-
ఆర్కిడ్ పూలు అమ్మి నెలకు లక్షలు సంపాదిస్తున్న రైతు
-
ఆర్కిడ్ పూలు మొక్కలు బతికేందుకు కేవలం నీటి తుంపరల తడి చాలు
-
విదేశాల్లో ఫుల్ డిమాండ్ ... ఆర్కిడ్ పూల సాగు తో రైతులకు లాభాలు
-
ఆర్కిడ్స్ పూల సాగుతో మంచి లాభాలు
-
ఈ చిన్న షేరు గెలాప్ వెనుక?!
ముంబై, సాక్షి: సుమారు రెండు నెలల క్రితం తిరిగి స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన హెల్త్కేర్ రంగ కంపెనీ ఆర్కిడ్ ఫార్మా కౌంటర్కు డిమాండ్ కొనసాగుతోంది. వెరసి వరుసగా 40వ సెషన్లోనూ 5 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకింది. బీఎస్ఈలో రూ. 120 వద్ద నిలిచింది. నవంబర్ 3న తిరిగి లిస్టయిన ఆర్కిడ్ ఫార్మా షేరు 567 శాతం దూసుకెళ్లింది. అయితే ఈ కౌంటర్లో అమ్మకందారులు కరవుకావడంతో ట్రేడింగ్ పరిమాణం తక్కువగానే నమోదవుతున్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ షేరు ట్రేడ్ టు ట్రేడ్ విభాగంలో ఉంది. డెలివరీ తప్పనిసరికాగా.. 5 శాతం సర్క్యూట్ బ్రేకర్ అమలవుతోంది. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్ల వాటా 98.04 శాతంగా నమోదైంది. అంటే పబ్లిక్కు 2 శాతంకంటే తక్కువగానే వాటా ఉంది. దీనిలో 0.55 శాతమే వ్యక్తిగత వాటాదారుల వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. మరో 1 శాతం బ్యాంకులు, ఇతర సంస్థల వద్ద ఉన్నట్లు నిపుణులు తెలియజేశారు. దీంతో ఈ కౌంటర్లో లిక్విడిటీ తక్కువై షేరు పరుగు తీస్తున్నట్లు వివరించారు. చదవండి: (కోరమాండల్ డౌన్- ఈఐడీ ప్యారీ అప్?) ఏం జరిగిందంటే? కార్పొరేట్ దివాళా పరిష్కార ప్రణాళిక(సీఐఆర్పీ) ప్రకారం ఆర్కిడ్ ఫార్మాను ఈ ఏడాది మార్చి31న హర్యానాకు చెందిన ధనుకా ల్యాబొరేటరీస్ సొంతం చేసుకుంది. తద్వారా ఆర్కిడ్ బోర్డును కొత్తగా ఏర్పాటు చేసింది. వెరసి ఆర్కిడ్ ఫార్మాకు గుర్గావ్ కంపెనీ ధనుకా ల్యాబ్ ప్రమోటర్ సంస్థగా ఆవిర్భవించింది. ఆపై రిజల్యూషన్ ప్రణాళికకు అనుగుణంగా ఆర్కిడ్ను లాభాల బాటలోకి తీసుకువచ్చే ప్రణాళికలు అమలు చేస్తోంది. దీనిలో భాగంగా తమిళనాడులోని అళత్తూర్లోని ఏపీఐ ప్లాంటు, ఇరుంగట్టుకొట్టాయ్ వద్దగల ఎఫ్డీఎఫ్ ప్లాంట్లలో యూఎస్ఎఫ్డీఏ తనిఖీలకు ఆహ్వానించింది. తనిఖీలు విజయవంతంగా ముగియడంతో ఈఐఆర్ సర్టిఫికేషన్ లభించినట్లు ధనుకా పేర్కొంది. ఫార్ములేషన్ల విభాగంలో ఆర్కిడ్కు యూఎస్ మార్కెట్లో 40 ఏఎన్డీఏలకు అనుమతి ఉన్నట్లు తెలియజేసింది. కాగా.. ఆర్కిడ్పై ఇన్వెస్టర్లు, కస్టమర్ల విశ్వాసాన్ని పెంపొందించేందుకు వీలుగా ధనుకా ల్యాబొరేటరీస్ పటిష్ట చర్యలు తీసుకోవలసి ఉన్నట్లు మార్కెట్ విశ్లేషకులు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. -
కీచక పర్వంపైప్రజాగ్రహం
కేంబ్రిడ్జి పాఠశాల ఎదుట ఆందోళనలు భారీ బందోబస్తు ఏర్పాటు నిందితుడు జైశంకర్ అరెస్ట్ సాక్షి, బెంగళూరు : ఉద్యాననగరిలో మరోసారి ప్రజాగ్రహం పెల్లుబికింది. విబ్గయార్, ఆర్కిడ్ సంఘటనలు మరచిపోకముందే కేంబ్రిడ్జి పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థినిపై అదే పాఠశాలలో హిందీ బోధనతో పాటు పీఈటీగా విధులు నిర్వర్తిస్తున్న జై శంకర్ అత్యాచారానికి పాల్పడిన విషయం వెలుగుచూసిన విష యం తెలిసిందే. ఈ ఘటనలో జైశంకర్ను పోలీసులు అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బెంగళూరులో శుక్రవారం వెల్లడించారు. మరోవైపు నిందితుడు జైశంకర్ను బెంగళూరు న్యాయస్థానంలో పోలీసులు శుక్రవారం సాయంత్రం హాజరుపరిచారు. అనంతరం న్యాయమూర్తి అనుమతి మేరకు వారంరోజుల పోలీసు కస్టడీకి తరలించారు. ఈ కేసు దర్యాప్తు మల్లేశ్వరం ఉపవిభాగం ఏసీపీ సారాఫాతిమా ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఇదిలా ఉండగా తాజా ఘటనల దర్యాప్తులో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. తనిఖీ రోజే ఆకృత్యం... కేంబ్రిడ్జ్ పాఠశాల బెంగళూరు దక్షిణ విభాగం పరిధిలోకి వస్తుంది. పాఠశాలలో భద్రతా చర్యల కోసం ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన గైడ్లైన్పై ఈనెల 28న బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి (బీఈఓ) రమేష్ నేతృత్వంలో కేంబ్రిడ్జ్ పాఠశాలలో తనిఖీ నిర్వహించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఈ కార్యక్రమం కొనసాగింది. మధ్యాహ్న భోజన విరామం తర్వాత నిందితుడు చిన్నారిని మొదటి అంతస్తులోని బాలుర శౌచాలయంలోకి బలవంతంగా తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసుల పరిశీలనలో తేలింది. తర్వాతి రోజు (అక్టోబర్ 29న) కూడా ఇదే విధంగా చిన్నారిపై జైశంకర్ లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం చిన్నారి తన జననేంద్రియాల వద్ద సమస్యగా ఉందంటూ తల్లికి చెప్పడంతో ఆమె బాలికను గైనకాలజిస్టు వద్దకు తీసుకెళ్లింది. వైద్యుల పరీక్షల్లో చిన్నారి లైంగిక దాడికి గురైనట్లు గుర్తించారు. తర్వాత వైద్యులు, స్వచ్ఛంద సంస్థల సూచనల మేరకు బాధిత చిన్నారి తల్లిదండ్రులు స్థానిక జీవన్భీమా నగర్లో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా విచారణలో శంకర్ ఇంటి వద్ద హిందీ ట్యూషన్లు చెప్పేవాడని తేలింది. ఆ సమయంలో బాధిత విద్యార్థిని తల్లి హిందీ నేర్చుకోవడం కోసం జై శంకర్ వద్దకు గతంలో ట్యూషన్కు వెళ్లేవారిని సమాచారం. ఇదిలా ఉంటే నిందితుడి కుమారుడు కూడా ఇదే పాఠశాలలో చదువుతుండటం గమనార్హం. అగ్నిగోళంగా మారిన ప్రజాగళం... చిన్నారిపై అత్యాచారం విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేశంతో రగిలిపోయారు. పాఠశాల వద్దకు చేరుకుని నిందితున్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఉదయం ఎనిమిది గంటలకే వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు అక్కడికి చేరుకుని పాఠశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా నినదించారు. వేలకు వేలు ఫీజులు వసూలు చేసే ఈ పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమైందంటూ ఆక్రోశం వ్యక్తం చేశారు. అదేవిధంగా 11 గంటల సమయంలో సీ.వీ రామన్నగర్ శాసనసభ్యుడు (బీజేపీ) రఘు నేతృత్వంలో వందలాది మంది పార్టీ కార్యకర్తలు అక్కడకు చేరుకుని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. బెంగళూరులో ప్రతి రోజూ ఏదోఒక చోట పిల్లలు, మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల క్షీణతకు నైతిక బాధ్యత వహిస్తూ హోంశాఖ మంత్రి కే.జేజార్జ్తోపాటు సీఎం సిద్ధరామయ్య తమ పదవులకు రాజీనామా చేయాలని ఎమ్మెల్యే రఘు ఈసందర్భంగా డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్నా పాఠశాల యాజమాన్యానికి చెందిన ఒక్కరు కూడా అటు విద్యాశాఖకు కానీ ఇటు పోలీసుశాఖకు కానీ అందుబాటులోకి రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కాగా, పాఠశాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నగర పోలీస్కమిషనర్ ఎం.ఎన్.రెడ్డి స్వయంగా పాఠశాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. బుధవారం పాఠశాల పునఃప్రారంభం! పాఠశాల విద్యార్థినిపై అత్యాచార విషయం గురువారం రాత్రి వెలుగులోకి రావడంతో పాఠశాల యాజమాన్యం శుక్రవారం స్కూల్కు సెలవు ప్రకటించింది. ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ ఎం.ఎన్ రెడ్డి శుక్రవారం సాయంత్రం పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేకంగా సమావేశమై సంఘటన పట్ల చర్చించారు. ఈ సందర్భంగా పాఠశాలలో భద్రతా చర్యలు సరిగా లేవ ంటూ తల్లిదండ్రులు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. పరిస్థితి చక్కబడేంతవరకూ తమ పిల్లలను పాఠశాలకు పంపేది లేదని తేల్చిచెప్పారు. చివరికి అందరూ కలిసి పాఠశాలను బుధవారం పునఃప్రారంభించడానికి నిర్ణయించారు. మరోవైపు ఈ విషయమై సోమవారం మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో తీర్మానించారు. నిర్లక్ష్యపు సమాధానాలు! కేంబ్రిడ్జ్ పాఠశాల ఉదంతం నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు హోంశాఖ మంత్రి కే.జే. జార్జ్ చేసిన వ్యాఖ్యల పట్ల సామాజిక వేత్తలతో పాటు తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. వారి వ్యాఖ్యలు ప్రజలను కాపాడటంలో ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్య వైఖరికి అద్ధం పడుతున్నాయని విమర్శిస్తున్నారు. పాఠశాల యాజమాన్యానిదే బాధ్యత : పాఠశాలల్లో ముఖ్యంగా ప్రైవేటు స్కూళ్లో జరిగే అత్యాచారాలకు ప్రభుత్వం బాధ్యత వహించదు. ఆయా పాఠశాలల యాజమాన్యానిదే బాధ్యత. అయితే అకృత్యానికి పాల్పడినవారు ఎవరైనా చట్టం ప్రకారం వారిని కఠినంగా శిక్షిస్తాం. - సీఎం తల్లిదండ్రులదే ఎక్కువ బాధ్యత: పిల్లల తల్లిదండ్రులు కూడా పిల్లల రక్షణ విషయంపై ఎక్కువ దృష్టి సారిస్తే ‘కేంబ్రిడ్’్జ వంటి ఘటనలు పునరావృతం కావు. ప్రతి చోటుకూ వెళ్లి పోలీసులు రక్షణ కల్పించడానికి వీలుకాదుకదా? - హోంశాఖ మంత్రి -
పిట్ట కాదు.. పువ్వు..
చూడ్డానికి రంగురంగుల పిట్టలా కనిపిస్తోంది కదూ.. నిజానికిది ఓ ఆర్చిడ్. ఆస్ట్రియాలోని లింజ్లో ఉన్న బొటానికల్ గార్డెన్లో క్రిస్టియన్ అనే ఫొటోగ్రాఫర్ కెమెరాకు చిక్కిన చిత్రమిది. ఏదో మామూలుగా ఆర్చిడ్స్ తాలూకు ఫొటోలు తీసుకుంటున్న క్రిస్టియన్ ఓ గులాబీ ఆర్చిడ్ను దగ్గర నుంచి ఫొటో తీయడానికి ప్రయత్నిస్తూ.. లెన్స్ను జూమ్ చేసేసరికి.. ఆర్చిడ్ లోపలి భాగం ఓ పక్షిలా ఉందన్న విషయాన్ని గుర్తించారు. ఈ ఫొటోను చూసినోళ్లందరూ ఇదో ఆర్చిడ్ చిత్రమంటే నమ్మడం లేదని క్రిస్టియన్ చెబుతున్నారు.
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
కాంచన-4లో టాలీవుడ్ హీరోయిన్.. రాఘవ లారెన్స్ క్లారిటీ!
బాబర్.. విరాట్ కాలిగోటికి కూడా సమానం కాడు: పాక్ మాజీ ప్లేయర్
కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి.. మోదీకి కృతజ్ఞతలు
హీట్ పెంచేలా మృణాల్.. చీరలో మరింత అందంగా ఆషిక!
ఒడిశా: పాలిటిక్స్కు వీకే పాండియన్ గుడ్బై
అలాంటి సర్జరీ చేయించుకోమని సలహా ఇచ్చారు: టాలీవుడ్ హీరోయిన్
ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లకు కీలక సూచన.. ఇకపై..
నా బయోపిక్లో ఈ హీరోల్లో ఎవరు నటించినా ఓకే.. నేను కూడా..
బన్నీతో బాక్సాఫీస్ వార్కి సై అంటున్న బాలీవుడ్ హీరో
రైతు కూతురు డిప్యూటీ కలెక్టర్గా..!
Advertisement