breaking news
parakala MLA
-
ఇడియట్ ముచ్చట్లు చెప్పకు..!
గీసుకొండ: మండలంలోని కొమ్మాల, విశ్వనాథపురం, శాయంపేట హవేలి, మరియపురం గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా విశ్వనాథపురం గ్రామంలో లబ్ధిదారుడు మూడు నర్సింహకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను పరిశీలిస్తూ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని అధికారులను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. పది మందికి ఇళ్లు మంజూరు కాగా, నలుగురు మాత్రమే ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించడంతో సంబంధిత ఏఈ వినోద్ను వివరణ కోరారు. అందులో ఒకరి ఆధార్ కార్డు మిస్ మ్యాచ్ కావడంతో జాప్యం జరిగిందని ఏఈ వివరణ ఇస్తుండగా, ఎమ్మెల్యే ఘాటుగా స్పందించారు. ‘నీ వయస్సు ఎంత’ అని ఏఈని ప్రశ్నించగా.. 28 ఏళ్లు అని చెప్పాడు. ఇడియట్ ముచ్చట్లు చెప్పకు డీఈకి ఫోన్ చెయ్ అంటూ పరుష పదజాలంతో ఏఈపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ వచ్చిన 45 రోజుల్లో బేస్మెంట్ వరకు నిర్మాణం చేపట్టాలని, లేకుంటే అవి రద్దవుతాయని అన్నారు. నిర్మాణాల విషయంలో జాప్యం జరిగితే పంచాయతీ కార్యదర్శి, సంబంధిత ఏఈలకు మెమోలో జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. కొమ్మాలలో కాంగ్రెస్ నాయకులకు చెందిన ఒకే కుటుంబానికి రెండు ఇళ్లు మంజూరైనట్లు స్థానికులు తెలపగా, జక్కుల రాజ్కుమార్, సాయిలి రమాదేవికి మంజూరు చేసిన ఇళ్లను వెంటనే రద్దు చేయాలని అధికారులను ప్రకాశ్రెడ్డి ఆదేశించారు. కొమ్మాలలో ప్రజా గ్రంథాలయానికి జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్థలం కేటాయించాలని, సెర్ప్ మహిళా సంఘాలకు డైరీ ఫాం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేను స్థానికులు కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు ఎండీ.రియాజుదీ్దన్, ఎంపీడీఓ పాక శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు శంకర్రావు, ప్రశాంత్, కాంగ్రెస్ నాయకులు దూల వెంటేశ్వర్లు, వీరాటి రవీందర్రెడ్డి, కూసం రమేష్, కొమ్ము శ్రీకాంత్, నాగరాజు, సాయిలి ప్రభాకర్, మూడు నర్సింహ, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జక్కుల సరిత, సెర్ప్ సీసీ కోల శోభ, ప్రగతి మండల సమాఖ్య అధ్యక్షురాలు గట్టు రాధిక తదితరులు పాల్గొన్నారు. -
చల్లా చేరికపై లొల్లి!
* పరకాల టీఆర్ఎస్లో విభేదాలు * సహోదర్రెడ్డి, మొలుగూరి వర్గాలు నారాజ్ * వీరికి ప్రాధాన్యం ఇవ్వాలని కేడర్ పట్టు * గులాబీ అధినాయకత్వంపై అసంతృప్తి * ధర్మారెడ్డి చేరిక తేదీపై స్పష్టత కరువు సాక్షి ప్రతినిధి, వరంగల్ : పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి టీఆర్ఎస్లో చేరే అంశం గులాబీ పార్టీలో కొత్త రాజకీయానికి తెర తీస్తోంది. పరకాల నియోజకవర్గంలోని టీఆర్ఎస్లో ఇప్పటికే మూడు వర్గాలు ఉన్నాయి. సాధారణ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిగా తాము ఎదుర్కొన్న వ్యక్తి ఇప్పుడు తమకు నాయకుడిగా వస్తుండడంపై మూడు వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయి. టీఆర్ఎస్లోని ద్వితీయ శ్రేణి నాయకత్వం ధర్మారెడ్డి పార్టీలోకి రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. టీఆర్ఎస్ అధినాయకత్వం ఆగ్రహానికి గురికావద్దనే ఉద్దేశంతో ధర్మారెడ్డి రాకను బహిరంగంగా ఎవరూ వ్యతిరేకించడం లేదు. అంతర్గతంగా మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల వరకు తమను రాజకీయంగా ఇబ్బంది పెట్టిన ఆయనకు విధేయంగా తాము ఎలా పని చేస్తామని ప్రశ్నిస్తున్నారు. సంగెం, ఆత్మకూరు మండలాల్లో ఇప్పటికే ధర్మారెడ్డికి వ్యతిరేకంగా కొందరు నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ధర్మారెడ్డి ప్రకటించిన రోజే ఈ రెండు మండలాల్లోని కొందరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలోకి రాకముందే ధర్మారెడ్డి ఇంటికి వెళ్లి కొందరు టీఆర్ఎస్ ముఖ్యనేతలు ఆయనకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలకడంపై వారు ఆగ్రహంతో ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన తమను రాజకీయంగా ఇబ్బంది పెట్టిన వ్యక్తిని తమ తో ప్రమేయం లేకుండా టీఆర్ఎస్ జిల్లా నేతలు కలవడాన్ని వీరు తప్పుబడుతున్నారు. సాధారణ ఎన్నికల వరకు పరకాల సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మొలుగూరి బిక్షపతికి ఆ ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. న్యాయవాదుల కోటాలో ముద్దసాని సహోదర్రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. గతంలో ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించిన కొండా సురేఖకు ఇక్కడ ప్రత్యేకంగా అనుచర వర్గం ఉంది. సాధారణ ఎన్నికలు, అంతకుముందు జరిగిన స్థానిక ఎన్నికల్లో ఈ మూడు వర్గాల్లోని ద్వితీ య శ్రేణి నేతలు.. టీడీపీ అభ్యర్థులతోనే పోటీ పడ్డారు. ధర్మారెడ్డి ఇప్పుడు టీఆర్ఎస్లో చేరితే ఆయనతో పార్టీలోకి వచ్చే వారికే ఆయా మండలాలు, గ్రామాల్లో ప్రాధాన్యం ఉంటుందని గులాబీ శ్రేణులు వాపోతున్నాయి. ఉద్యమంలో మొదటి నుంచి తాము పాల్గొనగా.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చే రిన వారికి ప్రాధాన్యం పెరిగితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. కొత్త రాజకీయం షురూ.. సాధారణ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా చల్లా ధర్మారెడ్డి 9,108 ఓ ట్ల మెజార్టీతో గెలిచారు. టీఆర్ఎస్ అభ్యర్థి సహోదర్రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పరకాల నియోజకవర్గంలో ఈ పార్టీకి పట్టు ఉంది. సాధారణ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ అనుకూల పవనాలు ఉన్నాయి. ఇ లాంటి పరిస్థితుల్లోనూ పరకాలలో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించలేదు. టీఆర్ఎస్లోని మూడు గ్రూపుల రాజకీయంతో నే ఇలా జరిగిందని గులాబీ నేతలే చెబుతున్నారు. మూడు వర్గాలను సమన్వయం చేసే విషయాన్ని పట్టించుకోని టీఆర్ఎస్ నాయకత్వం ఇప్పుడు ఇతర పార్టీకి చెందిన ఎమ్మెల్యేను చేర్చాలనుకోవడంపై ద్వితీయ శ్రేణి నేతలు ఆగ్రహంగా ఉన్నారు. టీఆర్ఎస్లో చేరితే పరకాల నియోజకవర్గంలోని ఈ పార్టీలో కొత్త రకమైన రాజకీయం మొదలుకానుంది. ప్రస్తుతం పరకాల టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి తానేనని సహోదర్రెడ్డి చెబుతుండగా.. మొలుగూరి బిక్షపతి వర్గం ఇదే అభిప్రాయంతో ఉం ది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ధర్మారెడ్డి చేరిన తర్వాత ఆయనే నియోజకవర్గ ఇన్చార్జ్గా ఉంటారు. దీంతో సహోదర్రెడ్డి, బిక్షపతి వర్గాలు భవిష్యత్లో తమ పరిస్థితిపై ఇప్పుడే జాగ్రత్త పడుతున్నాయి. మార్చిలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశంపై వారు దృష్టి పెట్టారు. వీరిద్దరికి ఏదైనా అవకాశం ఇచ్చిన తర్వాతే ధర్మారెడ్డి పార్టీలో చేరుతారనే అభిప్రాయం టీఆర్ఎస్లో ఉంది. సహోదర్రెడ్డి, బిక్షపతి విషయంలో నిర్ణయం జరిగాకే.. చేరితే ఇబ్బంది ఉండదని ధర్మారెడ్డి కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల ముందే టీఆర్ఎస్లో చేరుతారని, టీఆర్ఎస్ అధినాయకత్వం దీన్ని నిర్ణయిస్తుందని ధర్మారెడ్డి సన్నిహితులు చెబుతున్నారు.