breaking news
Oates
-
మల్టిపుల్ ప్రయోజనాల మల్టీ గ్రెయిన్ ఆటా
సాధారణంగా ఏదో ఒక ధాన్యపు పిండిని వాడటం మామూలే. కానీ ఇటీవల చాలామంది మల్టి గ్రెయిన్ ఆటాలను వాడుతున్నారు. ఏదో ఒక ధాన్యంతో చేసిన పిండి కాకుండా... చాలా రకాల ధాన్యాలను కలిపి దంచిన పిండినే ‘మల్టి గ్రెయిన్ ఆటా’ అంటున్నాం. ఓట్స్, గోధుమపిండి, కుసుమలు, పొట్టు తీయని మరికొన్ని తృణధాన్యాలు కలిపి ఈ పిండిని తయారుచేసుకోవచ్చు. ఇందులో కనిష్టంగా 3 – 5 మొదలుకొని, గరిష్ఠంగా 12 వరకు ధాన్యాలు కలిపి తయారు చేసుకోవచ్చు. ప్రయోజనాలు... చాలాసందర్భాల్లో ఒక రకం పిండిలో ఉన్న పోషకాలు మరోరకం పిండిలో లోపించవచ్చు లేదా చాలా తక్కువగా ఉండవచ్చు. రకరకాల ధాన్యాలను తీసుకొని వాటిని కలిపి పిండిగా చేసుకోవడం వల్ల మల్టి గ్రెయిన్ అనే ఒకే పిండిలోనే చాలా రకాల పోషకాలు దొరుకుతాయి. ఈ పిండి వాడటం వల్ల దేహానికి అన్నిరకాల పోషకాలు అంది ఆరోగ్యం సమకూరుతుంది. ప్రయోజనాలు పొందాలంటే... దేహానికి అన్ని రకాల పోషకాలు అందేలా అన్ని ధాన్యాల సమష్టి ప్రయోజనాలు పొందాలంటే... కనీసం 10 రకాల ధాన్యాలను కలిపి మనమే స్వయంగా పిండిగా పట్టించుకోవడం మేలు. ఎలా తయారు చేసుకోవాలంటే... 1 పైన పేర్కొన్న ధాన్యాలను విడివిడిగా వేయించుకోవాలి. (ఒక్క గోధుమలను మాత్రం వేయించకూడదు). 2 వేయించిన ధాన్యాలు చల్లబడే వరకు ఆరబెట్టాలి. ఆ తర్వాత గోధుమలతో కలపాలి. 3 అన్నింటినీ కలిపి మర ఆడించి, పిండి పట్టించుకోవాలి. 4 మర ఆడించిన పిండి వేడిగా ఉంటుంది. అది చల్లారేవరకు వేచి చూడాలి. 5 రెండుసార్లు జల్లెడ పట్టుకోవాలి. 6 జల్లెడ పట్టినప్పుడు జల్లెడలో మిగిలిన పదార్థాలను పారేయాలి. 7 జల్లెడ పట్టగా కింద మిగిలిన మెత్తటి పిండిని గాలి చొరని ఎయిర్టైట్ డబ్బాలో నిల్వ చేసుకుని అవసరమైనప్పుడు ఉపయోగించుకోవాలి. ఈ జాగ్రత్త పాటించండి: మార్కెట్లో లభ్యమయ్యే మల్టీ గ్రెయిన్ ఆటాలో వాణిజ్య ప్రయోజనాల కోసం చాలా మంది తేలిగ్గా లభ్యమయ్యే గోధుమ పిండినే ప్రధానంగానూ, ఎక్కువగానూ వాడి, మిగతా తృణధాన్యాలను తక్కువ మోతాదులో వాడుతుంటారు. దీని వల్ల మనం దాదాపు సాధారణ గోధుమ పిండిని వాడిన ప్రయోజనానికి మించి పెద్దగా ఉపయోగం పొందలేం. అందుకే మన మల్టి గ్రెయిన్ ఆటాను మనమే తయారుచేసుకునేలా మర పట్టించుకోవడం మంచిది. సుజాతా స్టీఫెన్ చీఫ్ న్యూట్రిషనిస్ట్ యశోద హాస్పిటల్స్, మలక్పేట, హైదరాబాద్ -
హెల్దీ ట్రీట్
►కావలసినవి: ఓట్స్ – 1 కప్పు; నీరు – 2 కప్పులు; ఆపిల్ – 1; నిమ్మరసం – 2 టీ స్పూన్లు; కిస్మిస్ – 1 టేబుల్ స్పూన్; వేరుశనగపప్పు – 1 టేబుల్ స్పూన్; పాలు – 1 కప్పు; తేనె – 2 టీ స్పూన్లు తయారి: ►రాత్రి ఓట్స్ని నీళ్ళలో నానబెట్టాలి. ►ఉదయాన ఆపిల్ పై తొక్క తీసి ముక్కలుగా కట్చేసి, ముక్కలకు బాగా అంటేలా నిమ్మరసం వేసి కలపాలి. ►తర్వాత ఇందులో కిస్మిస్, వేరుశనగపప్పు, మెత్తగా అయిన ఓట్స్ వేసి కలపాలి. ►పాలు పోసిన తర్వాత పైన తేనె వేసి పిల్లలకు బ్రేక్ఫాస్ట్గా ఇవ్వాలి. నోట్: పిల్లలకు సరైన పోషకాహారం అందించాడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ఓట్స్లో కొవ్వుపదార్థాలు ఉండవు. కార్బోహైడ్రేట్లు, కాల్షియం, విటమిన్లు, ప్రొటీన్లు సమృద్ధిగా ఉన్న ఈ అల్పాహారం పిల్లలకే కాదు, పెద్దలకూ మంచిదే. ఈవెనింగ్ స్నాక్గాను తీసుకోవచ్చు. ద్రాక్ష, స్ట్రాబెర్రీ, అరటిపండ్లనే కాదు పాలు కూడా ఇష్టప్రకారం వాడుకోవచ్చు. -
ఓట్స్ చిక్కీ
కావలసినవి: ఓట్స్ - 1 కప్పు, బెల్లం తురుము - అరకప్పు, మైదాపిండి - 4 చెంచాలు, చాక్లెట్ పౌడర్ - 6 చెంచాలు, నీళ్లు - తగినన్ని, అన్ని రకాల డ్రైఫ్రూట్స్ - కావలసినన్ని, నెయ్యి - అవసరానికి తగినంత తయారీ: ఓట్స్ని నూనె లేకుండా దోరగా వేయించి పక్కన పెట్టాలి. మైదాపిండిని కూడా పచ్చి వాసన పోయేవరకూ వేయించి పెట్టాలి. డ్రైఫ్రూట్స్ని నేతిలో వేయించి ఉంచుకోవాలి. బెల్లం తురుములో కొద్దిగా నీళ్లు పోసి పాకం పట్టాలి. తీగపాగం అవుతుండగా ఓట్స్, డ్రైఫ్రూట్స్ వేసి కలపాలి. రెండు నిమిషాల తర్వాత మైదాపిండి కూడా వేసి కలపాలి. మిశ్రమం దగ్గరగా అవుతుండగా చాక్లెట్ పౌడర్ కూడా వేసి కలపాలి. గట్టిగా అయ్యాక దించేసి, నెయ్యి రాసిన ట్రేలో వేయాలి. చల్లారిన తర్వాత ముక్కలుగా కోసుకోవాలి.