Ram Prakash Gunnam
-
వినోదం.. భావోద్వేగం!
రామ్ ప్రకాష్ గున్నం హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘చెరసాల’(Cherasala). శ్రీజిత్, నిష్కల, రమ్య ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఎస్రాయ్ క్రియేషన్స్ పై కథ్రి అంజమ్మ, షికార నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న రిలీజ్ కానుంది. రామ్ ప్రకాష్ గున్నం మాట్లాడుతూ– ‘‘రిలేషన్ షిప్లో ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? అనే అంశాలతో ఈ మూవీ తీశాం. ఇందులో మంచి భావోద్వేగాలతో పాటుగా, చక్కని వినోదం ఉంది ’’ అని అన్నారు. ‘‘ఈ చిత్రంపై దర్శకుడు నాలుగు సంవత్సరాలు దృష్టి పెట్టాడు. ఇలాంటి మంచి సినిమాలు రావాలి’’ అని పేర్కొన్నారు శ్రీజిత్. ‘‘ఓ అమ్మాయి తన భర్త కోసం, మాంగళ్యాన్ని కాపాడుకునేందుకు పడే తపనే ఈ కథ’’ అని తెలిపారు కథా రచయిత ఫణీంద్ర భరద్వాజ్. -
‘చెరసాల’ రిలీజ్కు ముందే రెండో సినిమా షురూ
సినీ ప్రేక్షకుల ఆలోచన మారింది. హీరో కాకుండా కంటెంట్ బాగుంటే చాలు ఆ సినిమాను ఆదరిస్తున్నారు. అందుకే యంగ్ డైరెక్టర్స్ డిఫరెంట్ కంటెంట్తో సినిమాలు చేస్తూ విజయం సాధిస్తున్నారు. దర్శకుడు రామ్ ప్రకాష్ గుణ్ణం కూడా ఓ కొత్త పాయింట్తో ‘చెరసాల’సినిమాను తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా విడుదలకు ముందే రెండో సినిమాకు శ్రీకారం చుట్టాడు ఈ యంగ్ డైరెక్టర్. ఎస్ రాయ్ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమం తాజాగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినిమా పరిశ్రమలోని ప్రముఖులతో పాటు సన్నిహితులు విచ్చేశారు. ముఖ్య అతిధులుగా నమీరుద్దీన్ అహ్మద్, కతేరి అంజమ్మ , కట్ల భాగ్య లక్ష్మి, రైటర్ నరేందర్ రెడ్డి, కిషోర్, తెలుగు మహేంద్ర విచ్చేశారు. ఈ సందర్భంగా రామ్ ప్రకాష్ మాట్లాడుతూ..‘నన్ను నమ్మి ఎంతో ప్రోత్సహిస్తున్న నిర్మాతలకు కృతజ్ఞతలు. మంచి కంటెంట్ ను అందించే విధంగా సినిమా కోసం పనిచేస్తున్నాను. త్వరలోనే ఆ సినిమా లను వెండితెరపైకి తీసుకు వస్తాను’ అని అన్నారు.