breaking news
puttoor
-
భర్త శవాన్ని చూస్తూ కుప్పకూలిన భార్య
సాక్షి, పుత్తూరు రూరల్: ధర్మార్థ కామములోన ఏనాడూ నీతోడు ఎన్నడూ నేవిడిచిపోను అని భార్యాభర్తల బంధం గురించి ఓ సినీకవి రాసిన మాటలు యాధృచ్ఛికంగా నిజమయ్యాయి.. వేదమంత్రాల సాక్షిగా ఒకరినొకరు చివరివరకు తోడుంటామని చేసుకున్న ప్రమాణాలను ఆ దంపతులు నిజం చేశారు. కడవరకు ఒకరినొకరు తోడూనీడగా నిలిచి చివరికి ఆ వృద్ధ దంపతులు మృత్యువులోనూ ఒక్కటయ్యారు. భర్త మృతి చెందడంతో చివరిచూపు చూస్తూ ఆమె కూడా ప్రాణాలొదిలిన సంఘటన పుత్తూరులో చోటు చేసుకుంది. (చదవండి: భార్య కాళ్లు పట్టుకుంది.. ప్రియుడు పీకనొక్కాడు) వివరాలు.. పుత్తూరు మున్సిపల్ పరిధి గోవిందపాళెంకు చెందిన ఎం.చంద్రయ్యనాయుడు (68) గుండెపోటుతో సోమవారం సాయంత్రం మృతి చెందాడు. మంగళవారం సాయంత్రం అంత్యక్రియలకు తరలించే సమయంలో కడసారిగా భర్త మృతదేహం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ భార్య ఎం.కుప్పమ్మ (64) కుప్ప కూలి మృతి చెందింది. దీంతో ఇద్దరికి మంగళవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. వీరికి నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నా రు. చంద్రయ్య నాయుడు మేస్త్రీ పనిచేస్తూ జీవనం సాగించేవారు. (చదవండి: వామ్మో! ఉన్నట్టుండి తల చీల్చేసింది..) -
పుత్తూరులో రోడ్డెక్కిన మహిళలు
-
ఎర్రచందనం దుంగల పట్టివేత
పుత్తూరు: చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం గోవిందపాలెం వద్ద ఐచర్ వాహనంలో తరలిస్తున్న 125 కిలోల బరువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో పుత్తూరు చెక్పోస్ట్ వద్ద తనిఖీ చేపట్టిన అధికారులు ఓ ఐచర్ వాహనాన్నిఆపినా డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయాడు. పోలీసులు వాహనాన్ని వెంబడించగా గోవిందపాలెం వద్ద వాహనాన్ని ఆపి పరారయ్యాడు. పోలీసులు తనిఖీ చేయగా అందులో ఎర్రచందనం దుంగలు వెలుగు చూశాయి. వాటితో పాటు వాహనాన్ని సీజ్ చేశారు.