ఎర్రచందనం దుంగల పట్టివేత | redsander seized in chittoor district | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం దుంగల పట్టివేత

Jan 25 2016 11:22 AM | Updated on Sep 3 2017 4:18 PM

చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం గోవిందపాలెం వద్ద ఐచర్ వాహనంలో తరలిస్తున్న 125 కిలోల బరువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు.

పుత్తూరు: చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం గోవిందపాలెం వద్ద ఐచర్ వాహనంలో తరలిస్తున్న 125 కిలోల బరువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో పుత్తూరు చెక్‌పోస్ట్ వద్ద తనిఖీ చేపట్టిన అధికారులు ఓ ఐచర్ వాహనాన్నిఆపినా డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయాడు. పోలీసులు వాహనాన్ని వెంబడించగా గోవిందపాలెం వద్ద వాహనాన్ని ఆపి పరారయ్యాడు. పోలీసులు తనిఖీ చేయగా అందులో ఎర్రచందనం దుంగలు వెలుగు చూశాయి. వాటితో పాటు వాహనాన్ని సీజ్ చేశారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement