breaking news
INTEX Mobile
-
ఇంటెక్స్ కొత్తఫోన్ని లాంచ్ చేసిన మహేష్
-
భారత్లో తొలి ‘ఆక్టా-కోర్’ మొబైల్
న్యూఢిల్లీ: ఇంటెక్స్ కంపెనీ ఆక్టా-కోర్ ప్రాసెసర్తో రూపొందించిన తొలి మొబైల్ ఫోన్.. ‘ఆక్వా ఆక్టా’ను గురువారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ ధర రూ.19,999 అని ఇంటెక్స్ టెక్నాలజీస్ బిజినెస్ హెడ్ (మొబైల్) సంజయ్ కుమార్ కలిరోణ చెప్పారు. మీడియా టెక్ అందించిన ప్రాసెసర్తో ఈ ఫోన్ను రూపొందించామని పేర్కొన్నారు. ఈ ప్రాసెసర్ అత్యధిక వేగం(1.7 గిగాహెర్ట్జ్)తో పనిచేస్తుందని, వీడియో, గేమింగ్లను అత్యధిక స్పీడ్తో యాక్సెస్ చేయవచ్చని వివరించారు. ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టమ్పై పనిచేసే ఈ డ్యుయల్ సిమ్ (జీఎస్ఎం, సీడీఎంఏ)ఫోన్లో ఆరు అంగుళాల హెచ్డీ డిస్ప్లే, 13 మెగా పిక్సెల్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 2 ఎంబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, 5 జీబీ క్లౌడ్ మెమరీ వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. గత ఏడాది ఆక్వా సిరీస్లో ఎనిమిది మోడళ్లను మార్కెట్లోకి తెచ్చామని సంజయ్ వివరించారు. -
మార్కెట్లోకి ఇంటెక్స్ మొబైల్ ఫోన్లు
హైదరాబాద్: ఇంటెక్స్ మొబైల్స్ కంపెనీ రెండు మొబైల్ ఫోన్లను మార్కెట్లోకి తెచ్చింది. 5 అంగుళాల స్క్రీన్ ఉన్న ఆక్వా ఐ-7లో డ్యుయల్ కెమెరా(13 ఎంపీ, 5 ఎంపీ), 32జీబీ ఇంటర్నల్ మెమెరీ, 3జీ వీడియో కాలింగ్ వంటి ఫీచర్లున్న ఈ ఫోన్ కొనుగోలు చేస్తే రూ. 5,500 వాల్యూపాక్(2.1 బ్లూటూత్ స్పీకర్) ఉచితమని కంపెనీ పేర్కొంది. ఇక ఆక్వా హెచ్డీ ఫోన్లో 4.7 అంగుళాల స్క్రీన్, డ్యుయల్ కెమెరా(13 ఎంపీ, 5 ఎంపీ), 4 జీబీ ఇంటర్నల్ మెమెరీ, 3జీ వీడియో కాలింగ్ ఉన్న ఈ ఫోన్ను కొనుగోలు చేస్తే ఫర్హాన్ ఆటోగ్రాఫ్ చేసిన పెన్, కీ చెయిన్ సెట్ ఉచితమని పేర్కొంది. ఈ ఉచిత ఆఫర్లు పరిమిత కాలం వరకేనని వివరించింది.