-
ఉల్లి వెక్కిరిస్తోంది
♦ మార్కెట్లో తగ్గిపోతున్న నిల్వలు ♦ అకాల వర్షాలతో తగ్గిన దిగుబడి సాక్షి, ముంబై : నగరంలో ఉల్లి ధరలు కంటతడి పెట్టిస్తున్నాయి. మార్కెట్లో ఉల్లి నిల్వలు తగ్గిపోవడంతో ధరలు మండిపోతున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో కురిసిన అకాల వర్షాలు, ఈదురు గాలులు వీయడంతో ఉల్లి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో పంట దిగుబడి తగ్గింది. ఫలితంగా జూన్లో అదుపులో ఉన్న ధరలు జూలైలో పెరగడం ప్రారంభమైంది. వాషిలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ)కి ముంబై ప్రజలకు కోసం ప్రతి రోజు 125 ట్రక్కుల ఉల్లి వస్తుండగా ప్రస్తుతం వంద వరకు మాత్రమే వస్తున్నాయి. దీంతో నగరంలో ఉల్లి కొరత ఏర్పడింది. ప్రస్తుతం హోల్సేల్ మార్కెట్లో కేజీ రూ. 35-37 పలుకుతన్న ఉల్లి కొనుగోలుదారుల చెంతుకు వచ్చేసరికి రూ. 50 అవుతోంది. మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగితే ధర రూ. 90-100కి పెరగడం ఖాయమని వ్యాపారులు చెబుతున్నా రు. మరోవైపు దా దర్, వాషి ఏపీఎంసీ మార్కెట్లలో వ్యాపారులు నాసిరకం ఉల్లిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. రాష్ట్రంలో నాసిక్ జిల్లాలోని నిఫాడ్, లాసల్గావ్ ప్రాంతాల్లో ఉల్లి ఎక్కువగా పండుతుంది. ఇక్కడి నుంచి వివిధ రాష్ట్రాలకు కూడా రైళ్లలో ఎగుమతి అవుతుంది. అయితే ప్రస్తుతం రైతుల వద్ద నిల్వలు అయిపోవడం, అకాల వర్షాల వల్ల పంట దిగుబడి తగ్గడం వల్ల ఉల్లికోసం ఇతర రాష్ట్రాలపై ఆదారపడాల్సిన పరిస్థితి వచ్చింది. -
ఉల్లి మార్కెట్పై సీబీఐ విచారణ
► ఉల్లి నిల్వలు, అమ్మకాలు, మార్కెట్ పరిస్థితులపై ఆరా ► తాడేపల్లిగూడెంలో సీబీఐ బృందం మకాం ► ఏలూరు మార్కెట్లోనూ వివరాల సేకరణ తాడేపల్లిగూడెం : ఉల్లిపాయల మార్కెట్పై కేంద్ర నేర పరిశోధనా సంస్థ (సీబీఐ) దృష్టి సారించింది. ఉల్లిపాయలేంటి.. సీబీఐ ఏంటని ఆశ్చర్యపోకండి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉల్లి పంట, మార్కెట్లో నెలకొన్న పరిస్థితులపై అధ్యయనం చేయూల్సిందిగా సీబీఐకి ఆదేశాలిచ్చినట్టు సమాచారం. దీంతో సీబీఐ అధికారుల బృందం ఉల్లికి ప్రధాన మార్కెట్ అయిన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మకాం వేసింది. ఇటీవల కాలంలో ఉల్లి ధరలు అడ్డూఅదుపూ లేకుండా పెరిగిపోయాయి. దీనికి మహారాష్ట్రలో అధిక వర్షాలు ఒక కారణం కాగా, కృత్రిమ కొరత కూడా ధరలను ఆకాశం నుంచి దిగనివ్వటంలేదు. అందుకే కేంద్రప్రభుత్వం ఉల్లి పండే ప్రాంతాలతో పాటు, వాటిని విక్రయించే మార్కెట్ల పరిస్థితులపైనా సమాచారం సేకరించాలని సీబీఐని ఆదేశించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో తాడేపల్లిగూడెం వచ్చిన సీబీఐ అధికారులు ఇక్కడి మార్కెట్ స్థితిగతులపై లోతుగా ఆరా తీస్తున్నారు. ఇవే అంశాలపై ఇటీవల ఏలూరులోనూ సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. ఈ విషయం తాడేపల్లిగూడెం, ఏలూరులోని ఉల్లి వ్యాపారుల్లో కలకలం రేపుతోంది. కర్నూలు ఉల్లిపాయలకు సంప్రదాయ మార్కెట్గా తాడేపల్లిగూడెంకు పేరుంది. ఈ ఉల్లికి కర్నూలు పుట్టిల్లైతే, తాడేపల్లిగూడెం మెట్టినిల్లుగా మారింది. చాలాకాలంగా ఈ రెండు ప్రాంతాల మధ్య ఉల్లి బంధం పెనవేసుకుపోయింది. ఇటీవల ఈ బంధం బలంగా ఉండటానికి గల కారణాలను తెలుసుకున్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత అవాక్కయ్యారు. దీంతో ఉల్లి వ్యవహా రంపై రాష్ట్రం కూడా నిఘా పెంచింది. ఉల్లి రవాణా విధానాలలో మార్పులు సైతం చేసింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఉల్లి పంట, డిమాండ్, మార్కెట్లకు వచ్చే సరుకు పరిస్థితులు, నిల్వలు, కృత్రిమ కొరత వంటి అంశాలతోపాటు ఎగుమతులకు సంబంధించిన అంశాలపైనా సీబీఐ ద్వారా వివరాలు సేకరిస్తున్నట్టు చెబుతున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సంజయ్లీలా భన్సాలీ 'హీరామండి' వెబ్ సిరీస్ ఎలా ఉంది..?
నాడు మోదీకి వంట వండిన దీపక్.. ఇప్పుడేం చేస్తున్నారు?
కాన్వాయ్ స్లో చేసి అంబులెన్స్కు దారిచ్చిన సీఎం జగన్ (ఫొటోలు)
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
ఎల్లో శారీలో హీరామండి హీరోయిన్ సంజీదా షేక్ లుక్స్.. ఫోటోలు
ఇంటింటి ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి (ఫొటోలు)
జగన్ పాటకే భయపడ్డారు!
‘ప్రియాంక గాంధీ కాంగ్రెస్కు రెబల్గా మారనుంది’
భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
పవన్ వ్యూహానికి వంగా గీత కౌంటర్ వ్యూహమిదే..!
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- తాతా.. నీకు టాటా..
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
Advertisement