breaking news
the land of the equation
-
మెతుకు పండిన చోట బతుకు.. బిక్కు బిక్కు
పూలు అమ్మిన చోటే కట్టెలు కొట్టాలి.. పల్లకీలో తిరిగిన చోటే బోయీగా మారాలి... కాలుమీద కాలేసుకున్న చోటే కాలికి బలపం కట్టుకుని పనిచేయాలి.. దర్జాగా జీవించిన చోటే దయనీయంగా బతకాలి.. అజమాయిషీ చెలాయించిన చోటే అన్నీ వదులుకుని మసలాలి. పుట్టి పెరిగిన ఊళ్లోనే పరదేశీయుల్లా తిరగాలి..! ఇదీ రానున్న రోజుల్లో రాజధాని గ్రామాల్లోని అన్నదాతల దుస్థితి.. తెలుగుదేశం ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల కారణంగా జరీబు రైతులు గరీబులు కానున్నారు. బంగారం పండిన భూములు కాంక్రీటు జంగిళ్లుగా మారబోతున్నాయి. పచ్చటి పంటలతో కళకళలాడిన ఊళ్లు కాలుష్యకాసారాలు కాబోతున్నాయి. రాజధాని గ్రామాల భవిష్యత్ను తలచుకుంటే అమెరికా రాజకీయ వేత్త విలియం జెన్నింగ్స్ బ్రెయామ్ చెప్పిన ఓ వ్యాఖ్య గుర్తుకు రాకమానదు. ‘‘ మీ నగరాలను దగ్ధం చేసి పొలాలను వదిలేయండి, మాయ చేసినట్టు నగరాలు మళ్లీ కళకళలాడతాయి. పొలాలను నాశనం చేసి నగరాలను వదిలిపెట్టండి, దేశమంతటా గడ్డే మొలుస్తుంది.’’ భూ సమీకరణ పూర్తికావడంతో రాజధాని గ్రామాల్లో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. రైతులు, రైతు కూలీలు, వ్యవసాయ కార్మికులు, చేతివృత్తి పనివారు తమ భవిష్యత్పై కలత చెందుతున్నారు. వ్యవసాయం మినహా మరో వ్యాపకం తెలియని ఈ వర్గాలు కొత్త జీవితాన్ని ఎలా ప్రారంభించాలి ? మిగిలిపోయిన పిల్లల చదువులు, వివాహాలు వంటి కుటుంబ బాధ్యతలను ఎలా నెరవేర్చాలి? ప్రభుత్వం సాలీనా ఇచ్చే నష్టపరిహారంతో కుటుంబాలను ఎలా నడపాలి...వంటి సమస్యలపైనే ఆలోచన చేస్తున్నారు. నిన్నటి వరకు పదిమందికి ఉపాధి కల్పించిన రైతు మరో నెలలో ఇతరుల వద్ద పనిచేయాల్సిన పరిస్థితి. మూడు పంటలు పండిస్తూ సాలీనా ఎకరాకు రూ.లక్ష ఆదాయం పొందిన జరీబు రైతుల పరిస్థితి అగమ్యగోచరం. నదీపరివాహక ప్రాంతంలో రెండు ఎకరాల జరీబు భూమి కలిగిన రైతు, సాగుతోపాటు పశుపోషణ వంటి అనుబంధ రంగాల నుంచి అధిక ఆదాయాన్ని పొంది గ్రామీణ ప్రాంతాల్లో సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపారు. ఇకపై ప్రభుత్వం ఎకరాకు ఇవ్వనున్న రూ.50 వేలతోనే సంవత్సరమంతా జీవనాన్ని కొనసాగించాలి. నిన్నటి వరకు రారాజులా గడిపిన జరీబు రైతు, ఇకపై ఖర్చుపై ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయాలి. ముఖ్యంగా వెంకటపాలెం, మందడం, లింగాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, రాయపూడి, అబ్బరాజుపాలెం, బోరుపాలెం తదితర గ్రామాల జరీబు రైతులు భవిష్యత్పై ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు పూలు, కూరగాయలు, పాలను విజయవాడకు ఎగుమతి చేసిన ఈ రైతులకు ఇకపై ఆ పనులేవీ ఉండవు. -సాక్షి ప్రతినిధి, గుంటూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజధాని గ్రామాల్లోని రైతుల హక్కులకు రక్షణ కల్పించేందుకు, వారికి వెన్నుదన్నుగా నిలిచేందుకు అనేక పోరాటాలు, ఉద్యమాలు నడిపింది. ఆ ఉద్యమాల ఫలితమే జరీబు రైతులకు గడువుకు రెండు రోజుల ముందు ప్రభుత్వం అదనపు ప్యాకేజీని ప్రకటించింది. ‘మేమంతా మీ వెంటే’అంటూ వైఎస్సార్ సీపీకి చెందిన 42 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు రాజధాని గ్రామాల్లో పర్యటించి రైతుకు భరోసా కల్పించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులు, రైతుకూలీలు, కౌలుదారులు, చేతివృతి ్తపనివారల సమస్యలను తెలుసుకుని అసెంబ్లీలో వారి తరఫున పోరాటం చేసేందుకు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఇక్కడకు రానున్నారు. ఆయన రాకకోసం రాజధాని గ్రామాలు ఎంతో ఆశతో నిరీక్షిస్తున్నాయి. పొంచి ఉన్న పొల్యూషన్ ... రాష్ట్ర ప్రభుత్వం కాలుష్యరహిత రాజధాని నిర్మాణానికి చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఈ నిర్మాణ పనుల సమయంలోనే కాలుష్యం పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కాలుష్య కారకాలు పరిమితంగా ఉండటంతో కృష్ణానదీ పరివాహక ప్రాంతాల ప్రజలకు ఆరోగ్య సమస్యలు పెద్దగా ఉత్పన్నం కాలేదు. ఇకపై కృష్ణానది కూడా హుస్సేన్ సాగర్ వలే కాలుష్య కాసారం కానుందనే భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. మురుగునీటిపారుదలకు ఇప్పటి వరకు అంచనాలే కాని టెండర్లు కూడా ఆహ్వానించలేదు. సంస్కృతి-సంప్రదాయాలపై దాడి .... ఈ గ్రామాల్లోని కార్మికులకు నిర్మాణపనుల్లో నైపుణ్యం లేకపోవడంతో ఆయా నిర్మాణ సంస్థలు తప్పనిసరిగా ఇతర రాష్ట్రాల కార్మికులను దిగుమతి చేసుకోక తప్పదు. ముం బాయి, బీహార్ వంటి రాష్ట్రాల నుంచి దిగుమతి అయ్యే కార్మికులు అక్కడి తమ సంస్కృతి, ఆచార వ్యవహారాలు, అలవాట్లను ఇక్కడ వ్యాప్తి చేయడం, అంతేగాక వాటికి సంబంధిం చిన వ్యాపారాలు ఇక్కడ ప్రారంభమయ్యే అవకాశం లేకపోలేదు. ఈ పరిస్థితుల కారణంగా మన సంస్కృతి, సంప్రదాయాలకు భంగం వాటిల్లనుందనే భయాందోళన వ్యక్తమవుతోంది. రెండు నెలల కష్టాలు .... రెండు నెలల పాటు జరిగిన భూ సమీకరణలో రాజధాని గ్రామాల రైతుల కష్టాలు వర్ణనాతీతం. కంటిమీద కునుకు లేకుండా నిత్యం అభద్రతతో కాలం గడిపారు. అధికారులు, టీడీపీ పాలకులు రోజుకో విధంగా రైతుల్ని బెదిరించి భూ సమీకరణ పూర్తిచేశారు. భూ సమీకరణను వ్యతిరేకించిన వారిపై పోలీసులు వేధింపులు కొనసాగాయి. స్వచ్ఛందంగా భూ సమీకరణ జరిగిందని చెప్పుకుంటున్న ప్రభుత్వం రైతులు అంగీకారపత్రాలు ఇచ్చేందుకు వారి హక్కులకు భంగం కలిగించే విధంగా అనేక చర్యలు తీసుకున్నారు. -
నమ్మలేకే.. అమ్మకం
సాక్షి, గుంటూరు :రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో భూములు రియల్ మాఫియూ గుప్పెట్లోకి వెళ్లిపోతున్నారుు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును నమ్మలేక భయంతో ఈ ప్రాంతంలో చాలా మంది రైతులు తమ భూములు అమ్మేసుకుంటున్నారు. కొనుగోలుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇక్కడకు చేరుకుంటున్నారు. భూ సమీకరణ అనంతరం ఎకరాకు రూ. 25వేలు చొప్పున ఇస్తామని చెబుతున్న చంద్రబాబు మాటలు, రుణ మాఫీ తరహాలోనే మాయ చేస్తే తమ బతుకులు ఏమిటనే భయంతో భూములు అమ్మేస్తున్నట్టు తుళ్లూరు మండలం దొండపాడు రైతులు తేల్చి చెబుతున్నారు. రోజురోజుకు ధరలు పైపైకి... ఇక్కడకు పెద్ద సంఖ్యలో వస్తున్న రియల్ వ్యాపారులను చూసి మధ్యవర్తులు భూముల ధరలు పెంచుతున్నారు. రూ. 70 లక్షలు, రూ. కోటి, రూ. కోటి 30లక్షలు ఇలా రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో భూముల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొంత మంది రైతులు ఎకరా ధరను రూ. 80లక్షలుగా ఖరారు చేసుకొని అడ్వాన్సులు తీసుకున్నారు. భూములు మాత్రం రిజిస్ట్రేషన్ చేయలేదు. ఇలా అడ్వాన్స్ తీసుకొన్న రైతులు ధరలు మళ్లీ పెరిగాయంటూ రిజిస్టర్ చేసేందుకు ముందుకు రావడం లేదు. ఇచ్చిన అడ్వాన్సులను తిరిగి పార్టీలకు ఇచ్చేస్తున్నారు. ఈ వ్యవహారాల్లో అసలు వ్యక్తులు కనిపించడం లేదు. అంతా దళారుల కనుసన్నల్లోనే సాగుతున్నారుు. రోడ్ల వెంట రియల్ ఎస్టేట్ ఆఫీసులు వెలుస్తున్నాయి. చివరకు పశువుల పాకలు సైతం రియల్ ఎస్టేట్ కార్యాలయాలుగా మారుస్తున్నారు. తుళ్లూరులో పెద్దసంఖ్యలో మధ్యవర్తులు కనిపిస్తున్నారు. వందల సంఖ్యలో వాహనాలు వస్తున్నాయి. తుళ్లూరు ప్రాంత రోడ్లన్నీ కిక్కిరిసి పోతున్నాయి. ఇదీ మార్కెట్ విలువ..తుళ్లూరు, శాఖమూరు, ఐనవోలులో ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎకరా మార్కెట్ విలువ రూ. 4 లక్షలుగా ఉంది. దీనికి ఆరు శాతం స్టాంపు డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. నెక్కల్లులో ఎకరా మార్కెట్ విలువ రూ. 3లక్షలు మాత్రమే. లింగాయపాలెం,ఉద్దండ్రాయునిపాలెంలో మార్కెట్ విలువ రూ. 5లక్షలుగా ఉంది, మంగళగిరి మండలంలో రూ.6 లక్షల నుంచి రూ.12 లక్షలుగా మార్కెట్ విలువ ఉంది. రాయపూడిలో అత్యధికంగా రోడ్డువైపు ఉన్న భూముల్లో గరిష్టంగా ఎకరా మార్కెట్ విలువ రూ. 12 లక్షలుగా ఉంది. మందడం, వెంకటపాలెం, బోరుపాలెంలో సగటున ఎకరా మార్కెట్ విలువ రూ. 6నుంచి రూ. 8 లక్షలుగా ఉంది. నమ్మలేక ... భయంతో అమ్మేస్తున్నాం.. చంద్రబాబును నమ్మలేకే భయంతో నా భూమిని అమ్మేశాను. రుణమాఫీ మాదిరిగా ఉంటుందని భయపడ్డాను. నా ఎకరం పొలాన్ని నెలరోజుల కిందటనే రూ. 34 లక్షలకు అమ్మేశాను. ఇంకా నా ఆడపిల్లలకు సంబంధించి నాలుగు ఎకరాల పొలం ఉంది. దీన్నికూడా రాజధానిప్రాంతాన్ని ఇచ్చేందుకు ఇష్టం లేకే అమ్మేయాలనుకుంటున్నా. ఆడబ్బు దగ్గరపెట్టుకోవాలనే అభిప్రాయంతో ఉన్నా. - ఎ.రామారావు, దొండపాడు, తుళ్లూరు మండలం బేరాలు కుదరడం లేదండి.. మేం నలుగురం కలిసి భూముల అమ్మకాలు,కొనుగోలుకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నాం. వారం రోజుల్లో 45 ఎకరాల భూమిని అమ్మించాం. భూముల ధరలు రూ. 70 లక్షల నుంచి రూ. కోటి 30 లక్షలకు పెరగడంతో అమ్మిన రైతులు ఇప్పుడు భూములు ఇవ్వబోమంటున్నారు. అడ్వాన్సులు తిరిగి ఇచ్చేస్తామని చెబుతున్నారు. ఇటు రైతులకు, అటు వ్యాపారులకు ఏం సమాధానం చెప్పాలో తెలియక ఇబ్బంది పడుతున్నాం. - తాడికొండ మాధవరావు, తుళ్లూరు రోడ్డు రవాణా భద్రత బిల్లును రద్దుచేయూలిఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుందరయ్య డిమాండ్ మంగళగిరి : ప్రమాదాలు నివారించాలనే సాకుతో ఆర్టీసీ మనుగడను ప్రశ్నార్థకం చేస్తోన్న రోడ్డు రవాణా భద్రతా బిల్లు- 2014ను రద్దుచేయాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ సుందరయ్య డిమాండ్చేశారు. బస్టాండ్ ఆవరణలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నూతన బిల్లు.. ఫెడరేషన్ వ్యవస్థకు, న్యాయ వ్యవస్థకు, రా జ్యాంగానికి వ్యతిరేకంగా వుందన్నారు. ఆర్టీసీపై రాష్ట్రప్రభుత్వాల హక్కును హరిస్తూ కేంద్రం తన చేతుల్లోకి తీసుకునే కుట్రలోభాగమే ఈ బిల్లు అని అన్నా రు. బిల్లును వ్యతిరేకిస్తూ తిరుపతిలో డిసెంబరు 6,7తేదీల్లో జాతీయ వర్క్షాప్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఎస్డబ్ల్యూఎఫ్ డిపో కార్యదర్శి పులి సత్యనారాయణ, ఎ.గంగాధర్, సీఐటీయూ నేత జేవీ రాఘవులు, ఎస్డబ్ల్యూఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు హరిప్రసాద్, డీవీ స్వామి తదితరులు పాల్గొన్నారు.