breaking news
inform
-
రాజద్రోహం చట్టంపై కేంద్రం కీలక నిర్ణయం.. పార్లమెంటులో బిల్లు..!
న్యూఢిల్లీ: రాజద్రోహం కేసులపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాజద్రోహం చట్టంపై పునర్ సమీక్ష చేస్తామని కేంద్రం చెప్పింది. వచ్చే వర్షాకాల సమావేశాల్లో రాజ ద్రోహం చట్టం సవరణ బిల్లును పార్లమెంటు ముందుకు తెస్తామని సూచన ప్రాయంగా తెలిపింది. దీంతో రాజద్రోహం కింద నమోదైన కేసులను ఆగస్టు రెండో వారంలో విచారిస్తామని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. కాగా.. బ్రిటిష్ కాలం నాటి రాజద్రోహ చట్టం చట్టబద్ధతను సవాల్ చేస్తూ ఎడిటర్స్ గిల్డ్ సహా మొత్తం 16 పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై కేంద్రం తన అభిప్రాయాన్ని తెలిపాలని గతేడాది మేలో సుప్రీంకోర్టు ఆదేశించింది. రాజద్రోహం చట్టం, దీని కింద నమోదైన కేసులపై స్టే విధిందించి. అయితే ఈ చట్టాన్ని పునర్ పరిశీలించేందుకు మరింత గడువు కావాలని కేంద్రం గతేడాది అక్టోబర్ 31న కోరింది. ఇప్పుడు మళ్లీ మరింత సమయం కావాలని అడిగింది. దీంతో తదుపరి విచారణను ఆగస్టుకు వాయిదా వేసింది సర్వోన్నత న్యాయస్థానం. చదవండి: ఆర్నెళ్లు ఆగక్కర్లేదు.. విడాకులపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు -
ఇల్లు మారితే ఆర్టీఏకు తెలపాల్సిందే
ముప్పై రోజులే గడువు.. లేకుంటే జరిమానా చట్టంలో మార్పులకు కసరత్తు సాక్షి, హైదరాబాద్: మీ వాహనం రిజిస్ట్రేషన్ సందర్భంగా ఆర్టీఏ కార్యాలయంలో సమర్పించిన చిరునామా ఇంటి నుంచి మరో ఇంటికి మారారా? అయితే కొత్తింటి చిరునామాను ఇక వెంటనే ఆర్టీఏలో సమర్పించండి.. చిరునామా మారినప్పుడల్లా వివరాలను రవాణా శాఖకు అందించాల్సిందే.లేని పక్షంలో పెనాల్టీ చెల్లించాలి. ఈ మేరకు రవాణాశాఖ చట్టంలో మార్పులుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. చెకింగ్ సమయంలో చిరునామా ఆరా... ప్రస్తుతం రవాణాశాఖ నుంచి గతంలో సేకరించిన చిరునామాలే పోలీసుల వద్ద ఉన్నాయి. ఏదైనా నేరం జరిగినప్పుడు ఆ చిరునామాను ఆరాతీస్తే అక్కడ వాహన యజమానులు ఉండడం లేదు. ఈ-చలానాలు పంపినా రిజెక్ట్ అవుతున్నాయి. ఈ ఇబ్బందులను పోలీసులు రవాణాశాఖ దృష్టికి తీసుకువచ్చారు. దీనిని నివారించేందుకు ఆర్టీఏ చట్టంలో మార్పులు తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. వాహనదారులు ఇల్లుమారితే 30 రోజుల్లోగా కొత్త చిరునామాను ఆర్టీఏ కార్యాలయాలకు అందజేయాలి. ఈ విషయంలో వాహనదారుల్లో చైతన్యం తెచ్చేందుకు త్వరలో రవాణాశాఖ భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలకూ సిద్ధమవుతోంది. ప్రతి సంవత్సరం వాహన ఇన్స్యూరెన్స్ రెన్యూవల్ చేసుకునేప్పుడు, పొల్యూషన్ సర్టిఫికెట్ తీసుకునేప్పుడు ఇంటి చిరునామాలను అప్డేట్ చేయించాలనే నిబంధన తీసుకురానున్నారు. వాహన ప్రమాదాలు, నేరాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో పోలీసు- రవాణాశాఖలు సంయుక్తంగా వ్యవహరించాలని నిర్ణయించాయి. ఈ కార్యాలయాల్లో రిజిస్టర్ అయ్యే ప్రతి వాహనం వివరాలు నేరుగా పోలీసు డేటా సర్వర్లో నమోదయ్యేలా సాఫ్ట్వేర్లో మార్పుచేర్పులు చేయాలని నిర్ణయించారు. మరో నెల రోజుల్లో ఈ కసరత్తు పూర్తి కానుంది. వాహనం తయారీ కంపెనీ పేరు, రంగు, ఇంజిన్, ఛాసిస్, రిజిస్ట్రేషన్ నంబర్లు, యజమాని పేరు, చిరునామాతో సహా వివరాలు పోలీసు రికార్డుల్లోకి చేరుతాయి.