breaking news
Non boarders
-
కేయూలో వివాదం.. నాన్బోర్డర్స్ వీరంగం
సాక్షి, వరంగల్ : చారిత్రక కాకతీయ యూనివర్సిటీలో మరో వివాదం చోటుచేసుకుంది. సౌత్ జోన్, ఆల్ ఇండియా, ఇంటర్ యూనివర్సిటీ పోటీల సందర్భంగా రాజుకున్న గొడవ.. కొట్లాట వరకు వెళ్లింది. స్థానిక విద్యార్థులు, అధికారుల ద్వారా అందిన సమాచారం ప్రకారం.. గద్వాల్ జిల్లాకు చెందిన గల్లా వెంకటేష్ ఆయన సోదరి కాకతీయ యూనివర్సిటీలో విద్యానభ్యసిస్తున్నాడు. ఇటీవల జాతీయ స్థాయి యూనివర్సిటీ గేమ్స్ లో పాల్గొన్న వెంకటేష్ సోదరి పట్ల కొందరు సహా విద్యార్థులు అసభ్యంగా ప్రవర్తించారు.ఈ ఘటనపై వెంకటేష్ కాకతీయ యూనివర్సిటీ స్పోర్ట్స్ డైరెక్టర్ సురేష్ లాల్కి పిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే గురువారం రోజున స్పోర్ట్స్ విభాగంలో మహిళా విద్యార్థులకు ట్రాక్ షూట్స్ పంపిణీ చేశారు. ఈ సమయంలో తన సోదరిపై వేధింపులకు పాల్పడిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని డైరెక్టర్ సురేష్ లాల్ను వెంకటేష్ గట్టిగా నిలదేశాడు. దీంతో అప్పటికే డైరెక్టర్ ఛాంబర్ లో ఉన్న కొందరు నాన్ బోర్డర్స్ వెంకటేష్పై మూకుమ్మడిగా పిడిగుద్దులతో దాడికి పాల్పడ్డారు. జరిగిన ఘటనపై బాధితుడు కేయూ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశాడు. మరోవైపు డైరెక్టర్ సురేష్ లాల్పై చర్యలు తీసుకోవాలని, విధుల నుంచి తొలగించాలని విద్యార్థి సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. విద్యార్థులపై బయటి వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటనపై విద్యార్థి సంఘాలు ఆగ్రహంతో ఆందోళనలుకు సిద్ధమవుతుండడంతో కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో యాజమాన్యం సైతం తగిన చర్యలను సిద్ధమవుతోంది. -
నాన్ బోర్డర్లకు ఓయూ వీసీ అప్పీల్
హైదరాబాద్: పరిస్థితులు అర్థం చేసుకొని ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని వసతి గృహాల్లో ఉంటున్న నాన్ బోర్డర్లు వెంటనే యూనివర్సిటీని ఖాళీ చేసి వెళ్లిపోవాలని వర్సిటీ వైఎస్ ఛాన్సలర్ రామచంద్రం విజ్ఞప్తి చేస్తూ ఓ లేఖ రాశారు. లేదంటే ఎన్నో ఆశలతో వర్సిటీకి వస్తున్న నూతన విద్యార్థులకు అన్యాయం చేసినవాళ్లం అవుతామంటూ అందులో వ్యాఖ్యానించారు. తెలంగాణ విద్యార్థుల పరిస్థితిపై అవగాహన ఉండి కూడా గతంలో విద్యనభ్యసించి కోర్సు పూర్తయినా వెళ్లకుండా ఉండిపోతున్న నాన్ బోర్డర్లు ఇలా వ్యవహరించడం భావ్యం కాదని అన్నారు. 'ఎంతో శ్రమపడి ఉన్నత విద్యాభ్యాసం ద్వారా ఆర్థికంగా, సామాజికంగా స్వశక్తిని సంపాదించుకునేందుకు మన యూనివర్సిటీలో ప్రతి సంవత్సరం ఎంతోమంది విద్యార్థులు చేరుతారు. మన విద్యార్థులకు సామాజిక, ఆర్థిక వసతుల లేమి మీకు(నాన్ బోర్డర్లకు) బాగా తెలుసు. అలాంటి పరిస్థితి నుంచి ఎడ్యుకేషన్ ద్వారా బయటపడేందుకు నూతన విద్యార్థులు వస్తుంటారు. వారికి తగిన సౌకర్యాలను అందించాల్సిన బాధ్యత యూనివర్సిటీ అధికారులుగా మాపై ఉంది. సంతృప్తికరమైన వసతి, భోజనం ఏర్పాట్లు, పరిసరాలు లేకుండా విద్యార్థులకు తాము కోరుకున్న స్వశక్తిని సాధించడం సాధ్యం కాదు. హాస్టల్ వసతులు, బడ్జెట్ అర్హత ఉన్న లబ్ధిదారులకు చేరుకోవడం లేదు. దీనికి కారణం నాన్ బోర్డర్లే. కోర్సులు ముగిసినప్పటికీ వారు ఖాళీ చేయకుండా అలాగే ఉండిపోతున్నారు. దీంతో కొత్తగా వస్తున్న విద్యార్థులకు వసతి గృహాల్లో, విద్యావకాశాల్లో తమ అవకాశాలను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్సలర్గా ఆయా కోర్సుల్లో ప్రవేశం పొందిన నూతన విద్యార్థులకు అకాడమిక్ అనుభవాన్ని అందించడం నా ధర్మకతృత్వ బాధ్యత మాత్రమే కాకుండా నైతిక బాధ్యత కూడా. నూతనంగా ప్రవేశం పొందుతున్న విద్యార్థుల భవిష్యత్ను అర్థం చేసుకొని వెంటనే హాస్టళ్లు ఖాళీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. లేదంటే మన విద్యార్థులకు, వారి కలలకు, ఆశయాలకు పెద్ద అన్యాయం జరిగినట్లు అవుతుంది. మనమంతా కలిసి ప్రతి విద్యార్థికి ఉస్మానియా యూనివర్సిటీ అందుబాటులో ఉండేలా చూడాలి. అప్పుడే మనమంతా మన యూనివర్సిటీని విద్యాపరిశోధనా రంగంలో అత్యున్నత శిఖరాలకు చేర్చగలం' అని బహిరంగ లేఖలో వీసీ విజ్ఞప్తి చేశారు.