breaking news
Leaf verabuls
-
22న సేంద్రియ పద్ధతిలో గొర్రెలు, మేకల పెంపకంపై శిక్షణ
సేంద్రియ పద్ధతిలో గొర్రెలు, మేకల పెంపకంపై గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గర కొర్నెపాడులోని రైతు శిక్షణా కేంద్రంలో రైతులకు ఈ నెల 22(ఆదివారం)న శిక్షణ ఇవ్వనున్నట్లు రైతునేస్తం ఫౌండేషన్ అధ్యక్షుడు డా. వై. వెంకటేశ్వరరావు తెలిపారు. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన నిపుణులు డా. జి. రాంబాబుతోపాటు గొర్రెలు, మేకల పెంపకంలో అనుభవజ్ఞులైన రైతులు శిక్షణ ఇస్తారన్నారు. ముందుగా పేర్లు నమోదు చేసుకోగోరే వారు సంప్రదించాల్సిన నంబర్లు: 970 538 3666, 0863–2286255 22న కాకినాడలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ శిక్షణ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంపై లోతైన అవగాహన కలిగించే లక్ష్యంతో సొసైటీ ఫర్ అవేర్నెస్ అండ్ విజన్ ఆన్ ఎన్విరాన్మెంట్(సేవ్) స్వచ్ఛంద సంస్థ ఈ నెల 22 (ఆదివారం)న కాకినాడ విద్యుత్నగర్లోని చల్లా ఫంక్షన్ హాల్ (వినాయకుడి గుడి ఎదుట)లో ఉ. 8.30 గం. నుంచి సా. 5.30 గం. వరకు రైతులకు శిక్షణ ఇవ్వనుంది. ప్రకృతి వ్యవసాయం అంటే ఏమిటి? పెట్టుబడి, ఖర్చులు తగ్గించుకునే మార్గాలు, రైతులు పంట దిగుబడులను మొత్తం నేరుగా అమ్ముకోకుండా కొంత మోత్తాన్ని విలువ ఆధారిత ఉత్పత్తులగా మార్చి అమ్ముకోవడం, అధికాదాయం కోసం ప్రయత్నాలు, దేశీ విత్తనాల ఆవశ్యకత, దేశీ ఆవు విశిష్టత తదితర అంశాలపై సేవ్ సంస్థ వ్యవస్థాపకులు, ప్రకృతి వ్యవసాయ నిపుణులు విజయరామ్ శిక్షణ ఇస్తారు. ప్రవేశ రుసుము: ఒక్కొక్కరికి రూ. వంద. ఆసక్తి గల రైతులు ముందుగా తమ పేర్లను ఫోన్ చేసి నమోదు చేసుకోవాలి.. వివరాలకు.. సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ సమాచార కేంద్రం: 04027654337, 86889 98047 94495 96039 మార్చిలో జాతీయ శాశ్వత వ్యవసాయ మహాసభ భూతాపోన్నతిని శాశ్వత వ్యవసాయ (పర్మాకల్చర్) పద్ధతుల్లో సమర్థవంతంగా ఎదుర్కొనే మార్గాలపై రైతాంగంలో చైతన్యం తెచ్చే లక్ష్యంతో వచ్చే ఏడాది మార్చి 6 నుంచి 8వ తేదీ వరకు జాతీయ శాశ్వత వ్యవసాయ మహాసభ జరగనుంది. తెలంగాణలోని జహీరాబాద్ దగ్గర్లోని బిడకన్నె గ్రామంలో అరణ్య పర్మాకల్చర్ అకాడమీలో ఈ మూడు రోజుల మహాసభ జరగనుందని అరణ్య శాశ్వత వ్యవసాయ సంస్థ తెలిపింది. 20న ప్రకృతి సేద్య పద్ధతుల్లో కూరగాయల సాగుపై శిక్షణ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో కూరగాయల సాగుపై కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ కొత్తూరు తాడేపల్లిలోని రామరాజు గారి వ్యవసాయ క్షేత్రంలో ఈ నెల 20 (శుక్రవారం)న ఉ. 10 గం. నుంచి సా. 5 గం. వరకు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆం. ప్ర. శాఖ తరఫున రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. కూరగాయల సాగులో కొత్త పద్ధతులను అనుసరిస్తున్న సీనియర్ రైతులు అనుభవాలను పంచుకుంటారు. వివరాలకు.. 78934 56163 -
ఆకు మొక్కలు!
నాణ్యమైన పూలు, పండ్ల మొక్కల కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న నర్సరీలపై ఆధారపడే పరిస్థితికి స్వస్తి చెప్పే రోజులు వస్తున్నాయా? అంటు కట్టకుండానే, టిష్యూ కల్చర్తో పని లేకుండానే రైతులే, 9–10 వారాల్లో అత్యంత సులువుగా జన్యుస్వచ్ఛతతో కూడిన నాణ్యమైన మొక్కల్ని తయారు చేసుకోవచ్చా?? రాజరత్నం అద్భుత ఆవిష్కరణ గురించి తెలుసుకుంటే ఈ ప్రశ్నలన్నిటికీ‘‘అవును’ అనే సమాధానం వస్తుంది. ఇంతకీ ఆ ఆవిష్కరణ ఏమిటంటారా.. ‘ఆకును నాటి మొక్కను తయారు చేసుకోవడం (లీఫ్ కల్చర్)’! ఒకింత ఆశ్చర్యంగా ఉన్నా ఇది ముమ్మాటికీ నిజం. రాజరత్నం ఎవరో.. ‘ఆకు మొక్కల’ కథా కమామిషు ఏమిటో చదవండి మరి.. రాజరత్నం స్వస్థలం తమిళనాడు కోయంబత్తూరు జిల్లా మెట్టుపాళయం. వ్యవసాయ కుటుంబంలో పుట్టి అప్లయిడ్ సైన్సెస్లో డిగ్రీ చదివిన రాజరత్నం మక్కువతో 6 ఎకరాల భూమిలో నర్సరీని ఏర్పాటు చేశారు. 1989 నుంచి ఈడెన్ నర్సరీ గార్డెన్స్ను నిర్వహిస్తున్నారు. షూట్ టిప్ కల్చర్లో నైపుణ్యం సాధించారు. ఏటా 10 లక్షల మొక్కల్ని విక్రయిస్తూ రూ. కోటిన్నర టర్నోవర్ సాధించారు. ఈ పూర్వరంగంలో సులభమైన రీతిలో మొక్కల ఉత్పత్తి పద్ధతులు అన్వేషిస్తూ ఈ నర్సరీ రైతు వినూత్నమైన ‘లీఫ్ కల్చర్’ పద్ధతిని ఆవిష్కరించారు. పచ్చి ఆకును నాటి, వేర్లు మొలిపించడం ద్వారా అత్యంత నాణ్యమైన మొక్కను తయారు చేయడం(లీఫ్ కల్చర్) అనే అద్భుత ఆవిష్కరణతో ఆయన నర్సరీ రంగంలో సంచలనం రేపుతున్నారు. ఈ ఏడాది ప్రతిష్టాత్మక చిన్నికృష్ణన్ ఇన్నోవేషన్ అవార్డు పొందారు.లీఫ్ కల్చర్పై పేటెంట్ కోసం ధరఖాస్తు చేసుకున్నారు. నర్సరీ కార్యకలాపాల్లో నైపుణ్యాన్ని మరింత పెంపొందించుకోవాలన్న దృష్టితో 2010లో తమిళనాడు వ్యవసాయ వర్సిటీలో 4 వారాల టిష్యూ కల్చర్ కోర్సు చేశారు. టిష్యూకల్చర్ పద్ధతిలో నాణ్యమైన మొక్కలను ఉత్పత్తి చేయడానికి రూ. లక్షల ఖరీదైన ప్రయోగశాలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, అతి తక్కువ ఖర్చుతో మొక్కలను ఉత్పత్తి చేసే మార్గమే లేదా? విత్తనాలతో, షూట్ టిప్ కటింగ్స్తో, ఇతరత్రా కణజాలాలతో నాణ్యమైన మొక్కలను ఉత్పత్తి చేయగలుగుతున్నప్పుడు.. పచ్చి ఆకును నాటి ఎందుకు మొక్కను ఉత్పత్తి చేయకూడదు? అన్న మెరుపు వంటి ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా ప్రయోగాలు ప్రారంభించాడు. ఈ క్రమంలో ఎదురైన వైఫల్యాలను అధిగమిస్తూ ఎట్టకేలకు 2013 నాటికి పచ్చి ఆకులు నాటి కొద్ది వారాల్లోనే చక్కని మొక్కలను ఉత్పత్తి చేయగలిగాడు. దేశంలోనే తొలి సేంద్రియ నర్సరీ రాజరత్నం నర్సరీలో ప్రధానంగా షూట్ టిప్ కటింగ్స్ ద్వారా గుండు మల్లి, బొడ్డు మల్లె, సన్నజాజి, కనకాంబరం, ఐక్సోరా వంటి పూల జాతులతోపాటు నిమ్మ, జామ, దానిమ్మ, నేరేడు, నోని, బొప్పాయి తదితర పండ్ల జాతుల మొక్కలు, తమలపాకు మొక్కలను ఏటా లక్షల సంఖ్యలో ఉత్పత్తి చేస్తుంటారు. మొక్కలను పూర్తి సేంద్రియ పద్ధతిలో ఉత్పత్తి చేస్తూ, దేశంలోనే తొలి సేంద్రియ నర్సరీగా రాజరత్నం నర్సరీ గుర్తింపు పొందింది కూడా. నర్సరీ మొక్కల పెంపకానికి ఎటువంటి సేంద్రియ ఎరువులు కూడా వాడటంలేదు, రిజర్వాయర్ ఒండ్రు మట్టినే వాడుతున్నారు. గుండు మల్లితో లీఫ్ కల్చర్ ప్రారంభం తమిళనాడులో రైతులు ఎక్కువగా సాగు చేసే ‘గుండు మల్లి’ రకంతో ‘లీఫ్ కల్చర్’ను రాజరత్నం విజయవంతంగా ప్రారంభించారు. ప్రస్తుతం గుండుమల్లితోపాటు నూరు వరహాల(ఐక్సోరా) రకం పూల జాతి మొక్కలను ఆకుల ద్వారా ఉత్పత్తి చేసి ఆయన విక్రయిస్తున్నాడు. గుండుమల్లి, నూరువరహాల పూల మొక్కల విషయంలో అన్ని పరీక్షలూ విజయవంతంగా పూర్తయ్యాయన్నారు. ఆకుతో ఉత్పత్తి చేసిన గుండుమల్లి మొక్కల ద్వారా దిగుబడి 20% పెరిగింది. అధిక నీటిని తట్టుకునే శక్తి పెరిగింది. ఒక గుత్తిలో పూల సంఖ్య దాదాపుగా రెట్టింపైంది. కొమ్మల కత్తిరింపు అవసరం ఏడాదికి 3 నుంచి ఒకసారికి తగ్గిందన్నారు. పూర్తి ఫలితాలకు 3–5 ఏళ్ల సమయం నేరేడు, జామ, నోని, తమలపాకు, మిరియాలు పనస తదితర పది పంట జాతుల ఆకుల నుంచి తయారు చేసిన మొక్కలను రైతులకిచ్చి ప్రయోగాత్మకంగా సాగుచేయిస్తున్నామన్నారు. ఈ ఫలితాలు పూర్తి స్థాయిలో రావటానికి మరో 3 నుంచి 5 సంవత్సరాలు పడుతుందని రాజరత్నం వివరించారు. దీర్ఘకాలిక పంటలు కావడంతో పండ్ల మొక్కల విషయంలో అనేక కోణాల్లో ఫలితాలను నిర్థారించుకున్న తర్వాతే రైతులకు అందించాల్సి ఉంటుందన్నారు. ‘లీఫ్ కల్చర్’పై ఏ విశ్వవిద్యాలయమూ ఇంతవరకూ పరిశోధనలు ప్రారంభించలేదన్నారు. ఏ విశ్వవిద్యాలయమైనా ఆసక్తి చూపితే సంతోషంగా కలిసి పనిచేస్తానని రాజరత్నం ఫోన్ ఇంటర్వ్యూలో ‘సాగుబడి’తో చెప్పారు. ఆకుకు వేర్లు మొలిపించేది ఇలా.. 1. తొలుత ఎంపిక చేసుకున్న ఆకులు నాటడానికి మట్టి మిశ్రమం నింపిన చిన్న పాలిథిన్ గ్రోబ్యాగ్లు సిద్ధం చేసుకోవాలి. వీటిని తొలి రోజుల్లో పెట్టడానికి షేడ్ నెట్ హౌస్ను ఏర్పాటు చేసుకోవాలి. 2. షేడ్ నెట్ హౌస్ లోపల అవసరం మేరకు టన్నెల్ మిస్ట్ ఛాంబర్లను ఏర్పాటు చేసుకోవాలి. ఛాంబర్ను 8 ఎం.ఎం. ఇనుప ఫ్రేమ్తో రూపొందించుకోవాలి. ఇది 2.5 అడుగుల ఎత్తు ఉండాలి. అవసరాన్ని బట్టి కావల్సినంత పొడవు పెట్టుకోవాలి. ఒక టన్నెల్ మిస్ట్ ఛాంబర్లో రాజరత్నం 3 వేల పాలిథిన్ గ్రోబ్యాగ్లు ఏర్పాటు చేసుకొని, వాటిలో ఆకులు పెడుతున్నారు. 3. తొలుత, మీకు అవసరమైన చెట్టు/మొక్క నుంచి పచ్చి ఆకును తొడిమతో పాటు తుంచాలి. 4. ఆ ఆకును లేత కొబ్బరి నీటిలో అరగంట సేపు నానబెట్టాలి. కొబ్బరి నీటిలో సీజన్ను బట్టి, ప్రాంతాన్ని బట్టి పోషకాల హెచ్చు తగ్గులుంటాయి. దీన్ని బట్టి లీఫ్ కల్చర్లో ఫలితాలు ఆధారపడి ఉంటాయి. 5. కాబట్టి, కొత్తగా ఆకుతో మొక్కను ఉత్పత్తి చేసుకునే రైతులు ఖచ్చితమైన ఫలితాలను పొందేందుకు ఐ.బి.ఎ.(ఇండోల్ బటైరిక్ యాసిడ్) అనే రూటింగ్ హార్మోన్ను ఉపయోగించడం ఉత్తమం. 6. పాలిథిన్ బ్యాగ్లలోని మట్టిలోకి తొడిమె పూర్తిగా వెళ్లేలా ఆకును పెట్టాలి. ఆకుకు వేర్లు పుట్టడానికి మట్టిలో తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి. తర్వాత టన్నెల్ మిస్ట్ ఛాంబర్లోకి అసలు గాలి చొరబడకుండా పాలిథిన్ షీట్ను బిగించి, అన్నివైపులా మట్టికప్పాలి. 7.పాలిథిన్ గ్రోబ్యాగ్లోని మట్టిలో తేమ చాలినంత ఉందో లేదో ప్రతి 5 రోజులకోసారి సరిచూసుకోవాలి. అవసరం మేరకు ఈ గ్రోబాగ్లపై నీటిని తగుమాత్రంగా పిచికారీ చేయాలి. 8. 4–5 వారాల్లో ఆకుకు వేర్లు మొలుస్తాయి. మరో 4–5 వారాల్లో ఆకు పక్కనే మొక్క పెరుగుతుంది. మూడు, నాలుగు ఆకులు వస్తాయి. ఆ దశలో టన్నెల్ మిస్ట్ ఛాంబర్పైన పాలిథిన్ షీట్ను తొలగించాలి. మొక్కలను షేడ్నెట్ హౌస్లో కొన్ని రోజులు ఉన్న తర్వాత.. ఆరుబయట ఎండలోకి మార్చాలి. 9. ఆరుబయట మొక్కలు బాగా ఎదిగిన తర్వాత పొలంలో నాటుకోవచ్చు. 10. నాటిన ఆకు ఎండిపోకుండా ఉండటానికి, చక్కగా వేరు పోసుకోవడానికి 30 డిగ్రీల ఉష్ణోగ్రత (2 డిగ్రీలు అటూ ఇటుగా), గాలిలో తేమ 70% ఉంటే అనువుగా ఉంటుందని రాజరత్నం అంటున్నారు. లీఫ్ కల్చర్పై రైతులకు ఉచిత శిక్షణ! ఆకులతో మొక్కల్ని ఉత్పత్తి చేయడం చాలా సులువు. రైతులెవరైనా సులువుగా నేర్చుకోగలరు. స్కూలు పిల్లలు కూడా ఇది నేర్చుకోగలుగుతారు. యంత్రాలు, ప్రయోగశాలలు అవసరం లేదు. విద్యుత్తు అవసరం లేదు. పెద్దగా పెట్టుబడి ఏమీ అవసరం లేదు. రూ. 20 వేల నుంచి 30 వేలు చాలు. షేడ్నెట్ హౌస్, మిస్ట్ ఛాంబర్ ఉంటే చాలు. రైతులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు అనుదినం మా నర్సరీని సందర్శిస్తూనే ఉంటారు. ఇప్పటికే సుమారు వంద మందికి ఆకులతో మొక్కల్ని ఉత్పత్తి చేసే పద్ధతిపై శిక్షణ ఇచ్చాను. రూపాయి కూడా ఫీజు చెల్లించనక్కరలేదు. రైతులంతా ఈ పద్ధతి నేర్చుకోవాలని, మొక్కల్ని కొనకుండా తామే ఉత్పత్తి చేసుకునేలా తోడ్పడాలనేదే నా అభిమతం. శిక్షణ పొందాలనుకునే వారు ఎవరైనా మా ఊరు బయలుదేరే ముందు సమాచారం కోసం నాకు ఒకసారి ఫోన్ చేస్తే చాలు. రైతులు ఎక్కువగా సాగు చేసే పూలు, పండ్ల జాతులతోపాటు అంతరించిపోతున్న చెట్ల జాతులు, ఔషధ మొక్కలపై పరిశోధనలు చేస్తున్నాను. నర్సరీపై వచ్చే 25% ఆదాయంలో లీఫ్ కల్చర్పై పరిశోధనలకు వెచ్చిస్తున్నాను. – ఎస్. రాజరత్నం, (94860 94670) నర్సరీ రైతు, కురుప్పాయమ్మల్ తొట్టం, వెల్లియపాళయం రోడ్డు, మెట్టుపాళయం, కోయంబత్తూరు జిల్లా, తమిళనాడు www.edennurserygardens.com ఆకులు నాటితే 10 వారాల్లో సిద్ధమైన మొక్కలు -
గాడ్జెట్ ఎక్స్పో ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఎలక్ట్రానిక్ ఉపకరణాల ప్రదర్శన, సదస్సు ‘ఇండియా గాడ్జెట్ ఎక్స్పో 2015’ ఇక్కడి హైటెక్స్ వేదికగా శుక్రవారం మొదలైంది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ఈ ఎక్స్పోను ప్రారంభించారు. ప్రదర్శన 21 వరకు సాగనుంది. గాడ్జెట్ ఎక్స్పో హైదరాబాద్లో జరగడం ఇది రెండోసారి. 100కుపైగా దేశ, విదేశీ కంపెనీలు ఇక్కడ తమ స్టాళ్లను ఏర్పాటు చేశాయి. నూతన టెక్నాలజీని, ఉపకరణాలను ఇవి ప్రదర్శిస్తున్నాయి. 50 స్టార్టప్ కంపెనీలు సైతం ఇక్కడ స్టాళ్లను ఏర్పాటు చేయడం విశేషం. ప్రతి రోజు సాయంత్రం 5 గంటలకు 5 ఉత్పాదనలను ఆవిష్కరించనున్నారు. ఓర్విటో, బి-వన్లు ప్రపంచంలో తొలిసారిగా తమ ఉత్పాదనలను ప్రదర్శిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఇండియా గాడ్జెట్ ఎక్స్పో ప్రపంచ ప్రముఖ ప్రదర్శనల్లో ఒకటిగా నిలుస్తుందని తారక రామారావు ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న టెక్నాలజీ ఇంకుబేషన్ కేంద్రం ‘టి-హబ్’ ప్రారంభోత్సవం అక్టోబరులో జరుగుతుందని చెప్పారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకట్టుకోవడంలో భాగంగా గాడ్జెట్ ఎక్స్పో వేదికగా 100 కంపెనీల సీఈవోలతో సమావేశమవుతున్నట్టు తెలిపారు. ఎలక్ట్రానిక్స్ హార్డ్వేర్ రంగంలో ఉన్న ఎస్ఎంఈల కోసం టెస్టింగ్ ఫెసిలిటీని ఏర్పాటు చేయాల్సిందిగా ఎక్స్పో చైర్మన్ జె.ఎ.చౌదరి ఈ సందర్భంగా మంత్రిని కోరారు. సేఫర్ పెండెంట్.. చూడ్డానికి ఇది పెండెంట్ మాత్రమే. ఆపదలో ఉన్న వ్యక్తులకు మాత్రం రక్షణ కవచం. ఢిల్లీ కేంద్రంగా ఉన్న స్టార్టప్ కంపెనీ లీఫ్ వేరబుల్స్ ‘సేఫర్’ పేరుతో దీనిని అభివృద్ధి చేసింది. స్మార్ట్ఫోన్లో సేఫర్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని పెయిర్ (అనుసంధానం) చేయాలి. అత్యవసర సమయాల్లో పెండెంట్ వెనకాల ఉన్న చిన్న బటన్ను నొక్కితే చాలు. స్మార్ట్ఫోన్లో ముందుగా నిర్దేశించిన అయిదుగురు వ్యక్తుల మొబైల్స్కు సందేశం వెళుతుంది. దర రూ.2,700. కంపెనీ ఇచ్చే జీవితకాల సర్వీసుకు ఎటువంటి చార్జీ ఉండదు. పెండెంట్తో సెల్ఫీ కూడా తీసుకోవచ్చని లీఫ్ వేరబుల్స్ మార్కెటింగ్ డెరైక్టర్ పరాస్ బాత్రా సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. పెండెంట్ వాడుతున్న వ్యక్తి స్మార్ట్ఫోన్ ఇంటర్నెట్కు కనెక్ట్ అయి ఉంటే ఆపద సమయంలో ఏ ప్రాంతంలో ఉన్నది గూగుల్ మ్యాప్ లొకేషన్ చిత్రం రూపంలో అయిదుగురికి చేరుతుంది. నెట్ కనెక్షన్ లేకపోయినా ప్రాంతం చిరునామా సందేశం రూపంలో వెళ్తుంది.