-
బడుగుల్ని పక్కనబెట్టిన బడ్జెట్
నరేంద్ర మోదీ ప్రభుత్వం పార్లమెంట్లో (1–2–2019) ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాజిక న్యాయానికి చాలా దూరంగా ఉంది. ఓట్ ఆన్ అకౌంట్గా పెట్టవలసిన బడ్జెట్ను 2019–20 బడ్జెట్గా పెట్టడం రాజ్యాంగ విరుద్ధం. పీయూష్ గోయల్ ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్లో మొత్తం కేటాయింపులు 27.84 లక్షల కోట్లు. బడ్జెట్లోని కీలకాంశాలు ఇలా వున్నాయి. రైల్వేకు రూ. 64,587 కోట్లు, రక్షణ రంగంకు రూ.3,05,296 కోట్లు, పెన్షన్లు రూ.1,74,300 కోట్లు, ప్రధాన సబ్సిడీలకు రూ.2,96,684 కోట్లు, వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.1,49,981 కోట్లు, వాణిజ్యం, పరిశ్రమలకు రూ.27,600 కోట్లు, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి రూ.3,000 కోట్లు, విద్యకు రూ.93,848 కోట్లు, ఇంధన రంగంకు రూ.44,101 కోట్లు, విదేశీ వ్యవహారాలకు రూ.16,062 కోట్లు, ఆర్థికశాఖకు రూ.19,812 కోట్లు, ఆరోగ్య రంగంకు రూ.63,538 కోట్లు, హోంశాఖకు రూ.1,03,927 కోట్లు, ఐటి,టెలికాంకు రూ.21,549 కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ.1,38,962 కోట్లు, సాంఘిక సంక్షేమాంకు రూ. 49,337 కోట్లు, రవాణా వ్యవస్ధకు రూ.1,56,187 కోట్లు, పట్టణాభివృద్ధికి రూ.48,032 కోట్లు, ఇతర రంగాలకు రూ.75,822 కోట్లు. ఈ పద్దును పరిశీలిస్తే ఇందులో అణగారిన సామాజిక శ్రేణుల ప్రస్తావన లేకుండా బడ్జెట్ను ప్రవేశపెట్టారని స్పష్టంగా తెలుస్తోంది. నిజానికి ఏ బడ్జెట్లో అయినా దళితులు, ఆదివాసీలు, స్త్రీలు, ప్రధాన పాత్రలో ఉండాలి. అయితే మోదీ ప్రభుత్వానికి వీళ్ళు ముఖ్యులు కారు. వాళ్ల దృష్టిలో కూడా లేరు. రక్తలేమితో పిల్లల్ని కనలేక వేలాది ఆదివాసీ స్త్రీలు చనిపోతున్నారు. దోమతెరలు లేక లక్షలాది మంది గిరిజనులు చనిపోతున్నారు. వారి ప్రస్తావన మోదీ బడ్జెట్లో లేదు. ఓట్ల కోసం హిందువుల్ని రెచ్చగొట్టాలని గో సంపదను జన్యు పరంగా తీర్చిదిద్దాలని, రాష్ట్రీయ గోకుల్మిషన్ కోసం 750 కోట్లు పెంచారు. అంటే ఒక తల్లి బిడ్డను కనలేక రక్తలేమితో మరణిస్తుంటే ఆమె పౌష్టికాహారానికి ఇవ్వాల్సిన ధనాన్ని పక్కనబెట్టి గోరక్షణకు కేటాయింపులు చేశారు. మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖకు కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో రూ.29 వేల కోట్లను కేటాయించింది. మొత్తం భారతదేశంలో వితంతువుల సంఖ్య ఎంత? లెక్కలున్నాయా. మీ మద్యపాన విధానాల వల్ల, రహదారుల విధానాల వల్ల ఎందరో త్వరగా మరణిస్తున్నారు. ఎంతో మంది వితంతువులుగా మిగిలిపోతున్నారు. వీరికి పునరావాస కేంద్రాలు ఏవి, వాటి నిర్మాణం ఏది? ప్రధానమంత్రి కిసాన్సమ్మాన్ నిధి పేరిట ఎకరాకు 6 వేలు ఇవ్వాలని మోదీ నిర్ణయించారు. కానీ దేశంలో 100కి 80% భూమిని కౌలు రైతులు సాగుచేస్తున్నారు. వారిలో ఎక్కువ మంది గిరిజనులు, దళితులు ఉన్నారు. మరి వారి సంగతి ఏమిటి. పోడు వ్యవసాయం చేసే గిరి జనులకు పట్టా పుస్తకాలు, పాసు పుస్తకాలు లేవు. భూయజమాన్య హక్కుల ఆధారంగా బ్యాంక్ రుణాలు తీసుకునే రైతులకు కేంద్రం నేరుగా ధనం బదిలీ అవుతుంది. ఇవి లేని దళిత, గిరిజన రైతుల పరిస్ధితి ఏమిటి? అంటే దళితులు రైతులు కాదా! సాగు చేస్తూ భూ హక్కులు లేనివారి సంఖ్య ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే 25 లక్షల పైనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారమే 16 లక్షల మంది ఉన్నారు. ఇందులో పది లక్షల మంది దళితులే ఉన్నారు. కేసీఆర్ తెలంగాణలో దళితులను దెబ్బతీయాలని కేవలం రైతులకు నగదు బ్యాంకుల్లో వేశారు. చంద్రబాబు నీరు, చెట్టు పేరుతో దళితుల భూములు లాక్కుని సొంత కులాలకు ఇచ్చారు. ఇప్పుడు దళితుల భూములు లాక్కుంటున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కౌలు రౌతులు ముందస్తుగా రైతులకు ఎకరాకు 30 వేలు వడ్డీలకు తెచ్చి చెల్లిస్తున్నారు. తుఫాన్లు వస్తే నష్టాన్ని తామే భరిస్తున్నారు. దళితులు వ్యవసాయ కూలీల నుంచి కౌలు రైతులుగా మారే క్రమంలో వారిని అప్పుల్లో ముంచే ప్రయత్నం కేంద్రం రాష్ట్రాలు చేస్తున్నాయి. రైతుకు 6 వేల రూపాయలు మూడు విడతలుగా బ్యాంక్లో వేయడం కూడా జరుగుతోంది. ఇదీ రైతు కులాలకు అవమానమే. ప్రభుత్వాన్ని పోషించాల్సిన రైతును భిక్షగాళ్ళగా మార్చుతున్నారు. అడుక్కునే స్వభావాన్ని నేర్పుతున్నారు. బడ్జెట్ పద్దుల్లో ఏపీ విద్యా సంస్ధల పేర్లు ప్రత్యేకంగా చూపినప్పటికీ కేటాయిం పులు మాత్రం చేయలేదు. 2018–19లో కేటాయిం చిన రూ.49 కోట్లను మాత్రం అంచనాల సవరణ సమయానికి రూ.70.40 కోట్లకు పెంచారు. ఈ కేంద్ర బడ్జెట్ను చూస్తే తప్పకుండా కేంద్రప్రభుత్వం దళిత, మైనార్టీ, స్త్రీ ద్వేషి అని అర్థం అవుతుంది. ‘హిందూ’ సెంటిమెంట్ను రెచ్చగొట్టి ‘గోవు’ను కేంద్రం చేసి మళ్ళీ రాజ్యానికి రావాలని చూస్తున్నారు. ఈ సందర్భంగా లౌకికవాదుల, వామపక్షవాదుల, సామాజిక ఉద్యమకారుల, హేతువాదుల ఐక్యత రాజకీయంగా పటిష్టం కావాల్సిఉంది. వ్యాసకర్త: డా‘‘ కత్తి పద్మారావు, సామాజిక తత్వవేత్త, నవ్యాంధ్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ‘ 98497 41695 -
‘రోహిత్ మృతిపై అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలి’
పొన్నూరు : రోహిత్ మరణంపై ప్రస్తుత న్యాయసాధికార మంత్రి రామ్దేవ్ అటాలే, రాంవిలాస్ పాశ్వాన్, మాయావతి, సీతారామ్ ఏచూరితో అఖిలపక్ష కమిటీని ఏర్పాటు చేయాలని నవ్యాంద్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కత్తి పద్మారావు డిమాండ్ చేశారు. స్థానిక కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రోహిత్ దళితుడు కాదనడం, అతని ఆత్మహత్య వెనుక స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయ ప్రమేయం లేదని, తనకు తానే ఆత్మహత్యకు కారణమయ్యాడని అలహాబాద్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఎ.కె రూపస్వాల్ ఇచ్చిన రిపోర్టు సరియైంది కాదని తెలిపారు. ఈ రిపోర్టును నిర్వీర్యం చేయడంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు ప్రమేయం స్పష్టంగా ఉందని ఆరోపించారు. రోహిత్ ఆత్మహత్యకు సంబంధించి సూసైడ్నోట్ దేశంలోని అన్ని పత్రికల్లో ప్రచురించడమే కాక బండారు దత్తాత్రేయ, స్మృతిఇరానీ చర్యలు ఉన్నట్లు నిర్థారించాయని పద్మారావు చెప్పారు. పార్లమెంటులోని 111 మంది దళిత ఎంపీలు ఆ నివేదిక అవాస్తవమని నిరాకరించాలని కోరారు. వీసీ అప్పారావును కాపాడేందుకే రోహిత్ దళితుడు కాదనే నివేదిక ఇచ్చారన్నారు. ప్రధానమంత్రే స్వయంగా రోహిత్ మరణం వెనుక ఉన్న కుల అంశాన్ని ప్రస్తావించడమే కాకుండా ఎర్రకోట మీద చేసిన ప్రసంగాన్ని మర్చిపోకూడదని తెలిపారు. చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు సొంత సామాజిక వర్గానికి చెందిన వీసీ అప్పారావును రక్షించాలనే కాంక్షతోనే ఇటువంటి నివేదికలు తెచ్చారన్నారు. ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ ఎట్రాసీటీ కేసులో ఉన్న వీసీని మరలా నియమించడం భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. -
2015 లో నవ్యాంధ్ర పార్టీ స్థాపన
చంద్రబాబు రాజ్యాన్ని కూల్చడమే లక్ష్యం: కత్తి పద్మారావు కనిగిరి: దళిత బహుజన పార్టీగా 2015 ఏప్రిల్లో నవ్యాంధ్ర పార్టీని స్థాపించనున్నట్లు దళిత ఉద్యమ నేత కత్తి పద్మారావు తెలిపారు. రాజధానిలో అంబేద్కర్ 150 అడుగుల విగ్రహ ఏర్పాటుకు సంబంధించి ప్రకాశం జిల్లా కనిగిరిలోని జూనియర్ కాలేజీ ఆవరణలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రానున్న కాలంలో చంద్రబాబు రాజ్యాన్ని కూల్చడమే లక్ష్యంగా దళిత బహుజన వర్గాలు ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూపురేఖలు మారాయి
అగ్రి ల్యాబ్ ఎంతో ప్రయోజనం
● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు ● వెల్లివిరుస్తున్న ప్రభుత్వ భవనాలు ● నాడు–నేడుతో సమూలంగా మారిన సర్కారు బడులు ● ఇళ్లు కాదు.. ఊళ్లుగా వెలిసిన జగనన్న కాలనీలు ● అబ్బో..! ఎటు చూసినా నయా మెరుగులే!
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
రేపు, ఎల్లుండి కూడా పోస్టల్ బ్యాలెట్
రోబోటిక్ టెక్నాలజీతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
అబ్బో.. ఆ యువ నాయకుడితో ఎట్టా ఏగేది?
బూటకాల ‘బాబు’
వైఎస్సార్సీపీ జోష్
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement