breaking news
jabir
-
జబీర్ ముందంజ
దోహా: ప్రతిష్టాత్మక ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ను భారత్ కాస్త ఆశాజనకంగా ప్రారంభించింది. ఈ మెగా టోర్నీ ప్రారంభ ఈవెంట్ లాంగ్జంప్లో భారత ఆశాకిరణం శ్రీ శంకర్ మురళీ నిరాశపరిచినా... 400మీ. హర్డిల్స్లో మదారి పిళ్లై జబీర్ ముందంజ వేశాడు. పోటీల తొలిరోజు శుక్రవారం 400మీ. హర్డిల్స్ తొలి హీట్స్లో పాల్గొన్న జబీర్ మూడో స్థానంలో నిలిచి సెమీఫైనల్కు అర్హత సాధించాడు. అతను 49.62 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తిచేశాడు. ఇదే ఈవెంట్లో పాల్గొన్న మరో భారత ఆటగాడు ధరుణ్ అయ్యసామి హీట్స్లోనే వెనుదిరిగాడు. ధరుణ్ 50.93 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకొని... ఎనిమిది మంది పాల్గొన్న హీట్స్లో ఆరో స్థానంలో నిలిచాడు. తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన వారు మాత్రమే సెమీస్కు అర్హత పొందుతారు. మరోవైపు లాంగ్జంప్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన ఏకైక ఆటగాడు శ్రీ శంకర్ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు. 20 ఏళ్ల ఈ యువ లాంగ్ జంపర్ క్వాలిఫయింగ్ ఈవెంట్లో అత్యుత్తమంగా కేవలం 7.62 మీ. మాత్రమే జంప్ చేశాడు 27 మంది పాల్గొన్న ఈ పోటీల్లో 22వ స్థానంలో నిలిచాడు. తొలి ప్రయత్నంలో 7.52మీ. జంప్ చేసిన అతను రెండో ప్రయత్నంలో కాస్త మెరుగ్గా 7.62మీ. నమోదు చేశాడు. చివరిదైన మూడో ప్రయత్నంలో ఫౌల్గా వెనుదిరిగాడు. ఫైనల్కు అర్హత సాధించాలంటే టాప్–12లో స్థానం దక్కించుకోవాల్సి ఉంటుంది. లేదా నిర్దేశిత ప్రమాణం 8.15మీ. జంప్ చేయాలి. శంకర్ పేలవ ప్రదర్శనతో పోటీల నుంచి ని్రష్కమించాడు. నేడు జరిగే పోటీల్లో భారత్ నుంచి 100మీ. మహిళల హీట్స్లో ద్యుతీచంద్, పురుషుల 400మీ. హర్డిల్స్ సెమీఫైనల్లో జబీర్... పురుషుల 4గీ400మీ. మిక్స్డ్ రిలే ఈవెంట్లో భారత జట్టు బరిలో దిగుతుంది. -
బస్సు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
బాలానగర్ (హైదరాబాద్): నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం జరిగింది. సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్కు చెందిన జబీర్ అనే వ్యక్తి బాలానగర్ ఐడీపీఎల్ టౌన్షిప్లో టూత్పేస్ట్లు అమ్ముకొని బస్సు ఎక్కేందుకు రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో జీడిమెట్ల నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు జబీర్ను ఢీకొంది. దీంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం జబీర్ను గాంధీ ఆస్పత్రికి తరలించారు.