breaking news
initiated
-
సమర్థవంతంగా జువెనైల్ జస్టిస్
సాక్షి, హైదరాబాద్: పిల్లల సంరక్షణ, పునరావాసం కోసం జువెనైల్ జస్టిస్ చట్టాలను సమర్థవంతంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం, యూనిసెఫ్ పలు చర్యలు తీసుకుంటున్నాయని తెలంగాణ లీగల్ సర్విసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, న్యాయమూర్తి జస్టిస్ శ్యామ్ కోషి పేర్కొన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని.. వారి అభివృద్ధే సమాజ ప్రగతి అన్నారు. లీగల్ సర్విసెస్ అథారిటీ, జ్యుడీషియల్ అకాడమీ సంయుక్తంగా ఇలాంటి అవగాహన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు. జువెనైల్ జస్టిస్పై రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీలో ఒకరోజు అవగాహన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్యామ్ కోషి, తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీ అధ్యక్షుడు, న్యాయమూర్తి జస్టిస్ అభినంద్కుమార్ షావిలీ, జ్యువెనైల్ జస్టిస్ బోర్డు చైర్మన్, న్యాయమూర్తి జస్టిస్ టి.వినోద్కుమార్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ శ్యామ్ కోషి మాట్లాడారు. పాఠశాలల్లో, నివాస ప్రాంతాల్లో ఆట స్థలాలను ఏర్పాటు చేయాలని, పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించాలని జస్టిస్ అభినంద్కుమార్ షావిలీ ఉద్ఘాటించారు. బాల నేరస్తులను సంస్కరించడం, పునరావాసం కల్పించడం లాంటి అంశాలను చట్టంలో పొందుపరిచారని జస్టిస్ వినోద్కుమార్ పేర్కొన్నారు. జువెనైల్కు న్యాయ సేవలను అందించడంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ కీలక పాత్ర పోషిస్తుందని తెలంగాణ స్టేట్ లీగల్ సర్విసెస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ ఎస్.గోవర్ధన్రెడ్డి వివరించారు. జువెనైల్ జస్టిస్ బలోపేతానికి ఈ కార్యక్రమం దోహదం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి భారతి హోళికేరి తదితరులు పాల్గొన్నారు. -
విజయమ్మ దీక్ష భగ్నంపై ఆగ్రహ జ్వాలలు
రాష్ట్రాన్ని విభజిస్తే అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయూలని, అలా కాకుంటే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని డిమాండ్చేస్తూ వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి భగ్నం చేయడంపై జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యను నిరసిస్తూ శనివారం నిర్వహించిన జిల్లా బంద్ విజయవంతమైంది. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పలుచోట్ల రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించారు. వ్యాపారులు స్వచ్ఛందంగా షాపులను మూసివేసి బంద్లో పాల్గొన్నారు. అన్నివర్గాల ప్రజలు ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండించారు. జంగారెడ్డిగూడెం, న్యూస్లైన్ : కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై రాష్ట్రాన్ని విభజించేందుకు పూనుకున్నాయని, ఈ రెండు పార్టీలకు పుట్టగతులుండవని, ప్రజల ఆగ్రహానికి అవి భూ స్థాపితం కావడం ఖాయమని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆమరణదీక్ష భగ్నం, అరెస్టుకు నిరసనగా శనివారం రాష్ట్ర ప్రధాన రహదారిపై బాలారాజు ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. బాలరాజు మాట్లాడుతూ వైఎస్ విజయమ్మ సమన్యాయం కోసం అందరికి మేలు జరిగేందుకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే అర్ధ రాత్రి పోలీసులు దీక్షను భగ్నం చేసి అరె స్ట్ చేయడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. కనీసం అంబులెన్స్ను ఏర్పాటు చేయకుండా పోలీస్ వాహనంలో తరలించడాన్ని విమర్శించారు. పోలీసులు నిరంకుశంగా వ్యవహరించారని, ఇలాంటి ప్రభుత్వాలు కాలగర్భంలో కలిసిపోక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించిందన్నారు. రాష్ట్రం తగులబడుతుంటే ఢిల్లీలో సోనియాగాంధీ నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఖబడ్దార్ సోనియా అంటూ హెచ్చరించారు. చంద్రబాబు బస్సుయాత్రను ప్రజలు అడ్డుకునేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పారు. వైఎస్సార్సీపీ బీసీ విభాగం జిల్లా కన్వీనర్ పాశం రామకృష్ణ, కనమతరెడ్డి శ్రీనివాసరెడ్డి, రావూరి కృష్ణ, మండల కన్వీనర్ నులకాని వీరాస్వామి నాయుడు, రాఘవరాజు ఆదివిష్ణు, మార్ని ప్రసాద్, కాసర సురేష్రెడ్డి, గూడపాటి రాధాకృష్ణ, నౌడు అశోక్ , కొయ్యే లీలాధర్రెడ్డి, కాసర సోమిరెడ్డి, పి.సుదర్శన్, పితాని రాజేశ్వరి పాల్గొన్నారు. సోనియా దిష్టిబొమ్మ దహనం పాలకొల్లు టౌన్ : విజయమ్మ దీక్షను భగ్నం చేయడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని వైఎస్సార్ సీపీ నాయకుడు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యే అల్లు వెంకట సత్యనారాయణ పేర్కొన్నారు. దీక్షను భగ్నం చేయడాన్ని నిరసిస్తూ స్థానిక గాందీబొమ్మల సెంటర్లో రోడ్డుపై బైఠారుుంచారు. సోనియా దిష్టిబొమ్మను దహనం చేసి మాట్లాడారు. సీమాంద్రప్రాంతంలో చిన్న పిల్లవాడి దగ్గర నుంచి మేధావుల వరకు సమైక్యాంధ్రను కోరుతూ ఎన్ని ఆందోళనలు చేపట్టినా సోనియాగాంధీ మొండి వైఖరి అవలంభించడం సరికాదన్నారు. తక్షణమే స్పందించి సమైక్య ప్రకటన చేయూలని డిమాండ్చేశారు. పార్టీ నాయకులు గుణ్ణం నాగబాబు, ముచ్చర్ల శ్రీరామ్, ఆకెన వీరాస్వామి(అబ్బు), సంగినీడి సూరిబాబు, చీకట్ల వరహాలు, యడ్ల తాతాజీ, మద్దా చంద్రకళ, నడిం పల్లి అన్న పూర్ణ పాల్గొన్నారు. అప్రజాస్వామికం చింతలపూడి, న్యూస్లైన్ : మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్కుమార్ నాయకత్వంలో చింతలపూడి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి బోసుబొమ్మ సెంటర్లో మానవహారంగా ఏర్పడ్డారు. అనంతరం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. రాజేష్ మాట్లాడుతూ విజయమ్మ దీక్ష భగ్నం అప్రజాస్వామికమన్నారు. తలా కాస్తా పంచుకోవడానికి రాష్ట్రం కేకు ముక్క కాదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే సమైక్య ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ మారిశెట్టి జగదీశ్వరరావు, మండల కన్వీనర్ టి. వెంకట్రామిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు పి. వినోద్రెడ్డి, జె. జానకీరెడ్డి, చేపూరి ఖాదర్బాబు, టీడబ్ల్యూ జయరాజు, మాజీ ఏఎంసీ చైర్మన్ బొడ్డు వెంకటేశ్వరరావు, గోలి చంద్రశేఖర్రెడ్డి, జి. రమణయ్య, ఎండీ సాదిక్, నిమ్మగడ్డ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. దీక్ష భగ్నం దారుణం తణుకు, న్యూస్లైన్ : వైఎస్ విజయమ్మ దీక్షను పోలీసులు భగ్నం చేయటం దారుణమని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పేర్కొన్నారు. దీనికి నిరసనగా శనివారం తణుకులో బంద్ చేపట్టారు. పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహిం చారు. జై సమైక్యాంధ్రా అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ స్వార్ధప్రయోజనాల కోసం రాష్ట్ర విభజనకు పూనుకొందని, ఈ విషయాన్ని గుర్తించి సీమాంధ్ర ప్రజలందరూ సమైక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ నాయకులు విడివాడ రామచంద్రరావు, కరుటూరి పాండురంగారావు, కారుమంచి మిత్రా, బొబ్బిలి సుధీంద్రబాబు, నాసరి రాజారామ్, గంధం బాబ్జి, కంచుమర్తి విశ్వేశ్వరరావు, గోడి నాగబాబు, నత్తా చంద్రశేఖర్, కొప్పోజు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
వేణుగోపాల్ దీక్ష భగ్నం
జంగారెడ్డిగూడెం, న్యూస్లైన్ : జంగారెడ్డిగూడెంలో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తిరివీధి వేణుగోపాల్ దీక్షను శనివారం రాత్రి పోలీసులు భగ్నం చేశారు. ఎస్సై బీఎన్ నాయక్ ఆధ్వర్యంలో రెండు వాహనాల్లో పోలీసులు అంబులెన్స్తో దీక్షా శిబిరం వద్దకు వచ్చి వేణుగోపాల్ను ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. జేఏసీ ప్రతినిధులు, ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు తీవ్రంగా ప్రతిఘటించారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. చివరకు వేణుగోపాల్ను పోలీసులు బలవంతంగా అంబులెన్స్లో ఎక్కించి స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఏరియా ఆసుపత్రి వద్ద కూడా సమైక్యవాదులు జై సమైక్యాంధ్ర అంటూ నినదించారు. ఆసుపత్రిలో వేణుగోపాల్కు డాక్టర్ సునీత వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ పల్స్రేట్ తగ్గిందని, షుగర్ లెవల్స్ కూడా పడిపోయాయని, అందువల్ల వైద్యం తప్పదని తెలిపారు. వేణుగోపాల్ మాట్లాడుతూ ఆసుపత్రిలోనే దీక్ష కొనసాగిస్తానని ప్రకటించారు. వేణుగోపాల్ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశామని ఎస్సై నాయక్ తెలిపారు. అంతకుముందు వేణుగోపాల్ దీక్షకు మద్దతుగా రిలే దీక్షల్లో నోముల లీలావతి, జలగం మౌనిక, పట్నాల సాయి, పమిడిపల్లి బ్రహ్మాజీలు పాల్గొన్నారు. ప్రభుత్వ వైద్యులు డాక్టర్ కొడాలి సత్యనారాయణ వేణుగోపాల్కు వైద్య పరీక్షలు నిర్వహించారు. దీక్షా శిబిరాన్ని పలు రాజకీయ పార్టీల నాయకులు, సంస్థలు, సంఘాల ప్రతినిధులు సంఘీభావం తెలిపారు. పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొని సంఘీభావం తెలిపారు.