breaking news
OFFICERS ASSOCIATION
-
రెవెన్యూ ఉద్యోగులు అధైర్యపడొద్దు
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ వ్యవస్థను రద్దు చేస్తారని.. ఇతర శాఖల్లో విలీనం చేస్తారని జరుగుతున్న ప్రచారం కేవలం అపోహ మాత్రమేన ని తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల సంఘం (టీడీసీఏ) అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి, తెలంగాణ తహసీల్దార్ల సంఘం(టీజీటీఏ) అధ్యక్షుడు కె.గౌతమ్కుమార్ పేర్కొన్నారు. రెవెన్యూ ఉద్యోగులు అధైర్యపడవద్దని చెప్పారు. బుధవారం హైదరాబాద్లోని టీజీటీఏ కేంద్ర కార్యాలయంలో ‘రెవెన్యూ ఉద్యోగుల రౌండ్టేబుల్ సమావేశం’జరిగింది. ఇందులో లచ్చిరెడ్డి, గౌతమ్కుమార్ మాట్లాడారు. ఇటీవల పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో రెవెన్యూ వ్యవస్థను రద్దు చేస్తున్నారని, ఇతర శాఖల్లో విలీనం చేస్తున్నారని వస్తున్న వార్తలను ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రచారంతో రెవెన్యూ ఉద్యోగుల్లో అభద్రతాభావం, ఆందోళన నెలకొన్నాయన్నారు. ఇప్పటివరకు శాఖను రద్దు చేస్తున్నామని, విలీనం చేస్తున్నామని కానీ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదన్నది గుర్తుంచుకోవాలన్నారు. ఉద్యోగులెవరూ ఆందోళనకు గురికావొద్దని చెప్పారు. కొత్త చట్టంతో పటిష్టం చేయాలి ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న కొత్త రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తున్నట్లు లచ్చిరెడ్డి, గౌతమ్కుమార్ స్పష్టం చేశారు. రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేసే విధంగా ఈ చట్టం ఉండాలన్నారు. పాలనాపరమైన సంస్కరణలు తీసుకొచ్చి శాఖను మరింత పటిష్టం చేయాలని తాము చాలా రోజులుగా కోరుతున్న విషయాన్ని గుర్తు చేశారు. కొత్త చట్టం, సంస్కరణల రూపకల్పనలో రెవెన్యూ ఉద్యోగులను భాగస్వాములను చేయాలని కోరారు. క్షేత్రస్థాయిలో పనిచేసే రెవెన్యూ ఉద్యోగులకు వాస్తవ పరిస్థితులపై అవగాహన ఉంటుందని, కాబట్టి ఉద్యోగుల అభిప్రాయాలను, సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. భూసమస్యల్లేని గ్రామాలుగా ప్రకటించాలి ఏడాదిన్నరగా భూ రికార్డుల ప్రక్షాళన ఉద్యోగులంతా తీరిక లేకుండా పనిచేశారని, అయినా కొన్ని చోట్ల తలెత్తిన సమస్యల వల్ల రెవెన్యూ శాఖపై నిందలు పడ్డాయని వారు చెప్పారు. ఈ చెడ్డపేరు తొలగించుకునేందుకు ముందడుగు వేయాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉందన్నారు. భూ రికార్డుల ప్రక్షాళనలో మిగిలి ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా ఉద్యోగులు పనిచేయాలని కోరారు. భూ సమస్యలు పరిష్కరించి రెవెన్యూ వివాదాలు లేని గ్రామాలుగా ప్రకటించాలని సూచించారు. భూ చట్టాల నిపుణుడు ఎం.సునీల్కుమార్, మా రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు లక్ష్మయ్య మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖను మరింత పటిష్టం చేయాలని వారు పేర్కొన్నారు. సమావేశంలో రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రవినాయక్, చిన్నరాజు, గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఈశ్వర్, రాములు, డిప్యూటీ కలెక్టర్ల సంఘం ప్రతినిధి రాజాగౌడ్, టీజీటీఏ ప్రధాన కార్యదర్శి ఏ.వెంకట భాస్కర్, అసోసియేట్ అధ్యక్షుడు పూల్సింగ్ చౌహాన్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే రాధాకృష్ణను అరెస్ట్ చేయాలి
ఏలూరు అర్బన్ : పోలీసు అధికారులపై అనుచితంగా ప్రవర్తించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, అతని అనుచరులపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఏపీ పోలీసు అధికారుల సంఘం శనివారం ఏలూరులో ప్రత్యేక అత్యవసర సమావేశం నిర్వహించింది. ఎమ్మెల్యే రాధాకృష్ణ తీరుపై సంఘ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎం.గంగాధర్, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జె.శ్రీనివాసరావు, డి.సుబ్రహ్మణ్యం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతకాలంగా ప్రజాప్రతినిధులు చట్టాలను తమ చేతుల్లోకి తీసుకుని పోలీసులపై దాడులకు దిగడం పరిపాటిగా మారిందని ఆవేదన వ్యక్త చేశారు. పోలీసులపై దాడికి పాల్పడే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. ఇటువంటి వారిని ఉపేక్షించేది లేదని, ఘటనపై శాసనసభ స్పీకర్ను కలిసి ఎ«థిక్స్ కమిటీకి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పారు. హోం శాఖ మంత్రి, డీజీపీకి నివేదిక సమర్పించి భవిష్యత్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరతామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా కలిసి దాడులకు పాల్పడుతున్న ఎమ్మెల్యేలపై చర్యలకు డిమాండ్ చేస్తామని, అప్పటికీ ఫలితం లేకపోతే హైకోర్టులో న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి టి.గో పాల్, జిల్లా సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, కె.నాగరాజు, కె.రజనీకుమార్, నాయకులు కృపానందం, టి. రాజు తదితరులు పాల్గొన్నారు.