breaking news
motarola Mobility Company
-
అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ విడుదల, ధర మరీ ఇంత తక్కువా!
ఈ పెళ్లిళ్ల సీజన్లో స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? మీరు కొనాలనుకుంటున్న ఫోన్లో అదిరిపోయే ఫీచర్లతో మీ బడ్జెట్లో ఉండాలని అనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ను రేపు (జూన్2న) విడుదల చేయనుంది. మోటో ఈ32ఎస్ ఫీచర్లు ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్నా, లేదంటే విడుదలకు సిద్ధంగా ఉన్న స్మార్ట్ఫోన్లు సేమ్ డిజైన్లే ఉంటాయి. కానీ ఈ మోటో ఈ32ఎస్ మాత్రం పంచ్ హోల్ డిస్ప్లే, ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రేర్ కెమెరాను డిజైన్ చేసింది. స్లేట్ గ్రే, మిస్టీ సిల్వర్ కలర్స్లో లభ్యం కానుంది. ఐపీ52 రేటింగ్ అంటే కింద పడినా, వాటర్లో పడినా తిరిగి వినియోగించుకోవచ్చు. యూఎస్బీ టైప్-సీ పోర్ట్, కింది భాగంలో ఒకే స్పీకర్, బయోమెట్రిక్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. స్పెసిఫికేషన్ల విషయానికొస్తే మోటో ఈఎస్32ఎస్ 5000ఏఎంహెచ్ బ్యాటరీ, 15డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో 6.5-అంగుళాల డిస్ప్లే, ఎఫ్హెచ్డీ ప్లస్ డిస్ప్లే లేనప్పటికీ స్క్రీన్ 90హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్కు సపోర్ట్ చేస్తుంది. ఫోన్ పనితీరు, సామర్ధ్యం బాగుండేందుకు మీడియా టెక్ హీలియా జీ 37 ఎస్ఓసీ ప్రాసెసర్ను అందిస్తుంది. 3జీబీ ర్యామ్ ప్లస్ 32జీబీ స్టోరేజ్, 4జీబీ ర్యామ్ ప్లస్ 64జీబీ స్టోరేజ్ ఉండే రెండు కాన్ఫిగరేషన్లను అందిస్తుంది. ఆప్టిక్స్ పరంగా, వెనుక కెమెరా సెటప్లో 16 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. ముందు భాగంలో ఒక 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. మోటో ఈ32ఎస్ ధర మోటరోలా సంస్థ మోటో ఈ32ఎస్ పేరుతో రూ.10వేల బడ్జెట్ ఫోన్ను జూన్2న విడుదలకు సిద్ధమైంది. ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ మాత్రం అదే ఫోన్ 3జీబీ ర్యామ్ ప్లస్ 32జీబీ స్టోరేజ్ ఫోన్ ను రూ.9,222గా ఉందని తెలిపింది. ఇక 4జీబీ ప్లస్ 64జీబీ ర్యామ్ ఫోన్ ధర ఇంకాస్త ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. -
ఆండ్రాయిడ్ కిట్క్యాట్లో చౌక ఫోన్
న్యూఢిల్లీ: మోటరొల మొబిలిటి కంపెనీ ఆండ్రాయిడ్ తాజా ఆపరేటింగ్ సిస్టమ్ కిట్క్యాట్పై పనిచేసే సరికొత్త మొబైల్ ఫోన్, ‘మోటో ఇ’ను మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ డ్యూయల్ సిమ్ మొబైల్ ధర రూ.6,999 అని మెటరోల మొబిలిటీ ఇండియా జీఎం అమిత్ బొని తెలిపారు. ఆండ్రాయిడ్ కిట్క్యాట్ ఓఎస్పై పనిచేసే ఫోన్లలో అత్యంత చౌకైన ఫోన్ ఇదే. ఈ డ్యూయల్ సిమ్ ఫోన్లో 1.2 గిగా హెర్ట్జ్ డ్యుయల్-కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 4 జీబీ ఇంటర్నల్ మెమరీ(32 జీబీ వరకూ విస్తరించుకోగల మెమరీ), 1,980 ఎంఏహెచ్ బ్యాటరీ, 5 మెగా పిక్సెల్ రియర్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయని వివరించారు. ఈ తాజా ఫోన్ కారణంగా భారత మార్కెట్లో తమ జోరు మరింత పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఫీచర్ ఫోన్ల నుంచి స్మార్ట్ఫోన్కు మారాలనుకునే భారత వినియోగదారుల అవసరాలకనుగుణంగా ఇ ఫోన్ను రూ పొందించామన్నారుు. దేశీ మొబైల్ కంపెనీలు మైక్రోమ్యాక్స్, కార్బన్లకు ఈ ‘మోటో ఇ’ ఫోన్ గట్టి సవాల్నిస్తుందని అంచనా. ఆన్లైన్ విక్రయాలు అదుర్స్ ఆన్లైన్ ద్వారా తమ మొబైళ్ల అమ్మకాలు జోరుగా ఉన్నాయని అమిత్ బొని పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారానే 2 కోట్ల మొబైళ్లు విక్రయించామని వివరించారు. తాజాగా అందిస్తున్న మోటో ఇ అమ్మకాలు ఆన్లైన్లో ఈ ఒక్క వారంలోనే 5 లక్షలు ఉండొచ్చని ఆయన ధీమా వ్యక్తం చేశారు.