-
తల్లీ బిడ్డలకు ఆరోగ్య పరీక్షలు
సాక్షి, అమరావతి: రక్త హీనతను పూర్తి స్థాయిలో అరికట్టి ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు గర్భిణిలు, బాలింతలు, పిల్లలకు ప్రతి నెలా హిమోగ్లోబిన్ పరీక్షలు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. జీవన శైలిలో మార్పుల కారణంగా వస్తున్న వ్యాధులు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, వ్యాయామాల ఆవశ్యకతను వివరిస్తూ క్యాంపులు నిర్వహించాలని సూచించారు. ఇందుకోసం ప్రతి నెలా ఒకసారి క్యాంపు నిర్వహించేలా చూడాలన్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ప్రతి ఇంటిని జల్లెడ పడుతూ.. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల ద్వారా ప్రతి ఇంటిని జల్లెడ పట్టి రక్తహీనత, పౌష్టికాహార లోపం బాధితులను గుర్తిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. వారందరికీ పౌష్టికాహారాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మందులు ఇచ్చే బాధ్యతను ఆరోగ్యశాఖ తీసుకుంటుందని, పౌష్టికాహారం బాధ్యతను మహిళా, శిశు సంక్షేమ శాఖ చేపట్టాలని నిర్దేశించారు. ఈ విషయంలో ఆయా సచివాలయాల పరిధిలో వైద్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ మధ్య సమన్వయం ఉండాలని స్పష్టం చేశారు. తద్వారా గ్రామ స్థాయిలో రక్త హీనతను పూర్తిస్థాయిలో నివారించగలుగుతామన్నారు. తగ్గిందో లేదో పర్యవేక్షించాలి పౌష్టికాహారాన్ని తీసుకున్నాక బాధితుల్లో రక్తహీనత తగ్గుతోందా లేదా? అనే అంశంపై కూడా దృష్టి పెట్టాలి. ఇచ్చిన పౌష్టికాహారాన్ని వారు తీసుకుంటున్నారా? లేదా? అనే విషయాన్ని నిర్థారించుకోవాలి. సంపూర్ణ పోషణ కింద పౌష్టికాహారాన్ని అందిస్తున్న సమయంలోనే గర్భిణిలు, పిల్లలకు టీకాలు అందించారా? లేదా? అనే అంశాలను కూడా పర్యవేక్షించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఒకవేళ టీకాలు మిస్ అయితే వెంటనే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు సంబంధిత గ్రామానికి చెందిన ఏఎన్ఎం ఆ సమయంలో అక్కడే ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. యాప్లో వివరాలు నమోదు పిల్లలు తమ వయసుకు తగ్గట్టుగా బరువు ఉన్నారా? లేదా? అన్నదానిపై కూడా అక్కడే పరిశీలన చేయాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. ఎవరైనా పిల్లల్లో పౌష్టికాహారం లోపం ఉంటే వారిపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని స్పష్టం చేశారు. ఈ వివరాలన్నీ ఎప్పటికప్పుడు యాప్లో నమోదు అయ్యేలా చూడాలన్నారు. రక్తహీనత, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లలను గుర్తించిన వెంటనే ఆ వివరాలను మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది దృష్టికి తెచ్చి పౌష్టికాహారం అందేలా చూడాలన్నారు. ఈ విషయంలో సచివాలయాల వారీగా వైద్య ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకోవాలని సీఎం సూచించారు. డ్రై రేషన్పై ప్రత్యేక దృష్టి వైఎస్సార్ సంపూర్ణ పోషణ అమలుపై సమీక్షించిన ముఖ్యమంత్రి జగన్ ఈ కార్యక్రమాన్ని అత్యంత నిశితంగా పర్యవేక్షించాలని నిర్దేశించారు. అంగన్వాడీలలో సూపర్ వైజరీ వ్యవస్ధ ఎలా పని చేస్తోందన్న దానిపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని, ఇందుకోసం బలమైన ఎస్వోపీని రూపొందించాలని సూచించారు. డ్రై రేషన్ పంపిణీపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. ఇప్పుడు అమలవుతున్న విధానంపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని, రేషన్ నాణ్యత విషయంలో ఎక్కడా లోపాలు ఉండకూడదని స్పష్టం చేశారు. ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. సమీక్షలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, ఆర్ధికశాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, ఏపీడీడీసీఎఫ్ ఎండీ అహ్మద్ బాబు, పాఠశాల విద్యాశాఖ (మౌలిక వసతుల కల్పన) కమిషనర్ కాటమనేని భాస్కర్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ కమిషనర్ ఎం.జానకి, పౌరసరఫరాలశాఖ ఎండీ జి.వీరపాండియన్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్ తదితరులు పాల్గొన్నారు. -
గురుకులాల్లో ఆరోగ్య పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో నిర్వహిస్తున్న ఆరోగ్య పరీక్షలు విద్యార్థులకు మేలు చేస్తున్నాయి. విద్యార్థులకు ప్రతి వారం క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు వారి ఆరోగ్య సమస్యల్ని గుర్తించి సత్వర చికిత్సను అందిస్తున్నారు. పేద పిల్లలు కావడంతో పోషకాహారం అందక రక్తహీనత వంటి సమస్యలతో బాధపడే వారిని గుర్తించి చికిత్సను అందించేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకూ 185 గురుకులాల్లో విద్యార్థులకు ఎనీమియా, పోషకాహార లోపానికి సంబంధించిన వైద్య పరీక్షలు పూర్తి చేశారు. మరోవైపు విద్యార్థుల్లో పోషకాహార లోపం తలెత్తకుండా పోషక విలువతో కూడిన ప్రత్యేక మెనూను అమలు చేస్తున్నారు. దృష్టిలోపంతో బాధపడుతున్న విద్యార్థులను గుర్తించే ప్రక్రియ చేపట్టారు. వైఎస్సార్ కంటి వెలుగు బృందాలతో ఇప్పటివరకు 91 గురుకులాల్లో నేత్ర పరీక్షలు నిర్వహించారు. వారిలో కంటి సమస్యలున్న వారిని గుర్తించి అవసరమైన చికిత్స అందిస్తున్నారు. మిగిలిన గురుకులాల్లోనూ నేత్ర పరీక్షలను కొనసాగిస్తున్నారు. దంత సమస్యలను గుర్తించేందుకు ఇప్పటివరకూ 68 గురుకులాల్లో పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించారు. మిగిలిన వాటిలోనూ దంత పరీక్షలు కొనసాగుతున్నాయి. కౌమార దశలోని బాలికలకు సమాజంలో ఎదురయ్యే సవాళ్లు, సమస్యలపై అవగాహన కల్పించేలా ‘వాయిస్ ఫర్ గరల్స్ సంస్థ’ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు జిల్లాలకు చెందిన 800 మంది బాలికలకు ఇప్పటికే ఈ శిక్షణ పూర్తి చేశారు. విద్యార్థులలో మానసిక ఆరోగ్య సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడానికి వీలుగా బోధన, బోధనేతర సిబ్బందికి ముంబైకి చెందిన టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. గురుకులాల్లో విద్యతోపాటు వైద్యం.. పోషకాహారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో గురుకులాల్లో చదివే విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం. పేద పిల్లల పెద్ద చదువులకు వారధిగా నిలుస్తున్న అంబేడ్కర్ గురుకులాల్లో విద్యతోపాటు వైద్యం, పోషకాహారం అందించేలా ప్రత్యేక దృష్టి సారించాం. ప్రధానంగా నేత్ర, దంత, పోషకాహార లోపం, రక్తహీనత, మానసిక వైద్య సేవలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. ఆడ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వారికి తగిన అవగాహన కల్పించి చైతన్యం తెచ్చేలా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. – మేరుగు నాగార్జున, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి -
ఆర్టీసీ సిబ్బందిని కాపాడిన ఓ నిర్ణయం.. 280 మందికిపైగా తప్పిన ప్రాణాపాయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)లో ఏటా మరణాలు అధికంగా నమోదవుతుండటాన్ని గుర్తించిన సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ వాటి నివారణ దిశగా తీసుకున్న ఓ నిర్ణయం ఏకంగా 280 మందికిపైగా సిబ్బందికి ప్రాణాపాయం తప్పించింది. మరే ప్రభుత్వ విభాగంలో లేనట్లుగా రెండు నెలల క్రితం ఆర్టీసీలో ‘హెల్త్ చాలెంజ్’ పేరుతో ఉద్యోగులకు 17 రకాల వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో 287 మంది తీవ్రమైన హృద్రోగ సమస్యలను ఎదుర్కొంటున్నట్టు తేలింది. రోజువారీ విధులకు హాజరవుతున్నప్పటికీ వారి గుండె పనితీరు బాగోలేదని, వారి పరిస్థితి క్రిటికల్గా ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. వెంటనే వారికి అత్యవసర వైద్య చికిత్సలు ప్రారంభించారు. సరిగ్గా మందులు వాడని ఇద్దరు మాత్రం మృత్యువాత పడగా మిగతా వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుండటంతో అపాయం నుంచి బయటపడ్డారు. ఇందులో డ్రైవర్లే ఎక్కువ మంది ఉన్నందున, వేల మంది ప్రయాణికులను గమ్యానికి చేర్చే డ్రైవర్లు ప్రమాదం నుంచి బయటపడటం ద్వారా పరోక్షంగా ప్రయాణికులకు కూడా ప్రమాదం తప్పినట్టయింది. ఆ మరణాలు అలాంటివే... ఆర్టీసీలో గత ఆర్థిక సంవత్సరం దాదాపు 225 మంది చనిపోయారు. ఇందులో 60 శాతం మంది గుండె సంబంధిత సమస్యలతోనే ప్రాణాలు వదిలారు. ఏటా సగటున ఆర్టీసీలో 200 మంది వరకు చనిపోతున్నారు. నాలుగేళ్ల క్రితం వరకు ఆ సంఖ్య గరిష్టంగా 180 ఉండగా ఆ తర్వాత అది క్రమంగా 200 దాటుతూ వస్తోంది. అప్పటివరకు డ్యూటీ చేసిన వారు ఉన్నట్టుండి నేలకూలుతున్నారు. తీవ్ర పని ఒత్తిడిలో పనిచేసే డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్లు, ఇతర ఫీల్డ్ సిబ్బంది ఎక్కువగా చనిపోతున్నారు. దీన్ని గుర్తించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. ఏకంగా 48 వేల మంది ఉద్యోగులకు డిపోలవారీగా ఓ ప్రైవేటు సంస్థ ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించారు. హైబీపీతో బాధపడుతూ సరైన వైద్యం తీసుకోకపోవడం, మందులు సరిగ్గా వాడకపోవడంతో పరిస్థితి క్రిటికల్గా మారిన వారు, క్రిటికల్గా మారేందుకు సిద్ధంగా ఉన్నవారు, సమస్య ఇప్పుడిప్పుడే పెరుగుతున్నవారు, కొత్తగా ఆ సమస్య పరిధిలోకి వచ్చినవారు ఇలా ఏబీసీడీఈ అంటూ జాబితాలు రూపొందిస్తున్నారు. అందులో క్రిటికల్ ఈసీజీ జాబితాలో 287 మంది చేరారు. శరీరంలో సమస్య తీవ్రంగా ఉన్నట్టు ఆ ఉద్యోగులకు కూడా తెలియదు. రోజువారీ విధులకు హాజరవుతున్నారు. వారికి సంబంధించి కొందరి మెడికల్ హిస్టరీ తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిలో ఉంది. కానీ దాన్ని ఫాలో అవుతున్నవారు లేరు. వారి పరిస్థితి అంత బాగోలేదని రిపోర్టులు స్పష్టం చేయటంతో వెంటనే నిమ్స్లో ఓ డాక్టర్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయించారు. వారిలో సమస్య తీవ్రత దృష్ట్యా 60 మందికి యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించారు. తీవ్ర సమస్య ఉన్న 25 మందికి వెంటనే స్టెంట్లు వేయించారు. ఇక 10 మంది మరింత క్రిటికల్గా ఉన్నట్లు తేల్చి అందులో ఇద్దరికి నిమ్స్లోనే తాజాగా ఓపెన్హార్ట్ సర్జరీ నిర్వహించారు. మరో ఇద్దరికి సర్జరీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మిగతా వారికి తగిన చికిత్సలు అందిస్తున్నారు. మందులు వేసుకోకుండా నిర్లక్ష్యం.. ఇద్దరి మృతి.. ప్రమాదకరంగా ఉన్నవారిలో ఇద్దరు డ్రైవర్లు సరిగా మందులు వేసుకోకుండా నిర్లక్ష్యం చేశారు. ఇటీవల ఆ ఇద్దరు మృతి చెందారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఎండీ సజ్జనార్ వెంటనే మిగతావారు మందులు సరిగా వేసుకునేలా చూడాల్సిన బాధ్యతను డిపో మేనేజర్లకు అప్పగించారు. ఇందుకోసం యాప్ ద్వారా అలర్ట్ మెసేజ్లు డీఎంలకు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. వారికి చికిత్స అందిస్తున్న వైద్య కేంద్రాల ద్వారా ఎప్పటికప్పుడు మందులు వాడుతున్న తీరును పర్యవేక్షిస్తున్నారు. ఎవరైనా నిర్లక్ష్యంగా ఉంటే వెంటనే డీఎంకు మెసేజ్ వెళ్తుంది. ఆ మేరకు డీఎంలు వారితో, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి మందులు వాడేలా చర్యలు తీసుకుంటారు. ఫలితంగా మిగతావారి ఆరోగ్యం కుదుటపడుతోంది. త్వరలో వీరంతా తిరిగి విధుల్లోకి వచ్చే పరిస్థితి తేనున్నట్టు వైద్యులు భరోసా ఇస్తున్నారు. నిమ్స్లో ప్రత్యేక ఏర్పాట్లు.. తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రి, జిల్లాల్లోని డిస్పెన్సరీల్లో సిబ్బందికి చికిత్సలందిస్తున్నారు. నిమ్స్లోనూ వారికి ప్రత్యేకంగా బెడ్లు, ఓ డాక్టర్ను ఏర్పాటు చేశారు. స్టెంట్లు వేయడం, ఓపెన్ హార్ట్ సర్జరీలను నిమ్స్లో నిర్వహిస్తున్నారు. -
అందరికీ ఆరోగ్య పరీక్షలు
సాక్షి, అమరావతి: మారుతున్న ఆహార అలవాట్లతో 40 ఏళ్లు నిండకుండానే జీవనశైలి జబ్బులు చుట్టుముడుతున్నాయి. వ్యాధి ముదిరిపోయే వరకు గుర్తించకపోవడంతో ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ముప్పుగా పరిణమించిన అసాంక్రమిక వ్యాధుల (ఎన్సీడీ) కట్టడిలో భాగంగా సార్వత్రిక ఆరోగ్య పరీక్షల కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మధుమేహం, రక్తపోటు, బాడీ మాస్ ఇండెక్స్(బీఎంఐ) సహా పలు రకాల స్క్రీనింగ్ పరీక్షలను ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ఇంటింటికి తిరిగి చేపడుతున్నారు. సగానికిపైగా స్క్రీనింగ్ పూర్తి రాష్ట్రవ్యాప్తంగా 4,66,67,774 మందికి స్క్రీనింగ్ చేపట్టాల్సి ఉండగా ఇప్పటికే 2,67,69,033 మందికి పూర్తయ్యింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 74.48% అనకాపల్లిలో 67.24%, నంద్యాలలో 66.72 శాతం జనాభాకు స్క్రీనింగ్ చేశారు. బీపీలో కోనసీమ టాప్ ఇప్పటివరకూ నిర్వహించిన సర్వేలో 11,92,104 మంది రక్తపోటుతో బాధ పడుతున్నట్టు గుర్తించారు. 8,93,904 మందికి మధుమేహం ఉన్నట్టు తేలింది. కోనసీమ జిల్లాలో అత్యధికంగా 99,376 మంది బీపీ బాధితులున్నారు. పశ్చిమ గోదావరిలో 81,072, ఏలూరులో 77,048, కాకినాడలో 75,640 మందికి హైపర్టెన్షన్ ఉన్నట్టు వెల్లడైంది. మధుమేహం బా«ధితులు అత్యధికంగా గుంటూరు జిల్లాలో 65,772 మంది ఉన్నారు. కోనసీమలో 63,012, కృష్ణాలో 61,935 మంది షుగర్తో బాధపడుతున్నారు. స్క్రీనింగ్ వివరాలతో ఐడీలు ఎన్సీడీ సర్వేలో గుర్తించిన అసాంక్రమిక వ్యా«ధుల బాధితులకు ప్రభుత్వమే ఉచితంగా వైద్య సేవలు అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో వీరి కోసం పీహెచ్సీల్లో ఎన్సీడీ క్లినిక్లను సైతం వైద్య, ఆరోగ్య శాఖ నిర్వహిస్తోంది. ఎన్సీడీ స్క్రీనింగ్తో పాటు ప్రజలకు డిజిటల్ ఆరోగ్య ఐడీని ఆరోగ్య కార్యకర్తలు సిద్ధం చేస్తున్నారు. స్క్రీనింగ్లో వెల్లడైన ఆరోగ్య వివరాలను ఐడీ ద్వారా ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. చికిత్స కోసం ఏ ఆస్పత్రికి వెళ్లినా ఐడీ నమోదు చేయగానే సంబంధిత వ్యక్తి ఆరోగ్య చరిత్ర అంతా ఆన్లైన్లో తెలుసుకోవచ్చు. ఆరోగ్య చరిత్రను పరిగణలోకి తీసుకుని వైద్యులు వేగంగా సరైన చికిత్స అందించేలా చర్యలు చేపట్టారు. -
అరుదైన ప్రయోగం.. స్పేస్లోకి టిక్టాక్ స్టార్
కాలిఫోర్నియా: అమెరికన్ ప్రైవేట్ స్పేస్ కంపెనీ వర్జిన్ గెలాక్టిక్ అరుదైన ప్రయోగానికి రెడీ అయ్యింది. ఫ్లోరిడాకు చెందిన కెల్లీ గెరార్డియా అనే ఫేమస్ టిక్టాక్ స్టార్ను స్పేస్లోకి పంపేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే రకరకాల పరీక్షల కోసమే ఈ స్పేస్ ఆపరేషన్ నిర్వహించబోతున్నట్లు వర్జిన్ గెలాక్టిక్ వెల్లడించింది. కొత్త హెల్త్కేర్ టెక్నాలజీని ఆమెపై ప్రయోగించడం ద్వారా వాటి సానుకూలతపై ఓ స్పష్టతకు వస్తామని ఒక ప్రకటనలో వర్జిన్ గెలాక్టిక్ పేర్కొంది. కాగా, గెరార్డియాకు టిక్టాక్, ఇన్స్టాగ్రామ్లో బాగానే ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఆమె బయోఆస్ట్రోనాటిక్స్ రీసెర్చర్ కావడం విశేషం. ఈ విషయాన్ని వర్జిన్ గెలాక్టిక్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. 32 ఏళ్ల కెల్లీ.. పాపులర్ సైన్స్ కమ్యూనికేటర్ అని తెలిపింది. ఇక స్పేస్షిప్లో గాల్లో తేలియాడుతూనే కెల్లీ, ఆరోగ్యపరమైన ప్రతీ ప్రయోగంలో పాలుపంచుకోబోతున్నట్లు తెలిపింది. అయితే ఆమె ప్రాణాలకు వచ్చే హాని ఏం ఉండదని వర్జిన్ గెలాక్టిక్ పేర్కొంది. ఇక ఈ స్పేస్క్రాఫ్ట్ ప్రయోగం ద్వారా బయోమానిటరింగ్(లాంఛ్, వెయిట్లెస్నెస్, రీ ఎంట్రీ) కెపాసిటీని పరీక్షించబోతున్నట్లు సమాచారం. తద్వారా రాబోయే రోజుల్లో మానవ సహిత వర్జిన్ గెలాక్టిక్ స్పేస్షిప్ ప్రయోగాల సాధ్యాసాధ్యాలపై మరో అడుగు ముందుకు వేయనుంది. ఇక ఈ ప్రయోగంపై గెరార్డియా స్పందిస్తూ.. ‘తన ప్రయత్నం మరికొందరు యువ రీసెర్చర్లను ముందుకు తీసుకొస్తుందని’ ఆశాభావం వ్యక్తం చేసింది. బ్రిటిష్ బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్, అమెరికా రిటైర్డ్ ఏరోస్పేస్ ఇంజినీర్ బర్ట్ రూటన్ కలిసి స్థాపించిన వర్జిన్ గెలాక్టిక్.. వచ్చే ఏడాది నుంచి కమర్షియల్ సబ్-ఆర్బిటల్ ఫ్లైట్స్ను ప్రారంభించాలని నిర్ణయించుకుంది.ఈ క్రమంలో ఏడాదికి 400 ట్రిప్పులను లక్ష్యంగా పెట్టుకుంది. కాగా, ఈ కంపెనీ తరపున ఇటీవలె రాకెట్ తరహా విమానం వీఎంఎన్ ఈవ్ ద్వారా ఇద్దరు పైలైట్లు స్పేస్లోకి చేరుకున్న విషయం తెలిసిందే. ఇక వర్జిన్ గెలాక్టిక్ నుంచి స్పేస్లోకి వెళ్లేందుకు సెలబ్రిటీలతో సహా 600 మంది ఇప్పటికే రిజర్వేషన్లు చేసుకోవడం విశేషం.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
Advertisement