breaking news
kli water
-
బీడు.. ఆయకట్టు గోడు!
కొల్లాపూర్రూరల్ : కేఎల్ఐ నుంచి సాగునీరు సరఫరా కాకపోవడంతో మండల పరిధిలోని పలు గ్రామాల్లోని చెరువులన్నీ వట్టిపోయాయి. చెరువుల కింద ఉన్న వేల ఎకరాల్లో ఆయకట్టు పొలాలు బీడువారాయి. సుదూర ప్రాంతాలకు ఇక్కడి నుంచి కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందించటానికి నీటిని సరఫరా చేస్తున్నా... ప్రాజెక్టుకు అతి సమీపంలో ఉన్న మండల పరిధిలోని చెరువులకు సాగునీరు లేక వట్టిపోయాయి. గత మూడు, నాలుగు సంవత్సరాల నుంచి కేఎల్ఐ అధికారులకు, ప్రభుత్వానికి చెరువులకు సాగునీరు విడుదల చేయాలని విన్నవించినా ఫలితం లేదని ఆయా గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వలసబాటలో రైతులు మండల పరిధిలోని జావాయిపల్లి చెరువు, ఎన్మన్బెట్ల గ్రామంలోని వీరమనాయుని చెరువు, కుడికిళ్ల గ్రామంలోని ఊర చెరువు, పట్టణంలోని కావలోనికుంట, మొలచింతలపల్లి గ్రామంలోని జిల్దార్తిప్ప చెరువులకు నేటి వరకు కేఎల్ఐ నుంచి సాగునీరు సరఫరా కావడం లేదు. ఈ చెరువుల కింద వేల ఎకరాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సుదూర ప్రాంతాలకు వలసబాట పడుతున్నారు. సాగునీరు విడుదల చేయాలి మండలంలోని జావాయిపల్లి చెరువుకు కేఎల్ఐ నుంచి సాగునీరు విడుదల చేయాలి. సింగోటం రిజర్వాయర్కు అతి సమీ పంలో జావాయిపల్లి చెరువు ఉంది. రిజర్వాయర్ నుంచి సాగునీరు విడుదల చేయాలని కొన్నేళ్లుగా విన్నపాలు చేస్తున్నాం. నేటికీ నీటి సరఫరా లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. – స్వామి,జావాయిపల్లి రైతు ఉద్యమాలు చేసినా ఫలితం లేదు గ్రామంలోని వీరమనాయుని చెరువుకు కేఎల్ఐ నుంచి సాగునీరు విడుదల చేయాలని గ్రామ రైతులతో కలిసి ఉద్యమాలు చేశాం. నేటి వరకు ఫలితం లేదు. స్థానిక మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి కూడా ఎన్నోసార్లు తెచ్చాం. ఎన్మన్బెట్లలోని వీరమనాయుని చెరువుకు సాగునీరు లేక వందల ఎకరాల్లో ఆయకట్టు బీడువారింది. – సాయిరాం, ఎన్మన్బెట్ల వార్డుమెంబర్ -
‘కేఎల్ఐ సాగునీరు వైఎస్సార్ పుణ్యమే’
బిజినేపల్లి : తెలంగాణ రాష్ట్రానికి సాగునీరు ఇవ్వడానికి బడ్జెట్ రూపకల్పన చేసింది వైఎస్సారే అని కేఎల్ఐ సాగునీరు ఆయన పుణ్యమేనని సీపీఐ రా ష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈర్ల నర్సింహ అన్నా రు. మండల కేంద్రంలో ఆదివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కేఎల్ఐ ప్రాజెక్టు కు రూపకల్పన చేసింది నాగం జనార్దన్రెడ్డి అని ప్రాజెక్టు నిర్మాణం కోసం కష్టపడితే నిధుల కొరత తో ఏమి చేయలేకపోయారని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అలికిపెట్టిన గూట్లో గువ్వ గుడ్డు పెట్టిన ట్లు చెప్పుకుంటుందని విమర్శించారు. వరద జ లాలు వాడుకోవాలని బ్రిజేష్ కమిటీ చెబుతుంటే ప్రభుత్వ నికర జలాలను వాడుకుంటుందని చె ప్పారు. పాలమూరు, రంగారెడ్డి పథకానికి కేంద్ర జలవనరుల శాఖ అనుమతి లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్టుపై సుప్రీం కోర్టుకు కూడా వెళ్లిం దన్నారు. జీఓ 123పై ప్రభుత్వాకి కోర్టు మొట్టికాయలు వేసినా మార్పు రాలేదన్నా రు. వైఎస్సార్ జలయజ్ఞాన్ని టీఆర్ఎస్ ధనయజ్ఞంగా మార్చడం సరికాదన్నారు. 1980లో సీపీఐ పాదయాత్రలు చేపడితే వైఎస్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులపై దష్టి పెట్టారన్నారు. సమావేశంలో కష్ణాజీ, యాదయ్య, భూపేష్ తదితరులు పాల్గొన్నారు.