breaking news
l and t chief am naik
-
రూ.760 జీతం నుంచి.. లక్షల కోట్ల కంపెనీ సారధిగా - ఎవరీ నాయక్
ఇంజనీరింగ్, నిర్మాణం, తయారీ, సాంకేతికత, సమాచార రంగాల్లో అగ్రగామిగా దూసుకెళ్తున్న 'లార్సెన్ అండ్ టుబ్రో' (Larsen & Toubro) గురించి చాలామందికి తెలుసు. కానీ ఈ సంస్థ పురోగతికి కారకుడైన ఏఎమ్ నాయక్ గురించి బహుశా విని ఉండక పోవచ్చు. కేవలం రూ. 760 తో మొదలైన ఈయన జీవితం.. వేలకోట్ల సామ్రాజ్యాన్ని నడిపించే స్థాయికి ఎదిగింది. ఈయన గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. 2023 సెప్టెంబర్లో ఎల్ అండ్ టీ చైర్మన్గా పదవీవిరమణ చేసిన 'అనిల్ మణిభాయ్ నాయక్' జీవితం ఐదు దశాబ్దాల క్రితం కంకర రాళ్లు, సిమెంటు ధూళి మధ్యనే మొదలైంది. మధ్య తరగతికి చెందిన అనిల్ మణిభాయ్.. స్వాతంత్ర సమరయోధుడు, గాంధేయవాది అయిన మణిభాయ్ నిచ్చాభాయ్ నాయక్ కుమారుడు. ఈయన ఉపాధ్యాయ వృత్తిలో కూడా ఉండేవారని సమాచారం. ముంబైకి వలస.. ఉద్యోగరీత్యా వారి కుటుంబం మహారాష్ట్రలోని ఓ మారుమూల పల్లె నుంచి ముంబైకి వలస వచ్చింది. దీంతో మణిభాయ్ చదువు ముంబైలోనే సాగింది. విశ్వకర్మ యూనివర్సిటీలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఈయన.. ప్రారంభంలో ఎల్ అండ్ టీ లో ఉద్యోగం పొందలేకపోయారు. నెస్టార్ బాయిలర్స్ అనే సంస్థలో ఉద్యోగం సంపాదించి ఇష్టం లేకపోయినా తండ్రి మాటకోసం చేరాడు. జూనియర్ ఇంజినీర్.. 'ఎల్ అండ్ టీ' కంపెనీలో ఉద్యోగం చేయడం అంటే దేశానికి సేవ చేయడమే అభిప్రాయంతో ఉన్న 'నాయక్' అతి తక్కువ కాలంలోనే జూనియర్ ఇంజినీర్ హోదాలో ఎల్ అండ్ టీ కంపెనీలో అడుగుపెట్టాడు. కంపెనీ పట్ల అతనికున్న నిబద్దత 21 సంవత్సరాల్లో ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా చేసింది. అంకిత భావంతో పనిచేస్తున్న ఇతన్ని గుర్తించిన కంపెనీ అనేక ఉన్నత పదవులను అందించింది. ఛైర్మన్గా.. 1999లో కంపెనీకి సీఈవోగా.. 2017 జూలైలో గ్రూప్ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన ఈయన నాయకత్వంలో కంపెనీ ఆస్తులు 870 కోట్ల డాలర్లను పెరిగాయి. 2017 - 18లో కంపెనీ అతనికి వార్షిక వేతనంగా రూ. 137 కోట్లు చెల్లించింది. సెలవు తీసుకోకుండా పనిచేసిన పనిదినాలు కంపెనీ ఏకంగా రూ. 19 కోట్లు చెల్లించింది. మొత్తం మీద అతని మొత్తం ఆస్తి రూ. 400 కోట్లు అని సమాచారం. ఇదీ చదవండి: కలిసొచ్చిన చంద్రయాన్ 3 సక్సెస్ - బిలియనీర్ల జాబితాలోకి కొత్త వ్యక్తి.. ఎవరో తెలుసా? రూ. 142 కోట్లు దానం.. అనిల్ మణిభాయ్ నాయక్ ఎన్నెన్నో కష్టాలను ఎదుర్కొని అంచెలులంచెలుగా ఎదిగిన కష్టజీవి, కష్టం విలువ తెలిసిన వ్యక్తి కాబట్టి 2016లో తన మొత్తం ఆస్తిలో 75 శాతం (సుమారు రూ. 142 కోట్లు) విరాళంగా ఇచ్చేసాడు. భారతదేశంలో ఇప్పటి వరకు ఎక్కువ విరాళాలు అందించిన టాప్ 10 దాతల్లో నాయక్ ఒకరు కావడం విశేషం. ఈయన సేవను గుర్తించి భారత ప్రభుత్వం పద్మభూషణ్, పద్మ విభూషణ్ వంటి సత్కారాలను అందించింది. 2023 మర్చి 31న దాఖలు చేసిన కార్పొరేట్ షేర్హోల్డింగ్ల ప్రకారం, నాయక్ ఆస్తి మొత్తం రూ. 171.3 కోట్లు అని తెలుస్తోంది. -
ఆదాయంలో 75 శాతం దానం: ఎల్అండ్టీ చీఫ్
ముంబై : ఇంజనీరింగ్ దిగ్గజ సంస్థ లార్సన్ అండ్ టుబ్రో చీఫ్గా వ్యవహరిస్తున్న ఏఎం నాయక్ తన దాతృత్వ హృదయాన్ని చాటుకున్నారు. జీవితకాలపు ఆదాయాల్లో 75 శాతం స్వచ్చంద సంస్థలకే కేటాయించనున్నట్టు వెల్లడించారు. 1600 కోట్ల డాలర్ల సంపదతో ఇంజనీరింగ్ దిగ్గజంగా ఉన్న ఎల్ అండ్ టీ క్రియాశీల నాయకత్వం నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. స్వచ్చంద సేవ అనేది తన వ్యక్తిగత కోరికని, తన మూడు తరాల్లో తాతయ్య, తండ్రి దగ్గర డబ్బులు లేకపోవడంతో వారు పేదలుగానే జీవనం గడిపారని గుర్తుచేసుకున్నారు. ఈ నేపథ్యంలో తన 75 శాతం ఆదాయాలను స్వచ్చంద సేవలకే వినియోగించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. నాయక్ ఇప్పటికే రెండు స్వచ్చంద సంస్థలను ఏర్పాటుచేశారు. ఒకటి నాయక్ చారిటబుల్ ట్రస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ ట్రైనింగ్, మరొకటి 2007లో తన మనువరాలు క్యాన్సర్తో చనిపోవడంతో నిరాళి మెమోరియల్ మెడికల్ ట్రస్ట్ను స్థాపించారు. అయితే ఇప్పటివరకు ఈ సంస్థలకు కేటాయించిన నిధుల వివరాలను నాయక్ తెలుపలేదు. నాయక్ మొదటి డొనేషన్ 1995లో గుజరాత్లోని తన స్వగ్రామంలో ఓ ఆస్పత్రికి కు రూ.125 కోట్లను ఇచ్చారు. నాయక్ ట్రస్టులు ఏడు ప్రాజెక్టులను రన్ చేస్తున్నాయి. వాటిలో రెండు 2017లో ప్రారంభం కానున్నాయి. దానిలో ఒకటి తన భార్య పేరుమీద ఆమె పుట్టినరోజు వేడుకల్లో భాగంగా వేదిక్ స్కూల్గా ఆవిష్కరించబోతున్నారు. నాయక్ ప్రతియేటా తన వేతనంగా రూ.200 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. 1965లో ఎల్ అండ్ టీలో జూనియర్ ఇంజనీర్గా నాయక్ కెరీర్ ప్రారంభించారు. అనంతరం 1999లో సీఈవోగా, 2003లో చైర్మన్గా ఎంపికయ్యారు. 2012లో అతని చైర్మన్ పదవిని ఎల్ అండ్ టీ పొడిగించింది. 2017లో ఆయన రిటైర్ కాబోతున్నారు. నాయక్కు ఇద్దరు పిల్లలున్నారు. ఇద్దరూ ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయ్యారు.