-
ఆసీస్తో రెండో టెస్ట్.. విండీస్ను ఆదుకున్న లోయర్ ఆర్డర్ బ్యాటర్లు
బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్లో పర్యాటక విండీస్ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్.. 64 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో మిడిలార్డర్ బ్యాటర్లు కవెమ్ హాడ్జ్ (71), వికెట్కీపర్ జాషువ డసిల్వ (79) విండీస్ను ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్కు 149 పరుగులు జోడించి విండీస్ పతనాన్ని అడ్డుకున్నారు. ఈ మ్యాచ్లోనూ విండీస్ టాపార్డర్ యధాతథంగా తమ పేలవ ప్రదర్శనను కొనసాగించింది. కెప్టెన్ బ్రాత్వైట్ 4, చంద్రపాల్ 21, మెక్కెంజీ 21, అథనాజ్ 8, జస్టిన్ గ్రీవ్స్ 6 పరుగుల చేసి ఔటయ్యారు. హాడ్జ్, డసిల్వతో పాటు బౌలర్ అల్జరీ జోసఫ్ (32) రాణించి విండీస్ పరువు కాపాడారు. 16 పరుగులతో కెవిన్ సింక్లెయిర్ క్రీజ్లో ఉన్నాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 4 వికెట్లు పడగొట్టి విండీస్ పతనాన్ని శాశించగా.. హాజిల్వుడ్ 2, కమిన్స్, నాథన్ లయోన్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, రెండు మ్యాచ్ల ఈ సిరీస్లో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో విండీస్ను చిత్తు చేసింది. -
నిప్పులు చెరిగిన కమిన్స్, హాజిల్వుడ్.. ఓపెనర్గా విఫలమైన స్టీవ్ స్మిత్
AUS VS WI 1st Test: రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా వెస్టిండీస్-ఆస్ట్రేలియా జట్ల మధ్య అడిలైడ్ వేదికగా ఇవాళ (జనవరి 17) తొలి మ్యాచ్ ప్రారంభమైంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 2 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. ఓపెనర్గా కొత్త అవతారమెత్తిన స్టీవ్ స్మిత్ 12 పరుగులకే ఔటై నిరాశపర్చగా.. లబూషేన్ (10) కూడా తక్కువ స్కోర్కే ఔటయ్యాడు. ఉస్మాన్ ఖ్వాజా (30), కెమరూన్ గ్రీన్ (6) క్రీజ్లో ఉన్నారు. విండీస్ అరంగేట్రం పేసర్ షమార్ జోసఫ్ 2 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు ఆసీస్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్.. ఆసీస్ పేసర్లు జోష్ హాజిల్వుడ్ (4/44), కెప్టెన్ పాట్ కమిన్స్ (4/41) ధాటికి తొలి ఇన్నింగ్స్లో 188 పరుగులకే కుప్పకూలింది. మిచెల్ స్టార్క్, నాథన్ లయోన్ తలో వికెట్ పడగొట్టారు. విండీస్ ఇన్నింగ్స్లో వన్డౌన్ బ్యాటర్ కిర్క్ మెక్కెంజీ (50) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించాడు. ఓపెనర్లు బ్రాత్వైట్ (13), తేజ్నరైన్ చంద్రపాల్ (6), అలిక్ అథనాజ్ (13), కవెమ్ హాడ్జ్ (12), జస్టిన్ గ్రీవ్స్ (5), జాషువ డిసిల్వ (6), అల్జరీ జోసఫ్ (14), మోటీ (1) నిరాశపర్చగా.. 11వ నంబర్ ఆటగాడు షమార్ జోసఫ్ (35) ఎంతో ఉపయోగకరమైన ఇన్నింగ్స్ ఆడి విండీస్ పరువు కాపాడాడు. షమార్.. కీమర్ రోచ్తో (17 నాటౌట్) కలిసి చివరి వికెట్కు 55 పరుగులు జోడించాడు. -
విండీస్తో తొలి టెస్ట్కు ఆసీస్ తుది జట్టు ఇదే.. స్మిత్ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభం
రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా జనవరి 17 నుంచి అడిలైడ్ వేదికగా జరిగే తొలి టెస్ట్ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా, వెస్టిండీస్ తమ తుది జట్ల వివరాలను వెల్లడించాయి. ఈ మ్యాచ్తో ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ ఓపెనర్గా కొత్త ఇన్నింగ్స్ను ప్రారంభించనున్నాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారికంగా వెల్లడించింది. స్మిత్ ఓపెనర్ అవతారమెత్తడంతో మరో ఓపెనర్ మ్యాట్ రెన్షా బెంచ్కే పరిమితం కావాల్సి వస్తుంది. తుది జట్టులో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కెమారూన్ గ్రీన్ కూడా చోటు దక్కించుకున్నాడు. వార్నర్ రిటైర్మెంట్ అనంతరం ఆసీస్ ఆడుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఇదే. మరోవైపు ఈ మ్యాచ్తో ముగ్గురు విండీస్ ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేయనున్నారు. కవెమ్ హాడ్జ్, జస్టిన్ గ్రీవ్స్, షమార్ జోసఫ్లు సుదీర్ఘ ఫార్మాట్లో తమ తొలి మ్యాచ్ ఆడనున్నారు. ఆస్ట్రేలియా: స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖ్వాజా, మార్నస్ లబూషేన్, కెమరూన్ గ్రీన్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ (వికెట్కీపర్), మిచెల్ మార్ష్, పాట్ కమిన్స్, నాథన్ లయోన్, జోష్ హాజిల్వుడ్ వెస్టిండీస్: క్రెయిగ్ బ్రాత్వైట్ (కెప్టెన్), తేజ్నరైన్ చందర్పాల్, కిర్క్ మెకెంజీ, అలిక్ అథనాజ్, కవెమ్ హాడ్జ్, జస్టిన్ గ్రీవ్స్, జాషువా డసిల్వా (వికెట్కీపర్), గుడకేష్ మోటీ, అల్జరీ జోసెఫ్, షమార్ జోసఫ్, కీమర్ రోచ్ -
టీమిండియాకు భారీ నష్టం! అందుకే వాళ్లు అభాసుపాలవుతున్నారు: మాజీ క్రికెటర్
West Indies vs India, 2nd Test: ‘‘డబ్ల్యూటీసీ తాజా సైకిల్లో పటిష్ట జట్లతో సిరీస్లు ఆడాల్సి ఉంది. అందులో కొన్ని విదేశాల్లో ఆడాలి. కాబట్టి ప్రస్తుతం ఈ మ్యాచ్ డ్రాగా ముగియడం టీమిండియాకు తీరని నష్టంగానే భావించాలి’’ అని భారత మాజీ క్రికెటర్ దీప్దాస్ గుప్తా అన్నాడు. కాగా వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ 2023-25 సీజన్లో టీమిండియా తమ తొలి సిరీస్ను వెస్టిండీస్తో ఆడింది. 2-0తో క్లీన్స్వీప్ చేద్దామనుకుంటే.. కరేబియన్ పర్యటనలో భాగంగా తొలి టెస్టులో ఘన విజయం సాధించిన రోహిత్ సేన.. రెండో మ్యాచ్లోనూ గెలుపొంది 2-0తో క్లీన్స్వీప్ చేయాలని భావించింది. అయితే, వర్షం కారణంగా విండీస్- టీమిండియా మధ్య రెండో టెస్టు ఐదో రోజు ఆట ఒక్క బంతి కూడా పడకుండానే ముగిసిపోయింది. ఒకవేళ వర్షం తెరిపినిస్తే ఫామ్లో ఉన్న భారత బౌలర్లు విండీస్ బ్యాటర్ల పనిపట్టేవారే. ఎనిమిది వికెట్లను పడగొట్టడం అంత కష్టమయ్యేది కాదు. అయితే, అనూహ్యంగా వరణుడి కారణంగా ఆట వీలుకాకపోవడంతో మ్యాచ్ డ్రా అయింది. టీమిండియాకు భారీ నష్టం ఈ నేపథ్యంలో 12 పాయింట్లు రావాల్సిన చోట టీమిండియాకు 4 పాయింట్లే వచ్చాయి. ఆతిథ్య విండీస్ ఖాతాలో సైతం 4 పాయింట్లు చేరాయి. ఈ క్రమంలో దీప్దాస్ గుప్తా మాట్లాడుతూ.. ట్రినిడాడ్ మ్యాచ్ డ్రా అయిన కారణంగా భారత జట్టు భారీగా నష్టపోయిందని పేర్కొన్నాడు. ‘‘డబ్ల్యూటీసీ తాజా సైకిల్లో ఆరంభంలోనే ఇలా జరిగింది. వెస్టిండీస్ సిరీస్ అనగానే రెండు మ్యాచ్లు గెలిచి టీమిండియా 2-0తో ముగిస్తుందని అనుకున్నారంతా! కానీ అలా జరుగలేదు. మున్ముందు పటిష్ట జట్లతో ఆడాల్సి ఉంది. అలాంటపుడు 8 పాయింట్ల మేర నష్టపోవడం అంటే మామూలు విషయం కాదు’’ అని దీప్దాస్ గుప్తా చెప్పుకొచ్చాడు. అందుకే వాళ్లు అభాసుపాలవుతున్నారు ఇక వెస్టిండీస్ జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదువ లేదన్న ఈ మాజీ బ్యాటర్.. నిలకడలేమి ఆట వల్లే అభాసుపాలవుతున్నారని అభిప్రాయపడ్డాడు. కాగా డొమినికా వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే, ట్రినిడాడ్లో జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసిపోయింది. దీంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానం కోల్పోగా.. పాకిస్తాన్ టాప్లో కొనసాగుతోంది. చదవండి: వరల్డ్కప్నకు ముందు ఆసీస్తో టీమిండియా వన్డే సిరీస్.. పూర్తి షెడ్యూల్ ఇదే: బీసీసీఐ ఈసారి వరల్డ్కప్ ట్రోఫీ మనదే.. అయితే ఆ విషయంలో మాత్రం: టీమిండియా దిగ్గజం -
Ind Vs WI: విండీస్- టీమిండియా ఆఖరి రోజు ఆటకు వర్షం అంతరాయం
West Indies vs India, 2nd Test Day 5: వెస్టిండీస్- టీమిండియా మధ్య రెండో టెస్టు ఐదో రోజు ఆటకు వరణుడు అంతరాయం కలిగించాడు. వర్షం కారణంగా ఆఖరి రోజు ఆట ఆలస్యంగా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. వాన తెరిపి ఇవ్వడంతో అంపైర్లు మైదానంలోకి వెళ్లి ఆట కొనసాగించే వీలుందా అని పరిశీలిస్తున్నట్లు తాజా సమాచారం. కాగా వర్షం వల్ల మొదటి సెషన్ తుడిచిపెట్టుకుపోయింది. లంచ్ బ్రేక్ దాకా ఆట మొదలుకాలేదు. కాగా రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత జట్టు డొమినికా టెస్టులో ఏకపక్ష విజయం సాధించిన విషయం తెలిసిందే. భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా విండీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించడం... ఆపై అరంగేట్ర ఓపెనర్ యశస్వి జైశ్వాల్, కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీలతో చెలరేగడంతో టీమిండియా తొలి టెస్టులో ఘన విజయం సాధించింది. జూలై 12న మొదలైన మ్యాచ్ను మూడు రోజుల్లోనే ముగించి.. ఏకంగా ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో జయభేరి మోగించి 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ క్రమంలో జూలై 20న ఇరు జట్ల మధ్య రెండో టెస్టు మొదలైంది. ట్రినిడాడ్లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో గల క్వీన్స్ పార్క్ ఓవల్ జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ నేపథ్యంలో బ్యాటింగ్కు దిగిన టీమిండియా 438 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఇందుకు బదులుగా కరేబియన్ జట్టు తమ మొదటి ఇన్నింగ్స్లో 255 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. రవీంద్ర జడేజా, ముకేశ్ కుమార్ చెరో రెండు, అశ్విన్ ఒక వికెట్ పడగొట్టారు. ఇక 183 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన రోహిత్ సేన.. 181-2 వద్ద డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో నాలుగో రోజు ఆట ముగిసే సరికి విండీస్ రెండు వికెట్ల నష్టానికి 76 పరుగులు సాధించింది. వెస్టిండీస్ ఓపెనర్లరిద్దరి వికెట్లను అశ్విన్ తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా టీమిండియా చేతిలో క్లీన్స్వీప్ నుంచి తప్పించుకోవాలంటే ఆఖరి రోజు విండీస్ 289 పరుగులు చేయాలి. అదే విధంగా రోహిత్ సేన 2-0తో విజయం సంపూర్ణం చేసుకోవాలంటే 8 వికెట్లు పడగొట్టాలి. వర్షం తెరిపిఇవ్వకపోతే మాత్రం ఇరు జట్ల ఆశలపై నీళ్లు చల్లినట్లవుతుంది. చదవండి: Ind vs WI: వాళ్లిద్దరు ఉంటే అంతే! మ్యాచ్ డ్రా అయినా చాలనుకుంటే మాత్రం..
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
Advertisement