breaking news
Mission preacher
-
మత బోధకుడి కేసులో నిందితుల అరెస్ట్
విజయవాడ (గుణదల) : ఓ మహిళతో అశ్లీలంగా ప్రవర్తించారని, దానికి సంబంధించిన వీడియో ఉందనే సాకుతో మత బోధకుడిని డబ్బు కోసం వేధిస్తున్న మీడియా మాజీ ప్రతినిధి సహా ముగ్గురు నిందితులను గురువారం మాచవరం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణాజిల్లా కంకిపాడు మం డలం ప్రొద్దుటూరుకు చెందిన సుధీర్ ఓ ప్రైవేటు కార్యక్రమానికి మతబోధకుడిని ఆహ్వానించాడు. అప్పటినుంచి అతనితో సన్నిహితంగా ఉండేవాడు. తాను ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశామని చెప్పి మతబోధకుడి వద్ద తరుచూ విరాళాలు తీసుకునేవాడు. ఆ ప్రైవేటు ఫంక్షన్లో ఓ మహిళతో అశ్లీలంగా వ్యవహరించారని, ఆ వీడియో తన వద్ద ఉందని సుధీర్.. మతబోధకుడిని రూ. 5 కోట్లు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. దీంతో ఆయన తన స్నేహితుడితో కలిసి నగర పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ను కలిసి విష యం చెప్పారు. రంగంలోకి దిగిన టాస్క్ఫోర్స్ సిబ్బంది 9 మందిని అదుపులోకి తీసుకుని విచారించారు. వీరిలో ఓ శాటిలైట్ చానల్ మాజీ ప్రతినిధి కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. సీపీ ఆదేశాల మేరకు నిందితుల్లో ముగ్గురు పాయకాపురానికి చెందిన కోరపాటి జోసఫ్ (ఏ1) , కంకిపాడు ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన మరీదు శశిధర్ (ఏ5), మందాటి రామోజిచౌదరి (ఏ8)లను మాచవరం పోలీ సులు అరెస్టు చేశారు. ఏ2గా ఉన్న సుధీర్ నుంచి మరింత సమాచారం రాబట్టేందుకుతమదైన శైలిలో విచారిస్తున్నట్లు తెలిసింది. సుధీర్, విజ య్, ప్రశాంత్, శ్రీకాంత్, సుబ్రమణ్యం, రాములను విచారిస్తున్నారు. మరో మలుపు.. కీలక నిందితుడిగా భావిస్తున్న న్యాయవాదిని ఇంతవరకు పోలీసులు అదుపులోకి తీసుకోలేదని సమాచారం. ఆ న్యాయవాది చర్చి ఫాదర్కు, నిందితులకు మధ్యవర్తిత్వం చేస్తున్నానని, తన వద్ద ఉన్న పెన్డ్రైవ్లోనివి వీడియోలు కాదని ప్లేటు ఫిరాయించినట్లు తెలుస్తోంది. ముగ్గురికి రిమాండ్ విజయవాడ లీగల్ : కేసులో నిందితులైన కంకిపాడు మండలం ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన మరీదు శశిధర్, పాయకాపురంలోగల రాధా నగర్కు చెందిన కొర్రపాటి జోసఫ్, మండాది రామోజిచౌదరిలను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. విచారించిన ఒకటవ అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఇన్చార్జ్ జడ్జి జి.సత్యప్రభాకరరావు నిందితులకు ఈ నెల 31వరకు రిమాండ్ విధించారు. నిందితులను రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు. మత బోధకుడి ఫిర్యాదు మేరకు మాచవరం పోలీసులు కొంతమందిపై 120-బి, 384, 385, 386, 450, 452, 506, 34 ఐ.పి.సి. సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రావి ప్రకాష్ అనే వ్యక్తిని మాచవరం, టాస్క్ఫోర్స్ పోలీసులు ఎనిమిది రోజులుగా అక్రమంగా నిర్బంధించినట్లు అతని భార్య సమత కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ను విచారించిన మూడవ అదనపు చీఫ్ మెట్రో పాలి టన్ మెజిస్ట్రేట్ న్యాయవాదిని అడ్వకేట్ కమిషనర్గా నియమించి నిందితుడు పోలీసు కస్టడీలో ఉంటే వెంటనే కోర్టులో హాజరు పరచమని ఉత్తర్వులు జారీచేశారు. తీరా స్టేషన్కు వెళ్లే సరికి ప్రకాష్ లేడు. -
మత బోధకుడికి బెదిరింపులు
బ్లాక్మెయిల్తో రూ.1.34 కోట్లు వసూలు అదుపులో గ్యాంగ్ సభ్యులు న్యాయవాది పాత్రపై టాస్క్ఫోర్స్ ఆరా విజయవాడ సిటీ : ఓ మత బోధకుడిని డబ్బుల కోసం డిమాండ్ చేస్తున్న గ్యాంగ్ను టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలి సింది. గ్యాంగ్లో ప్రధాన నిందితుడు పరార్ కాగా పట్టుబడిన న్యాయవాది పాత్రపై పోలీ సులు ఆరా తీస్తున్నారు. సేకరించిన సమాచారం ప్రకారం రాష్ట్రంలోనే అతిపెద్ద పవిత్ర పుణ్యక్షేత్రంలో మత బోధకుడిని పటమట ప్రాంతానికి చెందిన సుధీర్ అనుచరులతో కలిసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. పెనమలూరు నియోజకవర్గంలో పొదుపు సంఘాలు నిర్వహించే సుధీర్ మత బోధకుడి వ్యక్తిగత జీవితాన్ని చిత్రీకరించి బెదిరింపులకు దిగినట్లు తెలిసింది. సెప్టెంబర్, 2005 నుంచి మత బోధకుడికి సంబంధించిన అశ్లీల చిత్రాలతో కూడిన పెన్డ్రైవ్ తమ వద్ద ఉందని, రూ.4 కోట్లు ఇస్తే ఇచ్చేస్తామంటూ బెదిరింపులకు దిగినట్లు సమాచారం. అప్పటి నుంచి పలుమార్లు దశలవారీగా మత బోధకుడు రూ.1.34 కోట్లు సుధీర్ గ్యాంగ్కు ఇచ్చాడు. మిగిలిన డబ్బుల కోసం ఒత్తిడి తెస్తుండడంతో కొద్ది రోజుల కిందట మత బోధకుడు నగర పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ను కలిసి ఫిర్యాదు చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి మత బోధకుడి బ్లాక్మెయిల్ చేస్తున్న గ్యాంగ్ పట్టివేతకు గాలింపు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఈ గ్యాంగ్ లీడర్ సుధీర్ నగరంలోని ఓ హోటల్లో ఉన్నట్లు వచ్చిన సమాచారం మేరకు బుధవారం రాత్రి టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. పోలీసుల దాడిని ముందే ఊహించిన సుధీర్ అక్కడి నుంచి పరార్ కాగా ఆ సమయంలో అక్కడున్న న్యాయవాది కరుణేంద్రని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతని సమాచారంపై మత బోధకుడిని బ్లాక్బెయిల్ చేస్తున్న గ్యాంగ్లోని కొందరు సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. న్యాయవాది వద్ద టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్న పెన్డ్రైవ్ ఖాళీగా ఉన్నట్లుచెబుతున్నారు. మధ్యవర్తిత్వమా.. టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్న న్యాయవాది కరుణేంద్ర మధ్యవర్తిత్వం నెరిపేందుకు వెళ్లినట్టు న్యాయవాద వర్గాల సమాచారం. గత కొద్ది రోజులుగా మత బోధకుడిని బెదిరింపులకు గురి చేస్తున్న సుధీర్ వద్దకు వెళ్లి అనవసరంగా చిక్కులు కొని తెచ్చుకోవద్దని, పెన్డ్రైవ్ ఇస్తే పోలీసుల చర్యలు లేకుండా మత బోధకుడితో మాట్లాడతానని చెప్పినట్టు చెబుతున్నారు. ఈ క్రమంలోనే వారిద్దరూ కలిసి చర్చించుకుంటుండగా టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారని, అప్పటికే సుధీర్ తప్పించుకోగా న్యాయవాదిని అదుపులోకి తీసుకున్నట్లు సహచరుల వాదన. దీనిపై టాస్క్ఫోర్స్ ఏసీపీ ఎ.వి.ఆర్.జి.బి.ప్రసాద్ను సంప్రదించగా విచారణ జరుగుతోందని, తర్వాత వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.