-
ఆధార్ కొర్రీ.. వర్రీ..!
సాక్షి, కర్నూలు/కోసిగి: ఆధార్.. ప్రజల పాలిట గుదిబండగా మారింది. వంట గ్యాస్ సబ్సిడీ కోసం ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాలని గత కేంద్ర ప్రభుత్వం గ్యాస్ వినియోగదారులకు కంటిమీద కునుకులేకుండా చేసింది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో చివరికి దానికి బ్రేకులు పడ్డాయి. హమ్మయ్యా.. ఇక ఆధార్ పీడ విరుగుడైందని సంతోషిస్తున్న సమయంలో రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం మళ్లీ ఆధార్ను తెరపైకి తెచ్చింది. రేషన్ సరుకులు కావాలన్నా.. పింఛన్ రావాలన్నా.. రైతుల పట్టాదారు పాసుపుస్తకాలు పొందాలన్నా.. ఇలా ఏ ప్రభుత్వ సంక్షేమ పథకం ప్రయోజనమైనా పొందాలంటే ఆధార్ కార్డుతో తప్పనిసరిగా అనుసంధానం చేసుకోవాల్సిందే. దీంతో ఆధార్ కార్డు లేని ప్రజలు నలిగిపోతున్నారు. ఆధార్ కార్డు కోసం నమోదు చేయించుకుని, ఐరిస్ తీయించుకుని, ఫొటోలు తీయించుకున్నా.. నేటికి కార్డులు రాని వారు లక్షల్లో ఉన్నారు. ఆధార్ కార్డు లేకపోతే సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందుతాయో లేదోనన్న అయోమయంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా చౌక దుకాణాల్లో రేషన్ సరుకులు తీసుకోవాలంటే రేషన్ కార్డులను ఆధార్ కార్డులతో అనుసంధానం చేసుకోవాలని లింకు పెట్టింది. రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులు డీలర్కు అందజేసి అనుసంధానం చేయించుకోవాలని, లేకపోతే భవిష్యత్తులో రేషన్ ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తోంది. జిల్లాలో లక్షలాది మందికి ఇప్పటికీ ఆధార్ కార్డుల్లేవు. ఎన్నిసార్లు ఐరిస్ తీయించుకున్నా.. ఆధార్ కార్డులు రాలేదు. ఈ నెలాఖరులోగా రేషన్ కార్డులకు ఆధార్ కార్డులతో అనుసంధానం చేసుకోవాలని అధికారులు పేర్కొంటున్నారు. ఒకవేళ ఆధార్ కార్డులున్న వారు కూడా సరైన సమాచారం లేకపోవడంతో అనుసంధానం చేసుకోవడంలేదు. దీనిపై ప్రభుత్వం సరిగా ప్రచారం చేయడంలేదనే విమర్శలు ఉన్నాయి. జిల్లా జనాభా 43 లక్షలు కాగా 11,54,000 రేషన్ కార్డులున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు ఎన్ని లక్షల మందికి ఆధార్ కార్డులు వచ్చాయి. ఇంకా ఎంతమందికి రాలేదనే సమాచారం కూడా అధికారులు వద్ద లేకపోవడం గమనార్హం. 47 శాతం అనుసంధానం.. జిల్లాలో ఆధార్ కార్డులు ఉన్న వారిలో 47 శాతం మంది మాత్రమే రేషన్ కార్డులతో అనుసంధానం చేసుకున్నట్లు తెలిసింది. మిగతా 53 శాతం మంది ఆధార్ కార్డుల వివరాలు అందజేయలేదంటూ తహశీల్దార్లు పేర్కొంటున్నారు. తాజా సమాచారం ప్రకారం కోసిగి మండలంలోనే 57 వేల మంది ఆధార్తో అనుసంధానం కానట్లు తేలింది. జిల్లాలో 23 లక్షల మందికి అవసరం.. జిల్లా వ్యాప్తంగా రేషన్కార్డులకు 23 లక్షల మంది తమ పేర్లు అనుసంధానం చేసుకోవాల్సి ఉన్నట్లు తెలిసింది. ఉదాహరణకు ఒక కుటుంబంలో నలుగురు సభ్యులుండి అందరికీ ఆధార్ ఉన్నా.. ఆ వివరాలు రేషన్ డీలరుకు అందకపోతు భవిష్యత్తులో సరుకుల పంపిణీ ఆగిపోవచ్చు. కుటుంబ సభ్యులందరి వివరాలు అందిస్తేనే రేషన్ ఇబ్బంది లేకుండా అందుతుంది. అయితే ఇంతవరకు అనుసంధానం కానివారికి రేషన్లో కోత విధించాలన్న నిర్ణయమేమీ ప్రభుత్వం తీసుకోలేదని అధికారులు అంటున్నారు. ఆధార్, రేషన్ కార్డులకు అనుసంధానం కాని వారిలో ఎక్కువ మంది కోసిగి మండలంలోనే ఉన్నట్లు తేలింది. -
పోరు బావుటా
సాక్షి, కర్నూలు: సమైక్యాంధ్ర ఉద్యమం ఉద్ధృతమవుతోంది. ప్రజల స్వచ్ఛందంగా పాల్పంచుకుంటున్నారు. కర్నూలు నగరం ఆందోళనలతో హోరెత్తింది. ఇక గ్రామాల్లో సైతం ప్రజలు రోడ్డుపైకొచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను ముక్తకంఠంతో వ్యతిరేకిస్తుండటం విశేషం. ప్రధాన రహదారులను దిగ్బంధించి.. అక్కడే వంటావార్పులు నిర్వహిస్తున్నారు. ఆదివారం కర్నూలులో జర్నలిస్టుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్తో పాటు వికలాంగులు, అంధులు, బధిరులు ఉద్యమ బాట పట్టారు. ఇక న్యాయవాదులు తమ దీక్షలను కొనసాగిస్తున్నారు. కుల.. కార్మిక సంఘాలతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులు తమ సంఘీభావం ప్రకటిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు సైతం నిరసన కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నాయి. స్థానిక మ్యూజియం వద్ద న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహారదీక్ష శిబిరం, కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత కె.వి.సుబ్బారెడ్డి, సురక్ష హాస్పిటల్ ఆధినేత డాక్టర్ బి.ప్రసాద్ నిర్వహిస్తున్న ఆమరణ దీక్షా శిబిరాలకు వద్దకు వెళ్లి మాజీ ఎమ్మెల్సీ, వైఎస్ఆర్సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్రెడ్డి, ఎమ్మెల్సీ సుధాకర్బాబు, ప్రత్యేక రాయలసీమ ఉద్యమ నేత కుంచెం వెంకటసుబ్బారెడ్డి, బార్ కౌన్సిల్ రాష్ట్ర సభ్యుడు కృష్ణమోహన్లు మద్దతు ప్రకటించారు. ఐదో రోజూ వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. టీడీపీ నేత రాంభూపాల్ చౌదరి నేతృత్వంలో రాజ్విహార్ సెంటర్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. వైద్య ఉద్యోగులు భారీగా తరలి వచ్చి ఎన్టీఆర్ సర్కిల్లో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ నిన దించారు. ఇకపోతే రాష్ట్రం విడిపోతే యువత నష్టపోతుందని.. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉద్యమకారులు వినూత్న నిరసన చేపట్టారు. ప్రధానమంత్రి మన్మోహన్సింగ్, కేంద్ర మంత్రి చిరంజీవి, రాష్ట్ర మంత్రులు ఏరాసు, టీజీ వెంకటేష్ పేర్లతో కూడిన ప్లకార్డులను గాడిదల మెడల్లో వేసి రాజ్విహార్ సెంటర్ నుంచి మ్యూజియం వరకు ప్రదర్శన చేపట్టారు. అయితే మంత్రి టీజీ మౌఖిక ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు వీరి నిరసనను అడ్డుకోవడం గమనార్హం. నగరంలో వంటావార్పు జిల్లా అంతటా వంటావార్పు కార్యక్రమం రెండో రోజూ కొనసాగింది. నంద్యాల చెక్పోస్టు వద్ద వైఎస్ఆర్సీపీ కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్.వి.మోహన్రెడ్డి నేతృత్వంలో రాస్తారోకో నిర్వహించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. రోడ్డుపైనే వంటావార్పు నిర్వహించి నిరసన తెలిపారు. అలాగే స్థానిక చెన్నమ్మ సర్కిల్లోనూ కల్లూరు రైతు సంఘం, అఖిలపక్ష కమిటీ నేతృత్వంలో వంటావార్పు చేపట్టి, విభజనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్ వీరికి మద్దతు తెలిపారు. ఆలూరులో రాస్తారోకో సమక్యాంధ్రను కోరుతూ ఆలూరులో జేఏసీ అధ్యక్షుడు సత్యనారాయణ ఆధ్వర్యంలో విద్యుత్ కార్మిక సంఘం నేతలు రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ సంఘం నాయకులు మాదన్న ఆధ్వర్యంలో రిలేనిరహార దీక్షలు ప్రారంభమయ్యాయి. హొళగుందలో జర్నలిస్టులు మోటార్ బైక్లతో ర్యాలీ చేపట్టారు. పత్తికొండ వంటావార్పు.. పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు, యువకులు ఆర్అర్బీ అతిథిగృహం నుంచి ప్రదర్శనగా నాలుగు స్తంభాల మంటపం వద్దకు చేరుకుని సోనియా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం వంటావార్పు నిర్వహించి సహపంక్తి భోజనాలు చేశారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
No Headline
కౌంటింగ్ ప్రక్రియకు సన్నాహాలు
జీవాలకు విధిగా చిటుకు వ్యాధి నివారణ టీకా
టీడీపీ అభ్యర్థిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు
భూ యాజమాన్య హక్కు చట్టంతో మేలు
వైభవంగా పోలేరమ్మ తిరునాళ్ల
అసాంఘిక చర్యలకు పాల్పడితే రౌడీషీట్
ఎన్నికలవేళ తీవ్ర ఒడుదొడుకుల్లో స్టాక్మార్కెట్లు.. కారణం..
వేరబుల్స్ రంగానికీ పీఎల్ఐ స్కీమ్.. కేంద్రానికి ఎంఏఐటీ విజ్ఞప్తి
ఎమ్మెల్యే ఇంటిపై దాడి కేసులో నిందితుల అరెస్టు
తప్పక చదవండి
- కమెడియన్ అని చిన్నచూపు చూడొద్దు..
- ఏఎంసీ.. నో ఏసీ!.. ఇచ్చట ఎవరి ఫ్యాన్లు వారే తెచ్చుకోవలెను
- మోదీ గ్యారంటీలా? కేజ్రీ పథకాలా?.. ఢిల్లీ జనం మదిలో ఏముంది?
- రెప్పపాటులోనే మృత్యు ఒడికి
- Rasi Phalalu: ఈ రాశివారి జీవితాశయం నెరవేరుతుంది
- ఎమ్మెల్సీ కవితపై చార్జిషీటు
- సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్
- ఐఏఎస్లే ఇన్చార్జులు.. 10 యూనివర్సిటీలకు వీసీలుగా నియమించిన ప్రభుత్వం
- దారి మళ్లనున్న తుపాను!
- పాపం రాహుల్ త్రిపాఠి.. షాక్లో కావ్య మారన్! వీడియో వైరల్
Advertisement