-
మెరుగైన వైద్యం అందించాలి.. ఎమ్మెల్యే సూచనలు..!
జగిత్యాల: ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా వైద్యులు పనిచేయాలని, పేషెంట్లకు మెరుగై న వైద్యం అందించాలని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు సూచించారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులతో శుక్రవారం ఆయన సమావేశం నిర్వహించారు. వైద్య సేవలు, ఇతర విషయాల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదలకు వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు.విధి నిర్వహణలో సమయపాలన పాటించాలని సూచించారు. ప్రతీ ఆదివారం గైనకా లజిస్ట్ తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆరోగ్యశ్రీ నిధులు పక్కదారి పట్టాయ నే ఆరోపణలపై రికార్డులను పరిశీలించి పూర్తి వివరాలు ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. పలువురు ఉద్యోగులు జీతాలు సరిగ్గా రావడంలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అయితే, ఆయన అ ధికారులకు ఫోన్చేసి జీతాలు త్వరగా వచ్చేలా చూడాలని కోరారు. పేషెంట్లకు కావాల్సిన అన్ని మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రి భవనం పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. కొత్త భవనం పూర్తయ్యాక సీటీస్కాన్తోపాటు మరిన్ని అత్యాధునిక సదుపాయాలు అందుబాటులోకి తెస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రాణవేని సుజాత, ఇన్చార్జి సూపరింటెండెంట్ సాజీద్ అహ్మద్, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రారంభానికి సిద్ధం..
తీరనున్న 30 ఏండ్ల అద్దె తిప్పలు ఎట్టకేలకు సొంతభవనం పూర్తి.. త్వరలో నూతన భవనంలోకి తహసీల్దార్ కార్యాలయం సైదాపూర్: 30 ఏళ్ల అద్దె భవనం ఇక్కట్లు త్వరలో గట్టెక్కనున్నాయి. రెండు గ్రామాల నడుమ తలెత్తిన వివాదం ఎట్టకేలకు తెరపడనుంది. స్థానిక ఎమ్మెల్యే సతీశ్కుమార్ చొరవతో మండలకేంద్రంలో ఇటీవల అన్ని హంగులతో పూర్తయిన తహసీల్దార్ కార్యాలయ సొంత భవనం ప్రారంభానికి సిద్ధమైంది. వెన్కెపల్లి–సైదాపూర్ తహసీల్దార్ కార్యాలయం మండల వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి దాదాపు 30 ఏళ్లుగా అద్దె భవనంలోనే కొనసాగుతోంది. అరకొర వసతులతో పెంకుటింట్లో నిర్వహిస్తున్న ఈ కార్యాలయం వర్షానికి ఉరుస్తుంది. వేసవిలో గాలి ఆడదు. పైకప్పు నుంచి మట్టి రాలుతోంది. రికార్డులుసైతం దుమ్ము, వర్షానికి ఉరిసిన నీటితో తడిసి చెరిగిపోతున్నాయి. రైతుల భూముల రికార్డులు ఉండే కార్యాలయానికి భద్రత కరువైంది. ఇలా మూడు దశాబ్దాలుగా అవస్థలు పడుతున్నారు కార్యాలయ సిబ్బంది, మండల ప్రజలు. జంట గ్రామాల ఆదిపత్యం.. వెన్కెపల్లి–సైదాపూర్ రెండు జంట గ్రామాలు. వీటితోనే మండలకేంద్రంగా ఏర్పడ్డాయి. మండల వ్యవస్థ ఏర్పడినప్పుడు తహసీల్దార్, మండల పరిషత్, పోలీస్స్టేషన్ కార్యాలయాలు సైదాపూర్లో అద్దె భవనాల్లో కొనసాగాయి. పాలన సౌలభ్యం కోసం ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించేందుకు వెన్కెపల్లిలో స్థలం కేటాయించారు. మొదట పోలీస్స్టేషన్ కార్యాలయం పూర్తయింది. అనంతరం మండల పరిషత్, తహసీల్ కార్యాలయాలను రేకులతో నిర్మించారు. ఇందులో మండల పరిషత్ కార్యాలయాన్ని తరలించారు. తహసీల్ కార్యాలయం కూడా తరలించాల్సి ఉండగా అధికారులు సమ్మతించలేదు. కార్యాలయం ఊరు చివరన ఉన్నందున రక్షణ లేకుండా ఉంటుందని ఉన్నతాధికారులకు నివేదించారు. స్థానిక నాయకులు కూడా తమ గ్రామం నుంచి వెన్కెపల్లికి తరలించకూడదని అడ్డుకునే యత్నాలు చేశారు. ఈ సమస్య రెండు గ్రామాల మధ్య కొంత కాలం వివాదానికి దారితీసింది. సైదాపూర్లో స్థల విరాళం.. సైదాపూర్లోనే తహసీల్ కార్యాలయం నిర్మించాలని అందుకు కొత్త బస్టాండ్ సమీపంలో ఓ ప్రై వేట్ స్థలాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. అక్కడే తహసీల్దార్ కార్యాలయం ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. పాలనసౌలభ్యం దష్ట్యా ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండాలనే మెజార్టీ ప్రజాప్రతినిధులు అభిప్రాయానికి వచ్చారు. ఈ క్రమంలో అప్పటి ఎంపీపీ వీరేశం అధ్యక్షతన జరిగిన మండల సభలో అప్పటి ఎంపీ పొన్నం ప్రభాకర్,ఎమ్మెల్యే ప్రవీణ్రెడ్డి ఎదుట తహసీల్దార్ కార్యాలయం మండల కాంప్లెక్స్లోనే ఉండాలని సభ్యులు బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో గతంలో నిర్మించిన రేకుల షెడ్నే మరమ్మతు చేయించారు. అయినా అక్కడికి వెళ్లేందుకు రెవెన్యూ అధికారులు అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో ప్రభుత్వం పక్కా భవనం నిర్మించేందుకు నిధులు మంజూరు చేసింది. టెండర్ పిలిచి పనులు చేపట్టారు. ప్రస్తుత ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు మంజూరు చేయగా నిర్మాణ పనులు సైతం పూర్తయ్యాయి. ప్రస్తుతం ప్రారంభానికి సిద్ధంగా ఉంది. నూతన భవనం ప్రారంభం విషయమై తహసీల్దార్ కె. సురేఖను వివరణ కోరగా.. విషయాన్ని ఆర్డీవోకు శనివారం నివేదించామని తెలిపారు. ఎమ్మెల్యే సతీశ్కుమార్ కూడా త్వరగా రికార్డులు షిఫ్టు చేయాలని సూచించినట్లు పేర్కొన్నారు. ఆర్డీవో అనుమతి కోసం ప్రస్తుతం వేచి చూస్తున్నామని, వారంలోపు నూతన కార్యాలయం ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు ఆమె వివరించారు.
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
రుబెల్లాపై గర్భిణులు అప్రమత్తంగా ఉండాలి
స్పైస్జెట్కు రూ.60 వేల జరిమానా
బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే పింఛన్ల పెంపు
నేడు ప్రధానమంత్రి రోడ్ షో
ఓటింగ్ శాతం పెంచాలి
ఉమ్మరకోట్ సొంతం!
సీ్త్ర, పురుష నిష్పత్తిలో తేడా తగ్గించాలి
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
సమన్వయంతో పనిచేద్దాం: ఎస్పీ
‘12, 13 తేదీల్లో పత్రికా ప్రకటనలపై ముందస్తు అనుమతి తప్పనిసరి’
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్రైజర్స్ కెప్టెన్..
- ఫోటో తీస్తే కవిత రాసే కెమెరా.. ఇది కదా టెక్నాలజీ అంటే!
- పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
- కష్టాల్లో 'పద్మ శ్రీ మొగిలయ్య'.. సాయం చేసిన బుల్లితెర నటి
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement