breaking news
HUZURNAGAR police
-
వర్షం కారణంగా సీఎం కేసీఆర్ సభ రద్దు
-
కేసీఆర్ సభ: భారీవర్షంతో అనూహ్య పరిణామం
సాక్షి, సూర్యాపేట : ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గురువారం హుజూర్నగర్ పట్టణంలో తలపెట్టిన భారీ బహిరంగ సభకు వరుణుడు అడ్డు తగిలాడు. హుజూర్నగర్లో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురవడంతో సీఎం కేసీఆర్ సభ రద్దయింది. హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రచారానికి సీఎం కేసీఆర్ వస్తుండటంతో అధికార టీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది. పెద్ద ఎత్తున జనసమీకరణను చేపట్టింది. సభా ప్రాంగణానికి ఇప్పటికే పార్టీ శ్రేణులు, ప్రజలు తరలివచ్చారు. అయితే, ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా వర్షం విరుచుకుపడింది. గంటసేపటి నుంచి కుండపోతగా వర్షం కురుస్తుండటంతో సభాప్రాంగణం అస్తవ్యస్తంగా మారిపోయింది. సభా ప్రాంగణంలో నీళ్లు చేరి.. బురదమయంగా అయింది. దీంతో ప్రజలను, పార్టీ కార్యకర్తలను ఇబ్బందిపెడుతూ.. సభ నిర్వహించడం కుదరదని గ్రహించిన టీఆర్ఎస్ సీఎం కేసీఆర్ సభను రద్దు చేసింది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకున్న సంగతి తెలిసిందే. ప్రచారానికి ఇంకా రెండు రోజుల గడువు మాత్రమే ఉంది. ఇప్పటికే ఇక్కడ ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలో హుజూర్నగర్లో సీఎం కేసీఆర్ సభకు టీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్లాన్లు వేసింది. వారం రోజులుగా ఈ సభపైనే టీఆర్ఎస్ నేతలు ప్రత్యేక దృష్టి సారించారు. సీఎం సభ ఏర్పాట్లను మంత్రులు గుంటకండ్ల జగదీశ్రెడ్డి, సత్యవతి రాథోడ్, పార్టీ ముఖ్య నేతలు దగ్గరుండి పరిశీలించారు. అన్ని ఏర్పాట్లు పూర్తయి.. మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో నేరుగా హుజూర్నగర్ చేరుకుంటారనే తరుణంలో వరుణుడి రాకతో సభకు బ్రేక్ పడింది. -
దాయాదులే నిందితులు..!
వీడిన పొనుగోడు హత్యకేసు మిస్టరీ నిందితుల అరెస్ట్.. కోర్డులో హాజరుపర్చిన పోలీసులు భూతగాదాలు, చేతబడి నెపంతోనే ఘాతుకం కేసు వివరాలు వెల్లడించిన సీఐ దాయాదుల మధ్య ఆదిపత్యపోరు పెచ్చరిల్లింది...ఎంతోకాలంగా ఉన్న భూతగాదాలు.. పాత కక్షలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.. అగ్నికి వాయువు తోడైనట్టు కుటుంబ సభ్యుల అనారోగ్యానికి అతడే చేతబడి చేశాడని విశ్వసించారు.. ఇంకేముంది ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నారు.. అదును చూసి మాటేసి.. మట్టుబెట్టారు.. ఇదీ గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామంలో ఇటీవల వెలుగుచూసిన ఏడిపాల వీరారెడ్డి హత్యోదంతం వెనుక ఉన్న మిస్టరీ. - హుజూర్నగర్ గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామంలో దారుణహత్యకు గురైన ఏడిపాల వీరారెడ్డి కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. విచారణలో దాయాదులే నిం దితులుగా తేల్చి, వారిని అరెస్ట్ చేశారు. శనివారం హుజూర్నగర్ పోలీస్స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్చార్జ్ సీఐ కోట నర్సిం హారెడ్డి నిందితుల వివరాలు, హత్యోదంతానికి గల కారణాలను వివరించారు. గ్రామానికి చెందిన ఏడిపాల పాపిరెడ్డి, ఏడిపాల సత్యనారాయణరెడ్డి, ఉపేందర్రెడ్డి, సైదిరెడ్డిలు ఇదే గ్రామానికి చెందిన ఏడిపాల వీరారెడ్డికి దాయాదులు. వీరి మ ద్య ఎంతో కాలంగా భూతగాదాలు, పాతకక్షలు ఉన్నాయి. ఇటీవల కాలంలో ఏడిపాల పాపిరెడ్డి భార్య, కుమారుడు అనారోగ్యం బారిన పడ్డారు. వీరారెడ్డి చేతబడి చేయడంతోనే వీరి ఆరోగ్యం క్షీణిం చిందని పాపిరెడ్డి అతడి సోదరులు అనుమానం పెంచుకున్నారు. ఎలాగైనా వీరారెడ్డిని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. మాటేసి.. మట్టుబెట్టి.. అదును కోసం ఎదురు చూస్తున్న పాపిరెడ్డి, అతడి సోదరులు ఈనెల 19న వీరారెడ్డి ఒంటరిగా వ్యవసాయ బావి వద్దకు వెళ్లింది గమనించారు. సాయంత్రం మార్గమధ్యలో మాటేశారు. ఒంటరిగా ఇంటికి వస్తున్న వీరారెడ్డిని మార్గమధ్యలో పట్టుకుని ఇనుపరాడ్లతో తలపై మోది హత్య చేశారు. ఆది నుంచి వారిపైనే అనుమానాలు వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన తండ్రి వీరారెడ్డి తిరిగి రాకపోవడంతో అతడి కుమారుడు విజయ్భాస్కర్రెడ్డి ఈ నెల 20వ తేదీన గరిడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరుసటి రోజే వీరారెడ్డి దారుణహత్యకు గురై రిజర్వాయర్ ఇసుకమేట లో మృతదేహం లభ్యమైం ది. దీంతో దాయాదులపైనే అనుమానం వ్యక్తం చేస్తూ వీరారెడ్డి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ దిశగానే పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గ్రామంలోనే ఉన్న పాపిరెడ్డి, అతడి సోదరులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్టు సీఐ వివరించారు. నిందితులను కోర్టులో హాజరుపర్చ నున్నట్టు తెలిపారు. సమావేశంలో గరిడేపల్లి ఎస్ఐ జి.రాజశేఖర్గౌడ్, ఐడీ పార్టీ హెడ్కానిస్టేబుల్ బలరాంరెడ్డి,పెరుమాళ్ల శ్రీనివాస్, కత్తుల రాంబా బు, మండవ వెంకటేష్గౌడ్, బాల్దూరి అశోక్, మల్లికార్జున్ పాల్గొన్నారు. బ్లేడుతో గొంతుకోసి.. పగను చల్లార్చుకుని.. పాపిరెడ్డి అతడి సోదరులు వీరారెడ్డి మృతదేహాన్ని గోనెసంచిలో వేసుకుని ద్విచక్రవాహనంపై పొనుగోడు గ్రామ రిజర్వాయర్ వద్దకు తీసుకెళ్లారు. అప్పటికీ కోపంతో ఊగిపోతున్న పాపిరెడ్డి తన వెంట తెచ్చుకున్న ఎక్సాబ్లేడ్తో విగతజీవుడిగా ఉన్న వీరారెడ్డి గొంతుకోసి తన పగను చల్లార్చుకున్నాడు. అనంతరం అక్కడే గొయ్యితీసి ఇసుకమేటలో మృతదేహాన్ని పాతిపెట్టి వెళ్లిపోయారు.