breaking news
Henley & Partners
-
సంపన్నుల వలసబాట.. ఆ దేశాలకే ఎందుకు?
భద్రమైన జీవితాన్ని వెతుక్కుంటూ ఎంతోమంది భారతీయ సంపన్నులు విదేశాలకు పయనమవుతున్నారు. అక్కడే స్థిరపడుతున్నారు. మెరుగైన శాంతిభద్రతలు, కాలుష్యానికి తావులేని చక్కటి వాతావరణం, సంపదపై తక్కువ పన్నులు వారిని ఆకర్శిస్తున్నాయి. ఈ ఏడాది భారత్ నుంచి 6,500 మంది అత్యంత సంపన్నులు విదేశాలకు వెళ్లిపోయే అవకాశం ఉందని ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు, సంపన్నుల కదలికల తీరును విశ్లేషించే హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్–2023 తాజాగా వెల్లడించింది. 2022లో భారత్ నుంచి 7,500 మంది ధనవంతులు విదేశాలకు వెళ్లి స్థిరపడినట్లు అంచనా. ► మిలియన్ డాలర్లు(రూ.8.2 కోట్లు), అంతకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టగల సంపద ఉన్నవారిని అల్ట్రా రిచ్(హెచ్ఎన్డబ్ల్యూఐ)గా పరిగణిస్తారు. ► శాశ్వతంగా స్థిరపడడానికి సంపన్నులను విశేషంగా ఆకర్షిస్తున్న దేశాల్లో ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ), సింగపూర్, అమెరికా, స్విట్జర్లాండ్ మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. ► ఇక 2023లో చైనా, ఇండియా, యునైటెడ్ కింగ్డమ్(యూకే), రష్యా, బ్రెజిల్ నుంచి ఎక్కువ మంది ధనవంతులు విదేశాలకు వెళ్తారని అంచనా వేస్తున్నట్లు న్యూ వరల్డ్ వెల్త్ పరిశోధక సంస్థ చీఫ్ ఆండ్రూ ఆమోయిల్స్ చెప్పారు. ► భారత్ నుంచి మిలియనీర్లు వెళ్లిపోతున్నా పెద్దగా నష్టం లేదని, దేశంలో అంతకంటే ఎక్కువ మంది మిలియనీర్లు తయారవుతారని ఆమోయిల్స్ తెలిపారు. ► ఈ ఏడాది చైనా నుంచి 13,500 మంది ధనికులు వలస వెళ్తారని అంచనా. ► 2022 ఆఖరు నాటికి టాప్–10 ధనిక దేశాల జాబితాలో భారత్ 10వ స్థానంలో నిలిచింది. అమెరికా, జపాన్, చైనా, జర్మనీ, యూకే, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్ దేశాలు మొదటి 9 స్థానాలో ఉన్నాయి. ► భారత్లో మొత్తం జనాభా 142 కోట్లు కాగా, వీరిలో 3,44,600 మంది అల్ట్రా రిచ్(మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ అస్తి), 1,078 మంది సెంటి–మిలియనీర్లు(100 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఆస్తి), 123 మంది బిలియనీర్లు(బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఆస్తి) ఉన్నారు. ► చైనా జనాభా 141 కోట్లు కాగా, వీరిలో 7,80,000 మంది అల్ట్రా రిచ్, 285 మంది బిలియనీర్లు ఉన్నారు. అమెరికా జనాభా 34 కోట్లు కాగా, వీరిలో 52,70,000 మంది అల్ట్రా రిచ్, 770 మంది బిలియనీర్లు ఉన్నారు. అనువైన దేశం కోసం అన్వేషణ ► విదేశాలకు వలస వెళ్లడానికి సంపన్నులు ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. రాజకీయ స్థిరత్వం, తక్కువ పన్నుల విధానం, వ్యక్తిగత స్వేచ్ఛకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ► ఆరోగ్యకరమైన జీవనం సాగించేందుకు అనువైన దేశం కోసం అన్వేషిస్తున్నారు. ► పిల్లలకు నాణ్యమైన చదువులు, వైద్య సదుపాయాలు, నాణ్యమైన జీవన ప్రమాణాలు అందాలని కోరుకుంటున్నారు. ► తమ సంపదకు, ఆస్తులకు రక్షణ కల్పించే దేశాన్ని ఎంచుకుంటున్నారు. ► చట్టబద్ధ పాలన ఉండడంతోపాటు ఆర్థిక స్వేచ్ఛకు హామీ ఇచ్చే దేశాలకు వలస వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ► ప్రైవేట్ సంపద వెళ్లిపోవడం దేశాలకు నష్టదాయకమేనని నిపుణులు చెబుతున్నారు. ► భారత్లో పన్ను నిబంధనలు కఠినంగా ఉండడంతో ధనవంతులు తమ డబ్బును విదేశాల్లో పెట్టుబడి పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రపంచంలో ఎక్కువ మంది ధనవంతులు ఏ నగరంలో ఉన్నారో తెలుసా?
కుబేరులు అనగానే మన దృష్టి వారి సంపదవైపే వెళుతుంది. ఆసక్తి ఉంటే వారి కంపెనీలు.. వాళ్లు ఏం చదువుకుకున్నారు. రోజుకి ఎంత ఆర్జిస్తున్నారు?వంటి వివరాలను తెలుసుకుంటాం. కానీ, వాళ్లు ఎక్కుడ? ఏ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేశారా? ప్రపంచ వ్యాప్తంగా ధనవంతులు ఎంత మంది ఉన్నారో గుర్తించే హెన్లీ అండ్ పార్ట్నర్ సంస్థ ‘మోస్ట్ మిలియనీర్ ఇన్ 2023’పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. ఆ రిపోర్ట్లో అమెరికా న్యూయార్క్ సిటీలోనే ప్రపంచంలో ఎక్కువ మంది ధనవంతులు ఉన్నట్లు తెలిపింది. దీంతో న్యూయార్క్ నగరం మరోసారి అత్యధిక ధనవంతులు జాబితాలో మరోసారి స్థానం దక్కించుకుంది. ఈ నగరంలో 3,40,000 మంది మిలియనీర్లు ఉండగా.. తర్వాత టోక్యోలో 290,300 మంది, శాన్ ఫ్రాన్సిస్కో 285,000మంది ఉన్నారు. ఈ నివేదిక ప్రపంచంలో ఎక్కువ సంపద కలిగిన ఆఫ్రికా, ఆస్ట్రేలియా, సీఐఎస్(Commonwealth of Independent States), తూర్పు ఆసియా, యూరప్, మిడిల్ ఈస్ట్, నార్త్ అమెరికా, దక్షిణాసియా , ఆగ్నేయాసియాలలో మొత్తం 97 నగరాల్లో ఈ డేటాను సేకరించింది. వాటి ఆధారంగా ఏ ప్రాంతంలో ఎంతమంది మిలియనీర్లు ఉన్నారో నిర్ధారించింది. ఇక న్యూయార్క్, ది బే ఏరియా, లాస్ ఏంజిల్స్,చికాగో నగరాలు అమెరికాలో మిలియనీర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల విభాగంలో ఆధిపత్యం చెలాయించాయి. చైనాకు చెందిన రెండు నగరాలు బీజింగ్, షాంఘైలు సైతం అదే జాబితాలో ఉన్నాయి. రెసిడెంట్ హైనెట్వర్త్ జాబితాలో(HNWI) 258,000 మందితో లండన్ ఈ సంవత్సరం నాల్గవ స్థానానికి పడిపోయింది, 240,100 మందితో సింగపూర్ తర్వాతి స్థానంలో ఉంది. 2000లో లండన్ లక్షాధికారులలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది, కానీ గత 20 ఏళ్లలో ఇది జాబితా నుండి పడిపోయింది. ది బిగ్ యాపిల్గా పేరు గడించిన న్యూయార్క్ నగరంలో 3,40,000 మంది మిలియనీర్లు, 724 సెంటీ-మిలియనీర్లు, 58 మంది బిలియనీర్లు ఉన్నారు. ఇక బ్రాంక్స్, బ్రూక్లిన్, మాన్హట్టన్, క్వీన్స్, స్టాటెన్ ఐలాండ్లు, మాన్హాటన్లోని 5వ అవెన్యూతో సహా ప్రపంచంలోని అత్యంత ప్రత్యేకమైన నివాసాలున్న కాలనీలుగా గుర్తింపు పొందాయి. ఇక్కడ ప్రధాన అపార్ట్మెంట్ ధరలు చదరపు మీటరుకు 27వేల డాలర్ల కంటే ఎక్కువగా ఉండవచ్చు’ అని హెన్లీ అండ్ పార్ట్నర్ నివేదిక హైలెట్ చేసింది. చదవండి👉 అవధుల్లేని అభిమానం అంటే ఇదేనేమో..టిమ్ కుక్కు ఇంతకన్నా ఏం కావాలి!