-
యువకుల్లో ఆధ్యాత్మిక చైతన్యం
ఉచితంగా వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన చెవిరెడ్డి భాస్కర్రెడ్డి చెవిరెడ్డి ప్రయత్నం అద్భుతం కరుణాకర రెడ్డి ప్రశంస తిరుపతి : ‘‘తనకున్న భక్తిని పదిమందికి పంచుతూ గ్రామాల్లో మరింతగా ఆధ్యాత్మిక విలువలు పెంపొందించేదుకు నా తమ్ముడు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి చేపట్టిన వినాయక విగ్రహాల ఉచిత పంపిణీ కార్యక్రమం అద్భుతమైంది’’ అని తిరుపతి మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి అన్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని ప్రతి ఏడాది ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి చంద్రగిరి నియోజకవర్గంలోని గ్రామాలకు ఉచితంగా వినాయక విగ్రహాలను అందిస్తుంటారు. ఇందులో భాగంగా బుధవారం చేపట్టిన వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని భూమన కరుణాకరరెడ్డి పూజచేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకుల్లో ఆధ్యాత్మిక చైతన్యం, ఐక్యతను పెంచేందుకు చెవిరెడ్డి చేపట్టిన ఉచిత విగ్రహాల పంపిణీ కార్యక్రమం చాలా మంచిదని కొనియాడారు. గ్రామాల్లో విలువలు, ఆధ్యాత్మిక చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం వినాయక విగ్రహాల పంపిణీ ద్వారా చేస్తున్నారన్నారు. ప్రతి ఏడాదీ కొనసాగుతుంది : చెవిరెడ్డి యువకులు ఐకమత్యంగా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే వినాయక చవితిని పురస్కరించుకుని ప్రతి ఏడాదీ వినాయక విగ్రహాలను ఉచితంగా అందిస్తానని చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తెలిపారు. గత ఏడాది 680 విగ్రహాలు ఇచ్చానన్నారు. ఈ ఏడాది విగ్రహాలకు రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగిందన్నారు. యువకుల్లో ఆధ్యాత్మిక చైతన్యం పెంచేందుకోసం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానన్నారు. కష్టపడేతత్వం, ఆధ్యాత్మిక లక్షణాలు ఉంటే ఏధైనా సాధించవచ్చన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల గ్రామాలకు 20 లక్షల రూపాయల ఖర్చుతో 720 విగ్రహాలు ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఉపేంద్రరెడ్డి, కొటాల చంద్రశేఖర్రెడ్డి, పొట్టేలు మునస్వామి, చిన్నీయాదవ్, శ్రీరాములు, నంగా బాబురెడ్డి, భాను పాల్గొన్నారు. -
కరుణాకరరెడ్డిపై టీడీపీ అభ్యర్థి దాడి
తిరుపతిలో పోలింగ్ రోజూ టీడీపీ వారి దాష్టీకం కొనసాగింది. ప్రచార పర్వంలో డబ్బు, మద్యంతో వీరు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు ప్రయత్నించడం తెలిసిందే. పోలింగ్ రోజు ఏకంగా బూత్ల వద్ద వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. దీంతో ఇరు పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులూ అక్కడకు చేరుకున్నారు. నేతల మధ్య వాగ్వాదం జరగడంతో కరుణాకరరెడ్డిపై వెంకటరమణ చేయి చేసుకున్నారు. పోలీసులు అభ్యర్థులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు. తిరుపతి(మంగళం), న్యూస్లైన్: తిరుపతి ఎమ్మెల్యే స్థానానికి వైఎస్ఆర్ సీపీ తరఫున పోటీ చేస్తున్న భూమన కరుణాకరరెడ్డిపై బుధవారం టీడీపీ అభ్యర్థి వెంకటరమణ చేయి చేసుకున్నారు. దీంతో రాజీవనగర్ పంచాయతీ జీవకోనలో ఉద్రిక్తత నెలకొంది. వివరాలిలా.. బుధవారం ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఓటింగ్ సరళి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉండటంతో టీడీపీ వారు అసహనానికి గురయ్యారు. దీంతో పోలింగ్ బూత్ల వద్ద హల్చల్ చేయడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో తిరుపతి సత్యనారాయణపురంలోని ప్రాథమికపాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ నాయకులను వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా వారంతా వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై దాడికి దిగారు. ఈ దాడిలో ఇద్దరు వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అభ్యర్థులు భూమన కరుణాకరరెడ్డి, ఎం.వెంకటరమణ అక్కడికి చేరుకున్నారు. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గుమికూడారు. దీంతో నేతల మధ్య కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం టీడీపీ అభ్యర్థి ఎం. వెంకటరమణ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ తన వెంట పదిమందిని తీసుకుని పోలింగ్ కేంద్రంలోకి వెళ్లారు. కార్యకర్తలను పోలింగ్ కేంద్రంలోకి తీసుకురావడంపై కరుణాకరరెడ్డి ప్రశ్నించారు. పోలీసులు కూడా స్పందించి వెంకటరమణకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అనంతరం రాజీవ్నగర్ పంచాయతీ జీవకోనలోని గురుకృప పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి అభ్యర్థులు ఇద్దరూ వేర్వేరుగా వెళ్లారు. లోపల దాదాపు 30 నిమిషాలు పాటు ఇరువురు అభ్యర్థులు పోలింగ్ను పరిశీలించారు. అదే సమయంలో ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున బయట గుమికూడారు. సత్యనారాయణపురంలో తమ కార్యకర్తలపై దాడి ఎలా చేయిస్తారంటూ స్థానిక టీడీపీ నాయకులు అన్నా రామచంద్రయ్య, అన్నా రామకృష్ణను వైఎస్ఆర్ సీపీ నాయకులు మబ్బు చెంగారెడ్డి, పెంచలయ్య ప్రశ్నించారు. తాము దాడి చేయలేదని, ఎవరని ప్రశ్నించగా వారు పారిపోయారంటూ టీడీపీ నేతలు సమాధానం చెప్పారు. ఈ వ్యవహారంపై మాటామాటా పెరిగి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి తీవ్ర స్థాయిలో వాగ్వాదాలకు దిగారు. ఒక దశలో ఘర్షణకు దిగారు. పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. ఈ విషయం తెలిసి వెంకటరమణను కరుణాకరరెడ్డి నిలదీశారు. ఇలా దాడులు చేయడం తగదన్నారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆయన కరుణాకరరెడ్డిపై చేయి చేసుకున్నారు. అభ్యర్థులు ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసి ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లారు. రెండుపార్టీల కార్యకర్తలు తిరుపతి ఎస్పీ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. పరస్పరం వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు జాగ్రత్తగా వ్యవ హరించారు. చివరకు ఇద్దరినీ విడుదల చేశారు. -
జగన్తోనే బీసీల సంక్షేమం
మైనారిటీలను బీసీల్లో చేర్చింది వైఎస్ఆర్ వైఎస్ఆర్ సీపీలోనే బీసీలకు పెద్దపీట టీటీడీ చైర్మన్గా బలహీనవర్గాలఅభివృద్ధికి కృషిచేశా నాయీబ్రాహ్మణ మహిళలను క్షురకులుగా నియమించా తిరుమల గొల్ల మండపం సంరక్షణకు అన్ని చర్యలు ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తిరుపతి(మంగళం), న్యూస్లైన్: బీసీలకు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేయడం జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డికే సాధ్యమని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. జననేతను సీఎంగా చేసేందుకు బీసీలంతా వైఎస్ఆర్ సీపీకి మద్దతు ఇచ్చి ఓట్లేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. తిరుమల బైపాస్రోడ్డులోని ఓ ప్రరుువేటు కల్యాణ మండపంలో ఆదివారం బీసీ నాయకుడు కట్టా జయరాంయాదవ్ ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ భేరి కార్యక్రమాన్నినిర్వహించారు. ఈ సమావేశానికి నగర పరిధిలోని అన్ని బీసీ వర్గాల నాయకులు, ప్రజలు వేలాదిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి మాట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో బీసీల అభివృద్ధికి ఎంతగా కృషి చేశారో ప్రతి ఒక్కరికి తెలుసునన్నారు. బీసీల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రతి పేదవాడికి లబ్ధి చేకూర్చారని గుర్తు చేశారు. ప్రపంచంలో ఏ నాయకుడు చేయలేని విధంగా పేదల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించిన మహోన్నతి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం రాజశేఖరరెడ్డి మాత్రమేనన్నారు. మహానేత మరణానంతరం సంక్షేమ పథకాలను నీరుగార్చిన దుర్మార్గులు కిరణ్, చంద్రబాబులని మండిపడ్డారు. ఓదార్పుయాత్రను ప్రారంభిస్తే అందుకు అడ్డుతగిలిన రాక్షసి సోనియాగాంధీ అన్నారు. అప్పట్లో మూడున్నర నెలల రాజకీయ అనుభం కూడా లేని జగన్మోహన్రెడ్డి 125 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీతోపాటు సోనియాగాంధీ ఆదేశాలను సైతం ధిక్కరించి మృతుల కుటుంబాలను పరామర్శించి, వారి కష్టాలను తెలుసుకున్న దమ్మున్న నాయకుడు జగన్మోహన్రెడ్డి అన్నారు. బీసీలకు పెద్దపీట జగనన్న పాలనలో బీసీలకు పెద్దపీట వేస్తారని, వారి సంక్షేమానికి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతారని తెలిపారు. టీటీడీ చైర్మన్గా మహిళా క్షురకులను నియమించిన ఘనత తనకే దక్కుతుందన్నారు. 320 మందిని పీస్రేట్ లెక్కన కల్యాణకట్టలో నాయీ బ్రాహ్మణ యువకులకు ఉద్యోగాలు కల్పించానన్నారు. మత్స్యకార గోవిందం, దళితగోవిందం వంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టి బలహీనవర్గాలకు వేంకటేశ్వరస్వామి పూజలను దగ్గర చేశానన్నారు. తాను చైర్మన్గా ఉండగా గొల్లమండపం కొట్టాలని ప్రతిపాదన వస్తే అడ్డుకుని, దాని సంరక్షణకు చర్యలు చేపట్టామన్నారు. భవిష్యత్లో కూడా తిరుమలలోని గొల్లమండపం సంరక్షణకు ఎంతవరకైనా పోరాటం చేస్తానన్నారు. బీసీలు వైఎస్ఆర్ సీపీకి మద్దతు ప్రకటిస్తూ, ఫ్యాను గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని, వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం చేయాలని పిలుపునిచ్చారు. ఎంపీ అభ్యర్థి వరప్రసాద్రావును గెలిపిం చాలని అభ్యర్థించారు. అనంతరం ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ మాట్లాడుతూ చింతామోహన్లాగా ఇళ్లస్థలాలు, పట్టాలు ఇస్తానని మహిళలకు మాయమాటలు చెప్పి మోసం చేయనన్నారు. ఒక ఐఏఎస్ అధికారిగా తనకు ఉన్న అపార అనుభవాన్ని ఉపయోగించి భూమన కరుణాకరరెడ్డి సహకారంతో తిరుపతి నగరాన్ని ఒక సాంస్కృతిక రాజధానిగా చేస్తానన్నారు. వైఎస్ఆర్ సీపీ నాయకులు మబ్బు చెంగారెడ్డి మాట్లాడుతూ గతంలో గంగమ్మగుడి చైర్మన్ పదవికి కట్టా జయరాంయాదవ్ పేరు ప్రతిపాదించి బీసీలకు ప్రాధాన్యత ఇచ్చింది కరుణాకరరెడ్డి అని గుర్తు చేశారు. తొలినుంచి బీసీలు, ఎస్సీలు, ఎస్టీల పక్షపాతిగా పనిచేస్తున్న నాయకుడు, నీతి, నిజాయితీతో ముందుకెళ్తున్న వ్యక్తి కరుణాకరరెడ్డి అని పేర్కొన్నారు. వందమంది బీసీ యువకులు కరుణాకరరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. బీసీ నాయకులు ఎస్కే బాబు, షఫీఅహ్మద్ ఖాద్రీ, పుల్లయ్య, కొమ్ము చెంచయ్యయాదవ్, సాకం ప్రభాకర్, పెంచలయ్య, పార్టీ నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్రెడ్డి, దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, పోతిరెడ్డి వెంకటరెడ్డి, లక్ష్మయ్యయాదవ్, ముద్రనారాయణ, బాబూయాదవ్, బొమ్మగుంట రవి, కన్నయ్య, శివాచారి, గీతాయాదవ్, రత్నమ్మ, రమణమ్మ, లత, లక్ష్మి, పద్మావతమ్మ, అనురాధ పాల్గొన్నారు. వడ్డెర, మొదలియార్, నాయీబ్రాహ్మణ, యాదవ, బోయ, గౌడ, గాండ్ల వంటి 23 బీసీ కులాలకు చెందిన నాయకులు హాజరయ్యూరు. -
అందరికీ ‘సంక్షేమం’ జగన్తోనే సాధ్యం
తిరుపతి(మంగళం), న్యూస్లైన్: ‘ఫ్యాను గుర్తుకు ఓటెయ్యండి.. వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించే సంక్షేమ ఫలాలతో అభివృద్ధి చెందండి’ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్, సినీ నటుడు టీఎస్. విజయ్చందర్ విజ్ఞప్తి చేశారు. తిరుపతి పరిధిలోని చంద్రశేఖర్రెడ్డి కాలనీలో వైఎస్ఆర్ సీపీ నాయకుడు పోతిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ప్రజాబాట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయ్చందర్ మాట్లాడుతూ వైఎస్.జగన్మోహన్రెడ్డి సీఎం కాగానే అందించే సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలూ అభివృద్ధి చెందుతారన్నారు. టీటీడీ చైర్మన్గా ఉండి శ్రీవారి పవిత్రతను ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన మహోన్నత వ్యక్తి భూమన కరుణాకరరెడ్డి అని కొనియాడారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముస్లిం, మైనార్టీలను ఊచకోత కోసిన నరహంతకుడు నరేంద్రమోడి అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు గెలుపుకోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నారన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నరేంద్రమోడి ఎలా చెబితే అలా ఆడే గంగిరెద్దులా మారతాడని, దీంతో ముస్లిం, మైనార్టీలకు పూర్తిగా రక్షణ లేకుండా పోతుందన్నారు. మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కుమ్మక్కు రాజకీయాలతో కిరణ్, చంద్రబాబు నీరుగార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి ఆశయాల కోసం నిరంతరం పాటుపడుతున్న వ్యక్తి ఒక్క వైఎస్. జగన్మోహన్రెడ్డి మాత్రమేనన్నారు. ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం పాటు పడే జగనన్న నాయకత్వం కావాలా? లేదా అధికారం కోసం ఉత్తుత్తి హామీలు ఇచ్చి వంచించే చంద్రబాబునాయుడు కావాలా అన్న విషయాన్ని ఒక్కసారి ప్రజలు ఆలోచించుకుని ఓటేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కమిటీ సహాయ కో-ఆర్డినేటర్ జొన్నల శ్రీనివాసులురెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్రెడ్డి, దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, ఎస్కె. బాబు, కొమ్ము చెంచయ్యయాదవ్, నీలకంఠారెడ్డి, హర్షవర్ధన్, కేతం జయచంద్రారెడ్డి, పుల్లయ్య, అమరనాథరెడ్డి, రామచంద్రారెడ్డి, పాముల రమేష్రెడ్డి, ఎస్కె.చోటా, తాల్లూరి ప్రసాద్, చింతా రమేష్యాదవ్, లోకేష్బాబు, రఫీ, కొండారెడ్డి, రవిచంద్ర, గఫూర్, గీతాయాదవ్, పుణీత, శాంతారెడ్డి, మల్లికమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ఇంకెన్నాళ్లు మోసగిస్తారు..?
చంద్రబాబు మాయమాటలు ప్రజలు నమ్మరు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తిరుపతి (మంగళం), న్యూస్లైన్ : మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు అవిచేస్తా, ఇవి చేస్తానంటూ ఇంకెన్నాళ్లు మోసగిస్తావంటూ చంద్రబాబుపై తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ధ్వజమెత్తారు. తిరుపతి పరిధిలోని పూ లవానిగుంట, గొల్లవానిగుంట, ఆటోనగర్ ప్రాంతాల్లో పార్టీ నాయకులు రాజ గోపాల్రెడ్డి, చల్లా ఆధ్వర్యంలో ఎమ్మె ల్యే ప్రజాబాట నిర్వహించారు. ఈ సందర్భంగా కరుణాకరరెడ్డి మాట్లాడు తూ తొమ్మిదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఆవగింజంత మేలు కూడా చేయలేదని బాబుపై మండిపడ్డా రు. తొమ్మిదేళ్లపాటు చేసిన తప్పులకు ప్రజలు ఆయనను పదేళ్లపాటు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారన్నారు. మహానేత వైఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కిరణ్ కుమార్రెడ్డి నీరుగారుస్తుంటే చంద్రబా బు నోరువిప్పకపోవడం దారుణమన్నా రు. ఐదేళ్ల పాలనలో ప్రపంచంలో ఏ నాయకుడూ చేయలేనన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మహానేత వైఎస్. రాజశేఖరరెడ్డి చేశారని సగర్వం గా చెప్పారు. ఆయన మరణానంతరం తండ్రి ఆశయ సాధనకోసం, పేదల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడుతున్న వ్యక్తి వైఎస్. జగన్మోహన్రెడ్డి అన్నారు. రాబోయే ఎన్నికల్లో జగనన్న ను గెలిపించాలని, అధికారంలోకి రాగా నే పొదుపు సంఘాల్లోని దాదాపు రూ. 20వేల కోట్ల మహిళా రుణాలను మాఫీ చేస్తారని తెలిపారు. అమ్మఒడి పేరుతో బిడ్డలను బడికి పంపించే ప్రతి తల్లిదండ్రులకు నెలకు రూ.500ల చొప్పున ప్ర తి నెలా వారి ఖాతాలో వేస్తామన్నారు. రూ.6వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా పేద విద్యార్థులకు ఉన్న త విద్యను అందిస్తామని హామీ ఇచ్చా రు. వికలాంగులు, వితంతువులు, వృద్ధులకు ప్రతినెలా రూ.700ల నుంచి వెయ్యి రూపాయల వరకు పెన్షన్ ఇప్పిస్తామని, అలాగే రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. అభివృద్ధే లక్ష్యంగా... తిరుపతి నగరం అభివృద్ధికి నిరంతరం కృషి చేసి నగరంలో మురికివాడలే లేకుండా చేస్తానని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి హామీ ఇచ్చారు. తాను ఉపఎన్నికల్లో గెలుపొందినప్పటి నుంచి నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలను పూర్తిగా తెలుసుకుని అనేక సమస్యలు పరిష్కరించానని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో తిరిగి గెలిపిస్తే తిరుపతి నగరాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు వెలగపల్లి వరప్రసాద్, నాయకులు పులుగోరు ప్రభాకర్రెడ్డి, ఆదం రాధాకృష్ణారెడ్డి, ఆదం సుధాకర్రెడ్డి, రామచంద్రారెడ్డి, కుప్పయ్య, కిట్టు, నరిసింహారెడ్డి, శంకర్, రాము, బాబూయాదవ్, నూరుల్లా, మునిరత్నం, పూజారి లక్ష్మి, కావేరి, కవిత పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement