-
పుత్రశోకంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి.. హరీష్రావు ఓదార్పు
సాక్షి, హైదరాబాద్: పటాన్చెరువు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట విషాదం నెలకొంది. ఆయన పెద్ద కొడుకు విష్ణువర్థన్ గుండెపోటుతో మృతి చెందాడు. అనారోగ్యంతో మూడు రోజుల నుంచి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విష్ణు.. గత అర్ధరాత్రి గుండెపోటుతో కన్నుమూసినట్లు సమాచారం. పుత్రశోకంతో కుంగిపోయిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని ఆస్పత్రికి వెళ్లి తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. మహిపాల్ రెడ్డి, కుటుంబ సభ్యులను మంత్రి హరీశ్ రావు ఓదార్చారు. మరోవైపు ఎమ్మెల్యే తనయుడి మృతితో స్థానికంగా కార్యకర్తలు విషాదంలో మునిగిపోయారు. -
15,660 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు 117 బ్లాకులు..
సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/ సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం భారీ స్థాయిలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రాజెక్టు ‘కేసీఆర్ నగర్ 2బీహెచ్కే డిగ్నిటీ హౌసింగ్ టౌన్షిప్’ను గురువారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రారంభించనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ శివార్లలోని సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం మండలం కొల్లూరులో రెండో దశ కింద ఈ టౌన్షిప్ను నిర్మించారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఎంపిక చేసిన ఆరుగురు లబ్ధిదారులకు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా లాంఛనంగా ఇళ్ల పట్టాలను అందించనున్నారు. కార్పొరేట్ స్థాయి హంగులతో.. కొల్లూరులో సుమారు 144.50 ఎకరాల్లో రూ.1,474.75 కోట్ల వ్యయంతో కార్పొరేట్ అపార్ట్మెంట్లకు తీసిపోని విధంగా, సకల హంగులు, మౌలిక సదుపాయాలతో టౌన్షిప్ను నిర్మించారు. ఇక్కడ మొత్తంగా 117 బ్లాకుల్లో 15,660 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఉన్నాయి. ఈ టౌన్షిప్లో మొత్తంగా 6 నుంచి 36 మీటర్ల వెడల్పు గల 13.50 కిలోమీటర్ల పొడవైన రోడ్లను నిర్మించారు. మొత్తంగా 2.1 కోట్ల లీటర్ల సామర్థ్యమున్న నీటి నిల్వ (అండర్ గ్రౌండ్ కలిపి) ట్యాంకులను ఏర్పాటు చేశారు. అండర్ గ్రౌండ్ ద్వారానే విద్యుత్ సరఫరా కేబుళ్లు వేశారు. లిఫ్టులకు, వాటర్ సప్లై, ఎస్టీపీలకు విద్యుత్ సరఫరా కోసం 30 కేవీఏ నుంచి 400 కేవీఏ వరకు 133 జనరేటర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. మురుగు నీటిని బయటకు పంపించకుండా రీసైక్లింగ్ చేసే ఎస్టీపీలను, శుద్ధి చేసిన నీటిని సుందరీకరణ పనులకు వాడేలా పైప్లైన్ నిర్మించారు. 10.55 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్, 10.05 కిలోమీటర్ల తాగునీటి పైప్లైన్, 10.60 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ పైప్లైన్, 137 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, వీధి దీపాల కోసం 528 స్తంభాలు ఏర్పాటు చేశారు. 54,000 చదరపు అడుగుల విస్తీర్ణమున్న 3 షాపింగ్ కాంప్లెక్స్లలో 118 షాపులు, ప్రతి బ్లాక్కు రెండు చొప్పున 234 లిఫ్ట్లను ఏర్పాటు చేశారు. సామాజిక వసతులూ ఎన్నో.. ► టౌన్షిప్ వాసులకు ఆహ్లాదకరంగా ఉండేందుకు పార్కు, సైక్లింగ్, వాకింగ్ ట్రాక్, ఆట స్థలం, ఓపెన్ జిమ్, ఇండోర్ స్పోర్ట్ కాంప్లెక్స్, ఓపెన్ స్పోర్ట్స్ ఏరియా, మల్టీపర్పస్ గ్రౌండ్, ఆంఫి థియేటర్, ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం, బతుకమ్మ ఘాట్లనూ ఏర్పాటుచేశారు. ► కాలనీ వాసుల కోసం ఆధునిక కూరగాయల, మాంసాహార మార్కెట్, విద్యార్ధుల కోసం ప్లేస్కూల్, అంగన్వాడీ సెంటర్, బస్తీ దవాఖాన, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక, ఉన్నత పాఠశాల, బస్ టెర్మినల్, బస్స్టాప్, పోలీస్స్టేషన్, ఫైర్స్టేషన్, మిల్క్ బూత్లు, పెట్రోల్ బంకు, పోస్టాఫీసు, ఏటీఎం, బ్యాంకు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యార్డు వంటివి ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. శంకర్పల్లిలో ప్రైవేటు రైల్వే ఫ్యాక్టరీని ప్రారంభించనున్న కేసీఆర్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొండకల్ రెవెన్యూ పరిధిలో ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక ‘మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ’ని సీఎం కేసీఆర్ గురువారం ప్రారంభించనున్నారు. వంద ఎకరాల్లో, సుమారు వెయ్యి కోట్ల పెట్టుబడితో నిర్మించిన ఈ ఫ్యాక్టరీకి మంత్రి కేటీఆర్ 2017–18లో శంకుస్థాపన చేయగా.. ఇటీవలే పనులు పూర్తయి ఉత్పత్తి ప్రారంభమైంది. దీనిని సీఎం లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. ఏటా 500 రైల్వేకోచ్లు, 50లోకోమోటివ్ల ఉత్పత్తి లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేశారు. వాటిని వివిధ దేశాలకు ఎగుమతి చేయనున్నారు. రైల్వే పరికరాల ఉత్పత్తిలోని ప్రైవేటు సంస్థల్లో పెద్దదైన మేధా సంస్థ.. భారతీయ రైల్వేకు కూడా వివిధ ఉత్పత్తులను మేధా సంస్థ సరఫరా చేస్తోంది. ఫాక్టరీ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండు వేల మందికిపైగా ఉపాధి పొందనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. కంపెనీ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను బుధవారం చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, అధికారులు పరిశీలించారు. పటాన్చెరులో బహిరంగ సభ కొల్లూరులో డబుల్ బెడ్రూం టౌన్షిప్ను ప్రారంభించిన అనంతరం పటాన్చెరులో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి సీఎం కేసీఆర్ భూమిపూజ చేయనున్నారు. అనంతరం పటాన్చెరులో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆధ్వర్యంలో సభకు ఏర్పాట్లు చేశారు. వీటిని మంత్రి హరీశ్రావు బుధవారం పరిశీలించారు. 30 వేల మందితో ఈ సభను నిర్వహించనున్నట్టు బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. -
విషాదం: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
సంగారెడ్డి జిల్లా: పటాన్చెరు మండలం భానుర్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు మధ్యప్రదేశ్కు చెందిన వలస కూలీలుగా పోలీసులు గుర్తించారు. వివాహిత తన చిన్నారితో పాటు వరసకు మరిది అయిన వ్యక్తితో కలిసి ముగ్గురు అనుమానాస్పదంగా ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనపై హత్యా? ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: వీడిన మిస్టరీ.. బావే హంతకుడు.. అత్త ఆస్తి కోసం.. -
పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి కూతురుతో కలిసి
సాక్షి, పటాన్చెరు టౌన్: పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి కూతురుతో వెళ్లిన మహిళ అదృశ్యమైన సంఘటన పటాన్చెరు పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ సాయిలు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పటాన్చెరు పట్టణంలోని మంజీర పంప్ హౌస్లో చంద్రకుమార్ ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 11 తేదీ ఉదయం చంద్రకుమార్ భార్య ఊర్మిళ, రెండున్నర సంవత్సరాల కూతురు జాహ్నవితో కలసి హైదరాబాద్ అఫ్జల్గంజ్లో ఉంటున్న పుట్టింటికి వెళ్తున్నామని చెప్పి ఇంటి నుంచి వెళ్లింది. అదే రోజు మధ్యాహ్నం చంద్రకుమార్ భార్యకు ఫోన్చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ మెస్సేజ్ రావడంతో అత్తగారింటికి ఫోన్చేయగా ఇంకా రాలేదని చెప్పారు. భార్య, కూతురు కోసం తెలిసిన వారిని, బంధువులను విచారించినా వారి ఆచూకీ లభించలేదు. దీంతో చంద్రకుమార్ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
ఆడపిల్ల పుట్టిందని.. కొడుకంటే ఇష్టం లేదని.. చంపేశారు..
సాక్షి,కాగజ్నగర్: కన్న ప్రేమ కనికరం చూపలేకపోయింది. కన్నతండ్రే కాల యముడయ్యాడు. ఆడపిల్లగా పుట్టినందుకు 40 రోజుల పసికందును బండరాయితో కొట్టి చంపేశాడు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలంలో దారుణం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. కాగజ్నగర్ మండలం మారేపల్లి పంచాయతీ లైన్గూడ గ్రామానికి చెందిన మెస్రం బాపురావు–మానస దంపతులు వ్యవసాయ పనులు చేస్తుంటారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. మూడో సంతానంలోనూ ఆడపిల్ల పుట్టింది. భారంగా భావించిన బాపురావు తాగిన మైకంలో సోమవారం అర్ధరాత్రి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 40 రోజుల పసికందును తల్లి పొత్తిళ్ల నుంచి తీసుకెళ్లి రోడ్డుపై పడేసి, బండతో మోది చంపేశాడు. భార్య వారిస్తున్నా వినకుండా ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఇంకా లోకం కూడా చూడని చిన్నారిని కిరాతకంగా హత్య చేశాడు. పక్కలోని బిడ్డను తీసుకెళ్లి తన కళ్లముందే చంపడంతో తల్లి కంటికి పుట్టెడుగా శోకిస్తోంది. కుటుంబ సభ్యులు, స్థానికులు విషాదంలో మునిగిపోయారు. నిందితుడిని అదుపులోనికి తీసుకున్నట్లు కాగజ్నగర్ రూరల్ సీఐ రాజేంద్రప్రసాద్ తెలిపారు. చదవండి: నయా ట్రెండ్: నోరూరిస్తున్న బిర్యానీ.. తింటే వదల‘మండీ’ ఆరేళ్ల బాలుడిని చితకబాది హతమార్చిన మారుతండ్రి పటాన్చెరు టౌన్: ఆరు సంవత్సరాల బాలుడిని మారు తండ్రి చితకబాదడంతో మృతి చెందాడు. ఈ ఘటన పటాన్చెరు పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం దిగ్వాల్ గ్రామానికి చెందిన నర్సింహులుకు 11 సంవత్సరాల క్రితం అరుణతో వివాహం జరిగింది. వీరికి జాన్పాల్, జస్వంత్, అరుణ్ (6) ముగ్గురు కుమారులు. కాగా నర్సింహులు మద్యానికి బానిసై సంవత్సరం క్రితం మృతి చెందాడు. అరుణ గద్వాలలో పనిచేస్తున్న సమయంలో వినయ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. నెలరోజుల క్రితం వినయ్, అరుణ మెదక్ చర్చిలో వివాహం చేసుకున్నారు. అనంతరం ఇస్నాపూర్కు వచ్చి పద్మారావునగర్ కాలనీలో నివాసముంటున్నారు. చదవండి: బాలికపై టీఆర్ఎస్ సర్పంచ్ అత్యాచారం.. బాధితురాలికి బండి పరామర్శ అయితే వివాహం జరిగినప్పటి నుంచి వినయ్కు అరుణ్ అంటే ఇష్టం ఉండేది కాదు. చిన్నచిన్న విషయాలకు బాలుడిని కొట్టేవాడు. మంగళవారం కూడా అరుణ డ్యూటీకి వెళ్లిన సమయంలో ఇంట్లోనే ఉన్న అరుణ్ని వినయ్ తీవ్రంగా కొట్టాడు. స్పృహ తప్పి పడిపోయిన బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా పరిశీలించిన వైద్యులు అరుణ్ మృతిచెందినట్లు తెలిపారు. దీంతో బాలుడిని ఇంట్లో పడుకోబెట్టి వినయ్ పారిపోయాడు. డ్యూటీనుంచి తిరిగొచ్చిన తల్లికి కుమారుడు మృతిచెంది కనిపించాడు. అరుణ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
IPL 2024: సన్రైజర్స్, లక్నో మ్యాచ్.. లంక యువ స్పిన్నర్ అరంగేట్రం
ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
IPL 2024 SRH VS LSG: మరో మూడేస్తే..!
ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
తప్పక చదవండి
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement