-
ఈవెంట్ పర్మిట్లపై ఆబ్కారీ ఆంక్షలు
సాక్షి, అమరావతి: నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి డిసెంబర్ 31 రాత్రి నిర్వహించే ఈవెంట్లకు ఇచ్చే పర్మిట్లపై ఎక్సైజ్ శాఖ ఆంక్షలు విధించింది. ముందుగా పోలీసుల అనుమతి తీసుకుని ఎక్సైజ్ శాఖకు దరఖాస్తు చేసుకుంటేనే మద్యం సరఫరా అనుమతులు ఇచ్చే విషయం పరిశీలించాలని నిర్ణయించింది. మద్య నియంత్రణలో వైఎస్ జగన్ ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉండడంతో ఈవెంట్ పర్మిట్ల విషయం లోనూ ఎక్సైజ్ శాఖ జాగ్రత్తలు తీసుకుంటోంది. గతంలో అయితే ఈవెంట్ల నిర్వహణకు సంబంధించి లిక్కర్ సరఫరా కోసం నిర్వాహ కులు ఎక్సైజ్ శాఖకు దరఖాస్తు చేసుకునే వారు. ఎక్సైజ్ శాఖలో సూపరింటెండెంట్ స్థాయి అధికారి అంశాల ప్రాతిపదికగా (సబ్జెక్ట్ టు కండిషన్) అనుమతులు ఇచ్చేవారు. ఇప్పుడు అలా కుదరదు. సాధారణంగా నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నిర్వహించే ఈవెంట్లలో మద్యం వినియోగం ఎక్కువగా ఉంటుంది. గతంలో నూతన సంవత్సరం సందర్భంగా ఒక్క రోజే రూ.150 కోట్ల వరకు మద్యం అమ్మకాలు ఉండేవి. గత ప్రభుత్వం ఆదాయం పెంచుకు నేందుకు మద్యం అమ్మకాలను అర్ధరాత్రి వరకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసేది. ఇప్పుడు నిబంధనలు కఠినతరం చేయడంతో ఈ సారి కొత్త ఏడాది వేడుకల ఈవెంట్ల పర్మిట్లకు దరఖాస్తులు భారీగా తగ్గాయి. గతంలో ఒక్క విజయవాడలో 30 నుంచి 40 ఈవెంట్ల పర్మిట్లకు ఎక్సైజ్ శాఖ అనుమతులిచ్చేది. ఈ సారి కేవలం ఐదు ఈవెంట్లకు మాత్రమే దరఖాస్తులు అందాయి. విశాఖలోనూ దరఖాస్తులు పెద్దగా రాలేదని ఎక్సైజ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. -
‘తెలంగాణ’లో షూటింగులకు వెసులుబాటు
‘‘అవుడ్డోర్ షూటింగుల కోసం పోలీసుల నుంచి అనుమతులు తీసుకునే విషయంలో కొన్నేళ్లుగా నిర్మాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా తెలంగాణ డీజీపీ అనురాగ్శర్మకు విన్నవించాం. ఆయన సానుకూలంగా స్పందించారు. అవసరమైతేనే పోలీసుల అనుమతిని తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఇది తెలుగు సినీ నిర్మాతలందరికీ శుభవార్తే’’ అని తెలంగాణ ఫిల్మ్ అండ్ టి.వి. ప్రొడ్యూసర్స్ గిల్డ్ అధ్యక్షులు ప్రతాని రామకృష్ణ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామకృష్ణగౌడ్ మరిన్ని విషయాలు చెబుతూ -‘‘సాధారణంగా సినిమాల షూటింగులు ఎఫ్డీసీ అనుమతి తీసుకున్న తర్వాతే జరుగుతుంటాయి. ఆ అనుమతినే పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా వర్తింపజేయాలని కోరాం. దానికీ ఆయన సానుకూలంగా స్పందించారు. అంతేకాక తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖ అందరికీ ఆదేశాలు జారీ చేశారు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రావణ్కుమార్రెడ్డి, రామకృష్ణారెడ్డి, ఎం.శ్రీనివాస్, రేష్మీ పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement