breaking news
heavy load
-
లైసెన్స్, ఓవర్ లోడ్.. తనిఖీలు ముమ్మరం చేయండి: మంత్రి పొన్నం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రోడ్డు ప్రమాదాలను పూర్తిగా తగ్గించి, మరణాల రేటును నివారించే విధంగా అధికారులు పని చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్ఫోర్స్మెంట్ బృందాలు మరింత ముమ్మరంగా తనిఖీలు చేయాలన్నారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు ఓవర్ లోడ్ వల్లే అధికంగా జరుగుతుండటంతో దాని మీద అధికారులు ఎక్కువగా దృష్టి సారించాలన్నారు.రవాణా శాఖ ఉన్నత స్థాయి అధికారుల సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ..‘ఇటీవల రవాణా శాఖలో 33 జిల్లా స్థాయి బృందాలు, మూడు రాష్ట్రస్థాయి ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసింది. ఇందులో డీటీసీ, ఆర్టీఏ ఇతర అధికారులు నిరంతరం తనిఖీలు చేపడుతున్నారు. ఏ బృందం ఎక్కడ తనిఖీలు చేపడుతుంది అనే దానిపై ముందస్తు సమాచారం లేకుండా ప్రతి రోజు ఉదయం 6 గంటలకి ఆయా బృందాలకు సమాచారం అందించి తనిఖీలు చేపట్టింది. గత 10 రోజుల వ్యవధిలో తనిఖీలు చేపట్టడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 4,748 కేసులు నమోదు చేశారు. మొత్తం 3,420 వాహనాలు సీజ్ చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్ఫోర్స్మెంట్ బృందాలు మరింత తనిఖీలు ముమ్మరం చేయాలి. ప్రతి పది రోజులకు ఒకసారి ఎన్ఫోర్స్మెంట్ పై సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని ఆదేశించారు.ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు ఓవర్ లోడ్ వల్లే అధికంగా జరుగుతుండడంతో దాని మీద అధికారులు ఎక్కువగా దృష్టి సారించాలి. ఓవర్ లోడ్ అయిన వాహనాలు సీజ్ చేయడంతో పాటు, రెండోసారి ఓవర్ లోడ్ తో వాహనం పట్టుబడితే ఆ వాహనం పర్మిట్ రద్దు చేయడంతో పాటు, వాహనం నడుపుతున్న డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలి. అయితే ఓవర్ లోడ్ పై మైనింగ్ శాఖతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడైతే వాహనాల లోడింగ్ జరుగుతుందో అక్కడే నివారించేలా చర్యలు తీసుకోవాలి. హెవీ వెహికల్ డ్రైవర్కు లైసెన్సు రెన్యువల్ సమయంలో పునఃశ్చరణ తరగతులు ఏర్పాటు చేసేలా కార్యాచరణ తీసుకోవాలన్నారు. రోడ్డు నిబంధనలు అతిక్రమిస్తున్నట్లు ప్రజల నుంచి సమాచారం వస్తే రవాణా శాఖ అధికారులు వెంటనే స్పందించాలని ఆదేశించారు.గత సంవత్సరం నిర్వహించిన రోడ్డు భద్రత మాసోత్సవం మంచి ఫలితాలు ఇచ్చిందని ఈ సారి జనవరిలో జరిగే రోడ్డు భద్రత మాసోత్సవాలపై ఇప్పటినుంచే కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇందులో విద్యార్థులు, డ్రైవర్లు, కార్మికులు, పోలీసులు, అధికారులు భాగస్వామ్యం ఉండేలా ఇప్పటి నుండి అవగాహన కల్పించాలని తెలిపారు. -
బాప్రే! ఎత్తు ఎక్కాలంటే.. రిస్క్ చేయాలంతే!
-
కారుపై పడ్డ కంటైనర్: నలుగురు దుర్మరణం
జైపూర్: రాజస్థాన్ పాలి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.పాలరాతి లోడ్తో వెళుతున్న కంటైనర్ కారుపై పడడంతో కారు మొత్తం నుజ్జునుజ్జు అయిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్తో సహా నలుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. గుడా ఆండ్లా పోలీస్స్టేషన్ ప్రాంతంలోని బాలరాయ్ సమీపంలోని హైవేపై శుక్రవారం ఉదయం ఈ విషాదంచోటు చేసుకుంది. (ఘోర రైలు ప్రమాదం: 36 మంది మృతి) స్థానికులసమాచారం ప్రకారం పాలీ నుంచి సిరోహి వైపు వెళ్తున్న కారుపై పాలరాయి లోడ్తో వెళ్తున్న కంటైనర్ పడింది. ట్యాంకర్ను క్రేన్ సహాయంతో వేరు చేశారు. దీంతో కారులో ఉన్న దంపతులతో సహా నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒకరిని అజ్మీర్ మెడికల్ కాలేజీకి ఆర్థిక సలహాదారుగా మనోజ్ కుమార్ శర్మగా గుర్తించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అతి కష్టంమీద మృతదేహాలను వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం గుండోజ్లోని ఆస్పత్రికి తరలించారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అటు విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ రావత్, సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
రోడ్డు భద్రత పట్టేదెవరికి..!
అతివేగం అనర్థదాయకం.. ఓవర్ లోడ్ ప్రమాదకరం.. ఇవి రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగాఅధికారులు పలికే నినాదాలు. కేవలం వారోత్సవాల్లో తప్ప ఆచరణలో మాత్రం అధికారులు విఫలమవుతున్నారు. వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నా.. అధికారుల కంటికి మాత్రం కన్పించడం లేదు. వారోత్సవాల్లో నినాదాలివ్వడమే కాదు.. ఏడాది మొత్తం నిబంధనలపై నిఘా వేయాల్సిన అవసరం ఉంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిని చూసీ చూడనట్లు విడిచిపెట్టకుండా అధికారులు కఠినంగా వ్యవహరిస్తే ఇలా ప్రయాణించేవారు ప్రమాదాల బారిన పడకుండా కాపాడిన వారవుతారు. అంతేకాక రోడ్డు భద్రత అందరి బాధ్యత అనేది అధికారులు గుర్తించాల్సిన అంశం. ఇటీవల ‘సాక్షి’ కెమెరాకు చిక్కిన కొన్ని ప్రమాదకర ప్రయాణ దృశ్యాలు. – ఫొటో జర్నలిస్ట్, భద్రాద్రి కొత్తగూడెం -
ఇదేమి బరువురా బాబోయ్!
బీజింగ్: చైనా అనగానే మనకు ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశమని గుర్తుకు వస్తుంది. అంతంత మాత్రపు జీతాలపై బతుకు బండి లాగించే కార్మికులు గుర్తొస్తారు. అత్యంత బరువు బండి లాగే బతుకులు కూడా వాళ్లవే. ఒక సైకిల్పై నలుగురు, ఒక మోటార్ సైకిల్పై ఐదుగురు ప్రయాణించడం అక్కడ నిత్యం కన్పించే దృశ్యాలే. ట్రక్కులపై తీసుకెళ్లాల్సిన సరకులను సైకిల్పై లాక్కుపోవడం. వరుసగా మోటారు సైకిల్కు ఐదారు వాహనాలను కట్టుకొని తరలించుకుపోవడం, టన్నులకొద్ది బరువుగల భారీ పైపులను రిక్షాలపై లాగించడం, 20 టన్నులకు మించని లోడ్ను తీసుకెళ్లాల్సిన వాహనాలపై వంద టన్నుల సరకులను తరలించడం కూడా మామూలే. చైనాలో దాదాపు 66 లక్షల వంతెనలు ఉన్నాయన్నది ఓ అంచనా. వాటిలో దాదాపు పావు వంతు వంతెనలు అధిక బరువును తీసుకెళ్లే ట్రక్కుల వల్లనే కూలిపోయాయట. హాంగ్జౌలోని క్వియాన్టాంగ్ నదిపై నిర్మించిన వంతెన కూడా అలాగే కూలింది. ఆ వంతెన సామర్థ్యం ప్రకారం 30 టన్నులకు మించి సరకులను తీసుకెళ్లరాదు. ఓ రోజు 129 టన్నుల బరవును తీసుకెళుతున్న ట్రక్కు వల్ల కూలిపోయిందట. 2004లోనే రోడ్డు భద్రతా నిబంధనలను తీసుకొచ్చినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేదట. అందుకే కూలిన వంతెనల చోట కొత్త వంతెనలను కడుతూ పోతున్నారు. పర్యాటక ప్రాంతాల్లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన అతి పొడవైన, బలమైన, అబ్బురపరచే వంతెనలు కడుతున్న చైనాకు ఈ దుస్థితి ఏమిటో మరి!


