breaking news
Psychological doctor
-
అబ్బాయిలాగా..టీనేజ్లో స్వరం మారిపోయింది, ఏం చేయాలి?
నేనొక సోషల్ వెల్ఫేర్ హాస్టల్ వార్డెన్ని. మా హాస్టల్లో ఒక పన్నెండేళ్ల పాపకు స్వరం మారిపోయింది.. ఆ ఏజ్లో మగపిల్లలకు మారిపోయినట్టుగా. అయితే ఆ పాప ఇంకా పెద్దమనిషి అవలేదు. ఆ గొంతుతో ఆ అమ్మాయి చాలా సిగ్గుపడుతోంది. దాంతో మాట్లాడ్డమే తగ్గించేసింది. ఇలా అయితే పాప కాన్ఫిడెన్స్ కోల్పోతుందేమోననే భయంతో .. పరిష్కారం కోసం మీకు రాస్తున్నాను. – పేరు, ఊరు వివరాల్లేవు. వయసు పెరిగేకొద్దీ .. ప్యూబర్టీ టైమ్కి ఆడపిల్లల్లో చాలా మార్పులు వస్తాయి. (వాయిస్ బాక్స్) కూడా థిక్ అండ్ లార్జ్ అవుతుంది. అంతేకాదు ప్యూబర్టీ టైమ్కి సైనస్ క్యావిటీస్, గొంతు వెనుక భాగం కూడా ఎన్లార్జ్ అవుతాయి. వాయిస్ మారడానికి ఇవీ కారణమే. అందుకే 11 నుంచి 15 ఏళ్ల మధ్య ఉన్న మగపిల్లల్లోనే కాదు ఆడపిల్లల్లోనూ గొంతు మారడాన్ని గమనిస్తాం. ఇలా హఠాత్తుగా తన వాయిస్ అబ్బాయి వాయిస్లా హార్డ్గా అవడంతో అమ్మాయి ఇబ్బంది పడుతుండవచ్చు. కాబట్టి వీటన్నిటినీ వివరిస్తూ అదెంత సర్వసాధారణమైన విషయమో చెబుతూ సైకాలజిస్ట్ ద్వారా కౌన్సెలింగ్ ఇప్పించాలి. అమ్మాయిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి. స్పీచ్ థెరపీ, గొంతును తగ్గించి మాట్లాడ్డం వంటివి కొంతవరకు సహాయపడతాయి. అయితే జన్యుపరమైన కారణాల వల్లా కొంతమంది అమ్మాయిల్లో మేల్ వాయిస్ ఉంటుంది. కొందరికి అవాంఛిత రోమాలు కూడా రావచ్చు. అంటే ఆండ్రోజెన్ (మేల్ హార్మోన్) హార్మోన్ ఎక్కువ ఉండొచ్చు. ఒవేరియన్ సిస్ట్స్ వల్ల కూడా ఇలా అవొచ్చు. కాబట్టి ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించాలి. కొన్ని కేసెస్లో న్యూరలాజికల్ కండిషన్స్ వల్ల కూడా ఇలా మారవచ్చు. స్పెషలిస్ట్ని సంప్రదించాలి. రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉంటే వాయిస్ చేంజ్ను అడాప్ట్ చేసుకునే కౌన్సెలింగ్ని ఇప్పించాలి. విటమిన్ బీ12, విటమిన్డి సప్లిమెంట్స్ కూడా కొంతమందిలో ఈ హార్డ్ వాయిస్ని తగ్గిస్తాయి. డా. భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
జల్సాలతో జైలుపాలు
శ్రీను(పేరుమార్చం) సదాశివపేట మండలంలోని ఓ గ్రామం. సంగారెడ్డిలోని డిగ్రీ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన శ్రీను...సినిమాల్లో హీరోలు ఖరీదైన బైక్లపై రయ్యిమంటూ దూసుకుపోవడం చూసి తానూ అలా జీవితం గడపాలని భావించాడు. ఈ క్రమంలోనే చెడుస్నేహాలతో చదువుపక్కనపెట్టాడు. వ్యసనాలకు బానిసై వాటికోసం తల్లిదండ్రులను పీడించేవాడు. అయినా డబ్బు సరిపోక చోరీల బాటపట్టాడు. పుస్తెలతాడుతో మహిళ కనిపిస్తే బైక్పై వెళ్లి క్షణాల్లో పనికానిచ్చేవాడు. వాటిని విక్రయించగా వచ్చిన సొమ్ములతో జల్సాలు చేసేవాడు. ఇలా హస్తలాఘవం చూపుతూ పోలీసులకు దొరికిపోయాడు. అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా పాత నేరాలన్నీ ఒక్కొక్కటిగా కక్కేశాడు. ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నాడు. చదువుకుని ప్రయోజకుడవుతాడనుకున్న కుమారుడు ఊచలు లెక్కబెడుతుంటే...ఆ తల్లిదండ్రులు దేవుడా...మాకెందుకీ శిక్ష అంటూ రోదిస్తున్నారు. ఇలాంటి శ్రీనులు జిల్లాలో చాలామందే ఉన్నారు..వీరి వల్ల నరకయాతన అనుభవిస్తున్న తల్లిదండ్రులూ అంతే మంది ఉన్నారు. కేవలం వ్యసనాలు, చెడు స్నేహాలతో జల్సాలతో జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్న యువత కన్నవాళ్లకూ చెడ్డపేరు తీసుకువస్తున్నారు. తెలిసీతెలియక జీవితాలను కోల్పోతున్న యువతకు ఎప్పటికప్పుడు గమనిస్తూ కౌన్సెలింగ్ ఇస్తే వారు దారి తప్పకుండా ఉంటారని మానసిక వైద్యులు చెబుతున్నారు. శ్రీను(పేరుమార్చం) సదాశివపేట మండలంలోని ఓ గ్రామం. సంగారెడ్డిలోని డిగ్రీ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన శ్రీను...సినిమాల్లో హీరోలు ఖరీదైన బైక్లపై రయ్యిమంటూ దూసుకుపోవడం చూసి తానూ అలా జీవితం గడపాలని భావించాడు. ఈ క్రమంలోనే చెడుస్నేహాలతో చదువుపక్కనపెట్టాడు. వ్యసనాలకు బానిసై వాటికోసం తల్లిదండ్రులను పీడించేవాడు. అయినా డబ్బు సరిపోక చోరీల బాటపట్టాడు. పుస్తెలతాడుతో మహిళ కనిపిస్తే బైక్పై వెళ్లి క్షణాల్లో పనికానిచ్చేవాడు. వాటిని విక్రయించగా వచ్చిన సొమ్ములతో జల్సాలు చేసేవాడు. ఇలా హస్తలాఘవం చూపుతూ పోలీసులకు దొరికిపోయాడు. అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా పాత నేరాలన్నీ ఒక్కొక్కటిగా కక్కేశాడు. ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నాడు. చదువుకుని ప్రయోజకుడవుతాడనుకున్న కుమారుడు ఊచలు లెక్కబెడుతుంటే...ఆ తల్లిదండ్రులు దేవుడా...మాకెందుకీ శిక్ష అంటూ రోదిస్తున్నారు. ఇలాంటి శ్రీనులు జిల్లాలో చాలామందే ఉన్నారు..వీరి వల్ల నరకయాతన అనుభవిస్తున్న తల్లిదండ్రులూ అంతే మంది ఉన్నారు. కేవలం వ్యసనాలు, చెడు స్నేహాలతో జల్సాలతో జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్న యువత కన్నవాళ్లకూ చెడ్డపేరు తీసుకువస్తున్నారు. తెలిసీతెలియక జీవితాలను కోల్పోతున్న యువతకు ఎప్పటికప్పుడు గమనిస్తూ కౌన్సెలింగ్ ఇస్తే వారు దారి తప్పకుండా ఉంటారని మానసిక వైద్యులు చెబుతున్నారు. తల్లిదండ్రులూ..... తస్మాత్ జాగ్రత్త! తల్లిదండ్రులు ఎక్కువగా తమ పిల్లల కదలికలపై దృష్టి సారించకపోవడం వ ల్లే యువకులు చెడు వ్యసనాలకు బానిసలై దారి తప్పుతున్నట్లు తెలుస్తోంది. పిల్లల స్నేహితులు ఎలాంటి వారు? వారు కుటుంబ వివరాలు వంటి వాటిని కూడా తల్లిదండ్రులు తెలుసుకుంటే మంచిది. పిల్లలు చదువుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కళాశాలలకు వెళ్తున్నాడా? లేదా? అని ఆరా తీయాలి. వీలైతే కళాశాలకు ఫోన్ చేసైనా, స్వయంగా వెళ్లయినా తెలుసుకోవడం మంచిది. వారికి సెల్ఫోన్లు ఇచ్చే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. వారు నిత్యం ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నారో, ఎస్ఎంఎస్లు, కంప్యూటర్లలో మెయిల్స్ వంటి వాటిపై ఓ కన్నేసి ఉంచాలి. జల్సాలకు అలవాటుపడితే పరిస్థితులు ఎలా చేయిదాటుతాయో వివరిస్తుండాలి. ఒకవేళ నేరాలకు పాల్పడితే ఎటువంటి శిక్షలు ఉంటాయో వారికి అవగాహన కల్పిస్తుండాలి. హైదరాబాద్ నగరం జిల్లాకు సమీపంలోనే ఉండటంతో అనేక మంది తల్లిదండ్రులు వారి పిల్లలను చదువు నిమిత్తం నగరానికి పంపుతున్నారు. విద్యార్థులు ప్రతి రోజు ఇంటి నుంచి కళాశాలకని చెప్పి వెళ్తూ సినిమాలు, షికార్లతో పాటు చెడు స్నేహాలతో పక్కదారి పడుతున్నారు. అనేక కేసుల్లో నిందితులుగా యువకులే తేలుతుండడంతో జిల్లా పోలీసులు విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అంతేగాక కేసుల్లో ఇరుక్కుంటే ఏ విధంగా జీవితం నాశనమవుతుందో చెబుతూ అవగాహన కల్పిస్తున్నారు. జీవితాన్ని నాశనం చేసుకోవద్దు చాలా కేసుల్లో నిందితులుగా యువకులే ఉంటున్నారు. చదువుకోవాల్సిన సమయంలో జల్సాలకు అలవాటు పడి కేసుల్లో ఇరుక్కుని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ విషయంలో పిల్లలకు మంచి, చెడు గురించి వివరించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఎక్కువగా ఉంది. పిల్లల ప్రవర్తన గురించి ఓ వైపు కన్నేసి ఉంచాలి. చెడు మార్గంలో వెళ్లి బంగారు భవితను నాశనం చేసుకోవద్దని ఎప్పటికప్పుడు వారికి తెలియజేస్తుండాలి. పోలీసు శాఖ తరపున మేము కూడా విద్యార్థులకు అవగాహన కల్పించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నాం. -విజయ్కుమార్, జిల్లా ఎస్పీ అవగాహన కల్పించాలి పిల్లలు యవ్వనంలోకి రాగానే వారికి మంచి చెడుల గురించి వివరించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లలు నిత్యం చేస్తున్న కార్యకలాపాలు, ఫోన్ సందేశాలు వంటి వాటిపై నిఘా వేయాలి. ముఖ్యంగా వారి స్నేహితులు, వారి కుటుంబ వివరాల గురించి తెలుసుకోవాలి. కేసుల వల్ల జీవితంలో నష్టపోయిన వారి గురించి వారికి వివరిస్తూ కౌన్సిలింగ్ నిర్వహించాలి. యువకులు కూడా మంచి కోసం తెగించాలే తప్ప చెడు కోసం కాదని గమనించాలి. ప్రస్తుతం నమోదవుతున్న హెచ్ఐవీ కేసుల్లో ఎక్కువగా యువకులే బాధితులుగా ఉండటం విచారకరం. -డాక్టర్ మురహరి, మానసిక వైద్యనిపుణులు