breaking news
Mixture Potlam
-
హైదరాబాద్ టు షిరిడీ
సువర్ణ సుందరిగా శ్వేతాబసు ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘మిక్చర్ పొట్లం’. జయంత్, గీతాంజలి ఓ జంటగా ఏంవీ సతీశ్కుమార్ దర్శకత్వంలో కలపటపు శ్రీలక్షీప్రసాద్, కంటె వీరన్నచౌదరి, లంకలపల్లి శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా ఆడియో సక్సెస్ మీట్ హైదరాబాద్లో జరిగింది. ‘‘ఫస్ట్ కాపీ సిద్ధమైంది. ఈ నెలాఖరున సినిమాను విడుదల చేస్తాం’’ అని నిర్మాతలు తెలిపారు. ‘‘హైదరాబాద్ నుంచి షిరిడీ బయలుదేరిన సువర్ణ సుందరి ట్రావెల్స్ బస్సును కొందరు హైజాక్ చేస్తారు. వాళ్ల డిమాండ్స్ ఏంటి? ఏం జరిగింది? అనేది కథ’’ అన్నారు దర్శకుడు. భానుచందర్, సుమన్, పోసాని, కృష్ణభగవాన్ నటించిన ఈ చిత్రానికి సంగీతం: మాధవపెద్ది సురేశ్చంద్ర. -
చిన్న బ్రేక్ తర్వాత వస్తున్నా!
‘‘2016.. నాకు లక్కీ ఇయర్. హిందీలో రెండు సినిమాలు చేస్తున్నా. సెటైరికల్ కామెడీ సినిమా ‘మిక్చర్ పొట్లం’తో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్నా. స్టడీస్ కంప్లీట్ చేయాలని ఆ మధ్య బ్రేక్ తీసుకున్నా. అందుకే సినిమాలకు చిన్న గ్యాప్ వచ్చింది’’ అని శ్వేతా బసుప్రసాద్ అన్నారు. ఆమెతో పాటు జయంత్ భానుచందర్, గీతాంజలి ముఖ్య తారలుగా యంవీ సతీశ్ కుమార్ దర్శకత్వంలో కలపటపు శ్రీలక్ష్మీ ప్రసాద్, కంటే వీరన్న చౌదరి, లంకపల్లి శ్రీనివాసరావు నిర్మిస్తున్న సినిమా ‘మిక్చర్ పొట్లం’. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు సతీశ్ మాట్లాడుతూ - ‘‘చింతామణి, కనక మహాలక్ష్మీ తరహాలో శ్వేతా చేసిన ‘సువర్ణ సుందరి’ పాత్ర చరిత్రలో నిలుస్తుంది. అమలాపురం నుంచి షిరిడీ వెళ్లే బస్సులో ఏం జరిగిందనేది కథ. వినోదంతో పాటు సమాజంలో లోపాలను చూపిస్తున్నాం’’ అన్నారు. ‘‘వినోదం, సంగీతం, సందేశం సహా అన్ని వెరైటీలున్న సినిమా కాబట్టి ‘మిక్చర్ పొట్లం’ టైటిల్ పెట్టాం. త్వరలో పాటల్ని విడుదల చేస్తాం’’ అన్నారు నిర్మాత శ్రీలక్ష్మీ ప్రసాద్. శ్వేతాతో కలసి ఓ ముఖ్య పాత్రలో నటించడం నా అదృష్టమని మరో నిర్మాత లంకపల్లి శ్రీనివాసరావు చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: యస్.చిరంజీవి, కెమేరా: కళ్యాణ్ సమి, సంగీతం: మాదవపెద్ది సురేశ్.