breaking news
history sheeter
-
ముంబైలో అలర్ట్.. 53 మంది రౌడీషీటర్ల నగర బహిష్కరణ
అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా సాగేందుకు ముంబై పోలీసులు వివిధ రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్నికలు, ఫలితాల రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నేర చరిత్ర ఉన్న వ్యక్తులను, రౌడీ షీటర్లను ముందుగానే అదుపులోకి తీసుకుంటున్నారు. తీవ్ర నేరాలకు పాల్పడిన కొందరు రౌడీ షీటర్లను నగరం నుంచి బహిష్కరిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 53 మంది రౌడీ షీటర్లపై నగర బహిష్కరణ వేటు వేశారు. మరికొందరిని అదుపులోకి తీసుకుని కటకటాల వెనక్కి తోశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ముంబై పోలీసు ఉన్నతాధికారులు చెంబూర్, ఆర్సీఎఫ్ నగర్, తిలక్నగర్, గోవండీ, శివాజీనగర్, దేవ్నార్, మాన్ఖుర్ద్, ట్రాంబే, బాంద్రా, మాహీం, మహ్మద్ అలీ రోడ్, బైకల్లా నాగ్పాడా తదితర ప్రాంతాల్లో సోదాలు ప్రారంభించారు. ముంబై పోలీసు కమిషనర్ వివేక్ ఫణ్సాల్కర్, ప్రత్యేక పోలీసు కమిషనర్ దేవెన్ భారతీ, అసిస్టెంట్ పోలీసు కమిషనర్ సత్యనారాయణ్ చౌధరి, అప్పర్ పోలీసు కమిషనర్ మహేశ్ పాటిల్ మార్గదర్శనంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఆరో యూనిట్కు చెందిన డిప్యూటీ పోలీసు కమిషనర్ నవనాథ్ ఢవలే, ఆయన బృందం పథకం ప్రకారం రౌడీ షీటర్లందరినీ అదుపులోనికి తీసుకుని కొంతమందిపై నగర బహిష్కరణ వేటు వేశారు.రూ. 14.5 కోట్ల బంగారం సీజ్ నాగపూర్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తనిఖీల్లో భాగంగా నాగపూర్లో శనివారం పోల్ అధికారులు రూ.14.5 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీ నం చేసుకున్నారు. గుజరాత్కు చెందిన సీక్వెల్ లాజిస్టిక్స్ అనే సంస్థ ఆభరణాలు, బిస్కెట్ల రూపంలో ఈ బంగారాన్ని రవాణా చేస్తుండగా ఫ్లయింగ్ నిఘా బృందానికి పట్టుబడిందని ఓ అధికారి తెలిపారు. ఎన్నికల సమయంలో ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని రవాణా చేసేందుకు సీక్వెల్ లాజిస్టిక్స్ ఎన్నికల సంఘం అనుమతి తీసుకోలేదు. స్వాదీనం చేసుకున్న బంగారాన్ని అంబజారి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ అంశంపై తదుపరి విచారణ జరుగుతోంద’ని ఆ అధికారి పేర్కొన్నారు. -
రాత్రి అరెస్టు.. ఉదయాన్నే ఎన్కౌంటర్!
సాక్షి, చైన్నె: చైన్నె కమిషనరేట్ పరిధిలో రెండున్నర నెలలవ్యవధిలో మూడో ఎన్కౌంటర్ సోమవారం జరిగింది. ఆదివారం రాత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కడప జిల్లాలో అరెస్టయిన చైన్నె తాంబరంకు చెందిన ఏ వన్ రౌడీ సీ సింగ్ రాజా సోమవారం ఉదయాన్నే జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యాడు. వివరాలు.. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాంగ్ హత్యతో రౌడీల గుండెలకు పోలీసులు ముచ్చెమటలు పటిస్తున్నారు. అజ్ఞాతంలోకి వెళ్లిన వారిని జల్లెడ పట్టి మరీ అరెస్టు చేస్తున్నారు. అదే సమయంలో చైన్నె పోలీసు కమిషనర్గా అరుణ్ బాధ్యతలు స్వీకరించగానే ఈ కేసులో నిందితుడైన తిరువెంగడంను ఎన్కౌంటర్లో హతమార్చారు. ఆ తర్వాత జరిగిన ఎన్కౌంటర్లో రౌడీ కాకా తోపు బాలాజీని మట్టుబెట్టారు. ఆర్మ్ స్ట్రాంగ్ కేసులో నిందితుల వేట ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో 29వ నిందితుడిగా ఏ వన్ రౌడీ సీ సింగ్ రాజాను ఆదివారం రాత్రి ప్రత్యేక బృందం పోలీసులు ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఓ ప్రాంతంలో అరెస్టు చేశారు. ఇతడిని చైన్నెకు తీసుకొచ్చి పారిశ్రామిక వేత్తకు బెదిరింపు ఇచ్చిన కేసు విచారణ నిమిత్తం వేళచ్చేరి స్టేషన్ పోలీసుకు అప్పగించారు. ఈ కేసు విచారణలో భాగంగా ఆయుధాలను దాచిపెట్టిన అక్కరై ప్రాంతానికి వేళచ్చేరి స్టేషన్ ఇన్స్పెక్టర్ విమల్ తన సిబ్బందితో సీ సింగ్ రాజాను తీసుకెళ్లారు. సీసింగ్ రాజాకు ఇద్దరు భార్యలు ఉన్నట్లు తెలిసిందే. అదే సమయంలో మరో ఇద్దరు మహిళలు తాము కూడా ఆయన భార్యలంటూ తెరమీదకు వచ్చారు. వీరిలో ఎవరికి మృతదేహం అప్పగించాలో అనే అయోమయంలో పోలీసులు పడిపోయారు.ఎదురుకాల్పుల్లో..ఆయుధాలను చూపిస్తానని పేర్కొని బకింగ్ హాం కాలువ తీరంలోని ఓ ప్రాంతానికి సీసింగ్ రాజ వెళ్లా డు. ఆయుధాలను చూపిస్తున్నట్టుగా పేర్కొంటూనే అక్కడున్న ఓ నాటు తుపాకీ ద్వారా పోలీసులపై కాల్పులు జరిపాడు. దీంతో ఆత్మరక్షణ కోసం ఇన్స్పెక్టర్ విమల్ రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. పొట్ట, ఛాతి భాగంలో తూటాలు దిగడంతో ఘటనా స్థలంలో సీ సింగ్ రాజా కుప్పకూలాడు. ఎన్కౌంటర్ సమాచారంతో గ్రేటర్ చైన్నె దక్షిణ జోన్ అదనపు కమిషనర్ శిబిరాజ్ నేతృత్వంలోని అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. అయితే సీ సింగ్ రాజాను ఆర్మ్స్ట్రాంగ్ కేసులో తాము విచారించలేదని, పారిశ్రామిక వేత్తకు బెదిరింపులు ఇచ్చిన కేసులో ఆయుధాల కోసం వచ్చినప్పుడు ఈ ఘటన జరిగిందని శిబిరాజ్ పేర్కొన్నారు. అయితే ఈ ఎన్కౌంటర్పై పలు అనుమానాలు బయలుదేరాయి. రౌడీల ఎన్కౌంటర్ పర్వం కొనసాగుతుండటంపై కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్ సైతం అనుమానం వ్యక్తం చేశారు.వాహనాల సీజ్ నుంచి ఏ వన్ రౌడీగా..తాంబరం రామకృష్ణపురం సుభాష్ చంద్రబోస్ నగర్కు చెందిన రాజ అలియాస్ సీసింగ్ రాజా తొమ్మిదో తరగతి వరకు చదువుకున్నాడు. తొలుత ఫైనాన్సియర్ ఒకరి వద్ద పనిచేశారు. ఎవరైనా కంతులు చెల్లించని పక్షంలో వారి వాహనాలను బలవంతంగా సీజ్ చేసి తీసుకెళ్లి ఫైనాన్సియర్కు అప్పగించే వాడు. మరమలై నగర్, ఇరుంగాట్టు కోట్టైలో రెండు పరిశ్రమల ఏర్పాటుతో తన దృష్టికి వాటి మీద పెట్టాడు. ఇక్కడి నుంచి వెలువడే ముడి ఇనుము, ఇతర పరికరాలను కొనుగో లు చేసి విక్రయించే క్రమంలో రౌడీ అవతారం ఎత్తాడు. అనుచరులను ఏకం చేసి, కిరాయి ముఠా నాయకుడిగా మారాడు. చైన్నెలో ప్రముఖ రౌడీలుగా ఉన్న ఆర్కాడు సురేష్ (ఇతడి హత్యకు ప్రతీకారంగానే ఆర్మ్స్ట్రాంగ్ హత్య జరిగింది)కు అత్యంత సన్నిహితుడయ్యాడు. ఆర్మ్స్ట్రాంగ్ కేసులో అజ్ఞాతంలో ఉన్న రౌడీ శంభో శంకర్కు మి త్రుడయ్యాడు. దీంతో ఏ వన్ రౌడీగా రాజ్య మేలు తూ వచ్చిన సీ సింగ్ రాజపై ఆరు హత్య కేసులతో పాటు 39 కేసులు ఉన్నాయి. పలు కేసుల్లో నాన్ బె యిల్ వారెంట్లు కూడా ఉన్నాయి. ఇతడికి జానకీ, జాన్సీ అనే ఇద్దరు భార్యలు, ధనప్రియ, ధనుష్, యోగేష్ అనే కుమార్తె, కుమారులు ఉన్నారు. జాన్సీ ఆంధ్రాకు చెందిన మహిళ కావడంతో ఆర్మ్ స్ట్రాంగ్ హత్య అనంతరం కడపకు వెళ్లి తలదాచుకున్నాడు. చివరకు పోలీసులు అరెస్టు చేసి ఎన్కౌంటర్లో మట్టు బెట్టారు.మరో ఐదుగురు రౌడీల అరెస్టురౌడీల వేటలో భాగంగా చైన్నెలో సోమవారం నలుగురు, తిరుచ్చిలో ఓ ప్రముఖ రౌడీని అరెస్టు చేశారు. ఒట్టేరి, పులియాంతోపునకు చెందిన సుందర మూర్తి, కమల్, వెట్రి, భరత్ అనే ఈ నలుగురి రౌడీలను అరెస్టు చేసి విచారిస్తున్నారు. వీరి మీద అనేక పాత కేసులు ఉన్నాయి. అలాగే తిరుచ్చిలో వృద్ధులను టార్గెట్చేసి, కంతు వడ్డి చెల్లించని వారిని గురి పెట్టి, ఆస్తుల పత్రాలు, ఆస్తులను కబ్జా చేస్తూ వచ్చిన రౌడీ, ఓ పార్టీకి చెందిన పట్టరై సురేష్ను అరెస్టుచేశారు. అతడి ఇంట్లో ఉన్న 60 మంది బాధితులకు సంబంధించిన దస్తావేజులు పోలీసులు సీజ్ చేశారు. అలాగే తిరుచ్చిలో పరారీలో ఉన్న రౌడీ జంబుకేశ్వరన్ను పోలీసులు పట్టుకునే క్రమంలో కాల్పులు జరిపారు. సాయంత్రం జరిగిన ఈ కాల్పులలో రౌడీ కాలికి గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం తిరుచ్చి ఆస్పత్రికి తరలించారు. -
బీజేపీలో చేరేందుకు సిద్ధపడ్డ హత్య కేసు నిందితుడు
చెన్నై : అనేక క్రిమినల్ కేసుల్లో నిందితుడుగా ఉన్న ఓ వ్యక్తి బీజేపీ పార్టీలో చేరేందుకు సిద్ధపడ్డాడు. నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోగా తీరా అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. సూర్య అనే వ్యక్తి ఆరు హత్య కేసులతోపాటు మొత్తం 35కు పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇటీవల అతడు బీజేపీలో చేరేందుకు నిర్ణయించుకున్నాడు. బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు ఎల్ మురుగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరాలని ప్రయత్నించాడు. (నాకు ఎవరి నుంచి ప్రాణ హాని ఉందో చెప్పాలి!) అయితే నిందితుడు బీజేపీ కార్యక్రమంలో పాల్గొంటున్నాడని సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసుల కదలికలను గమనించిన సూర్య కారులో అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు. సూర్య సహచరులలో నలుగురిని పోలీసులు అరెస్టు చేసి ఆ తరువాత బెయిల్పై వారిని విడుదల చేశారు. సీఆర్పీసీ సెక్షన్ 41 ప్రకారం సూర్యపై కేసు నమోదైంది. ఆయనను వారంట్ లేకుండా అరెస్టు చేయడానికి అవకాశం ఉంది. ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మురుగన్ మాట్లాడుతూ.. పార్టీలో చేరాలని భావించిన వారి నేపథ్యం గురించి తనకు తెలియదని అన్నారు. -
అనకాపల్లిలో తుపాకీతో రౌడీషీటర్ హల్ చల్
-
అనకాపల్లిలో తుపాకీతో రౌడీషీటర్ హల్ చల్
విశాఖపట్నం: రౌడీల ఆధిపత్య పోరు రోడ్డెక్కడంతో విశాఖపట్నంలో కలకలం రేగింది. రౌడీషీటర్ రాజేష్ అనకాపల్లి జంక్షన్ లో బుధవారం రాత్రి తుపాకీతో హల్ చల్ చేశాడు. తన ప్రత్యర్థి దాడి కృష్ణపై తుపాకీతో కాల్పులు జరిపేందుకు విఫలయత్నం చేశాడు. తుపాకీ పేలకపోవడంతో దాడి కృష్ణ ప్రాణాలతో బయటపడ్డాడు. కాగా కృష్ణ వర్గీయులు అనకాపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. రాజేష్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.