jublie hills police station
-
లేడీ కానిస్టేబుల్ సంధ్య రాణి కేసులో కొత్త ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: వివాహం అయ్యిందని తెలిసే తనను పెళ్లి చేసుకున్న భర్త ప్రస్తుతం వేధిస్తున్నాడని ఏఆర్ కానిస్టేబుల్ సంధ్య రాణి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. సంధ్య రాణిపై ఆమె భర్త చరణ్ తేజ్ కావాలనే దుష్ప్రచారం చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. తనకు వివాహం అయిన సంగతి తెలిసే పెళ్లి చేసుకున్నాడని.. ఆ తర్వాత తనను దూరం పెడుతున్నాడని సంధ్య రాణి జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇక భర్త చరణ్ తేజ్ తనను కులం పేరుతో దూషించి, వేధింపులకు గురి చేస్తున్నట్లు సంధ్య రాణి ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలో పోలీసులు చరణ్ తేజ్పై ఐపీసీ 498ఏ, 506, వరకట్న నిరోధక చట్టంతో పాటు ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇక చరణ్ తేజ్ సంధ్యా రాణికి గతంలోనే రెండు వివాహాలు అయ్యాయని.. ఆ విషయం దాచి తనను పెళ్లి చేసుకుందని ఆరోపించాడు. తనను తీవ్రంగా కొట్టడంతో పాటు తల్లిదండ్రులు, స్నేహితులను కలవనీయకుండా చేస్తోందన్నారు. సంధ్యారాణి కుటుంబం నుంచి తనకు, తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ శంషాబాద్ డీసీపీకి ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశాడు. చదవండి: పెళ్లిచేసుకుని మోసం చేస్తున్నాడు: లేడీ కానిస్టేబుల్ ఫిర్యాదు -
దొంగలు పడ్డారు.. డబ్బులు వదిలేశారు..
హైదరాబాద్: నిర్లక్ష్యం కొన్నిసార్లు వరంగానూ మారుతుందని రుజువైంది. ఓ ఇంట్లో దొంగతనానికి ప్రవేశించిన చోరులు.. మిగతా సామాన్లన్నీ వెదికి.. బీరువాను మాత్రం వదిలేశారు. ఎందుకంటే తాళం చెవులు బీరువాకే ఉంచారు కాబట్టి అందులో విలువైన వస్తువులేవీ ఉండవని వారు భ్రమ పడ్డారు. తీరా దర్యాప్తులో మాత్రం ఆ బీరువాలో ఏకంగా రూ.70 వేల నగదు ఉందని తేలింది! జూబ్లీ హిల్స్ లో చోటుచేసుకున్న ఈ సంఘటన పూర్వాపరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిథిలోకి వచ్చే నందగిరి హిల్స్ లో జర్నలిస్ట్ కాలనీ ఉంది. అక్కడే నివసించే సీనియర్ జర్నలిస్ట్ రవీంద్రనాథ్.. రెండు నెలల కిందట అమెరికా వెళ్లారు. కారు డ్రైవర్ గానేకాక ఇంటి వాచ్ మన్ గానూ పనిచేసే దస్తగిరికి ఇంటి బాధ్యతలు అప్పగించారు. ఇంటి ఆవరణలో దస్తగిరి పడుకునేందుకు కావాల్సిన ఏర్పాటు చేశారు. అలా రవీంద్రనాథ్ కుటుంబం అమెరికా వెళ్లినప్పటి నుంచి ఇంటికి దస్తగిరి కాపలా కాస్తూనే ఉన్నాడు. అయితే రెండు రోజుల కిందట దస్తగిరి అనారోగ్యానికి గురై.. సొంత ఊరికి వెళ్లాడు. ఆదివారం ఉదయం ఎప్పటిలాగే డ్యూటీకి వచ్చిన దస్తగిరి.. ఇంటి కిటికీలు తొలిగించి ఉండటాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంటి యజమాని పేరున్న జర్నలిస్ట్ కావడంతో అప్రమత్తమైన పోలీసులు.. క్రైం, క్లూస్టీం బృందాలను రంగంలోకి దించారు. ఇంటిని క్షుణ్నంగా పరిశీలించిన అనంతరం అమెరికాలో ఉన్న రవీంద్రనాథ్ కు ఫోన్ చేసి ఇంట్లో విలువైన వస్తువులు ఎక్కడున్నాయో తెలుసుకున్నారు. ఆ వివరాల ప్రకారం బెడ్ రూమ్ లోని బీరువాలో రూ. 70 వేల నగదును గుర్తించారు. తాళం చెవులు బీరువాకే ఉండిపోవడంతో దొంగలు పొరబడ్డారని, దర్యాప్తు కొనసాగుతుందని జూబ్లీహిల్స్ పోలీసులు చెప్పారు.