breaking news
Mount Fuji
-
జపాన్ పర్యటనకు ఐఆర్సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజీ!
విదేశీ ప్రయాణం అనేది చాలా మందికి ఒక కల. అయితే ఖరీదైన హోటళ్లు, రవాణా, వీసా ఏర్పాట్లు వంటి సమస్యలు చాలా మందిని వెనక్కి లాగుతుంటాయి. అలాంటి వారికి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ఒక అద్భుతమైన, సరికొత్త జపాన్ పర్యటన ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఎలాంటి టెన్షన్ లేకుండా బ్యాగులు సర్దుకుని విదేశీ పర్యటనను ఆస్వాదించాలనుకునే వారికి ఇది సువర్ణావకాశం.జపాన్ పర్యటన అడ్డంకులకు చెక్విదేశాలకు వెళ్లాలని కలలు కనేవారికి ఇకపై ప్లానింగ్ టెన్షన్స్ ఉండవు. హోటల్ బుకింగ్లు, విమాన ప్రయాణాలు, భోజనం, స్థానిక రవాణా ఏర్పాట్లన్నీ ముందుగానే పక్కాగా సిద్ధం అవుతాయి. ప్రయాణికులు కేవలం తమ లగేజ్తో ప్రయాణాన్ని ప్రారంభించడమే తరువాయి.పర్యటన కాలపరిమితి.. తేదీలుఈ ప్రత్యేక ఐఆర్సీటీసీ పర్యటన మొత్తం 9 రాత్రులు, 10 రోజుల పాటు అద్భుతంగా కొనసాగుతుంది. ఈ ట్రిప్ సెప్టెంబర్ 6, 2026 న ఢిల్లీ నుండి బయలుదేరి, సెప్టెంబర్ 15, 2026తో ముగుస్తుంది. పూర్తి ప్రయాణం విమాన మార్గంలోనే సౌకర్యవంతంగా సాగుతుంది.సందర్శించాల్సిన ప్రముఖ నగరాలుఈ 10 రోజుల సుదీర్ఘ పర్యటనలో జపాన్లోని అత్యంత ప్రసిద్ధ నగరాలను చూడవచ్చు. ప్రయాణికులు టోక్యో, హకోనే, హమామత్సు, క్యోటో, ఒసాకా, నారా, హిరోషిమా వంటి అద్భుతమైన ప్రదేశాలను సందర్శించే అరుదైన అవకాశం దక్కనుంది.ప్రపంచ ప్రసిద్ధ మౌంట్ ఫూజీ సందర్శనజపాన్ అనగానే గుర్తొచ్చే అద్భుతమైన ఆకర్షణ మౌంట్ ఫూజీ. ఈ ప్యాకేజీలో భాగంగా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మౌంట్ ఫూజీని అతి దగ్గరగా వీక్షించే అవకాశం ప్రయాణికులకు లభిస్తుంది. ప్రకృతి అందాలను ఆస్వాదించే వారికి ఈ అనుభూతి జీవితంలో మరువలేనిదిగా ఉంటుంది.మొదటిసారి వెళ్లేవారికి పర్ఫెక్ట్ ఛాయిస్జపాన్ను మొదటిసారి సందర్శిస్తూ, ఎటువంటి ఇబ్బందులు లేని ఒక ప్రయాణ అనుభవాన్ని కోరుకునే వారి కోసం ఈ టూర్ ప్రత్యేకంగా రూపొందించారు. ఇది ఒక గైడెడ్ గ్రూప్ టూర్ కాబట్టి ఎయిర్పోర్ట్ ట్రాన్స్ఫర్లు, హోటల్ చెక్-ఇన్ల గురించి ఆందోళన చెందాల్సిన పనే లేదు.ప్యాకేజీ ధరల వివరాలుఐఆర్సీటీసీ ప్రకటించిన వివరాల ప్రకారం ట్విన్ లేదా డబుల్ షేరింగ్లో ప్రయాణించే ప్రతి ఒక్కరూ టీసీఎస్తో కలిపి రూ. 3,49,999 చెల్లించాల్సి ఉంటుంది. ఇక సింగిల్ ఆక్యుపెన్సీ కోసం రూ. 4,73,999, ట్రిపుల్ షేరింగ్ అయితే ఒక్కొక్కరికి రూ. 3,45,999గా ఛార్జీలను నిర్ణయించారు.పిల్లల కోసం ప్రత్యేక రాయితీలుకుటుంబంతో కలిసి ప్రయాణించే వారికి కూడా ఈ ప్యాకేజీలో తగిన వెసులుబాట్లు కల్పించారు. 5 నుండి 11 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు బెడ్తో కూడిన ప్యాకేజీ ధర రూ. 2,92,499 కాగా, బెడ్ అవసరం లేని పిల్లలకు రూ. 2,63,999 చొప్పున ఖర్చవుతుంది.ఇది కూడా చదవండి: గాల్లో దూసుకెళ్లే ఫ్లయింగ్ వెహికల్.. దిమ్మతిరిగే ఆవిష్కరణ! -
12వేల అడుగుల శిఖరం ఎక్కిన 102 ఏళ్ల వృద్ధుడు
టోక్యో: ఏదైనా సాధించాలని అనుకుంటే దానికి వయసు ఎంతమాత్రం అడ్డంకి కాదని ‘కోకిచి అకుజావా’ నిరూపించాడు. జపాన్కు చెందిన ఈ 102 రెండేళ్లు వృద్ధుడు హృద్రోగంతో బాధపడుతున్నాడు. అయినా దానిని లెక్కచేయకుండా అత్యంత ఎత్తయిన పర్వతాన్ని అధిరోహించి, గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకున్నాడు.1923లో జన్మించిన కోకిచి అకుజావా, నెలల తరబడి శిక్షణ పొందిన తర్వాత ఈ నెల ప్రారంభంలో జపాన్లోని అత్యంత ఎత్తయి శిఖరాగ్రానికి చేరుకున్నాడు. అకుజువా మీడియాతో మాట్లాడుతూ.. తాను ఈ శిఖరాన్ని చివరిసారి అధిరోహించినప్పటి కన్నా ఇప్పుడు ఆరేళ్లు పెద్దవాడినని అన్నారు. నాడు 96 ఏళ్ల వయసులో 3,776 మీటర్ల (12,388-అడుగులు) శిఖరాన్ని అధిరోహించానన్నారు. పశువుల పెంపకందారుడు, అకుజావా స్వచ్ఛంద సేవకునిగా, పెయింటర్గా పేరొందారు. గత జనవరిలో తాను హైకింగ్ చేస్తున్నప్పుడు కాలుజారి పడ్డానని, హృద్రోగాన్ని ఎదుర్కొన్నానని అయినా పర్వాతారోహ శిక్షణకు వెనుకడుగు వేయలేదన్నారు.తాను చాలా వేగంగా కోవడాన్ని వైద్యులు కూడా నమ్మలేకపోయారని అకుజావా తెలిపారు. కుటుంబంలోని వారు వద్దని చెప్పినప్పటికీ అకుజావా పర్వాతారోహణ ప్రయత్నాన్ని విరమించలేదు. ఎద్దయిన పర్వతం మౌంట్ ఫుజిని మూడు రోజులలో అధిరోహించాడు. రాత్రి వేళ విశ్రాంతి తీసుకుంటూ అధిరోహణ కొనసాగించాడు. ఈ ప్రయత్నంలో కొందరు సహచరులు అతనికి సాయం అందించారు. -
జపాన్ యుద్ధ విన్యాసాలు..
మౌంట్ ఫ్యూజీ : జపాన్ గుండెల్లో వణుకు పుట్టిన ఉత్తర కొరియాకు ప్రతిగా ఆ దేశం కూడా దూకుడు ప్రదర్శిస్తోంది. కిమ్ వరుస హెచ్చరికల నేపథ్యంలో జపాన్ కూడా యుద్ధ విన్యాసాలను ప్రారంభించింది. జపాన్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ ఆధ్వర్యంలో మౌంట్ ఫ్యూజీ ప్రాంతంలో ఈ లైవ్ ఫైర్ డ్రిల్స్ను ప్రారంభించింది. ఉత్తర కొరియా ప్రయోగించిన ప్రతి క్షిపణి జపాన్ సముద్రంలో పడుతుండటం ఇటీవల సబ్ మెరైన్ నుంచి క్షిపణి ప్రయోగాలను చేపడుతున్న సమయంలో జపాన్ ఈ విన్యాసాలను చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2,400 మంది సైనికులు పాల్గొన్న ఈ విన్యాసాలలో పలు యుద్ధ ట్యాంకులు, జపాన్ నూతనంగా అభివృద్ధి చేసిన క్షిపణులను పరీక్షించారు. అన్ని ఆయుధాల పనితీరు బాగుందని ఎటువంటి చర్యలనైనా ఎదుర్కోవడానికి సిద్దమని ఆ దేశ రక్షణాధికారులు ప్రకటించారు. కాగా ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణి ప్రయోగంతో తమకు ప్రత్యక్షంగా ఎలాంటి ముప్పు లేదని అధికారులు చెబుతున్నారు.


