-
ఆ పాట ప్రతి బిర్యానీ సెంటర్లో ఉంటుంది
‘‘1994లో ‘భైరవద్వీపం’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. ఈ 26 ఏళ్ల కెరీర్లో ఎన్నో మధురానుభూతులుఉన్నాయి. నా కెరీర్లో ‘అరవిందసమేత వీరరాఘవ’ వందో చిత్రమని నాకు ముందు తెలీదు. ఆ తర్వాత తెలిసి ఆశ్చర్యపోయా. ఎన్ని సినిమాలు చేశానని వెనక్కి తిరిగి చూసుకుని లెక్కలు వేసుకోను.. వచ్చిన అవకాశాల్ని ఉపయోగించుకుంటూ సినిమాలు చేసుకుంటూ పోతుంటా’’ అని సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ అన్నారు. రవితేజ, శ్రుతీహాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘క్రాక్’. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్పై బి. మధు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర సంగీత దర్శకుడు తమన్ పంచుకున్న విశేషాలు. ► గత ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘అల వైకుంఠపురములో’ సినిమా పాటలు ఎంత హిట్ అయ్యాయో తెలిసిందే. ఆ సినిమా తర్వాత నా చేతిలో ఉన్న ప్రాజెక్టులను ఒత్తిడిగా భావించలేదు. ప్రతి సినిమాకి బాధ్యతగా 100 శాతం కష్టపడతాను. అది చిన్నదా, పెద్దదా అనే తేడా ఎప్పుడూ ఉండదు. కొన్ని సినిమా పాటలు మాత్రం ప్రేక్షకులకు బాగా నచ్చుతాయి. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలయ్యే ‘క్రాక్’ సినిమాలోని పాటలు ‘అల వైకుంఠపురములో’ అంత హిట్ అవుతాయనే నమ్మకం వెయ్యి శాతం ఉంది. ‘క్రాక్’ సినిమా నుంచి నేడు విడుదల చేయనున్న ‘క్రాక్ బిర్యానీ..’ అనే పాట ప్రతి బిర్యానీ సెంటర్లో వినిపిస్తుంటుంది. ► రవితేజగారు, నా కాంబినేషన్లో వస్తున్న పదో చిత్రం ‘క్రాక్’. ఆయన పూర్తి ఫ్రీడమ్ ఇస్తారు. సరదాగా సినిమా పూర్తి చేయొచ్చు. ఆయన బాడీ లాంగ్వేజ్కి, కథకి ఎటువంటి సంగీతం ఇవ్వాలో నాకు తెలుసు.. అందుకే నాపై ఆయనకు నమ్మకం. ► గోపీచంద్ మలినేనిగారితోనూ నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన దర్శకత్వం వహించిన 6 సినిమాల్లో వరుసగా 5 చిత్రాలకు నేను సంగీతం అందించడం చాలా సంతోషంగా ఉంది. ‘క్రాక్’ సినిమాతో రవితేజగారు, గోపీచంద్గారు హ్యాట్రిక్ హిట్ సాధిస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ► లాక్డౌన్లో రికార్డింగ్ పనులు చూసుకుంటూ ఉన్నాను. సంగీతం అనేది నాకు అన్నం పెడుతోంది.. కాబట్టి నా దృష్టంతా పూర్తిగా సంగీతంపైనే.. నటించాలనే ఆలోచన ఒక్క శాతం కూడా లేదు. ప్రస్తుతం తెలుగులో ‘సర్కారువారి పాట, వకీల్ సాబ్, టక్ జగదీష్’ తో పాటు పవన్ కల్యాణ్గారి 29వ సినిమా సంగీత పనులు జరుగుతున్నాయి. ఇవి పూర్తయ్యాకే తెలుగులో కొత్త సినిమాలు అంగీకరిస్తాను. -
కాలేజ్కి అప్గ్రేడ్ అయినట్టుంది
‘‘పాటలు ఎంత సక్సెస్ సాధించినా కూడా సినిమా హిట్ అయితేనే పాటలు మరింతగా ప్రేక్షకుల్లోకి వెళ్తాయి. డైలాగ్కు మ్యూజికల్ వెర్షనే పాట అని నమ్ముతాను’’ అని తమన్ అన్నారు. ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ తెరకెక్కించిన చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. యస్.రాధాకృష్ణ నిర్మించారు. ఈ చిత్రం గురువారం రిలీజైంది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు యస్.యస్. తమన్ పలు విశేషాలు పంచుకున్నారు. ► ‘అరవింద సమేత’ సినిమా కోసం పని చేయడం మంచి అనుభూతి. ఒక్కోపాట చేస్తున్నప్పుడు ఎన్టీఆర్ అన్నయ్య, త్రివిక్రమ్గారు ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. మనసు పెట్టి చేశావు అని ఆ ఇద్దరూ అభినందించడం ఆనందంగా ఉంది. ఇండస్ట్రీలో కూడా చాలా మంది దర్శకులు అభినందిస్తున్నారు. ► ఈ చిత్రం కథకు అనుగుణంగానే మ్యూజిక్ కంపోజ్ చేశాను. ఎక్కడా కావాలని పాటను ఇరికించలేదు. అంత ఇంపార్టెన్స్ ఉంది కథకు. పక్కదారి పట్టకుండా తెరకెక్కించినందుకు త్రివిక్రమ్ గారికి హ్యాట్సాఫ్. ► ఎనిమిదేళ్లుగా త్రివిక్రమ్గారితో పని చేయాలనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. ఈ సినిమా పూర్తయ్యాక స్కూల్ నుంచి కాలేజ్కి అప్గ్రేడ్ అయినట్టుంది. ► గత కొంత కాలంగా కేవలం కథానుగుణంగా పాటలు అడుగుతున్నారు. అందరి అభిరుచులు మారుతున్నాయి. మంచి పరిణామం. కాపీ ట్యూన్స్ వాడితే ఇంత మైలేజ్ ఉండేదా? నేను ఏమీ అనననేగా నన్ను అడుగుతున్నారు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ని ఆమాట అడుగుతారా? ► సంగీత దర్శకుడిగా రాణించాలంటే చాలా ప్రోగ్రామ్స్ చేయాలి. స్టేజ్షోలు కూడా ఉపయోగపడతాయి. ఆ అనుభవంతోనే రాణించగలం అని నమ్ముతాను. -
పెళ్లయిన ఏడేళ్ల తరువాత మొదటిసారి అత్తవారింటికి
ఎస్ఎస్ తమన్.. నవతరం తెలుగు సినీ సంగీతంలో ఆయనో సంచలనం. ఎన్నో హిట్ సినిమాలకు బాణీలు అందించి, అనతికాలంలోనే అగ్రస్థాయి సంగీత దర్శకుడిగా ఎదిగారు. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఆయన పూర్తి పేరు.. ఘంటసాల శివసాయి తమన్. కిక్ సినిమా నుంచి ఆగడు వరకూ సినిమాలకు తమన్ చక్కటి సంగీతం అందించారు. అమలాపురం కిమ్స్ వైద్య కళాశాలలో జరిగిన ‘గ్లిట్జ్-2014’లో ప్రత్యేక ప్రదర్శన ఇచ్చేందుకు వచ్చిన ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. సాక్షి : మీ కుటుంబ నేపథ్యం.. తమన్ : మా తాతగారు ఘంటసాల బలరామ్గారు సినీ నిర్మాత. అక్కినేని నాగేశ్వరరావుగారిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఆయనే. ఆయన నిర్మాణ సంస్థ ప్రతిభ ప్రొడక్షన్స్లో ఏఎన్ఆర్గారితో 50 సినిమాల వరకూ తీశారు. మా తండ్రి శివకుమార్, తల్లి సావిత్రి. భార్య శ్రీవర్ధిని. మాకు ఆరేళ్ల పాప ఉంది. సాక్షి : బాలుగారితో సాన్నిహిత్యం గురించి.. తమన్ : ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారితోనే నా సంగీత ప్రయాణం మొదలైంది. ఆయనతో 300 పైగా ప్రోగ్రాంలు చేశాను. ఆయనతో అనుబంధం నా కెరీర్కు ఎంతో ఉపయోగపడింది. సాక్షి : మీ సినీ ప్రయాణం గురించి.. తమన్ : మా తండ్రి శివకుమార్ తబలా విద్వాంసుడు కావడంతో చిన్ననాటి నుంచీ తబలా, డ్రమ్స్పై ఎక్కువ శ్రద్ధ చూపించేవాడిని. బాయ్స్ సినిమాతో నటన ప్రారంభించినా మ్యూజిక్ మీద ఉన్న ఆసక్తితో సంగీత దర్శకుడిని అయ్యాను. సాక్షి : ఇప్పటివరకూ ఎన్ని సినిమాలకు సంగీతం అందించారు? తమన్ :తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో 56 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించాను. సాక్షి : బాగా బ్రేక్ ఇచ్చిన సినిమా.. తమన్ : నేను పని చేసిన అన్ని సినిమాలూ నాకు బ్రేక్ ఇచ్చినవే. ప్రత్యేకంగా చెప్పాలంటే కిక్, దూకుడు, బిజినెస్ మేన్ సినిమా లు నాకు బాగా గుర్తింపునిచ్చాయి. సాక్షి : తక్కువ కాలంలోనే ఇన్ని సినిమాలకు సంగీతం అందించడం ఎలా సాధ్యమైంది? తమన్ : నిర్మాత చెప్పిన షెడ్యూల్ తగ్గట్టుగా పని చేస్తాను. చెప్పిన సమయంకంటే ముందుగానే సంగీతం అందిస్తాను. నావల్ల ఏ సినిమా ఆలస్యం కాకూడదు. కానివ్వను. అందుకోసం మా టీమంతా చాలా కష్టపడి పని చేస్తుంది. సాక్షి : కొత్త సినిమాల గురించి.. తమన్ : కిక్-2, పండగ చేస్కో సినిమాలతోపాటు రామ్చరణ్తో ఒకటి, బాలకృష్ణ 99వ చిత్రం, నాగార్జున కుమారుడు అఖిల్ హీరోగా తీయబోయే సినిమాకు సంగీతం అందించనున్నాను. సాక్షి : దేవీశ్రీప్రసాద్తో పోటీ పడుతున్నట్టున్నారు? తమన్ : కాంపిటీషన్ ఉండాలి. శత్రువు లేని యుద్ధం చేయలేం. పోటీ లేని ప్రపంచంలో ఎదగలేం. మా మధ్య ఆరోగ్యకరమైన పోటీయే ఉంది. ఇది మా ఇద్దరికీ మంచిదే. సాక్షి : కోనసీమ గురించి.. తమన్ : ఇక్కడి సంస్కృతి, పచ్చని పొలాలు, స్వచ్ఛమైన మనుషులు ఎంతో నచ్చారు. నాకు కోనసీమతో ప్రత్యేక అనుబంధం ఉంది. నేను అమలాపురం అల్లుడినే. నా భార్య శ్రీవర్ధిని. ఆమె సింగర్. ఏడేళ్ల క్రితం మాకు వివాహమైంది. మామ కూచి దీక్షితులు తబలా విద్వాంసుడు. వారిది అమలాపురమే. సాక్షి : అత్తారింటికొచ్చారన్నమాట.. తమన్ : (నవ్వుతూ) పెళ్లయిన ఏడేళ్ల తరువాత మొదటిసారి అత్తవారింటికి అమలాపురం వచ్చాను. సాక్షి : ‘మేము సైతం’ కార్యక్రమం గురించి.. తమన్ : హుద్హుద్ తుపాను ఎందరికో నష్టాన్ని మిగిల్చింది. బాధితుల సహాయార్థం ఈ మధ్యనే రాక్గార్డెన్స్ ఆధ్వర్యంలో సినీ రచయిత కోన వెంకట్ సోదరి నీరజ ప్రోత్సాహంతో ఓ స్టేజ్ షో చేశాను. దానిద్వారా వచ్చిన రూ.6 లక్షలు తుపాను బాధితుల కోసం ఇచ్చాను. సినీ పరిశ్రమ తరఫున మేమంతా అండగా ఉంటాం. ఈ నెల 30న ‘మేము సైతం’ కార్యక్రమంలో సినీ హీరోలతో పాటలు పాడిస్తున్నాం. ఎన్టీఆర్, రవితేజలతో పాడిస్తాను. సాక్షి : బాయ్స్ సినిమాలో నటించారు. మళ్లీ మేకప్ వేసుకునేదెప్పుడు? తమన్ : నా పూర్తి కాన్సట్రేషన్ మ్యూజిక్పైనే ఉంది. ఇక నటించాలన్న ఆసక్తి లేదు. సంగీత పాఠశాల ఏర్పాటు చేస్తా వెలుగుబంద (రాజానగరం) : రాష్ట్రంలో ఒక సంగీత పాఠశాల ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందని ఎస్ఎస్ తమన్ తెలిపారు. స్థానిక గైట్ కళాశాలను శనివారం సందర్శించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. మున్ముందు తమ ‘టమోటా బ్యాండ్’ అనే గ్రూపు ద్వారా వచ్చే సంపాదనను మ్యూజిక్ పాఠశాల నిర్వహణకు వినియోగిస్తానన్నారు. మ్యూజిక్ పాఠశాలను తమ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేస్తే అనువైన భవంతి సమకూరుస్తామని, గైట్ కళాశాల ఎండీ కె.శశికిరణ్వర్మ, ఈడీ కె.లక్ష్మి చెప్పడంతో తమన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
Advertisement