-
‘ఏపీలో సామాజిక విప్లవం.. ఆ ఘనత సీఎం జగన్దే’
సాక్షి, అన్నమయ్య జిల్లా: తంబళ్లపల్లెలో ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర కొనసాగింది. మధ్యాహ్నం కేజీఎన్ ఫంక్షన్ హాలులో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం అనంతరం బైక్ ర్యాలీ ప్రారంభమైంది. మాదవయ్యగారి పల్లె, పులికల్లు మీదుగా బైక్ ర్యాలీ కొనసాగింది. సాయంత్రం ములకలచెరువులో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేని అభివృద్ది సీఎం జగన్ పాలనలోనే జరిగిందని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ‘‘జగన్ పాలనలోనే సామాజిక న్యాయం జరిగింది. వెనుకబడిన వర్గాలకు సీఎం జగన్ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. విద్య, వైద్య రంగాల్లో సీఎం జగన్ విప్లవాత్మక మార్పులు తెచ్చారు. నాలుగున్నరేళ్లుగా జరిగిన అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారు. వెనుకబడిన వర్గాల సాధికారతే సీఎం జగన్ లక్ష్యం. ఏపీలో సామాజిక విప్లవానికి నాంది పలికిన నేత వైఎస్ జగన్. ఆయన పాలనలో అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతోంది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలకు న్యాయం చేసిన ఘనత జగన్దే’’ అని మంత్రి కొనియాడారు. ‘‘దళితులను అడుగడుగునా అవమానించిన వ్యక్తి చంద్రబాబు. అర్హత ఉంటే చాలు అన్ని సంక్షేమ పథకాలు అందించిన నాయకుడు జగన్. లక్షా 76 వేల కోట్లు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఖాతాల్లో జమ చేశాం. రుణమాఫీ పేరుతో చంద్రబాబు రైతులను మోసం చేశాడు. ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు, పవన్ మళ్లీ కలిసొస్తున్నారు. చంద్రబాబు, పవన్లకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు’’ అని మంత్రి మేరుగు నాగార్జున పేర్కొన్నారు. చదవండి: పురందేశ్వరి చంద్రముఖిలా మారిపోయారు: మంత్రి సీదిరి -
ఏసీబీ వలలో గొల్లపల్లి వీఆర్వో
గొల్లపల్లి, న్యూస్లైన్: అవినీతిపరుల భరతం పడతామంటూ ఓవైపు ఏసీబీ అధికారులు హెచ్చరిస్తున్నా రెవెన్యూ శాఖలోని కొందరు ఉద్యోగులు మాత్రం మారడం లేదు. దాడులు చేస్తే చేసుకోండి.. మా కేంటి? అనుకుంటున్నారేమో.. తమ పనితీరు మార్చకోవడం లేదు. ప్రతి పనికీ వెలకట్టి లంచాల కోసం పీడిస్తుండడంతో విసిగివేసారిన బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తున్నారు. ఏసీబీ దాడుల్లో అవినీతిపరులు అడ్డం గా దొరికిపోతున్నారు. జిల్లాలో పలు సంఘటనలు మరవకు ముందే గొల్లపల్లి మండలంలో మరో వీఆర్వో ఏసీబీకి చిక్కాడు. కంప్యూటర్ పహణీ నకల్ కోసం రూ.7వేలు లంచం తీసుకుంటూ గొల్లపల్లి వీఆర్వో మేరుగు శంకరయ్య సోమవారం ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ టి.సుదర్శన్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. గొల్లపల్లికి చెందిన అబ్దుల్ రషీద్ 2012లో తన భార్య పేరిట సర్వేనంబరు 545(అ)లో 242 చదరపు గజాల స్థలం కొన్నాడు. అప్పుడే జమాబంది కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అప్పటి వీఆర్వో గంగాధర్ రూ.4వేలు తీసుకుని మ్యూటేషన్ ప్రొసీడింగ్ పత్రాలు ఇచ్చాడు. కానీ ఇది కంప్యూటర్లో నమోదు కాలేదు. సంబంధి త స్థలంలో ఇటీవల ఇల్లు నిర్మించుకున్న రషీద్ రుణం కోసం బ్యాంకులో సంప్రదించాడు. రుణ మంజూరుకు కంప్యూటర్ పహణీ కావాలని బ్యాంకు అధికారులు సూచించారు. దంతో తొ మ్మిది నెలల క్రితం కంప్యూటర్ పహణీ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ క్రమంలో వీఆర్వో గంగాధర్ గంగాధర మండలానికి బదిలీ అ య్యాడు. ఆయన స్థానంలో జూన్లో రామగుం డం మండల ఈసాలతక్కల్లపెల్లికి చెందిన మేరు గు శంకరయ్య విధుల్లో చేరాడు. ఆయన రషీద్ను రూ.11 వేలు డిమాండ్ చేయగా, రూ. 1500 ఇచ్చాడు. మిగిలిన మొత్తం కూడా చెల్లిస్తే నే పని పూర్తి చేస్తానని శంకరయ్య తేల్చిచెప్పా డు. విసిగివేసారిన రషీద్ ఇంకా రూ.7వేలు ఇ స్తానని శంకరయ్యతో ఫోన్లో మాట్లాడి వాయి స్ రికార్డు చేసుకున్నాడు. ఇటీవల కరీంనగర్లో ఏసీబీ అధికారులను కలిసి విషయం చెప్పాడు. వారి సూచనల మేరకు రషీద్ సోమవారం మధ్యాహ్నం శంకరయ్య గదికి వెళ్లి రూ.7వేలు ఇచ్చాడు. వెంటనే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి శంకరయ్యను పట్టుకుని నగదు స్వాధీనం చేసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ సుదర్శన్గౌడ్ తెలిపారు. గతంలో వీఆర్వోగా పనిచేసిన గంగాధర్ రూ.4వేలు తీసుకున్నాడని రషీద్ ఫిర్యాదు చేయగా, విచారించి తగు చ ర్యలు తీసుకోవాలని తహశీల్దార్ రవీందర్రాజు కు సూచించారు. ఆయన చర్యలు తీసకోకపోతే తామే చర్యలు తీసుకుంటామన్నారు. వీఆర్వో మేరుగు శంకరయ్య 2008లో రామగుండం మండంలోనే విధుల్లో చేరాడు. అప్పటినుంచే అతడు ప్రతి పనికీ లంచాలు గుంజుతాడనే ఆరోపణలున్నాయి. అయితే తాను రషీద్ను డబ్బు లు అడగలేదని, అతడే రూ.7వేలు తీసుకొచ్చి తన బేబులో పెట్టాడని ఏసీబీ ఎదుట శంకరయ్య బుకాయించడం కొసమెరుపు. ఏసీబీకి మరో ఫిర్యాదు వీఆర్వో శంకరయ్య తనను కూడా లంచం కోసం వేధిస్తున్నాడని బోనగిరి లింగమూర్తి అనే వ్యక్తి ఏసీబీ డీఎస్పీ ఫిర్యాదు చేశాడు. 2012లో ఆరెకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకుని జమాబందీ కోసం తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు పెట్టుకున్నాని, వీఆర్వో శంకరయ్య రూ.10వేలు అడిగితే.. రూ.7వేలు ఇచ్చానని, మరో రూ.15వేలు ఇస్తేనే పని చేస్తానని వేధిస్తున్నాడని వాపోయాడు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
సత్యనాదెళ్ళ వీడియోపై మస్క్ ట్వీట్.. బ్లాక్ మిర్రర్ ఎపిసోడ్ అంటూ..
టీమిండియా హెడ్ కోచ్ పదవిపై హర్భజన్ ఆసక్తి..?
రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
Indian 2 Paaraa Song Promo: కమల్ హాసన్ ఇండియన్-2.. ప్రోమో వచ్చేసింది!
SRH: అతడి లాగే నన్నూ ఆశీర్వదించండి: అభిషేక్ తల్లికి అర్ష్దీప్ రిక్వెస్ట్ (ఫొటోలు)
బెంగుళూరు రేవ్ పార్టీ... టీడీపీ,సోమిరెడ్డికి ఇచ్చిపడేసిన కాకాణి
బజాజ్ ఫైనాన్స్తో చేతులు కలిపిన టాటా మోటార్స్.. ఎందుకో తెలుసా?
పచ్చ మందకు వాతలు పెట్టిన కాకాణి
మళ్లీ హానీమూన్కి వెళ్లిన రకుల్.. అనసూయ స్మైలీ పోజులు
అమెరికా ‘సాంత ఫె’లో విహారయాత్ర !
తప్పక చదవండి
- రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
- T20 WC: అఫ్గానిస్తాన్ బౌలింగ్ కన్సల్టెంట్గా డ్వేన్ బ్రావో..
- లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- 2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
- ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
- జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
- Allu Arjun: ఊహించని ప్లేసులో కనిపించిన అల్లు అర్జున్.. ఫొటో వైరల్
- బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
Advertisement