minimum balance in accounts
-
బ్యాంకు అకౌంట్లో పైసా లేకపోయినా పర్లేదు..!
బ్యాంక్ అకౌంట్.. దేశంలోని ప్రతి పౌరుడికీ కనీస అవసరంగా మారింది. ప్రభుత్వ పథకాలు, ఇతర అవసరాల కోసం అందరూ బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నారు. కానీ ఆ బ్యాంకు అకౌంట్లలో కనీస బ్యాలెన్స్ ఉంచడం పేదలు, సామాన్యులకు భారంగా మారింది. మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే చార్జీల పేరుతో బ్యాంకులు బాదేస్తున్నాయి. అయితే కొన్ని బ్యాంకులు ఇప్పుడిప్పుడే సామాన్యులకు ఉపశమనం కల్పిస్తున్నాయి.తాజాగా ప్రభుత్వ రంగ కెనరా బ్యాంకు జూన్ 1 నుంచి అన్ని రకాల సేవింగ్స్ అకౌంట్లకు కనీస నెలవారీ బ్యాలెన్స్ (ఏఎంబీ) నిబంధనను పూర్తిగా ఎత్తివేసినట్లు వెల్లడించింది. ఇదే క్రమంలో మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేని, తక్కువ లేదా జీరో బ్యాలెన్స్కు ఎటువంటి జరిమానాలు విధించని జీరో బ్యాలెన్స్ పొదుపు ఖాతాలను మరికొన్ని బ్యాంకులు అందిస్తున్నాయి. ఇలాంటి అకౌంట్లను ఏయే బ్యాంకులు అందిస్తున్నాయి.. ఎలాంటి ప్రయోజనాలు కల్పిస్తున్నాయి.. ఈ కథనంలో తెలుసుకోండి...స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ (బీఎస్బీడీఏ)ను అందిస్తుంది.ఫీచర్లు: ఉచిత రూపే ఏటీఎం కమ్ డెబిట్ కార్డు, నెఫ్ట్/ ఆర్టీజీఎస్, ఇంటర్నెట్/ మొబైల్ బ్యాంకింగ్, ఇన్ఆపరేటివ్ అకౌంట్స్ యాక్టివేట్ చేయడానికి లేదా అకౌంట్ క్లోజర్కు ఎలాంటి ఛార్జీలు ఉండవు.వడ్డీ రేటు: రూ .10 కోట్ల వరకు సంవత్సరానికి 2.70%అర్హత: భారతీయ నివాసితులు; చెల్లుబాటు అయ్యే కేవైసీ (ఆధార్, పాన్ మొదలైనవి) అవసరం.అదనపు గమనికలు: గరిష్ట బ్యాలెన్స్ పై గరిష్ట పరిమితి లేదు; ఏటీఎం లేదా బ్రాంచీల వద్ద విత్ డ్రా ఫారాల ద్వారా విత్ డ్రా చేసుకోవచ్చు.కెనరా బ్యాంక్:జూన్ 1 నుండి, కెనరా బ్యాంక్ అన్ని పొదుపు ఖాతాలలో కనీస బ్యాలెన్స్ జరిమానాలను తొలగించింది. జీరో బ్యాలెన్స్ ఖాతాలుగా మార్చింది.ఫీచర్లు: తక్కువ లేదా జీరో బ్యాలెన్స్ లకు ఛార్జీలు ఉండవు, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ను ప్రోత్సహిస్తాయి.సేవింగ్స్ అకౌంట్లు, శాలరీ అకౌంట్లు, ఎన్ఆర్ఐ ఎస్బీ అకౌంట్లకు ఇది వర్తిస్తుంది.ఇండియన్ బ్యాంక్:బీఎస్బీడీఏ, మైనర్ల ఖాతాలు వంటి నిర్దిష్ట జీరో బ్యాలెన్స్ పొదుపు ఖాతాలను అందిస్తుంది (గరిష్టంగా రూ. 2,00,000 ఉన్న ఖాతాలకు కనీస బ్యాలెన్స్ లేదు).ఫీచర్లు: ఉచిత రూపే డెబిట్ కార్డు, ప్రారంభ డిపాజిట్ అవసరం లేదు, ఉచిత నగదు డిపాజిట్లు, పాస్బుక్, ఇంటర్నెట్ / మొబైల్ బ్యాంకింగ్ (అభ్యర్థనపై).వడ్డీ రేటు: సంవత్సరానికి 2.75% –2.90% (2024 లో బ్యాలెన్స్ ఆధారంగా).గమనిక: సాధారణ పొదుపు ఖాతాలకు రూ .500 (చెక్బుక్ లేకుండా) లేదా రూ. 1,000 (చెక్బుక్తో) కనీస బ్యాలెన్స్ అవసరం, కానీ ఈ ఖాతాలలో ఈ మినిమమ్ బ్యాలెన్స్ ఉంచకపోయినా ఎటువంటి జరిమానాలు ఉండవు. నిర్దిష్ట పథకాలకు జీరో బ్యాలెన్స్ ఖాతాలు అందుబాటులో ఉన్నాయి.యాక్సిస్ బ్యాంక్:ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై) కింద కనీస బ్యాలెన్స్ అవసరం లేకుండా బేసిక్ సేవింగ్స్ ఖాతాను అందిస్తుంది.ఫీచర్లు: ఉచిత రూపే డెబిట్ కార్డు, బేసిక్ బ్యాంకింగ్ సేవలు (డిపాజిట్లు/ ఉపసంహరణలు), ఇంటర్నెట్/ మొబైల్ బ్యాంకింగ్ యాక్సెస్.వడ్డీ రేటు: సంవత్సరానికి 3% –3.5% (బ్యాలెన్స్ ఆధారంగా).బ్యాంక్ ఆఫ్ బరోడా:ఎలాంటి మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయంతో కూడిన బరోడా రెగ్యులర్ సేవింగ్స్ ఖాతాను అందిస్తుంది.ఫీచర్లు: ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు, ఇంటర్నెట్/మొబైల్ బ్యాంకింగ్, జీరో బ్యాలెన్స్కు ఎలాంటి పెనాల్టీలు ఉండవు.వడ్డీ రేటు: మారుతుంది (సాధారణంగా సంవత్సరానికి 2.75%–3.25%).హెచ్డీఎఫ్సీ బ్యాంక్:మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా బీఎస్బీడీఏను అందిస్తుంది.ఫీచర్లు: ఉచిత రూపే డెబిట్ కార్డు, ప్రారంభ డిపాజిట్ అవసరం లేదు, అపరిమిత ఏటీిఎం ఉపసంహరణలు, ఉచిత నెట్ / మొబైల్ బ్యాంకింగ్, ఎల్పీజీ సబ్సిడీలు, డీబీటీ వంటి ప్రభుత్వ సబ్సిడీ పథకాలకు ప్రాప్యత.వడ్డీ రేటు: ఏడాదికి 3 శాతం (రూ.50 లక్షలలోపు బ్యాలెన్స్లకు), 3.5 శాతం (రూ.50 లక్షలకు మించిన బ్యాలెన్స్లకు).ఐసీఐసీఐ బ్యాంక్:మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా బీఎస్బీడీఏ ఖాతాను అందిస్తుంది.ఫీచర్లు: ఉచిత రూపే డెబిట్ కార్డు, 15,000+ ఏటీఎంలకు యాక్సెస్, ఉచిత నగదు డిపాజిట్లు, పాస్బుక్, ఆప్షనల్ ఇంటర్నెట్/ మొబైల్ బ్యాంకింగ్.వడ్డీ రేటు: సంవత్సరానికి 3% (ప్రారంభ రేటు).కోటక్ మహీంద్రా బ్యాంక్:మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా కోటక్ 811 డిజిటల్ సేవింగ్స్ ఖాతాను అందిస్తోంది.ఫీచర్లు: 811 యాప్ లేదా వెబ్సైట్ ద్వారా తక్షణ ఖాతా తెరవడం, ఉచిత వర్చువల్ డెబిట్ కార్డు (సంవత్సరానికి రూ.199 వద్ద ఫిజికల్ కార్డు), అపరిమిత ఉచిత నెఫ్ట్ / ఆర్టీజీఎస్ / ఐఎంపీఎస్, డెబిట్ కార్డు చెల్లింపులపై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ / రివార్డులు.వడ్డీ రేటు: ఏడాదికి 4% వరకుఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్:కనీస బ్యాలెన్స్ అవసరం లేకుండా ప్రథమ్ సేవింగ్స్ ఖాతాను అందిస్తుంది.ఫీచర్లు: అపరిమిత ఏటీఎం ఉపసంహరణలు (మైక్రో ఏటీఎంలతో సహా), ఉచిత నెట్/ మొబైల్ బ్యాంకింగ్, నెలవారీ వడ్డీ క్రెడిట్లు, కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ (ఉదా. రూ.35 లక్షల ప్రమాద బీమా, డైనింగ్ డీల్స్).వడ్డీ రేటు: ఏడాదికి 7% వరకు (లిస్టెడ్ బ్యాంకుల్లో అత్యధికం).ఆర్బీఎల్ బ్యాంక్:మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతాను అందిస్తుంది.ఫీచర్లు: ఉచిత రూపే డెబిట్ కార్డు (విత్ డ్రా లిమిట్ రూ.50,000/రోజు), ఉచిత అన్ లిమిటెడ్ నెఫ్ట్/ఆర్టీజీఎస్, ఉచిత నెట్/మొబైల్/ఫోన్ బ్యాంకింగ్, షాపింగ్/డైనింగ్ పై డిస్కౌంట్లు.వడ్డీ రేటు: ఏడాదికి 7.5% వరకు.యస్ బ్యాంక్:మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతాను అందిస్తుంది.ఫీచర్లు: ఉచిత అంతర్జాతీయ డెబిట్ కార్డు, యెస్ బ్యాంక్ ఏటీఎంలలో అపరిమిత ఏటీఎం ఉపసంహరణలు, ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఐదు ఉచిత లావాదేవీలు, ఉచిత నెఫ్ట్/ ఆర్టీజీఎస్/ ఐఎంపీఎస్, కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ (ఉదా. యాక్సిడెంటల్ డెత్ కవర్).వడ్డీ రేటు: ఏడాదికి 2.75% (రూ.50 లక్షల వరకు), 3.25% (రూ.40 కోట్ల వరకు).డీసీబీ బ్యాంక్:మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతాను అందిస్తుంది.ఫీచర్లు: ఉచిత ఏటీఎం కార్డు, అపరిమిత ఉచిత నెఫ్ట్/ ఆర్టీజీఎస్, ఉచిత నెట్/ మొబైల్/ ఫోన్ బ్యాంకింగ్, ఫిజికల్/ ఈమెయిల్ స్టేట్మెంట్లు.వడ్డీ రేటు: వనరులలో పేర్కొనబడదు, కానీ సాధారణంగా పోటీ.ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్:సెల్ఫీ సేవింగ్స్ అకౌంట్ (జీరో బ్యాలెన్స్, యువతను లక్ష్యంగా చేసుకుని) అందిస్తోంది.ఫీచర్లు: నో మినిమమ్ బ్యాలెన్స్, ఉచిత డెబిట్ కార్డు, ఇంటర్నెట్/ మొబైల్ బ్యాంకింగ్, కాంపిటీటివ్ వడ్డీ రేట్లు.వడ్డీ రేటు: పరిశ్రమలో అత్యధికం (క్రెడిట్ త్రైమాసికం).ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్:మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతాను అందిస్తుంది.ఫీచర్లు: ఉచిత రూపే ప్లాటినం డెబిట్ కార్డు, అపరిమిత ఉచిత నెఫ్ట్ / ఆర్టీజీఎస్ / ఐఎంపీఎస్, రూ .5,000 వరకు కాంటాక్ట్ లెస్ లావాదేవీలు, క్యాష్ బ్యాక్ / రివార్డులు.వడ్డీ రేటు: ఏడాదికి 7% వరకు. -
మీ బ్యాంక్ బ్యాలెన్స్ మైనస్లోకి వెళ్లిందా? మీ ఒక్క సంతకంతో ఇలా బయట పడండి!
ఓ సంస్థలో పని చేస్తున్న మీనా’కి అత్యవసరంగా డబ్బులు కావాల్సి వచ్చింది. వెంటనే తన పాత శాలరీ అకౌంట్ నుంచి ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ను అమ్మి ఆర్ధిక సమస్య నుంచి బయటపడాలని అనుకుంది. వెంటనే మ్యూచువల్ ఫండ్స్ను అమ్మింది. ఆ డబ్బును తన పాత శాలరీ బ్యాంక్ అకౌంటుకు ట్రాన్స్ఫర్ చేసుకుంది. కానీ, అప్పుడే బ్యాంక్ అధికారులు ఆమెకు చావుకబురు చల్లాగా చెప్పారు. ఏమని? మీ బ్యాంక్ అకౌంట్కు నాన్ మెయింటెన్స్ ఛార్జీలు ఉన్నాయి. ఇందుకోసం అదనపు ఛార్జీల పేరుతో అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ మొత్తాన్ని తీసుకుంటున్నట్లు ఓ మెసేజ్ రూపంలో సమాచారం అందించారు. దీంతో ఆ మెసేజ్ చూసి షాక్ తిన్న ఆమె బ్యాంక్ అకౌంట్ను చెక్ చేసింది. బ్యాలెన్స్ జీరో.. పైగా బ్యాలెన్స్ నెగిటీవ్లోకి వెళ్లింది. దీంతో మీనాకు ఏం చేయాలో పాలు పోలేదు. వెంటనే ఆర్దిక రంగంలో నిపుణురాలైన తన స్నేహితురాలికి ఫోన్ చేసి బ్యాంక్లో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి చెప్పింది. మరి ఇంతకీ మీనా బ్యాంక్ నుంచి ఎదురైనా సమస్య నుంచి ఓ చిన్న సంతకంతో ఎలా భయటపడింది? మైనస్లోకి వెళ్లిన తన శాలరీ అకౌంట్ను నెగిటీవ్ లేకుండా ఏం చేసింది? మైనస్ బ్యాలెన్స్తో ఇబ్బందులు మీనా తన పాత సంస్థలో పనిచేసే సమయంలో ‘xyz’ అనే బ్యాంక్లో శాలరీ అకౌంట్ ఓపెన్ చేసింది. నాలుగేళ్ల తర్వాత మరో సంస్థకు వెళ్లింది. అక్కడ కూడా అదే xyz బ్యాంక్ శాలరీ అకౌంటేనని తెలుసుకుంది. తన పాత శాలరీ అకౌంట్ను ఓపెన్ చేసింది. అందులో ఇంకా మైనస్ బ్యాలెన్స్ (ఉదాహరణ) రూ.22,000 చూపిస్తుంది. ఆర్బీఐ రూల్స్ ప్రకారం.. అకౌంట్ బ్యాలెన్స్ నెగిటీవ్లో ఉండకూడదు. ఒకవేళ బ్యాలెన్స్ సున్నా అయితే బ్యాంక్లు ఫైన్ విధించకుండా ఆ అకౌంట్ను హోల్డ్లో పెట్టాలి. ఈ ఆర్బీఐ రూల్ గుర్తు చేస్తూ మీనా తన బ్యాంక్ అకౌంట్లో మైనస్ బ్యాలెన్స్ రూ.22,000 ఎందుకు ఉన్నాయని బ్యాంక్ అధికారుల్ని ప్రశ్నించింది. మెయింటెయిన్ ఛార్జీల వల్ల నెగిటీవ్ బ్యాలెన్స్లోకి వెళ్లింది. కాబట్టి పైన పేర్కొన్న మొత్తాన్ని కట్టాల్సిందేనని ఆదేశించారు. బ్యాంక్ మేనేజర్ను అడిగినా లాభం లేకుండా పోయింది. మీ ఒక్క సంతకంతో ఇలా బయటపడిండి వెంటనే, తన స్నేహితురాలి సూచనతో సదరు బ్యాంక్ అధికారిక మెయిల్కు, తాను నివాసం ఉంటున్న స్థానిక ఆర్బీఐ రీజనల్ బ్రాంచ్కు కలిపి సమస్యను వివరిస్తూ ఫిర్యాదు చేసింది. ఆ మరుసటి రోజే ఆ బ్యాంకు మేనేజర్ మీనాకు ఫోన్ చేసి మీరు ఒక సంతకం చేస్తే చాలు అకౌంట్ని జీరో బ్యాలెన్స్ చేస్తామని చెప్పారు. వెంటనే బ్యాంక్ను సందర్శించి తన సంతకంతో సమస్యను పరిష్కరించుకుంది. ఇలా ఒక్క మీనా’నే కాదు... బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్క ఖాతాదారులు ఈ తరహా సమస్య నుంచి బయట పడొచ్చని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. బ్యాంక్లకు ఆర్బీఐ ఆదేశాలు కస్టమర్లకు బ్యాంకులు విధిస్తున్న అదనపు ఛార్జీల అంశం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. సమావేశాల సందర్భంగా పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ ఖరాద్ మాట్లాడుతూ.. 2018 నుంచి దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఖాతాదారుల నుంచి అదనపు ఛార్జీలు ఎంత విధించాయో వివరించారు. అందులో మినిమమ్ బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోవడంపై రూ.21,044.4 కోట్లు, అదనపు ఏటీఎం లావాదేవీల కోసం రూ.8,289.3 కోట్లు, ఎస్ఎంఎస్ సేవల ద్వారా రూ.6,254.3 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్దు ఎత్తున చర్చ జరిగింది. అదే సమయంలో ఆర్బీఐ సైతం.. బ్యాంక్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఖాతాదారులకు ఒప్పందం ప్రకారం విధించే వడ్డీని మించి అదనపు ఛార్జీలను వసూలు చేయొద్దని ఆర్బీఐ బ్యాంకులు సూచించింది. దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది. చదవండి👉 ఇళ్ల కొనుగోలు దారులకు ఆర్బీఐ భారీ షాక్? వచ్చే ఏడాది వరకు తప్పదంట -
మినిమమ్ బాదుడు
ఆమధ్య బ్యాంకులు ఖాతాదారుల మీద రకరకాల రుసుముల మోత మోగించిన తర్వాత సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన ఓ జోకు చాలామందికి గుర్తుండే ఉంటుంది.. తన అకౌంట్ ఉన్న బ్యాంకు వైపు మామూలుగా చూసేసరికి ఇరవై రూపాయలు కట్ అయిపోయాయంటూ ఓ వ్యక్తి తన మిత్రుడితో చెప్పి వాపోతున్నట్టు ఉన్న ఆ జోకు అందరినీ నవ్వించడమే కాదు.. బ్యాంకుల ఘనత గురించి ఆలోచింపజేసింది కూడా. బ్యాంకులు ఇప్పుడు వసూలు చేస్తున్న రుసుములు, పెనాల్టీల తీరు చూస్తూ ఉంటే ఈ జోకు ఎంత సత్యమో తేలిగ్గానే అర్థమవుతుంది. సాక్షి, విశాఖపట్నం : సుబ్బారావు ఓ షాపింగ్ మాల్లో చిరుద్యోగి. అతనికొచ్చే నెలసరి వేతనం రూ.10 వేలు. దాంట్లో నాలుగువేలు అద్దెలకే పోతాయి.మిగిలిన జీతం సొమ్ముతో గుట్టుగా జీవనం సాగిస్తున్నాడు. మొదటి వారానికే బ్యాంకు ఖాతా ఖాళీ అయిపోతుంది. మళ్లీ ఫస్ట్ వరకు ఎదురు చూపులే. కానీ బ్యాంకులో జీతం జమ అయ్యే సరికి రూ.200 కోత పడుతుంది. ప్రతీ నెలా ఈ తంతు జరుగుతూ ఉండేసరికి ఇదేమిటని సుబ్బారావు బ్యాంకు మేనేజర్ను ఆరాతీస్తే ఖాతాలో కనీస మొత్తంగా రూ. 5 వేలు ఉంచడం లేదు కాబట్టి పెనాల్టీ తప్పడం లేదని చెప్పడంతో సుబ్బారావుకు ప్రాణం ఉసూరనిపించింది. ⇒ సూర్యనారాయణ చిరు వ్యాపారి. ఈయనకు ప్రతి నెలా పెట్టుబడి, ఖర్చులు పోనూ రూ.15 వేల వరకు మిగులుతుంది. కానీ అవసరానికి ఆ మొత్తం తీసుకుందామంటే సొంత బ్యాంకు ఏటీఎంలు పనిచేయక చాలా ఇబ్బంది అవుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో అందుబాటులో ఉండే ఏదోబ్యాంకు ఏటీఎం నుంచి తనకు కావాల్సిన మొత్తాన్ని తీయడం అనివార్యమవుతుంది. అయితే మూడు కంటే ఎక్కువ సార్లు ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి విత్ డ్రా చేస్తున్నారన్న కారణంతో సొమ్ము తీసిన ప్రతిసారీ రూ. 20 వంతున ఖాతా నుంచి ఫీజు మళ్లిపోతోంది. ⇒ ఇవి సామాన్యుల తిప్పలు. సగటు మానవులకు ఎదురవుతున్న ఇక్కట్లు. అయితే ఇలాటి ఖాతాదారులే ఎక్కువమంది ఉండడంతో బ్యాంకుల పంట పండుతోంది. పెద్ద మొత్తంలో సొత్తు దాఖలు పడుతోంది. ⇒ పెద్ద నోట్ల రద్దు తర్వాత రిజర్వు బ్యాంకు ఆదేశాల మేరకు బ్యాంకులు విధించిన ఆంక్షలో ఈ పరిస్థితి తలెత్తింది. చాలిచాలని జీతంతో కుటుంబపోషణే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో బ్యాంకు ఖాతాలో ఏకంగా ఐదువేలు మినిమమ్ బ్యాలెన్స్ ఉంచాలంటే ఎలా? అన్నది సామాన్యుల సమస్యగా ఉంది. స్వల్ప ఆదాయమే అధికం జిల్లా జనాభా 43.66 లక్షలయితే, మొత్తం 14 లక్షల కుటుంబాలున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం వీరిలో 31,209 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కాగా, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు 70,239 మంది ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో 47,818 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. స్థానిక సంస్థల్లో మరో 11,044 మంది పని చేస్తున్నారు. ఎంప్లాయింట్మెంట్ ఎక్సే్ఛంజి లెక్కల ప్రకారం ప్రైవేటు రంగంలో 49,689 మంది మాత్రమే పనిచేస్తున్నారు. కానీ అన«ధికారికంగా ప్రైవేటు సెక్టార్లో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో నాలుదైదు లక్షల మందికి పైగా పనిచేస్తున్నారు. వీరిలో 30 శాతం మంది ఆదాయం రూ.5వేల నుంచి 8వేలు కాగా, 50 శాతం ఆదాయం రూ.8వేల నుంచి రూ.15 వేల వరకు ఉంది. మిగిలిన 20 శాతం మంది ఆదాయం రూ.15 వేలకు పైబడి ఆర్జిస్తున్నారు. చిరు వ్యాపారులు రెండు లక్షల మంది వరకు ఉన్నారు. వీరికి ప్రతి నెలా వచ్చే ఆదాయం రూ.5 వేల నుంచి రూ.10 వేల లోపే. జిల్లాలో 45 బ్యాంకుల పరిధిలో 707 బ్రాంచ్లుంటే వాటిలో 186 బ్రాంచ్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. జిల్లా జనాభాలో బ్యాంకు ఖాతాలున్న వారి సంఖ్య 38లక్షల వరకు ఉంది. బ్యాంకుల్లో 64.54 లక్షల ఖాతాలున్నాయి. జన్ధన్ యోజన ఖాతాలు రూ.9.27లక్షలు కాగా, ఖాతాల్లేని వారి సంఖ్య 8లక్షల వరకు ఉంది. నిత్యం బ్యాంకులు, ఏటీఎంల పరిధి లో రూ.150 నుంచి రూ.200 కోట్ల వరకు లావాదేవీలు జరుగుతుంటాయి. ప్రైవేటు సెక్టార్లో పనిచేసే ఉద్యోగులతో పాటు చిరు వ్యాపారులు పూర్తిగా బ్యాంకులు, ఏటీఎంలపై ఆధారపడే లావాదేవీలు జరుపు తుంటారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ ఉద్యోగులు, ప్రైవేటు సెక్టార్లో పనిచేసే ఉద్యోగుల కంటే చిరుద్యోగులు..చిరు వ్యాపారాలు జరిపే లావాదేవీలే ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులు తమకు అవసరమైన మేరకు మాత్రమే విత్ డ్రా చేస్తుంటారు. కానీ చిరుద్యోగులు తమకు వచ్చిన వేతనమంతా విత్డ్రా చేసి నెలవారీ ఖర్చులకు సర్దుబాటు చేసుకుంటుంటారు. మినిమమ్ బ్యాలెన్స్ నిర్వహించని కారణంగా ఆ పొదుపు ఖాతాలనుంచి జూన్ నెలాఖరు నాటికి ఏకంగా రూ.235.06కోట్లు పెనాల్టీ రూపంలో వసూలు చేసినట్టు ఎస్బీఐ ప్రకటించింది. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఈ మొత్తం రూ.2వేల కోట్లు దాటుతుందని ప్రకటించింది. ఒక్క ఎస్బీఐకే పెనాల్టీ రూపంలో ఇంతపెద్ద మొత్తంలో ఆదాయం వస్తే..ఇతర బ్యాంకులన్నీ కలుపు కుంటే ఈమొత్తం ఐదువేల కోట్లకుపైగానే ఉంటుందని బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు విశాఖ జిల్లాలో ఈ విధంగా పెనాల్టీల రూపంలోనే బ్యాంకులు వసూలు చేసిన మొత్తం రూ.2 కోట్లకు పైగానే ఉంటుందని చెబుతున్నారు. ఇందులో గరిష్ట భాగం సామాన్యులదేనని చెప్పనక్కర్దేదు. బ్యాంకుల పెనాల్టీ దోపిడీపై సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మినిమమ్ బ్యాలెన్స్ ఆంక్షలను ఎత్తివేయాలని.. అరకొర వేతనాలతో అవస్థలు పడుతున్న వారంతా ఈ ఆంక్షల వల్ల ఆర్థిక ఇబ్బందుల పాలవు తున్నారని వాపోతున్నారు. అయితే తాము ఆర్బీఐ ఆదేశాల మేరకు వసూలు చేస్తున్నామని.. బ్యాంకుల ప్రమేయం ఏమాత్రం లేదని లీడ్ బ్యాంకు అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. -
స్టేట్ బ్యాంక్ బాదుడు షురూ!
దేశంలోనే అతి పెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ప్రైవేటు బ్యాంకుల బాటలోనే నడుస్తోంది. ఖాతాలలో కనీస మొత్తం ఉంచకపోతే పెనాల్టీలు విధిస్తామని చెప్పింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇవి అమలవుతాయి. మెట్రోపాలిటన్ నగరాల్లో కనీసం రూ. 5వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 3వేలు, సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ. 2వేలు, గ్రామీణ ప్రాంతాల్లో వెయ్యి రూపాయల చొప్పున కనీస నిల్వ ఖాతాల్లో ఉండాలని స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఖాతాలలో ఉన్న మొత్తానికి, కనీస నిల్వకు మధ్య ఎంత తేడా ఉందో దాన్ని బట్టి పెనాల్టీలు ఉంటాయి. మెట్రోపాలిటన్ నగరాల్లో రూ. 3750 (75%) కంటే తక్కువ ఉంటే వంద రూపాయలు, దానిపై సేవాపన్నును పెనాల్టీగా వేస్తారు. అదే 50-75 శాతం మధ్య అయితే 75 రూపాయలు, దానిపై సేవాపన్ను పనడుతుంది. సగం కంటే తక్కువ తేడా ఉంటే 50 రూపాయలు, సేవాపన్ను పెనాల్టీగా వేస్తారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఖాతాల్లో కనీస నిల్వ మొత్తం ఉంచుకోకపోతే రూ. 25-50, సేవాపన్ను పెనాల్టీగా పడుతుంది. బ్యాంకుకు వస్తే మోతే బ్రాంచిలో నెలకు మూడుసార్ల కంటే ఎక్కువ నగదు లావాదేవీలు నిర్వహిస్తే 50 రూపాయల చొప్పున చార్జీ విధిస్తారు. అయితే ఎంత మొత్తం నగదు లావాదేవీ అనే పరిమితి మాత్రం లేదు. గతంలో కూడా ఇలా బ్యాంకులో నగదు లావాదేవీల మీద చార్జీలు ఉండేవని, వాటిని ఏప్రిల్ 1 నుంచి పునరుద్ధరిస్తున్నామని బ్యాంకు అధికారులు తెలిపారు. ఏటీఎంల నుంచి నెలకు 10 సార్లు ఉచితంగా విత్డ్రా చేసుకునే అవకాశం ఉన్నందున కస్టమర్లు బ్రాంచికి రావాల్సిన అవసరమే ఉండదన్నారు.