-
విధేయతకు పట్టం
ఎట్టకేలకు ఉత్కంఠకు తెరపడింది. కృష్ణా జిల్లా నుంచి ముగ్గురిని అమాత్య పదవులువరించాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డివెన్నంటి ఉండి.. ఆయనకు సన్నిహితులుగా పేరున్న మచిలీపట్నం, గుడివాడఎమ్మెల్యేలు పేర్ని వెంకట్రామయ్య(నాని), కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని)లతోపాటు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్కుమంత్రులుగా అవకాశం దక్కింది. శనివారం జరిగే ప్రమాణ స్వీకారానికిరావాల్సిందిగా ముగ్గురికి సీఎం పేషీ నుంచి సమాచారం అందింది. దీంతోనేతలు, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు రాజధాని బాట పట్టారు. సాక్షి, అమరావతి బ్యూరో: విధేయతకు పట్టం కడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృష్ణా జిల్లా నుంచి ముగ్గురికి మంత్రి వర్గంలో అవకాశం కల్పించారు. సీఎం వైఎస్ జగన్కు అండగా ఉన్న పేర్ని నాని, కొడాలి నానిలకు కేబినెట్లో స్థానం ఖరారైంది. పేర్నినాని తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ 2004లో కాంగ్రెస్ తరఫున మొదటిసారి బరిలో దిగి గెలుపొందారు. తర్వాత 2009లోనూ ఆయన ఎమ్మెల్యేగా రెండోసారి విజయం సాధించారు. అయితే ఎమ్మెల్యేగా ఉండగానే కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేసి ఓటమి చవిచూశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ మంత్రి కొల్లురవీంద్రపై గెలుపొందారు. ఇక గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వరుసగా నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. నాని మొదట రెండు పర్యాయాలు టీడీపీతరఫున గెలుపొందగా.. 2014లో వైఎస్సార్ సీపీ తరఫున విజయం సాధించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ వైఎస్సార్ సీపీ తరఫున బరిలోకి దిగిన కొడాలి నానిని ఎలాగైనా ఓడించాలనేపట్టుదలతో టీడీపీ అధినేత చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేసినా.. ఆయన విజయాన్ని అడ్డుకోలేకపోయారు. కొడాలి నాని సీఎం జగన్కు అత్యంత సన్నిహితుడనే పేరుంది. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ మొదటిసారి 2009లో ప్రజారాజ్యం తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో విజయం సాధించారు. బందరు నుంచి ఐదో మంత్రి.. రాజకీయ పరంగా ఎంతో ప్రత్యేక స్థానం ఉన్న బందరు నియోజకవర్గం నుంచి వివిధ పార్టీల నుంచి గెలుపొందిన వారు మంత్రులుగా పదవులు అలంకరించిన చరిత్ర మచిలీపట్నం నియోజకవర్గానికి ఉంది. 1984లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన వడ్డి రంగారావుకు మంత్రి పదవి వరించింది. తర్వాత నేదురుమల్లి జనార్దన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ నుంచి పేర్ని కృష్ణమూర్తి మంత్రి పదవి చేపట్టారు. చంద్రబాబు సారథ్యంలో నడకుదటి నరసింహారావు, 2014 ఎన్నికల్లో గెలిచిన ఆయన అల్లుడు కొల్లు రవీంద్రలు అమాత్యులుగా పదవీ బాధ్యతలు నిర్వహించారు. కాంగ్రెస్ తరఫున రెండు పర్యాయాలు విజయం సాధించిన పేర్ని వెంకట్రామయ్య(నాని) 2012లో కిరణ్కుమార్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ విప్గా పనిచేశారు. టీడీపీ కోటలు బద్దలు కొట్టిన నాని.. రాష్ట్ర రాజకీయాల్లో కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు తొలిసారి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించింది. ఈ నియోజకవర్గం నుంచే. టీడీపీ ఆవిర్భావం నుంచి ఈ స్థానం ఆ పార్టీకి పట్టుగొమ్మగా నిలిచింది. 2004, 2009లో జరిగిన ఎన్నికల్లో రెండు పర్యాయాలు కొడాలి నాని టీడీపీ తరఫున గెలుపొందారు. అయితే ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాక.. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ కోటలకు బీటలు వారాయి. వైఎస్సార్ సీపీ తరఫున బరిలో నిలిచి టీడీపీ అభ్యర్థిపై గెలుపొందారు. అప్పటి వరకు ఉన్న టీడీపీకి పట్టుగొమ్మగా నిలిచిన ఆ నియోజకవర్గంలో తొలిసారి వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలాడింది. ఆ తర్వాత ఆ పంథాను కొనసాగిస్తూ 2019 ఎన్నికల్లోనూ ఆయన ఘన విజయం సాధించారు. -
ఖబడ్దార్!
రైతు, డ్వాక్రా రుణమాఫీకి షరతులొద్దు హామీ మేరకు పూర్తిస్థాయిలో రద్దు చేయాలి ఎన్నికల హామీలు అమలయ్యేవరకు నిత్య పోరాటాలే ధర్నాలో వైఎస్సార్సీపీ నేతల హెచ్చరిక విజయవాడ : ఎన్నికల ముందు టీడీపీ ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసేవరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని ఆ పార్టీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి, ఉత్తర కృష్ణా అధ్యక్షుడు కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) స్పష్టం చేశారు. రైతులు, డ్వాక్రా సంఘాల రుణాలు ఎలాంటి షరతులూ లేకుండా.. పూర్తిస్థాయిలో మాఫీ చేయాలని కోరుతూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నానుద్దేశించి పార్థసారథి మాట్లాడుతూ రైతులు, మహిళల కంట కన్నీరు కార్చేలా వ్యవహరిస్తే ప్రభుత్వ నాశనమవుతుందన్నారు. రుణమాఫీ సక్రమంగా చేయకుండా అనేక అడ్డంకులు సృష్టిస్తున్న టీడీపీ నాయకులు సిగ్గుపడాల్సిందిపోయి స్వీట్లు పంచుకోవడం విడ్డూరంగాఉందని చెప్పారు. అధికారంలోకొచ్చి ఆరునెలలు అవుతున్నా రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేయకుండా టీడీపీ ప్రభుత్వం జాప్యం చేస్తోందన్నారు. రూ.50 వేలకు పైబడి పంట రుణం ఉంటే 20 శాతం మొదటి విడతగా జమ చేస్తామని, రైతు పేరున బాండ్లు ఇస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పంట సాగు కోసం రైతులు రుణాలు తీసుకుంటే.. వారి ఆధార్, రేషన్ కార్డులు ఇతర వివరాలు సేకరించి టీడీపీ ప్రభుత్వం అన్నదాతలను దొంగలుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిందని విమర్శించారు. దాళ్వా నీటిపై నేటికీ స్పష్టత లేదు.: జిల్లాకు చెందిన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నీటిపారుదలశాఖ మంత్రిగా ఉండి దాళ్వా పంటకు ఎప్పుడు నీరు విడుదల చేస్తారో ఇంతవరకు ప్రకటించలేద సారథి విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి విషయంపై ఉద్యమాలు నడిపిన దేవినేని ఉమామహేశ్వరరావు నేడు చేతగాని దద్దమ్మలా మారారని ఎద్దేవా చేశారు. గత ఏడాది బస్తా ధాన్యం రూ.1,400 అమ్మితే నేడు రూ.1,050కి కూడా కొనే దిక్కులేదన్నారు. పత్తి, సుబాబుల్ తక్కువ ధరకే కొంటున్నా టీడీపీ పాలకులు రైతుల పక్షాన ఒక్కమాట కూడా మాట్లాడటం లేదని మండిపడ్డారు. సుబాబుల్ రైతులకు ఒక కంపెనీ రూ.12 కోట్ల బకాయిలు ఇవ్వాల్సి ఉండగా రైతుల పక్షాన మాట్లాడి ఇప్పించడంలో మంత్రి విఫలమయ్యారని విమర్శించారు. కౌలు రైతులను టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవడమే లేదన్నారు. రాజధాని రైతులను ముఖ్యమంత్రే బెదిరిస్తున్నారు... తమకు జీవనాధారంగా ఉన్న భూములను రాజధాని నిర్మాణానికి ఇచ్చేది లేదని చెబుతున్న రైతులను స్వయంగా ముఖ్యమంత్రే బెదిరిస్తున్నారని సారథి ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతవరకు రాజధాని ఎక్కడ నిర్మిస్తారో స్పష్టం చేయకుండా టీడీపీ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారం గుట్టుచప్పుడు కాకుండా చేస్తున్నారన్నారు. టీడీపీ నేతలు తమ నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదంటే వైఎస్సార్సీపీ నేతలు అంతకన్నా అధికంగా స్పందిస్తారని ఆయన హెచ్చరించారు. జనాన్ని మోసపుచ్చలేకే.. జగన్ సీఎం పదవిని వదులుకున్నారు... ఎన్నికల సమయంలో చిత్తూరు పర్యటనలో వైఎస్ జగన్మోహనరెడ్డి ఉన్నప్పుడు తామంతా వెళ్లి చంద్రబాబు రైతులకు రుణమాఫీ చేస్తానని చెబుతున్నాడని, మీరు కూడా ఆ హామీ ఇవ్వాలని కోరామన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో రూ.87 వేల కోట్ల పంట రుణాలు, రూ.14 వేల కోట్ల డ్వాక్రా రుణాలు ఉన్నాయని, రాష్ట్రం విడిపోయిన తరువాత ఈ రుణాలను మాఫీ చేయడం జరిగే పని కాదని చెప్పారన్నారు. ప్రజలను దగా చేయలేనని, చంద్రబాబు మాదిరిగా పచ్చి అబద్ధాలు ఆడలేనని, ముఖ్యమంత్రి పదవి వచ్చినా, రాకున్నా ప్రజలను మోసం చేయలేనని స్పష్టం చేశారని వివరించారు. ఆనాడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిన మాట నేడు నిజమైందన్నారు. ప్రజలను మోసపుచ్చలేక ఆయన ముఖ్యమంత్రి పదవిని వదులుకున్నారని గుర్తుచేశారు. కొందరు టీడీపీ నాయకులు చంద్రబాబుకు, జగన్కు మధ్య నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అంటున్నారని, ఈ విషయం నిజమేనని, నక్క చంద్రబాబునాయుడు అయితే నాగలోకం జగన్మోహన్రెడ్డి అని చెప్పారు. షరతులు లేకుండా రుణమాఫీ చేస్తామన్నారు... ఎన్నికల సమయంలో ఎలాంటి షరతులూ లేకుండానే రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన టీడీపీ.. అధికారంలోకి వచ్చాక అనేక అడ్డంకులు సృష్టించిందని ధర్నా పరిశీలకుడు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ విమర్శించారు. రుణమాఫీ చేస్తామని చంద్రబాబు చెబితే రైతులు, డ్వాక్రా మహిళలు నమ్మి ఆయనకు ఓట్లు వేశారని, అధికారంలోకి వచ్చిన తరువాత రుణాలు రద్దు చేయకుండా అనేక ఆంక్షలు విధిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం రుణమాఫీ కోసం ఇచ్చిన రూ.5 వేల కోట్లు వడ్డీకి కూడా చాలవన్నారు. ప్రజలు నివురుగప్పిన నిప్పులా ఉన్నారని, టీడీపీ ఇచ్చిన హామీలు అమలుకాని నేపథ్యంలో, సమయం వచ్చినప్పుడు జుట్టు పట్టుకుంటారని హెచ్చరించారు. గతంలో వ్యవసాయం దండగ అని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు అదే ధోరణిలో పచ్చని పొలాలను రాజధాని నిర్మాణం కోసం తీసుకుని రైతుల నోట్లో మట్టి కొడుతున్నారన్నారు. ప్రతిపక్ష నేత హోదాలో ముఖ్యమంత్రి చంద్రబాబు మెడలు వంచేది జగన్మోహన్రెడ్డి ఒక్కరేనని, ఈ ధర్నా కార్యక్రమం ఆరంభం మాత్రమేనని మోపిదేవి వెంకటరమణ చెప్పారు. తాళం వేసిన తలుపునకే వినతిపత్రం... ధర్నా అనంతరం కలెక్టర్కు వినతిపత్రం సమర్పించేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నాయకులు.. ఆయన అందుబాటులో లేకపోవడంతో చాంబర్కు వెళ్లే దారిలో తాళం వేసిన తలుపునకే వినతిపత్రం అంటించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టరేట్ ఎదురుగా ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య (నాని), విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ఖాన్, శాసనసభ ఉప ప్రతిపక్ష నాయకురాలు, పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, తిరువూరు ఎమ్మెల్యే కె.రక్షణనిధి, నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు, జగ్గయ్యపేట నియోజకవర్గ సమన్వయకర్త సామినేని ఉదయభాను, పార్టీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతమ్రెడ్డి, మైలవరం, పెడన, అవనిగడ్డ, గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్తలు జోగి రమేష్, బూరగడ్డ వేదవ్యాస్, సింహాద్రి రమేష్, దుట్టా రామచంద్రరావు, పార్టీ నాయకులు దూలం నాగేశ్వరరావు, ఉప్పాల రాంప్రసాద్ తదితరులు ప్రసంగించారు. ఆయా నియోజకవర్గాల నుంచి జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధులు, రైతులు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. పార్టీ మచిలీపట్నం పట్టణ కన్వీనర్ షేక్ సలార్దాదా అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఉమాది అప్పుడొక మాట.. ఇప్పుడొక మాట... వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోలవరం కాలువ పనులు జరుగుతుంటే ప్రస్తుత నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఈ పథకంపై దుష్ర్పచారం చేశారని చెప్పారు. మంత్రి పదవి చేపట్టాక.. పోలవరం కాలువ పనులు పూర్తయ్యాయని, ఈ కాలువ ద్వారానే కృష్ణాడెల్టాకు సాగునీటిని విడుదల చేస్తామని నేడు చెబుతున్నారన్నారు. ఎన్నికల సమయంలో టీడీపీ హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి, డ్వాక్రా, రైతు రుణమాఫీ జరిగే వరకు ముఖ్యమంత్రి మెడలు వంచి పనిచేయిస్తామన్నారు. పచ్చి మోసకారి.. చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతులను, నిరుద్యోగులను, మహిళలను మోసపుచ్చుతూ దేశంలో పచ్చి మోసకారిగా మారారని వైఎస్సార్ సీపీ ఉత్తర కృష్ణా అధ్యక్షుడు, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రుణమాఫీపై ధర్నా నిర్వహిస్తామని చెప్పిన తరువాతే ముఖ్యమంత్రి విలేకర్ల సమావేశం నిర్వహించి మాఫీ వివరాలు ప్రకటించారని చెప్పారు. ధర్నాలో మాట్లాడుతున్న కొడాలి నాని, చిత్రంలో నేతలు పార్థసారథి, మోపిదేవి వెంకటరమణ, రక్షణనిధి, మేకా ప్రతాప్, కల్పన, ఉదయభాను, జోగి రమేష్, వేదవ్యాస్, గౌతంరెడ్డి, సింహాద్రి, దుట్టా, దూలం నాగేశ్వరరావు తదితరులు (ఇన్సెట్) చిలకలపూడి పోలీస్స్టేషన్ ఎదురుగా ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇస్తున్న కొలుసు పార్థసారథి -
ఉమా జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకో
సంస్కారవంతంగా మాట్లాడు నీకంటే ఎక్కువ బూతులు తిట్టగలను ఉన్నది చెబితే ఉలుకెందుకు వైఎస్సార్ సీపీ నేతలు కొడాలి నాని, పార్థసారథి ధ్వజం విజయవాడ : ‘ఉన్న మాట చెబితే ఉలుకెందుకు.. నోరు అదుపులో పెట్టుకో.. లేకుంటే మీకంటే ఎక్కువగా బండబూతులు తిట్టగలం..’ అంటూ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, శాసనసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)హెచ్చరించారు. గురువారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మంత్రి ఉమా దుర్భాషలాడడాన్ని ఖండించారు. గత ఎన్నికల్లో రైతులు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని నమ్మబలికి గద్దెనెక్కి ఆరు మాసాలైనా అమలు చేయకపోవడంతో వచ్చిన ప్రజాగ్రహాన్ని తమ పార్టీ అధినేత బయటకు చెప్పారని కొడాలి నాని వివరించారు. హామీలు అమలుచేయాలని ప్రజల తరఫున కోరుతుంటే ఉమా సంస్కారహీనంగా మాట్లాడడం శోచనీయమన్నారు. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడకపోతే రాబోయే రోజుల్లో చంద్రబాబును కూడా తిట్టేందుకు తాము వెనుకాడేది లేదని హెచ్చరించారు. మానసిక రోగం తమ పార్టీ నేతకు లేదని, 66 ఏళ్లు దాటిన మీ నాయకుడు చంద్రబాబుకే ఉందన్నారు. అధికారం కోసం చంద్రబాబు మామను చంపారని, ఎమ్మెల్యే పదవి కోసం ఉమా ఇంట్లో మనుషులను చంపారని దుయ్యబట్టారు. చంద్రబాబును ప్రజలు క్షమించరు : సారథి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మంత్రి కె.పార్థసారథి మాట్లాడుతూ చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలు అమలుచేయకపోతే భవిష్యత్తులో రాళ్లతో కొడతారని తమ పార్టీ అధినేత అన్న మాటల్లో ఎటువంటి తప్పు లేదన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసగిస్తున్న చంద్రబాబును ప్రజలు క్షమించరన్నారు. మంత్రి ఉమా పిచ్చివాగుడు వాగుతూ వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రుణమాఫీపై ఎన్ని మాటలు మార్చారో ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. పింఛన్లకు రూ. 3,700 కోట్ల బడ్జెట్ కేటాయించి నిరుపేదలకు ఎగనామం పెడుతున్నారని దుయ్యబట్టారు. ఈ సమస్యలపై నిలదీస్తున్న తమ పార్టీ అధినేతపై దుర్భాషలాడడం తగదన్నారు. జిల్లాలో మంజూరైన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని గుంటూరుకు తరలించినా మంత్రి ఉమా దద్దమ్మలా నోరు మెదపకుండా కూర్చున్నారని విమర్శించారు. సంస్కారహీనంగా ప్రవర్తించవద్దని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని మంత్రి ఉమాకు సారథి హితవు పలికారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పశ్చిమ బెంగాల్లో బాంబు పేలుడు.. ఒకరు మృతి!
రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్
Sakshi News Cartoon: మనమే ఇవ్వలేం! ఇక వాళ్లేందుకిస్తారు!
IPL 2024: ప్లే ఆఫ్స్ అవకాశాలు ఏ జట్టుకు ఎలా..?
ఓటీటీలోకి రాబోతున్న విశాల్ 'రత్నం' సినిమా
సీఎం జగన్ రాయల్ ఎంట్రీ
పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
ప్రజలు జాగ్రత్త.. బాబుపై ద్వారంపూడి సెటైర్లు
దొంగలు దొరికారు
రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారతాడు..కన్నబాబు ఫైర్
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement