breaking news
JC Rama Rao
-
పాస్పుస్తకాలకు లంచం డిమాండ్
విజయనగరం కంటోన్మెంట్ :పట్టాదారు పాస్పుస్తకాల మంజూరుకు వేపాడ మండల డిప్యూటీ తహశీల్దార్ బెంజుమన్ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని మండలంలోని సింగరాయ గ్రామానికి చెందిన ఆర్. అప్పారావు, తదితరులు జేసీ బి. రామారావుకు ఫిర్యాదు చేశారు. ఎకరానికి ఇంత అని రేటు ఫిక్స్ చేసి డబ్బులు అడుగుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కలెక్టర్ ఎం. ఎం నాయక్ సెలవులో ఉండడంతో జేసీ రామారావు సోమవారం గ్రీవెన్స్సెల్ నిర్వహించారు. 202 వినతులు స్వీకరించి వాటి పరిష్కారినికి చర్యలు తీసకోవాలని సంబంధిత అధికారులను కోరారు. వచ్చిన వాటిలో కొన్ని ఫిర్యాదులు మీ సేవలో డబ్బులు అడుగుతున్నారు నెల్లిమర్ల మండల కేంద్రానికి మంజూరైన మీ సేవా కేంద్రాన్ని గుర్లలో నిర్వహించడంతో పాటు వచ్చిన ప్రతి ఒక్కరి నుంచి అదనంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని నిర్వాహకుడు చింతాడ రాజుపై గుర్ల గ్రామానికి చెందిన మొదిలి వెంకటనాయుడు ఫిర్యాదు చేశారు. ఆధార్, అడంగల్, కుల, ఆదాయ, తదితర ధ్రువపత్రాల కోసం వెళ్లిన వారి నుంచి సాధారణ రుసుముతో పాటు అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నాడని జేసీ దృష్టికి తీసుకువచ్చారు. డబ్బును రికవరీ చేయాలి మక్కువ మండలం ఎం వెంకంపేటలో క్వారీ నిర్వహిస్తున్న మావుడి రంగునాయుడు అనే వ్యక్తికి నాలుగు ఎకరాలకు మాత్రమే అనుమతి ఉండగా 53 ఎకరాల్లో తవ్వకాలు జరిపి విలువైన రాయిని తరలించుకుపోతున్నాడని ఎంపీపీ పి. ఉమ ఫిర్యాదు చేశారు. ఆర్ ఆర్ యాక్టు ప్రకారం రాయితో పాటు డబ్బును రికవరీ చేయడంతో పాటు అతనిపై చర్యలు తీసుకోవాలని ఉమ, తిరుపతి, తదితరులు కోరారు. అమ్మకాలు నిలిపివేయాలి జిల్లా కేంద్రంలోని రింగురోడ్డు రైతుబజార్ పక్కనే ఉన్న రహదారిపై కూడా కూరగాయలు అమ్మడం వల్ల ట్రాఫిక్కు ఇబ్బంది ఏర్పడుతోందని పట్టణానికి చెందిన ఎంఎల్ నారాయణ, తదితరులు వినతి అందించారు. అమ్మకాలను నిలిపివేయాలని కోరారు. పంటలు కలుషితం పూసపాటి రేగ మండలం కందివలస వద్ద ఉన్న మైలాన్ పరిశ్రమ నుంచి వెలువడే వ్యర్థాల వల్ల సమీపంలోని చెరువులు, ఆ నీటితో సాగయే పంట భూములు కలుషితమవుతున్నాయనీ కందివలస గ్రామస్థులు అప్పారావు తదితరులు ఫిర్యాదు చేశారు. ప్రజలు కూడా చర్మవ్యాధులతో ఇబ్బంది పడుతున్నట్లు జేఈ దృష్టికి తీసుకువచ్చారు. పార్వతీపురం : గ్రీవెన్స్సెల్కు వస్తున్న ఫిర్యాదులపై తక్షణమే చర్యలు చేపట్టాలని ఐటీడీఏ ఏపీఓ జె వసంతరావు సిబ్బందిని ఆదేశించారు. ఐటీడీఏ కార్యాలయంలోని పీఓ చాంబరులో గ్రీవెన్స్సెల్ నిర్వహించి అర్జీలు స్వీకరించారు. బాడంగి మండలం పిండ్రంగివలస గ్రామస్తుడు అప్పన్నదొర వ్యవసాయానికి ఆయిల్ ఇంజన్ మంజూరు చేయాలని, సీతానగరం మండలం బక్కుపేట గ్రామానికి చెందిన జి.అప్పారావు గ్రామంలో బోరుబావి ఏర్పాటు చేయాలని, మక్కువ మండలం చెముడు గ్రామానికి చెందిన సిర్లాపు రామకృష్ణ జిరాక్స్ మిషన్ మంజూరు చేయాలని వినతులు అందించారు. గుమ్మలక్ష్మీపురం మండలం బల్లేరు గూడ గ్రామానికి చెందిన టి.భాస్కరరావు గ్రామానికి రహదారి ఏర్పాటు చేయాలని, కురుపాం మండలం పి.లేవిడి గ్రామస్తుడు ఎ.శాంతికుమారి స్మార్ట్కార్డు కావాలని కోరుతూ దరఖాస్తులు అందించారు. గుమ్మలక్ష్మీపురం మండలం మంత్రజోడుకు చెందిన పి. అలాజీ గ్రామానికి రహదారి వేయాలని, పార్వతీపురం మండలం తేలునాయుడువలస గ్రామానికి చెందిన దండాసి సన్యాసిరావు భూ పట్టాలు మంజూరు చేయాలని కోరారు. అలాగే సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏఓ టి.రామకృష్ణ నిర్వహించిన గ్రీవెన్స్లో పలువురు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, పట్టాదారు పాసుపుస్తకాలు కావాలని వినతులు సమర్పించారు. ఐదు ఫిర్యాదుల స్వీకరణ విజయనగరం క్రైం : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నవదీప్సింగ్ గ్రేవాల్ గ్రీవెన్స్సెల్ నిర్వహించి ఐదు ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో స్పెషల్బ్రాంచి సీఐలు వి.లీలారావు, కృష్ణారావు, ఎస్సై కె. రామారావు, తదితరులు పాల్గొన్నారు. కొన్ని ఫిర్యాదులు విజయనగరం పట్టణంలోని ఎస్వీఎన్ నగర్కు చెందిన ఎం.గీత ఎస్పీతో మాట్లాడుతూ, తన కుమారుడు సందీప్ మెరైన్ ఇంజనీరింగ్ పూర్తిచేసి ఉద్యోగం కోసంప్రయత్నం చేస్తుండగా, మీరట్కు చెందిన కులదీప్కుమార్ సింగపూర్లో మెరైన్షిప్పింగ్లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 3,11,000 రూపాయలు తీసుకుని మోసం చేశాడని ఫిర్యాదు చేసింది. మూడు సంవత్సరాలుగా తన భర్త కానిస్టేబుల్ ఎం. ప్రసాద్ తనను వేధిస్తున్నట్లు మెంటాడ మండలం తమ్మిరాజుపేట గ్రామానికి చెందిన ఎం.సరోజిని ఫిర్యాదు చేసింది. తన భార్య ఎల్లమ్మ ప్రతినెలా రూ.50 చొప్పున డ్వాక్రా సంఘానికి చెల్లించినప్పటికీ ఆర్. సన్యాసిరావు అనే వ్యక్తి ఆ సొమ్మును దుర్వినియోగం చేసినట్లు నెల్లిమర్ల మండలం సారిపల్లి గ్రామానికి చెందిన ఆర్.సూర్యనారాయణ ఫిర్యాదు చేశారు. -
వలసకు వెళితే..భూమి కబ్జా చేశారు..
విజయనగరం కంటోన్మెంట్ :కుటుంబ పోషణ కోసం ఇతర ప్రాంతాలకు వలసపోతే తన భూమిని కబ్జా చేశారని ఎల్.కోట మండలం కొట్యాడ గ్రామానికి చెందిన ఎద్దు కృష్ణమ్మ సోమవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్సెల్లో ఫిర్యాదు చేసింది. గ్రామానికి చెందిన కొట్యాడ అప్పలనరసయ్య తన భూమిని ఆక్రమించుకున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరింది. కలెక్టర్ ముదావత్ ఎం. నాయక్ సెలవులో ఉండడంతో గ్రీవెన్స్సెల్ను జేసీ రామారావు నిర్వహించారు. ఈ సందర్భంగా 250 వినతులు స్వీకరించి వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వచ్చిన వాటిలో కొన్ని ఫిర్యాదులు మున్సిపల్ స్థలాలు ఆక్రమించుకున్నారు బూర్లిపేటలోని మున్సిపల్ స్థలాలను కొంతమంది ఆక్రమించుకుని షాపులు నిర్మించుకున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని మాజీ కౌన్సిలర్ బలరాంసింగ్ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. 38వ వార్డులోని ప్రభుత్వ స్థలంలో కొంతమంది ఐదు షాపులు నిర్మించారని, ఈ విషయాన్ని పలుమార్లు అధికారులకు తెలియజేసినా ఫలితం లేకపోయిందన్నారు. ఇప్పటికైనా ఆక్రమణదారులను శిక్షించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. పాఠశాల స్థలం కబ్జా భోగాపురం మండలం ముంజేరు పంచాయతీ రెల్లిపేటలో ప్రభుత్వ పాఠశాలకు కేటాయించిన స్థలాన్ని సకల రాజారావు కబ్జా చేశారని గ్రామానికి చెందిన డి శ్రీను, ధనాల సోమయ్య, రమణ, అప్పారావు, సన్యాసి, నర్సింగరావు, రాము, తదితరులు ఫిర్యాదు చేశారు. రెగ్యులర్ చేయాలి ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలల్లోని సోషల్, పీఈటీ, ఎస్జీటీ, తదితర పోస్టులను వెంటనే రెగ్యులర్ చేయాలని ప్రభుత్వ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు జి అప్పలసూరి డిమాండ్ చేశారు. ఈ మేరకు అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు. ూ ఎంపీటీసీ మాజీ సభ్యుడు భూమిని ఆక్రమించుకున్నాడు గరివిడి మండలం మందిరివలసలో పోరంబోకు భూమిలో జీడి తోటలు వేసుకుంటే పక్క గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు తాళ్లవలస ఆదినారాయణ భూమిని ఆక్రమించుకున్నాడని గ్రామానికి చెందిన రేజేటి లక్ష్మి, టెక్కలి లక్ష్మి, సుక్క లక్ష్మి, తదితర మహిళలు ఫిర్యాదు చేశారు. దీనికి జేసీ రామారావు స్పందిస్తూ సమస్య పరిష్కరించాలని ఆర్డీఓ జెక వెంకటరావుకు ఫోన్ చేసి ఆదేశించారు. వినతుల వెల్లువ పార్వతీపురం : సబ్ కలెక్టర్, ఐటీడీఏ కార్యాలయాల్లో నిర్వహించిన గ్రీవెన్స్సెల్కు వినతులు వెల్లువెత్తాయి. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎల్విన్పేట స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ టి.సీతారామ్మూర్తి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా గంగాపురానికి చెందిన తిరుపతిరావు అన్నింటికీ ఆధార్ అనుసంధానం చేయడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారని, ముందు అందరికీ ఆధార్ కార్డులందేలా చూడాలని కోరారు. అలాగే గుమ్మలక్ష్మీపురం మండలంలో పనిచేస్తున్న జీసీసీ నిర్వాహకుడు మిన్నారావును తొలగించాలని మండల కేంద్రానికి చెందిన పలువురు ఫిర్యాదు చేశారు. పదేళ్లుగా సాగు చేస్తున్న బంజరుభూమికి పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ మంజూరు చేయాలని కురుపాం మండలం జి.శివడకు చెందిన ఆరిక జగ్గన్న వినతిపత్రం సమర్పించారు. అలాగే ఐటీడీఏ కార్యాలయంలో ఏపీఓ వసంతరావు నిర్వహించిన గ్రీవెన్స్సెల్లో జియ్యమ్మవలస మండలం చాపరాయగూడకు చెందిన గ్రామస్తులు మంచినీటి ట్యాంకు నిర్మించాలని కోరారు. కురుపాం మం డలం పి.లేవిడికి చెందిన బి. చిన్నమ్మలు, తదితర 22 మంది తమకుసాగు చేసుకునేందుకు భూ మి మంజూరు చేయాలని కోరారు. మక్కువ మండలంలోని బం టుమక్కువకు చెందిన డి. గురవందొర, గుమ్మలక్ష్మీపురం మండలం మిరయగూడకు చెందిన బిడ్డిక లక్కోజులు తమ భూములను గిరజనేతరులు ఆక్రమించారని ఫిర్యాదు చేశారు. సమస్యలన్నీ విన్న అధికారులు పరి ష్కరించడానికిచర్యలు తీసుకుంటామన్నారు.