breaking news
Payment Crisis
-
ప్రకాశ్రాజ్కు హైకోర్టు నోటీసులు
పెరంబూరు : నటుడు ప్రకాశ్రాజ్కు మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో నటించి పేరుగాంచిన నటుడు ప్రకాశ్రాజ్. ఈయన నటుడు మాత్రమే కాకుండా, నిర్మాత, దర్శకుడు కూడా. తమిళంలో ధోని, ఉన్ సమయల్ అరైయిల్ వంటి చిత్రాలను స్వీయ దర్శకత్వంలో నిర్మించి నటించారు. కాగా ప్రకాశ్రాజ్ నడిగర్ అనే చిత్రాన్ని నిర్మించారు. ఇది తమిళంలో రూపొందించిన ఉన్ సమయల్ అరైయిల్ చిత్రానికి రీమేక్. కాగా ఈ చిత్రానికి ఆయన బాలీవుడ్ ఫైనాన్సియర్ ఒకరి వద్ద రూ.5 కోట్లు అప్పు తీసుకున్నట్లు తెలిసింది. అందుకు ఆయన ఆ ఫైనాన్సియర్కు చెక్కును ఇవ్వగా అది బ్యాంకులో బౌన్స్ అయ్యింది.దీంతో ఆ ఫైనాన్సియర్ నటుడు ప్రకాశ్రాజ్పై మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను గురువారం విచారించిన న్యాయమూర్తి ఏప్రిల్ 2వ తేదీలోగా కోర్టుకు హాజరవ్వాలని నటుడు ప్రకాశ్రాజ్కు సమన్లు జారీ చేశారు. (వారిని చంపేందుకు 29న ముహూర్తం) -
పాస్వర్డ్... పర్సనల్ కాదుగా...!
సాక్షి, కడప : చాలా మంది పుట్టిన రోజు, తేదీని, జాబ్లో జాయిన్ తేదీని రహస్య కోడ్గా వినియోగిస్తున్నారు. అలా చేస్తుంటే ఇబ్బంది పడతారు. ఎలాగంటే మీ కొలీగ్స్, సహచరులకు అవకాశమిచ్చినట్లే. డబ్బు ఎవరికి చేదు చెప్పండి. ప్రధాన నగరాల్లో ఒక ప్రయివేట్ ఏజెన్సీ నిర్వహించిన సర్వేలో ఎక్కువశాతం మంది కొన్ని నంబర్లనే పిన్, పాస్వర్డ్గా ఉపయోగిస్తున్నారని తేలింది. ఈ నివేదిక ప్రకారం ఎక్కువ మంది వాడుతున్న పిన్ నెంబరు, పాస్వర్డు 12234, తరువాత స్థానంలో 1111 ఉంది. కేవలం సమాచారం ఇచ్చి పుచ్చుకునే ఈ మెయిల్ ఐడీ, పాస్వర్డ్ను కష్టమైనది పెడుతున్న చాలామంది డబ్బులు, లావాదేవీలు నిర్వహించే అకౌంట్లు, డెబిట్, క్రెడిట్ కార్డులకు, విలువైన వ్యక్తిగత సమాచారం దాచుకునే స్మార్ట్ఫోన్కు మాత్రం సులువైన పిన్ నెంబర్లు పెట్టడం ఆశ్చర్యకరం. ఇలాంటి విషయాల్లో నిర్లక్ష్యం వహిస్తే సైబర్ నేరాలు జరిగే అవకాశముందని బ్యాంకు నిపుణులు హెచ్చరిస్తున్నారు. సంస్థ నివేదిక ప్రకారం చాలామంది పుట్టిన తేదీని, సంవత్సరాన్ని పాస్వర్డ్గా పెట్టుకుంటున్నారు. వీటిలో ఎక్కువగా 1980 నుంచి 2000 వరకూ పిన్ నంబర్లు మాత్రమే ఉంటున్నాయి. డెబిట్ , క్రెడిట్ కార్డు పాస్వర్డ్ నాలుగు అంకెలు మాత్రమే ఉండాలి. సాధారణంగా నాలుగంకెల నెంబర్లు 10 వేల వరకు ఉన్నాయి. కానీ వందలో సగం మంది 10 వేల నాలుగంకెలలో కేవలం 500 నెంబర్లను మాత్రమే వినియోగిస్తున్నారు. ఇలా వాడటం వల్ల ఏటీఎంకార్డు పోయినా, చోరీకి గురైనా సులువుగా డబ్బు డ్రా చేసుకునే అవకాశం దొంగలకు ఉంటుంది. చాలా మంది ఎక్కువగా వినియోగిస్తున్న పాస్వర్డ్స్, పిన్ నెంబర్లు ఇవేనని సంస్థ నివేదిక పేర్కొంది. 1234, 1111, 0000, 1212, 2222, 2244, 7777, 8888, 3333, 4444, 5555, 6666, 1122, 1313, 1010, 2001, 2010 తస్మాత్ జాగ్రత్త పిన్ నంబరే కదా అనుకుంటే చాలా పొరపాటే. ఎందుకంటే నాలుగు అంకెల ఈ సంఖ్య మీ ఆర్థిక స్థితిగతినే మార్చేసే అవకాశముంది. ఒక్క పిన్ విషయంలోనే కాదు మిగిలిన విషయాల్లోనూ అప్రమత్తత అవసరం. తద్వారా మీడబ్బు భద్రంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దొంగిలించిన ఏటీఎం కార్డు నుంచి డబ్బులు విత్ డ్రా అయితే అందుకు బ్యాంకు బాధ్యత వహించదు. విషయం గుర్తించుకోవాలి. తర్వాత ఎన్ని పాట్లు పడినా పోయిన డబ్బు రాదని తెలుసుకోవాలి. ఎప్పటికప్పుడు మారిస్తే మంచిది పిన్ నంబర్లను నెలకు, రెండు నెలకొకసారి మారిస్తే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఒక పెద్ద లావాదేవీ జరిపిన తక్షణం పిన్నంబర్ మారిస్తే సైబర్నేరగాళ్లకు చిక్కకుండా బయట పడొచ్చంటున్నారు. అదే విధంగా పిన్నంబర్ నమోదు చేసే ముందు మిమ్మల్ని ఎవరైనా గమనించనట్లైతే మీ లావాదేవీని వెంటనే రద్దు చేసుకోవాలని హెచ్చరిస్తున్నారు. పిన్ ఎంటర్ చేసే సమయంలో ఇతర వ్యక్తులు సహాయం చేస్తామని వస్తే నిరాకరించాలి. చాలా మంది పిన్ నెంబరు మరిచిపోతామనే ఉద్దేశంతో పౌచ్లో రాసి ఉంచుతారు. ఇది చాలా ప్రమాదం. ఈ తరహా చర్యలు కేటుగాళ్లకు ఊతమిచ్చినట్లే, మీ మెదడులో పాస్వర్డును భద్రంగా దాచుకుంటే ఇబ్బందులుండవు. -
జిగ్నేష్ షాపై లుక్అవుట్ నోటీసులు
ముంబై: దాదాపు రూ. 5,600 కోట్ల కుంభకోణానికి సంబంధించి నేషనల్ స్పాట్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈఎల్) ప్రమోటరు జిగ్నేష్ షా, మరికొందరిపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. వారు దేశం విడిచి వెళ్లకుండా చూడాలంటూ ఇమిగ్రేషన్ బ్యూరోని కూడా కోరినట్లు ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం (ఈవోడబ్ల్యూ) సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. సోమవారం నుంచి 60 గిడ్డంగులను తనిఖీ చేయగా 30 గిడ్డంగులు ఖాళీగా ఉన్నట్లు తేలిందని ఆయన వివరించారు. దీన్ని బట్టి చూస్తే.. కొందరు ట్రేడర్లు.. ఎన్ఎస్ఈఎల్తో కుమ్మక్కైనట్లుగా కనిపిస్తోందని అధికారి పేర్కొన్నారు. ఇన్వెస్టర్ల దగ్గర నుంచి డబ్బు తీసుకుని.. గిడ్డంగుల్లో సరుకు జమ చేయలేదని భావిస్తున్నట్లుగా ఆయన వివరించారు. పెపైచ్చు ఎన్ఎస్ఈఎల్ పత్రాల్లో పేర్కొన్న గిడ్డంగుల్లో నాలుగు అసలు లేనే లేవని తేలినట్లు అధికారి పేర్కొన్నారు.