-
తొమిదేళ్ళు పట్టిందా? అమిత్ షా వ్యాఖ్యలపై ఎంపీ సీరియస్
న్యూఢిల్లీ: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ఉద్దేశ్యంతో లోక్సభలో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు చర్చ సందర్బంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా కపటమైన వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు శివసేన(యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది. 2014 ఎన్నికల బీజేపీ మేనిఫెస్టోలోనే మహిళా రిజర్వేషన్ సాధిస్తామని హామీ ఇచ్చారని, అది జరిగిన తొమ్మిదేళ్లకు వారిలో చలనం వచ్చిందని అన్నారు. లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు భారీ మెజారిటీతో ఆమోదం పొందిన తర్వాత ఎంపీ ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు కపటమైనవని తొమ్మిదేళ్ల క్రితం 2014లోనే మహిళా రిజర్వేషన్ చట్టాన్ని తీసుకోస్తామని ఎన్నికల సందర్బంగా హామీ ఇచ్చారని అన్నారు. 2014, 2019 ఎన్నికల్లో కూడా అతిపెద్ద సింగిల్ పార్టీగా అవతరించినప్పటికీ ప్రతిపక్ష పార్టీలు అనేక మార్లు ఒత్తిడి తెచ్చిన తర్వాత ఇన్నాళ్లకు ఈ బిల్లుకు లోక్సభలో మోక్షం కలిగించారన్నారు. ఇక ఈ బిల్లు విషయంలో కూడా వారు కపట మాటలనే చెబుతున్నారు. ఈ బిల్లు చట్టంగా మారడమనేది జనగణన, డీలిమిటేషన్ వ్యవహారంపై ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే వారు 2021 నుంచి జనగణన కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. నాకు తెలిసి 2029 కంటే ముందు డీలిమిటేషన్ ప్రక్రియ కూడా జరిగే అవకాశం లేదు. దాని తర్వాత జనగణన 2031లో చేయాల్సి ఉంటుంది. మొత్తంగా వారు మహిళా ఓటర్లను ప్రలోభ పెట్టె ప్రయత్నం చేస్తున్నారని వచ్చే ఎన్నికల్లోనే మహిళలు వారికి గట్టిగా బుద్ధి చెబుతారని అన్నారు. అంతకుముందు బిల్లుపై చర్చలు జరుగుతున్నసమయంలో హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. 2024 ఎన్నికలకు మహిళా రిజర్వేషన్ బిల్లు వర్తించదని ఎన్నికలు జరిగిన వెంటనే జనగణన, డీలిమిటేషన్ ప్రక్రియ మొదలుపెడతామన్నారు. దానికోసం అవసరాన్ని బట్టి చట్టంలో కొన్ని మార్పులు చేస్తామన్నారు. పారదర్శకత కోసమే డీలిమిటేషన్ చేయనున్నట్లు అమిత్ షా తెలిపారు. ఏయే స్థానాలు మహిళలకు కేటాయించాలనే దానిపై డిలిమిటేషన్ కమిషన్ మాత్రమే నిర్ణయిస్తుందని, దానికి జనాభా లెక్కల సమాచారం మూలాధారమని అన్నారు. అందుకే 2029 ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్లు అమలవుతాయన్నారు. #WATCH | Delhi: On Union Home Minister Amit Shah's statement in parliament, Shiv Sena (UBT) MP Priyanka Chaturvedi says, "His (HM Amit Shah) statement is hypocritical because a commitment made to the women of the country 9 and a half years ago in the 2014 manifesto and coming and… pic.twitter.com/LV61OqKV5N — ANI (@ANI) September 20, 2023 ఇది కూడా చదవండి : Womens Reservation Bill 2023: తక్షణమే అమలు చేయండి -
రాష్ట్ర ప్రజలపై పవన్ కల్యాణ్ది కపటప్రేమ
-
'సీఎంను కూడా ఆమె లెక్కచేయడం లేదు'
తిరువనంతపురం: కేంద్ర మంత్రి మేనకా గాంధీ 'మోసకారి' అంటూ కేరళ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రమేశ్ చెన్నితల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేరళలో వీధి కుక్కలను చంపొద్దని చెప్పడానికి ఆమె ఎవరు అని అసెంబ్లీలో ప్రశ్నించారు. గురువారం ఆయన శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతూ... 'మేనకా గాంధీ మోసకారి. ఆమె గురించి ఆమె ఏమనుకుంటున్నారు. ముఖ్యమంత్రిని కూడా ఆమె లెక్కచేయడం లేదు. ఈ అధికారం ఆమెకు ఎవరు ఇచ్చారు. దీన్ని ఏమాత్రం అంగీకరించబోమ'ని రమేశ్ అన్నారు. ఇటీవల కాలంలో కేరళలో వీధి కుక్క బెడద ఎక్కువైంది. తిరువనంతపురం జిల్లాలో 90 ఏళ్ల వృద్ధురాలిని కుక్కులు పిక్కుతిన్నాయి. దీంతో కాంగ్రెస్(ఎం) యువజన నాయకులు పెద్ద సంఖ్యలో వీధి కుక్కలను పట్టుకుని విచక్షణారహితంగా చంపారు. జంతు ప్రేమికురాలైన మేనకా గాంధీ దీన్ని ఖండించారు. వీధి కుక్కలను చంపిన వారిపై అసాంఘిక కార్యకలాపాల వ్యతిరేక చట్టం(కాపా) ప్రయోగించాలని ఆమె డిమాండ్ చేశారు. మూగజీవాలను చంపడానికి ఉసిగొల్పిన వారికి మరణశిక్ష విధించాలని వ్యాఖ్యానించారు. మేనకా గాంధీ వ్యాఖ్యలపై బుధవారం కేరళ అసెంబ్లీలో దుమారం రేగింది. ఆమెను వ్యాఖ్యలను అధికార, విపక్ష సభ్యులు ఖండించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement