-
పిండేస్తున్నారు..!
పిల్లల ఉన్నత చదువులు.. ఆడపిల్ల పెళ్లి... కుటుంబ సభ్యుల వైద్య ఖర్చుల కోసం సామాన్యులు డబ్బు కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. వచ్చిన వారి అవసరాన్ని ఆసరాగా తీసుకుంటున్న వడ్డీ వ్యాపారులు మీటరు వడ్డీ, బారు వడ్డీ, చక్రవడ్డీ పేరిట అడ్డంగా దోచేస్తున్నారు. ప్రామిసరీ నోట్లు, ఏటీఎం కార్డులు, బ్యాంకు ఖాళీ చెక్కులు తీసుకుని నగదు ఇస్తున్నారు. ఆపై రోజువారీ, వారం, నెలవారీ వడ్డీ అంటూ ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. వడ్డీ చెల్లింపులో ఏమాత్రం జాప్యం జరిగినా వేధింపులకు దిగుతున్నారు. ఒక్క నరసరావుపేట పట్టణంలో వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక రెండు నెలల వ్యవధిలో ముగ్గురు బలవన్మరణాలకు పాల్పడ్డారు. సాక్షి, గుంటూరు : జిల్లాలో వడ్డీ వ్యాపారులు కాలసర్పాలుగా మారి బుసలు కొడుతున్నారు. అత్యవసరంగా నగదు అవసరమై వచ్చిన వారి నిస్సహాయతను ఆసరా చేసుకొని వడ్డీ మీద వడ్డీ వేస్తూ వారి శ్రమను జలగల్లా పీల్చుకుంటున్నారు. మీటర్ వడ్డీ, బారువడ్డీ, చక్రవడ్డీ అంటూ అప్పు ఇచ్చి, రోజువారీ, వారం, నెలవారీ వడ్డీల పేరుతో సంవత్సరాలు, నెలలు తరబడి వసూలు చేస్తున్నారు. వడ్డీ అసలును మించినా బాకీ తీరలేదంటూ బెదిరిస్తున్నారు. అదేమని ప్రశ్నిస్తే ఇప్పటి వరకు చెల్లించింది వడ్డీకే చాల్లేదంటూ దాడులకు దిగుతున్నారు. నరసరావుపేటలో వడ్డీ వ్యాపారుల వేధిం పులు తాళలేక రెండు నెలల్లో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. వడ్డీ వ్యాపారులల ఆగడాలు మితిమీడంతో బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. పోలీస్స్టేషన్లలోనే పంచాయితీలు జిల్లాలో కొందరు వడ్డీ వ్యాపారులు పోలీస్ స్టేషన్లలో పోలీసులతోనే పంచాయితీలు చేయిస్తూ తమకు రావాల్సిన బాకీలను వసూలు చేసుకుంన్నారు. గుంటూరులోని ఫ్రూట్ మార్కెట్లో ఇప్పటికీ రోజు వారీ వడ్డీలు బహిరంగంగానే కొనసాగుతుండటం మీటరు వడ్డీ వ్యాపారుల దందాకు నిదర్శనం. తెనాలి, నరసరావుపేట కూరగాయల మార్కెట్లు, మాచర్ల, బాపట్ల, సత్తెనపల్లి, పిడుగురాళ్ల సహా వివిధ ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారం మూగు ప్రామిసరీ నోట్లు.. ఆరు ఖాళీ చెక్కులు అన్న చందంగా విచ్చలవిడిగా సాగుతోంది. కోర్టు కేసుల పేరిట వేధింపులు అప్పుకోసం తమ వద్దకు వచ్చే వారి వద్ద వడ్డీవ్యాపారులు బ్యాంక్ ఖాళీ చెక్కులు, ఏటీఎం కార్డులు తీసుకుని ప్రామిసరీ నోట్ల మీద సంతకాలు చేయించుకుంటారు. డబ్బు ఇచ్చే సమయంలో రూ.100కు రూ.10 నుంచి రూ.20 తగ్గించి మిగిలిన డబ్బును అప్పుగా ఇస్తున్నారు. వడ్డీ మాత్రం వంద రూపాయలకు వసూలు చేస్తున్నారు. కొంతమంది నిస్సహాయ స్థితిలో భవనాలు, భూములు, నగలు, ఇళ్లను తనఖా పెడుతున్నారు. వారు వడ్డీ చెల్లించడంలో ఆలస్యమైతే వడ్డీ వ్యాపారులు ఆయా ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నారు. రుణగ్రహీత వడ్డీ చెల్లించడం ఆలస్యమయినా, అక్రమంగా వసూలు చేస్తున్న వడ్డీ గురించి ప్రశ్నించినా అప్పు ఇచ్చిన సమయంలో తీసుకున్న ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లు ఆధారంగా ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ మొత్తం రాసుకుని కోర్టుల్లో చెక్బౌన్స్ కేసులు వేస్తామని, జైల్లో వేయిస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. వడ్డీవ్యాపారుల్లో చాలా మంది అనుమతులు లేనివారే కావడం గమనార్హం. ఇటీవల గుంటూరు కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బడా వడ్డీ వ్యాపారిని పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి భారీ స్థాయిలో ప్రామిసరీ నోట్లు, ఏటీఎం కార్డులు, బ్యాంకు పాస్ బుక్కులు పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనతో వడ్డీ వ్యాపారులు మరింత జాగ్రత్త పడుతున్నారు. ప్రాంసరీ నోట్లు, ఖాళీ చెక్కులు, ఏటీఎంలు తమ నివాసాల్లో ఉంచుకోవడం లేదు. తెలిసినవారు, స్నేహితులు, బంధువుల ఇళ్లలో ఉంచుతున్నారు. వడ్డీ వసూలు చేసేది ఇలా.. రూ.లక్ష తీసుకుంటే నాలుగు నుంచి పది రూపాలయ వరకూ వడ్డీ వసూలు చేస్తారు. నెలనెలా కొంత మొత్తాన్ని అసలు కింద జమచేసేలా ఒప్పందం కుదుర్చుకుంటారు. రుణగ్రహీత నెలనెలా అసలు కింద సొమ్ము జమ చేస్తున్నా వడ్డీ మాత్రం చివరి నెల వరకూ రూ.లక్షకే వసూలు చేస్తారు. ఈ లెక్కన రుణగ్రహీత తీసుకున్న సొమ్ముతో సమానంగా వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. కఠిన చర్యలు తీసుకుంటాం.. వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీలు వసూలు చేయకూడదు. ఎవరినీ వేధింపులకు గురిచేయకూడదు. అధికవడ్డీ, వేధింపులపై బా«ధితులు ఫిర్యాదు చేస్తే సంబంధిత వడ్డీ వ్యాపారులపై కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం. వడ్డీ పేరుతో సామాన్యులను పీక్కుతింటున్న వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వడ్డీ వ్యాపారుల ఆగడాలకు చెక్ పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – పీహెచ్డీ రామకృష్ణ, అర్బన్ జిల్లా ఎస్పీ పోలీసులను ఆశ్రయించాలి వడ్డీ వ్యాపారస్తులు వేధింపులకు పాల్పడితే బాధితులు స్థానిక పోలీస్లను ఆశ్రయించాలి. వడ్డీ వ్యాపారుల వేధింపులకు భయపడి ఆత్మహత్యలకు పాల్పడటం, ఊరు వదిలి వెళ్లిపోవడం వంటి చర్యలకు పాల్పడొద్దు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు బాధితుల కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. పోలీసులను ఆశ్రయించి రక్షణ పొందాలి. – ఆర్. జయలక్ష్మి, రూరల్ జిల్లా ఎస్పీ -
‘సహకారం’పై... వడ్డీ రాయితీల దెబ్బ
అమలాపురం టౌన్ : క్షేత్రస్థాయిలో కీలకమైన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతోంది. ఒకప్పుడు లాభాలు, నిల్వలతో ఉన్న సంఘాలు ఇప్పుడు నష్టాల అంచులపై వేలాడుతున్నాయి. జిల్లాలోని 297 సహకార సంఘాల్లో ఏ సంఘం రికార్డులు పరిశీలించినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వడ్డీ రాయితీల నిధులు జమ కాకపోవడంతో సంఘాల ఆర్థిక ఉనికికి ప్రమాదం వాటిల్లే పరిస్థితులు ఏర్పడ్డాయి. రైతులకు సహకార సంఘాల ద్వారా ఇచ్చే పలు రకాలు రుణాలను సకాలంలో చెల్లిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొంత శాతాలతో వడ్డీ రాయితీలు ఇవ్వటం గత మూడు దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోంది. గత మూడు సంవత్సరాలుగా సంఘాలకు ప్రభుత్వాలు వడ్డీ రాయితీలకు సంబంధించిన నిధులు జమ చేయకపోవటంతో ఆర్థిక ఒడుదొడుకులు ప్రారంభమయ్యాయి. ఏడాది కిందటి వరకూ రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ నిల్వలతో ఉన్న సంఘాలు ఇప్పుడు ఇ¯ŒS బ్యాలె¯Œ్సలో పడిపోతున్నాయి. ఆ రూ.90 కోట్లు జమైతేనే సంఘాలకు జీవం... జిల్లాలో సహకార సంఘాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీర్ఘ కాలిక, స్వల్ప కాలికంగా ఇస్తున్న వడ్డీ రాయితీల బకాయిలు గత మూడేళ్ల నుంచి దాదాపు రూ.90 కోట్లు పేరుకుపోయింది. ఒక్కో సంఘానికి రుణ బట్వాడాల స్థాయిని బట్టి రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ ఈ రాయితీల రూపేణా జమ కావాల్సి ఉంది. ఈ రూ.90 కోట్లు ప్రభుత్వాలు జమ చేస్తేనే సంఘాలు మనుగడ సాగించే అవకాశం ఉంది. 2016 సంవత్సరానికి దీర్ఘ కాలిక రుణాలపై ఇచ్చిన 6 శాతం వడ్డీ రాయితీ నిధులు దాదాపు రూ.15 కోట్ల వరకూ జమ కావాల్సి ఉంది. స్వల్పకాలిక రుణాలపై ఇస్తున్న 0 శాతం వడ్డీ రాయితీ అంటే రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఇచ్చే 4 శాతం రాయితీ 2103 నుంచి విడుదల కావల్సి ఉండగా...కేంద్ర ప్రభుత్వ వాటాగా ఇచ్చే 3 శాతం రాయితీ 2014 నుంచి రావాల్సి ఉంది. 0 శాతం వడ్డీ రాయితీ దాదాపు రూ.75 కోట్ల మేర పేరుకుపోయింది. 0 శాతం వడ్డీ వర్తింపునకు ప్రభుత్వం ప్రతి ఏటా ఓ జీవో విడుదల చేస్తుంది. 2015–16 సంవత్సరానికి ఆ జీవో విడుదల చేయకపోవటం గమనార్హం. ఈ పరిణామాన్ని గమనిస్తుంటే భవిష్యత్తులో 0 శాతం వడ్డీకి మంగళం పాడే అవకాశాలున్నాయనే అనుమానాన్ని బలపరుస్తోంది. కొన్ని వైఫల్యాలూ కారణమే... సహకార సంఘాలను పూర్తి కంప్యూటరీకరణ చేసి వాణిజ్య బ్యాంకుల మాదిరిగా వేగవంతంగా ఆ¯ŒSలై¯ŒS సేవలు చేయాలని జిల్లా సహకార శాఖ విశ్వ ప్రయత్నం చేస్తోంది. అయితే దీన్ని అందిపుచ్చుకోలేకపోతున్నాయి. రైతుల నుంచి రుణాలు జమైన వెంటనే ఆ సమాచారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ¯ŒSలై¯ŒSలో తక్షణమే వాణిజ్య బ్యాంకులు చేర్చుతాయి. సహకార సంఘాల్లో మాన్యువల్ విధానంలో రుణాలు జమవుతున్నా ఆ సమాచారం ప్రభుత్వాలకు అందటంలో జాప్యం జరుగుతోంది. అందుకే సంఘాలకు వడ్డీ రాయితీల నిధులు సకాలంతో జమ కావటం లేదని సహకార అధికారులు అంటున్నారు. ఆ¯ŒSలై¯ŒS లేదన్న సాకుతో రాయితీల నిధలు ఇవ్వకపోవటం అన్యాయమేమని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాల్లోన్నైనా జిల్లాలో సహకార రంగాన్ని ఆప్కాబ్, డీసీసీబీలు సానుకూలతతో చర్యలు చేపట్టాలని రైతు ప్రతినిధులు సూచిస్తున్నారు. డీసీసీబీ మహా జనసభలో ప్రస్తావన... సంఘాలకు వడ్డీ రాయితీల నిధులు జమకాని వైనంపై ఈ నెల మూడో తేదీన కాకినాడ డీసీసీబీ కార్యాలయంలో జరిగిన జన మహాసభలో జిల్లాలోని వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షులు ప్రస్తావించారు. కిరణ్కుమార్ రెడ్డి ప్రభుత్వంలో 0 వడ్డీకి విడుదలైన జీవో 270, ఆ తరువాత సరవణ జీవోతో సంఘాలకు వడ్డీ రాయితీలపరంగా ఇబ్బందులు లేవని..గత మూడేళ్లుగా కొర్రీ పెట్టడంతో సంఘాల మనగడ అగమ్య గోచరంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగైతే సంఘాలను నడపలేం... వడ్డీ రాయితీల నిధులు ప్రభుత్వాలు జమ చేయకపోతే సంఘాలను నడపలేం. ఇప్పటికే మా కోన సీమలోని 116 సంఘాల్లో 70 శాతం సంఘాలు ఆర్థిక నిల్వల పరంగా అ¯ŒS బ్యాలె¯Œ్సలో పడి సంఘాల మనుగడ ప్రశ్నార్ధకయ్యేలా మారాయి. అమలాపురం మండలంలో ఎ.వేమరం, సాకుర్రు, ఇందుపల్లి వంటి సంఘాల పరిస్థితి మరీ దుర్భరంగా ఉంది. రావాలి్సన వడ్డీ రాయితీల నిధులు జమ చేస్తేనే సహకార సంఘాల వ్యవస్థ కొనసాగుతుంది. – గోకరకొండ విజయ రామారావు, అధ్యక్షుడు, కోనసీమ సహకార సంఘాల అధ్యక్షుల సమాఖ్య
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూపురేఖలు మారాయి
అగ్రి ల్యాబ్ ఎంతో ప్రయోజనం
● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు ● వెల్లివిరుస్తున్న ప్రభుత్వ భవనాలు ● నాడు–నేడుతో సమూలంగా మారిన సర్కారు బడులు ● ఇళ్లు కాదు.. ఊళ్లుగా వెలిసిన జగనన్న కాలనీలు ● అబ్బో..! ఎటు చూసినా నయా మెరుగులే!
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
రేపు, ఎల్లుండి కూడా పోస్టల్ బ్యాలెట్
రోబోటిక్ టెక్నాలజీతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
అబ్బో.. ఆ యువ నాయకుడితో ఎట్టా ఏగేది?
బూటకాల ‘బాబు’
వైఎస్సార్సీపీ జోష్
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement