-
డీఆర్డీఎల్ ప్రోగ్రామ్ డైరెక్టర్కు కొండలరావు అవార్డు
సాక్షి, హైదరాబాద్: క్షిపణులు, వైమానిక వ్యవస్థల అభివృద్ధిలో కీలకమైన పరిశోధనలు చేసినందుకు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ (డీఆర్డీఎల్) ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ జయతీర్థ రాఘవేంద్ర జోషీకి ప్రతిష్టాత్మక డాక్టర్.ఎన్. కొండలరావు స్మారక అవార్డు లభించింది. ఇండియన్ సొసైటీ ఫర్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ సంస్థ 2022 సంవత్సరానికి గాను ఈ అవార్డును శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో ప్రదానం చేసింది. ఉస్మానియా యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ విద్యనభ్యసించిన డాక్టర్ జోషీ.. పూణే యూనివర్సిటీ నుంచి మేనేజ్మెంట్ సైన్సెస్లో మాస్టర్స్ పట్టా పొందారు. వరంగల్ ఎన్ఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్లోనే పీహెచ్డీ సంపాదించారు. దేశంలోనే దిగ్గజ శాస్త్రవేత్తలు ఆర్.చిదంబరం, అనిల్ కాకోద్కర్, డాక్టర్ జి.సతీష్ రెడ్డి వంటి వారు కూడా ఎన్.కొండలరావు స్మారక అవార్డు అందుకున్నారు. -
కొండల్రావ్... ఆనప్పాదా?
అక్షర తూణీరం ఆయన పేరు చెప్పగానే తెలుగు మేస్టారు ఆయన మాటలు గుర్తొచ్చి నవ్వు తెప్పిస్తాయి. రావి కొండల్రావు బహుముఖ ప్రజ్ఞాశాలి. అన్నిటికీ మించి ప్రఖ్యాత నటి రాధాకుమారిని కట్టుకున్న భర్త. కొండల్రావు నాటక రచయిత, స్టేజ్ నించి వెండితెరకెక్కిన నటుడు, పత్రికా రచయిత, పత్రికా సంపాదకులు, దర్శకులు, ప్రయోక్త ఎందరో ప్రముఖులకు తలలో నాలుక, కళాప్రపూర్ణ బిరుదుని సార్థకం చేసుకున్న విలక్షణ వ్యక్తి మొన్న జూలై 28న 88వ ఏట కాలధర్మం చెందారు. కొండల్రావ్ శ్రీకాకుళం నించి వస్తూ వస్తూ తనకు చిన్నప్పుడు చదువు చెప్పిన తెలుగు మేస్టారిని భుజాల మీద ఎక్కించుకు వచ్చారు. మేస్టారి మేనరిజమ్స్ని రకరకాలుగా ప్రదర్శిస్తూ దర్శింపచేస్తూ తెలుగు మేస్టారిని మద్రాసు, ఆంధ్రా, రాష్ట్రాలలో ప్రాచుర్యం తెప్పించి, ఆ పాత్రని చిరంజీవిగా కొండల్రావ్ నిలబెట్టారు. ఇంతకుమించిన గొప్ప గురుదక్షిణ మరొకటి ఉండదు. నాలుగిళ్ళ సావిడి, కుక్కపిల్ల దొరికింది కొండల్రావుకి పేరు తెచ్చిన నాటకాలు. తెలుగు మేష్టారు ఓ రోజు శిష్యుడి ఇంటిముందు ఆగారు. ఇంటిమీద ఆనప్పాదు ఆనూపంగా అల్లుకుని వుంది. తెరచాప చూసి ‘కొండల్రావ్..! ఆనప్పాదా?’ అని ప్రశ్నించారు. శిష్యుడు క్షణం తడబడకుండా ‘కాయట్లేదు మేష్టారూ’ అని వినయంగా స్పష్టంగా జవాబు యిచ్చాడు. దాంతో తెలుగు మేస్టారు తోక తొక్కిన త్రాచులా లేచారు. రాస్కెల్ నేనడిగిందేమిటి, నువ్ చెప్పేదేమిటి? కొండల్రావ్ ఆనప్పాదా అని అడిగినపుడు అది ఆనప్పాదైతే ఆనప్పాదని లేదూ బీరపాదైతే బీరపాదని, కాదూ చిక్కుడైతే చిక్కుడనీ లేదూ నాశార్థం పాదైతే నాశార్థం పాదు, నీ శార్ధం పాడైతే ఆ పాదూ అని చెప్పి అఘోరించాలి. కాయట్లేదు మేష్టారూ ఏమిట్రా బటాచోర్ ! ఏవిరా, నీ ఇంటికాయలు తినే ఇంతవాణ్ణి అయానా దొంగరాస్కెల్! అసలు నేనేమడిగాను, నువ్వేం చెప్పావ్! అయ్యారండి కొంచెం మీరు జడ్జిమెంటింగ్ ఉండాలి... వీడు నా క్లాసు మీటు (తెలుగు మేస్టారు ఇంగ్లిష్లో పరమపూర్, ఇంగ్లిష్ మీద చాపల్యం మెండ్. క్లాస్మీట్ అంటే స్టూడెంట్ అని భావించాలి) వీడిని కొండల్రావ్ ఆనప్పాదా అని అడిగినపుడు వాడేం చెప్పాలండీ... అని మేస్టారు మళ్ళీ మొత్తం లూప్ వేస్తారు. ఇలాగే మనిషి మనిషికీ చెప్పి వేష్టపడడంతో యీ ఫార్స్ వినోదాన్ని పంచుతుంది. విషాదం కూడా తొంగి చూస్తుంది. ఈ మహత్తర సన్నివేశాన్ని సంగీత కోవిదుడు ప్రతి సభలోనూ ఎలాగ సరికొత్త సంగతులతో కొత్త మెరుపులు అద్దు తాడో.. రావి కూడా అలాగే మనోధర్మంతో పలుకులకి నగిషీలు చెక్కేవారు. ఈ సంకీర్తన గంటసేపు జనరంజకంగా నడిచేది. మన కథల మేష్టారు కాళీపట్నం రామారావు. రావి కొండల రావు ఒకే ప్రాంతం వారు. ఒకే బడి విద్యార్థులు కూడా ‘ఆ తెలుగు మేస్టారు నాకూ అయ్యవారే. కానీ కొండల్రావ్ భూత ద్దంలోంచి చూపిస్తూ వేదిక లెక్కించి హాస్యం జోడించి మేష్టా రుని నవ్వుతాలు చేశారు’ అని కాళీపట్నం ఒకసారి చాలా సౌమ్యంగా నవ్వుతూ వ్యాఖ్యానించారు. కళాకారుడు కళా ప్రపూర్ణుడు అయినవాడు అంతమాత్రం చనువు చొరవ తీసుకోవడంలో తప్పేముంది? గురుభక్తితోనే యింతటి అక్షరా భిషేకం చేశాడని అనుకోవచ్చు. 1965లో ఆదుర్తి సుబ్బారావు అంతా కొత్తవారలే, కొత్త తారలే అంటూ తేనెమనసులు సినిమా తీశారు. హీరో కృష్ణ, రామ్మోహన్, సుకన్య, సంధ్యారాణి రావి కొండల్రావ్ ఆ వరదలో వచ్చినవారే! చందమామ ఆవరణలో రచన నించి నిర్మాణ నిర్వహణలు దాకా రక్తి కట్టించారు. డాల్టన్ ప్రెస్ నుంచి వచ్చిన ‘‘విజయచిత్ర’’ సినిమా పత్రిక ఎవర్ గ్రీన్ సినిమా మ్యాగజైన్. గాసిప్స్ గాలి కబుర్లు లేకుండా మల్టీకలర్లో చక్కని ఘుమఘుమలతో వచ్చేది. విజయచిత్రకి దాదాపు పాతికేళ్లు ఎడిటర్గా పనిచేసిన ఘనత కొండల్రావ్ది. బాపు రమణలు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి నడిపిన జ్యోతి మాసపత్రిక, సంపాదక వర్గంలో రావి వున్నారు. ‘సుకుమార్’ ఆయన కలం పేరు. బాపురమణ, వీఏకే, శ్రీశ్రీ, ఆరుద్ర, నండూరి ఇత్యాదులందరికీ సుకుమార్ చాలా ఆత్మీయులు. మద్రాస్ తెలుగు సాంస్కృతిక సంస్థలకు లోగోగా ఉండేవారు రావి కొండల్రావ్. అయన సినిమా కబుర్ల పుట్ట. కడదాకా ఆయన జ్ఞాపకశక్తి, నలుగురికీ చెప్పాలనే చాపల్యం సడలలేదు. కెరీర్లో లెక్కకి 500 సినిమాలలో కనిపించినా, ఒక పాతిక వేషాలు ఎన్నదగినవి. ఆయన రాసిన తెలుగు సినిమా చరిత్ర, నాగావళి నించి మంజీరా దాకా జ్ఞాపకాల కబుర్లు వాసి కెక్కాయి. అది మద్రాస్ ఎయిర్పోర్టు. అన్నగారు ఎదురుపడితే నమస్కరించారు కొండల్రావ్. ఆయన చిరునవ్వు నవ్వి ‘బ్రదర్! దుర్యోధనుడు లాంటి నెగెటివ్ క్యారెక్టర్కి ఎవరైనా శృంగార భరిత డ్యూయెట్ పెడతారా’ అని సూటిగా అడిగారు. వెంటనే తడుముకోకుండా ‘ఛీ.. ఛీ ఎవరూ పెట్టరండీ’ అన్నారు రావు కరాఖండిగా. యన్టీఆర్ విశాలంగా నవ్వి ‘మేం పెట్టాం బ్రదర్.. వినండి’ అంటూ చేతిలో ఉన్న టేప్రికార్డర్ మీట నొక్కారు. ‘చిత్రం... విభళారే చిత్రం’ (పాట) ఇవ్వాళే రికార్డ్ చేశాం. మన రెడ్డిగారు రాశారంటూ వినిపించారు. కొండల్రావుకి మొహం ఎట్లా పెట్టాలో అర్థం కాలేదు. ఇలాంటి సంఘటనలు ఎన్నో ఎన్నెన్నో చెబుతుండేవారు. అన్ని రంగాలలో సత్కీర్తి గడించిన కొండల్రావ్ ధన్యజీవి. ఆయనతో ఉన్న వేల వేల జ్ఞాపకాలకు అంజలి ఘటిస్తూ.... (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) శ్రీరమణ -
కరోనా: రెండో దశలోనే తీవ్రంగా ఉంది
సాక్షి, నల్గొండ: జిల్లాలో తొలిసారిగా 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని డిఎంహెచ్ఓ డాక్టర్ కొండల్ రావు వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నల్గొండలో అయిదుగురు మిర్యాలగూడకు చెందిన ఓ మహిళ కరోనా వైరస్ బారిన పడినట్లు ఆయ తెలిపారు. అయితే వీరంతా ఢిల్లీలోని మార్కజ్కు వెళ్లిన వారేనని కూడా పేర్కొన్నారు. కాగా పాజిటివ్ వచ్చిన వీరికి ఫీవర్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. వారి కుటుంబ సభ్యులను ఉదయం జిల్లా కేంద్ర ఆసుపత్రి క్వారంటైన్కు తరలించామని, వారి శాంపిల్స్ సేకరించి హైదరాబాద్కు పంపించామన్నారు. (క్షణక్షణం.. అప్రమత్తం) కాగా వారి రిపోర్ట్సు వచ్చాక అవసరమైన చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. ఇక పాజిటివ్ వచ్చిన వ్యక్తులతో ఎవరెవరూ సన్నిహితంగా ఉన్నారో వారి వివరాలు కూడా సేకరిస్తున్నామని చెప్పారు. జిల్లాలో ఇంకా 82 మంది క్వారంటైన్లో ఉన్నారని, ప్రజలు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన హెచ్చరించారు. జిల్లాలో మహమ్మారి విజృంభన రెండో దశలోనే తీవ్రంగా ఉందని, ప్రజలంతా ఇంట్లో నుంచి బయటకు రావొద్దని సూచించారు. ఇక వైద్య సిబ్బంది కూడా తగు జాగ్రత్తలతో విధులు నిర్వర్తించాలని ఆయన చెప్పారు. (నల్లగొండలో 17 మంది బర్మా దేశీయులు) -
రంగస్థలంపై ‘కొండంత’ అభిమానం
ఆ రోజుల్లో నాటకాలంటే భలే క్రేజ్.. ఎక్కడ నాటకాలు వేసినా గుంపులుగా జనం వెళ్లేవారు.. దాంతో అతడికి నాటకాలపై మక్కువ పెరిగింది. ఎలాగైనా నాటకాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఎంతో ప్రయత్నం చేశాడు. చివరకు అనుకున్నది సాధించి నాటక రంగంలో దూసుకుపోయాడు. తను ఏ పాత్ర వేసినా జనంలోంచి విజిల్స్ చప్పుడు.. కేకలు.. అరుపులు.. అవే అతడిలో మరింత ఆసక్తి పెంచాయి. నాటకాన్నే జీవనోపాధిగా మార్చుకున్నాడు. ఆరోజుల్లో నాటకాలకు ఉన్న ఆదరణ ప్రస్తుతం లేకపోవడంతో బతుకు భారమైంది. కల నుంచి బయటకు వచ్చి.. కళను వదిలిపెట్టి.. పొట్టనింపుకునేందుకు దర్జీ పని మొదలు పెట్టారు. మార్కెట్లో రెడీమేడ్ దుస్తుల పోటీని తట్టుకోలేక బతుకును భారంగా వెళ్లదీస్తున్నారు కొండల్రావు. రహమత్నగర్: రహమత్నగర్ డివిజన్లోని ఎన్ఎస్బీ నగర్కు చెందిన కొండల్రావు(75)కు భార్య ముగ్గురు కుమారులు ఉన్నారు. చిన్నతనం నుంచే నాటకాలపై ఉన్న మక్కువతో ఎన్నెన్నో అవార్డులు, రివార్డులు, సత్కారాలు పొందారు. రాష్ట్ర వ్యాప్తంగా రంగస్థల సంస్థలతో సంబంధాలు పెంచుకొని రాష్ట్రవ్యాప్తంగా నాటకాలు వేసి శెభాష్ అనిపించుకున్నారు. ఈయన వేసిన క్రిష్ణార్జున యుద్దం, మాయాబజార్, చింతామణి, çసత్యహరిచంద్ర, నాటకాలు బహుమతులు అందుకొని ప్రశంసలు అందుకున్నారు. 2011 ఫిబ్రవరిలో రవీంద్రభారతిలో నంది నాటకోత్సవం ప్రశంస పత్రం అందుకున్నారు. ప్రస్తుతం బ్రహ్మశంకర్ బస్తీలో టైలర్గా జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఓవైపు వృద్ధాప్యం.. మరోవైపు ఆర్థిక పరిస్థితులు ఆయనను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఏళ్లుగా నాటక రంగంలో ఉన్నా కనీసం ప్రభుత్వ గుర్తింపు కార్డు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి కళాకారులను ఆదుకోవాలని కోరుతున్నారు. -
ఏసీబీ దాడులు.. కోట్లలో అక్రమాస్తులు గుర్తింపు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ఆదిలాబాద్ మున్సిపల్ డీఈ కొండల్రావు ఇళ్లలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఆదిలాబాద్, వరంగల్, కొత్తగూడెంలలో పలుచోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు రూ. 6 కోట్ల అక్రమాస్తులు గుర్తించినట్లు తెలుస్తోంది. కొత్తగూడెం జిల్లా రామానుజ కాలనీలోని మున్సిపల్ డీఈ మామ ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ రోజు సాయంత్రం వరంగల్లో మీడియాకు వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
నేటి నుంచి పోస్టల్ బ్యాలెట్
ధర్మాగ్రహం ముందు నిలవని దాదాగిరి
కన్నీటి సుడులు.. కరిగె మారాజు
ఎవరినీ వదిలిపెట్టను
గంటల్లోనే పరిహారం
కార్మికులకు తక్షణ పరిహారం
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement