breaking news
inteligent
-
Monkey Day: అడవులను సృష్టించే ‘కోతి చేష్టలు
కోతులు.. అత్యంత తెలివైన జంతువులు.. వాటికి జీవవైవిధ్యంలో, మానవ సంస్కృతిలో ప్రత్యేకమైన స్థానం ఉంది. సుమారు 60 మిలియన్ సంవత్సరాల క్రితం ఉద్భవించిన కోతులు భూమిపై గల అత్యంత ముఖ్యమైన జంతు సమూహాలలో ఒకటి. అరణ్యాలలో పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో, విత్తనాలను వెదజల్లే ఏజెంట్లుగా అవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. కోతులు ప్రపంచంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. అందుకే ప్రతి సంవత్సరం డిసెంబర్ 14న కోతుల దినోత్సవం (Monkey Day) జరుపుకుంటారు. సరదాగా మొదలై..కోతుల దినోత్సవం అనేది కేవలం కోతులను మాత్రమే కాకుండా, చింపాంజీలు, గొరిల్లాలు, ఒరంగుటాన్లతో సహా అన్ని రకాల సిమియన్లను (ప్రైమేట్లను) గుర్తుచేస్తుంది. మానవ కుటుంబ వృక్షంలో ప్రైమేట్స్ ఒక భాగం. సుమారు 60 మిలియన్ సంవత్సరాల క్రితం ఉద్భవించిన ఈ జాతుల పట్ల మనకున్న ప్రేమను, గౌరవాన్ని తెలియజేయడానికి ఈ రోజు మనకు ఒక అవకాశం కల్పిస్తుంది. మొదట్లో సరదాగా ప్రారంభమైన ఈ దినోత్సవం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించే వార్షికోత్సవంగా మారింది.కేలండర్లో సరదాగా రాయగానే..ఈ ప్రత్యేక దినోత్సవ ఆవిర్భావం 2000లో జరిగింది. మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీకి చెందిన కాసే సారో, ఎరిక్ మిల్లికిన్ అనే విద్యార్థులు ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు. డిసెంబర్ నెలలో సెలవు రోజులను వెదుకుతూ వారు క్యాలెండర్లో 14వ తేదీన మంకీ డే అని రాశారు. ఈ విషయాన్ని వారు తోటి స్నేహితులకు తెలిపారు. దీంతో వారంతా కోతుల తరహా ప్రత్యేక దుస్తులు ధరించి, గెంతుతూ ఉల్లాసంగా గడిపారు. ఈ విధంగా వినోదంగా మొదలైన ఈ దినోత్సం నేడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది.మంకీ డే నాడే ‘కింగ్ కాంగ్’ విడుదలసారో, మిల్లికిన్ ఈ దినోత్సవం సందర్భంగా కొన్ని కళాకృతులు తయారుచేశారు. వీటిని ఆన్లైన్లో ప్రచురించడం ద్వారా ‘మంకీ డే’ భావన ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడానికి దారితీసింది. పీటర్ జాక్సన్ తీసిన ‘కింగ్ కాంగ్’(2005) మంకీ డే ఐదవ వార్షికోత్సవం సందర్భంగా విడుదలైంది. ఇది మంకీడే ప్రాముఖ్యతను మరింతగా పెంచింది. మొదట సరదాగా ప్రారంభమైన మంకీ డే ఇప్పుడు పూర్తి స్థాయి ప్రపంచ ఆపరేషన్గా రూపాంతరం చెందింది. నేషనల్ జియోగ్రాఫిక్, స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్, గ్రీన్పీస్ వంటి సంస్థలు ఈ రోజున కోతులు ఎదుర్కొంటున్న ముప్పుపై అవగాహన కల్పిస్తున్నాయి. (Facts About Monkeys In Telugu)కోతులలో సుమారు 260 జాతులు ఉండగా, వాటిలోని పలు రకాలు అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. బార్బరీ మకాక్ల జనాభా గత 24 ఏళ్లలో 50 శాతానికి తగ్గింది. మంకీ డే అనేది కేవలం ఉల్లాసానికి మాత్రమే కాకుండా, కోతులు ఎదుర్కొంటున్న సవాళ్లపై అవగాహన కలిగించేందుకు కూడా దోహపదపడుతుంది.కోతులు.. 10 అద్భుత విషయాలువిభిన్న జాతులు (Diversity): ప్రపంచవ్యాప్తంగా సుమారు 260కి పైగా రకాల కోతి జాతులు ఉన్నాయి. వీటిని ప్రధానంగా ‘పాత ప్రపంచ కోతులు’ (ఆఫ్రికా, ఆసియా), ‘కొత్త ప్రపంచ కోతులు’ (దక్షిణ, మధ్య అమెరికా)గా విభజిస్తారు.తోక ప్రాముఖ్యత (Prehensile Tails): కొత్త ప్రపంచ కోతులు (ఉదాహరణకు సాలీడు కోతులు) కొన్నిటికి ప్రత్యేకమైన తోకలు ఉంటాయి. ఇవి చెట్ల కొమ్మలను పట్టుకోవడానికి లేదా ఆహారాన్ని తీసుకునేందుకు ఒక అవయవంలా పనిచేస్తాయి.సమాజ జీవనం (Social Lives): కోతులు అత్యంత సామాజిక జీవులు. అవి సమూహాలుగా (ట్రూప్స్) జీవిస్తాయి. కొన్నిచోట్ల వందల కోతులు కలిసివుంటాయి. ఈ సమూహాలలో వాటి మధ్య బంధాలు ఉంటాయి.శుభ్రం చేసుకోవడం (Grooming): కోతులు తమ సమూహంలోని ఇతర కోతులను శుభ్రం చేస్తుంటాయి. ఇది వాటి సామాజిక బంధాలను, పరస్పర నమ్మకాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది.బుద్ధి కుశలత (Intelligence): కోతులు చాలా తెలివైనవి. అవి సమస్యలను పరిష్కరించుకుంటాయి. వివిధ పరికరాలను ఉపయోగించగలవు. ఉదాహరణకు పండ్లను, కాయలను ముక్కలు చేసేందుకు రాళ్లను వినియోగిస్తాయి.వివిధ రకాల ఆహారం (Varied Diet): కోతులు సాధారణంగా పండ్లు, ఆకులు, పువ్వులు, కీటకాలు చిన్న జంతువులను తినే సర్వభక్షకాలు (Omnivores). వాటి ఆహారం జాతిని బట్టి, అవి నివసించే ప్రాంతం ప్రకారం మారుతుంటుంది.ప్రత్యేకమైన కమ్యూనికేషన్ (Unique Communication): కోతులు వివిధ రకాల శబ్దాలు, ముఖ కవళికలు, శరీర భాష ద్వారా ఒకదానితో ఒకటి సంభాషించుకుంటాయి. ప్రమాదాన్ని సూచించడానికి లేదా ఆహారం గురించి తెలియజేయడానికి ప్రతి జాతికి ప్రత్యేకమైన అరుపులు ఉంటాయి.చిన్న కోతి (Pygmy Marmoset): పిగ్మీ మార్మోసెట్ అనేది ప్రపంచంలోనే అత్యంత చిన్న కోతి జాతి. ఇది కేవలం 5-6 అంగుళాల పొడవు మాత్రమే ఉంటుంది. 100 గ్రాముల కంటే తక్కువ బరువు ఉంటుంది.నిద్రించే విధానం (Sleeping Habits): చాలా కోతులు చెట్లపై నిద్రిస్తాయి. మాంసాహార జీవుల నుంచి సంరక్షణకే అవి అలా చేస్తుంటాయి. కొన్ని కోతులు నిద్రించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసుకుంటాయి.మానవులకు దగ్గర సంబంధం (Close to Humans): కోతులు, ముఖ్యంగా పాత ప్రపంచ కోతులు (మకాక్లు, బబూన్లు వంటివి), మానవులకు చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాయి.ఇది కూడా చదవండి: Delhi Pollution: తొలగని అంధకారం.. వైద్యుల హెచ్చరికలు -
ఆ అన్నదమ్ములిద్దరూ కలిస్తే తేజ్
‘‘తేజూతో ‘చమకు చమకు..’ సాంగ్ చేసేటప్పుడు చిరంజీవి గారే గుర్తుకొచ్చారు. రెండు మూడు సీన్స్లో పవన్కల్యాణ్లా తేజు కనపడేలా తీశాం. ఎందుకంటే చిరంజీవిగారు, పవన్కల్యాణ్గారు కలిస్తే ఎలా ఉంటుందో తేజు స్టైల్ అలా ఉంటుంది’’ అన్నారు వీవీ వినాయక్. సాయిధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంటగా వినాయక్ దర్శకత్వంలో సి.కల్యాణ్ నిర్మించిన ‘ఇంటిలిజెంట్’ ఈ నెల 9న విడుదలవుతోంది. రాజమండ్రిలో జరిగిన ప్రీ–రిలీజ్ వేడుకలో వినాయక్ మాట్లాడుతూ– ‘‘మెగా ఫ్యామిలీలోని కష్టపడే తత్వం తేజులోనూ ఉంది. తేజు కూడా చిరంజీవిగారు, పవన్కల్యాణ్ అంత పెద్ద స్టార్ కావాలి. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పట్నుంచి పెద్ద డైరెక్టర్ని అవుతానని నమ్మినవారిలో సి.కల్యాణ్ అన్నయ్య ఒకరు. ఆయన రామానాయుడిగారిలా వంద సినిమాలు తీస్తారు. ఆ జర్నీలో నేనూ ఉంటాను. మాతోపాటు విడుదలవుతున్న ‘తొలి ప్రేమ’, ‘గాయత్రి’ సినిమాలు పెద్ద హిట్టవ్వాలని కోరుకుంటున్నా’’ అన్నారు. సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘అత్తకి యముడు అమ్మాయికి మొగుడు’ సినిమా వంద రోజుల ఫంక్షన్ తర్వాత ఆ రేంజ్లో గ్రాండ్గా జరుగుతున్న ఫంక్షన్ ‘ఇంటిలిజెంట్’. నాకెంతో ఇష్టమైన డైరెక్టర్ వినాయక్గారు. ఇంత మంచి సినిమా చేసే చాన్స్ ఇచ్చారు. ప్రేక్షకులకు, మెగా ఫ్యాన్స్కు ఈ సినిమా గుర్తుండిపోయేలా ఉంటుంది. మెగాస్టార్, పవర్స్టార్, మెగాపవర్స్టార్, స్టైలిష్ స్టార్, వరుణ్.. నాకు పంచభూతాలు. చిరంజీవిగారు, పవన్కల్యాణ్గారు, నాగబాబుగారు నాకు గురువులు. వారు లేకుండా ఈ స్టేజ్పై నేను లేను’’ అన్నారు. ‘‘ఇప్పటివరకు తేజ్ చేసిన సినిమాలు వేరు. ఈ సినిమా వేరు. వినాయక్ సినిమాను ఇరగదీశారు. పాటలు చూస్తుంటే చిరంజీవిగారి సాంగ్స్ చూస్తున్నట్లుంటుంది. ఓ దర్శకుడు కారు దిగగానే సింహం, పులి, ఏనుగులా గంభీరంగా అనిపించేవారిలో దాసరిగారు ఒకరు. ఆయన తర్వాత అలా అనిపించే దర్శకుడు వినాయక్ మాత్రమే’’ అన్నారు సి.కల్యాణ్. -
'ఇంటిలిజెంట్' టీజర్ విడుదల
-
కేంద్రం కంటే నేనే తెలివైన వాడిని
– నన్నెవరూ ఏమీ చేయలేరు – అందుకే ప్యాకేజీకి అంగీకరించా – తెలంగాణ ప్రభుత్వం ఏ కేసూ పెట్టలేదు – పోలవరం నిర్మించే బాధ్యత కేంద్రం నాకు అప్పగించింది – ప్రధాని కంటే ముందే నేను పచ్చదనం, పరిశుభ్రతకు పిలుపునిచ్చా – పేరుకే ప్రత్యేక హోదా.. ప్యాకేజీలో అన్నీ ఉన్నాయి – ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు ఏలూరు (మెట్రో) : ఎవరు ఎన్ని కేసులు పెట్టినా తనను ఎవరూ ఏమీ చేయలేరని, తెలంగాణ ప్రభుత్వం తనపై ఏ కేసూ పెట్టలేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో శనివారం దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి అనంతరం సురేష్ బహుగుణ పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. తాను నీతి నిజాయితీలతో జీవనం సాగిస్తున్నానని, అందువల్లే రోజుకు 6 గంటలపాటు ప్రశాంతంగా నిద్రపోతున్నానని పేర్కొన్నారు. తాను ఎవరికో భయపడుతున్నాననిఅంటున్నారని ఓటుకు నోటు కేసు గురించి పరోక్షంగా ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఆ కేసు తెలంగాణలో ఉంటే తాను ఎందుకు భయపడతానని, అయినా తెలంగాణ ప్రభుత్వం తనపై ఏ కేసూ పెట్టే సాహసం చేయలేదని చెప్పుకొచ్చారు. తనమీద బురదజల్లే యత్నం చేస్తున్నారని, ఇది ఇప్పుడు మాత్రమే కాదని, గతంలోనూ తనపై చాలాసార్లు బురద చల్లారని, ఎవరు ఎన్నిసార్లు యత్నించినా తనను ఎవరూ ఏమీ చేయలేరని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఇబ్బందులు పెడదామని యత్నించిన వారికి కోర్టులు కూడా చీవాట్లు పెట్టాయని, అయినా వారికి బుద్ధి రాలేదని పేర్కొన్నారు. ప్రధాని కంటే ముందే పిలుపునిచ్చా భారత ప్రధాన మంత్రి ఇటీవల స్వచ్ఛభారత్కు పిలుపునిచ్చారని, తాను గతంలోనే పచ్చదనం– పరిశుభ్రతకు పిలుపునిచ్చాన అన్నారు. ఇది తన గొప్పతనమని చెప్పుకున్నారు. ఓ పద్ధతి ప్రకారం ముందుకు పోతున్నానని పేర్కొన్నారు. కేంద్రం కంటే తెలివైన వాడిని తాను చాలా తెలివైన వాడినని, కేంద్రం కంటే ఎక్కువ తెలివి ఉందని, తాను అందరి కంటే సీనియర్ నాయకుడినని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. తెలివైన వాడిని కాబట్టే రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నాను తప్ప ఇంకొకటి కాదన్నారు. డబ్బులు లేకపోతేనే ఎన్నో అభివద్ధి పనులు చేశామని, డబ్బులుంటే రాష్ట్రాన్ని నంబర్ వన్గా తయారు చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రెండేళ్లపాటు హోదాపై మాట్లాడకుంటే గట్టిగా అడిగానని, దాని ఫలితమే ఈ ప్యాకేజీ అని చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదాతో సమానంగా మెరుగ్గా ప్యాకేజీ ఇస్తామన్న కేంద్రం పోలవరానికి రూ.30వేల కోట్లు రానున్న మూడు నాలుగు సంవత్సరాల్లో ఇస్తానని స్పష్టం చేసిందని చెప్పారు. పోలవరం నిర్మాణ బాధ్యత నాకు అప్పగించింది పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం చేయలేక ఆ బాధ్యతను తనకు అప్పగించిందని చంద్రబాబు చెప్పారు. ప్రతి సోమవరం పోలవరం పనులపై సమీక్ష నిర్వహిస్తానని, సోమవారాన్ని పోలవారంగా మారుస్తున్నానని చెప్పారు. ఓ పక్క దీన్ని పూర్తి చేస్తూనే ప్రత్యేక హోదా వస్తే ఎన్ని నిధులు వస్తాయో అన్నీ ఇస్తామని కేంద్రం చెప్పిందని, అందుకే ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నానని పేర్కొన్నారు. నాకు ఇంగ్లిష్ రాదన్నారు ఇటీవల ఏలూరులో నిర్వహించిన యువభేరిలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి ముఖ్యమంత్రి పరోక్షంగా మాట్లాడుతూ ఇటీవల ఒక నాయకుడు ఏలూరు వచ్చి తనకు ఇంగ్లిష్ రాదని చెప్పారన్నారు. అటువంటి నాయకుల సభలకు విద్యార్థులను ఎందుకు పంపిస్తున్నారో వారి తల్లిదంఢ్రులు ఆలోచించుకోవాలన్నారు. విద్యార్థులు ఆ నేత సమావేశాలకు ఎందుకు పోతున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ కోసం కషి రాష్ట్రంలో దోమల నివారణ, పారిశుధ్యం మెరుగుదలకు చర్యలు తీసుకుంటున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అక్టోబరు 2 నాటికి రాష్ట్రంలో 110 మునిసిపాలిటీలను సంపూర్ణ పారిశుధ్య పట్టణాలుగా ప్రకటించనున్నామని చెప్పారు. దోమలపై దండయాత్ర కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు. బైబిల్, ఖురాన్, భగవద్గీత ఉన్నట్టే ప్రతి ఒక్కరి దగ్గర రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన దోమలపై దండయాత్ర పుస్తకం ఉండాలని కోరారు. కార్యక్రమంలో మంత్రి పీతల సుజాత, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, ఎంపీలు తోట సీతారామలక్ష్మి, మాగంటి వెంకటేశ్వరరావు, పంచాయతీరాజ్ కమిషనర్ బి.రామాంజనేయులు, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ పాల్గొన్నారు.


