-
హైకోర్టులో వీహెచ్ రచ్చ
♦ ‘హెచ్సీయూ’ ఘటనపై పిటిషన్ విచారణలో గందరగోళం ♦ తమ న్యాయవాదిని ధర్మాసనం నిలదీయడంతో అసహనం ♦ నేను ఎంపీని.. కావాలంటే అరెస్ట్ చేసుకోండి ♦ జైలుకు కూడా వెళతానంటూ గ్యాలరీ దాటిన వీహెచ్ ♦ ధర్మాసనం తీవ్ర ఆగ్రహం.. వెనక్కి తగ్గిన వీహెచ్ సాక్షి, హైదరాబాద్: హెచ్సీయూ వీసీగా అప్పారావుకు తిరిగి బాధ్యతలు అప్పజెప్పడంపై దాఖలైన పిటిషన్ విచారణలో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు గందరగోళం సృష్టించారు. హైకోర్టులోనే గట్టిగా మాట్లాడుతూ.. గ్యాలరీ దాటి ముందుకెళ్లేం దుకు ప్రయత్నించారు. న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెనక్కితగ్గారు. ఇక ఈ పిటిషన్కు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వీసీ అప్పారావు, సైబరాబాద్ కమిషనర్లకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. విచారణను జూన్ 20కి వాయిదా వేస్తూ... తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్రావులతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్సీయూ వీసీగా అప్పారావు తిరిగి బాధ్యతలు చేపట్టేందుకు కేంద్ర మానవ వనరుల శాఖ అనుమతివ్వడాన్ని సవాలు చేస్తూ ఎంపీ వి.హనుమంతరావు పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ధర్మాసనం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది సి.దామోదర్రెడ్డి స్పం దిస్తూ... హెచ్సీయూలో విద్యార్థి ఆత్మహత్య ఘటన కేసులో వీసీ అప్పారావు మొదటి నిందితుడిగా ఉన్నారన్నారు. దాంతో కేంద్రం ఆయనను సస్పెండ్ చేసిందని, దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారని పేర్కొన్నారు. ఆయన తిరిగి బాధ్యతలు చేపట్టడంతో విద్యార్థుల హక్కులు ప్రభావితమవుతున్నాయన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. వీసీని సస్పెండ్ చేశారా, సెలవుపై వెళ్లారా అనే స్పష్టత లేకుంటే ఎలాగని నిలదీసింది. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాజ్యం దాఖలు చేశామని న్యాయవాది చెప్పగా... విద్యార్థుల ప్రయోజనాలను తాము పరిరక్షిస్తామని, దాని గురించి పిటిషనర్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి వీసీగా కొనసాగరాదని ఏ చట్ట నిబంధనలు చెబుతున్నాయో చెప్పాలని ప్రశ్నించింది. భావోద్వేగాలు, మీడియా కథనాల ఆధారంగా కేసులను విచారించడం సాధ్యం కాదని పేర్కొంది. వీహెచ్ రగడ.. అసలు ఈ వ్యాజ్యంలో మీరు ఏం కోరుతున్నారో కూడా చెప్పాలని న్యాయవాదిని ధర్మాసనం పలుమార్లు ప్రశ్నించింది. ఈ సమయంలో కక్షిదారుల గ్యాలరీలో ఉన్న వీహెచ్ లేచి తనదైన యాసలో పెద్దగా మాట్లాడడం ప్రారంభించారు. ఓ వ్యక్తి కోసం 6 వేల మంది విద్యార్థులు రోడ్డుపై ఉన్నారని అరుస్తూ గ్యాలరీ దాటి వచ్చే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో న్యాయవాదులు వారించడంతో వెనక్కి తగ్గారు. ధర్మాసనం మళ్లీ న్యాయవాదిని స్పష్టత కోరడంతో వీహెచ్ సహనం కోల్పోయారు. తాను ఎంపీనని, తనను అరెస్ట్ చేసుకోవచ్చని, జైలుకు కూడా వెళతానంటూ గ్యాలరీ దాటి ముందుకెళ్లారు. తన వాదన వినాలని కోరారు. దీంతో ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులను పిలిచేందుకు సిద్ధమైంది. ఈ సమయంలో న్యాయవాదులు వీహెచ్ను వారించడంతో వెనక్కి వెళ్లారు. అయితే పోలీసులు కోర్టు హాల్లోకి రావడం, వీహెచ్ మరో ద్వారం నుంచి బయటకు వెళ్లిపోవడం జరిగాయి. అనంతరం ధర్మాసనం ఈ పిటిషన్లో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. -
నిందితునిగా ఉన్న వ్యక్తి వీసీగా ఉండకూడదని ఎక్కడుంది..?
పిటిషనర్ను ప్రశ్నించిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: ఓ కేసులో మొదట నిందితునిగా ఉన్న వ్యక్తి వీసీగా బాధ్యతలు చేపట్టకూడదని ఏ చట్టంలో ఉందో చూపాలని వేముల రోహిత్ ఆత్మహత్యోదంతం నేపథ్యంలో హెచ్సీయూ వీసీగా అప్పారావు కొనసాగింపు వ్యవహారంలో దాఖలైన కేసులో పిటిషనర్ను హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయంలో తగిన అధ్యయనం చేసి రావాలని పిటిషనర్ తరఫు న్యాయవాదికి సూచిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్రావులతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్గా అప్పారావు తిరిగి బాధ్యతలు చేపట్టేందుకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ అనుమతినివ్వడాన్ని సవాలు చేస్తూ, అప్పారావును హెచ్సీయూ నుంచి మరోచోటుకు బదిలీ చేయడంతో పాటు, బోధనా, బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీ చేయకుండా హెచ్సీయూ రిజిస్ట్రార్ను ఆదేశించాలంటూ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే.దీన్ని బుధవారం తాత్కాలిక సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదలను వినిపిస్తూ, హెచ్సీయూ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యకు సంబంధించి నమోదైన కేసులో వీసీ అప్పారావు మొదటి నిందితునిగా ఉన్నారని తెలిపారు. సంబంధిత ఎఫ్ఐఆర్ను ఆయన ధర్మాసనం ముందుంచారు. దీనిని పరిశీలించిన ధర్మాసనం, ఓ కేసులో మొదట నిందితునిగా ఉన్న వ్యక్తి వీసీగా కొనసాగరాదని ఏ చట్టంలో ఉందో చూపాలని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. భావోద్వేగాల ఆధారంగా అధికరణ 226 కింద కేసులను విచారించడం సాధ్యం కాదని ధర్మాసనం తేల్చి చెప్పింది. ‘మీరు అప్పారావును తొలగించాలని కోరుతున్నారు.. మేం చట్టం గురించి అడుగుతున్నాం’...అంటూ పిటిషనర్ను ఉద్దేశించి పేర్కొంది. ఈ కేసును పూర్తిగా అధ్యయనం చేసి రావాలని సూచించిన ధర్మాసనం, ఈ కేసులో తామెవ్వరికీ నోటీసులు జారీ చేయడం లేదంది. -
'హెచ్సీయూ వీసీపై చర్యలు తీసుకోవాలి'
హైదరాబాద్ : హెచ్సీయూలో విద్యార్థి రోహిత్ మరణం తీరని లోటని కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్రెడ్డి వెల్లడించారు. శనివారం యూనివర్శిటీలో విద్యార్థులు చేపట్టిన నిరవధిక దీక్ష శిబిరాన్ని ఎస్ జైపాల్రెడ్డి, టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే టి. జీవన్రెడ్డి జస్టిస్ సుదర్శన్రెడ్డి సందర్శించారు. యూనిర్శిటీలో దళితుల పట్ల వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వీసీ అప్పారావుపై చర్యలు తీసుకోవాలని జైపాల్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూనివర్శిటీ విద్యార్థులను సంఘ విద్రోహుల్లా చిత్రీకరిస్తున్న తీరుపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్శిటీలో దళితులకు చట్ట రక్షణ కల్పించాలని టి. జీవన్రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. టీఆర్ఎస్కు ఎన్నికలపై ఉన్న శ్రద్ధ యూనివర్శిటీ ఘటనపై దృష్టి పెట్టడం లేదని ఆరోపించారు. జస్టిస్ సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ... యూనివర్శిటీలో దళితులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రోహిత్ మరణం పై కేంద్రం వ్యవహారించిన తీరు బాధాకరమని జస్టిస్ సుదర్శన్రెడ్డి అన్నారు. -
'బీజేపీ మనిషిని కాదు'
హైదరాబాద్: రోహిత్ ఆత్మహత్యకు కారణమయిన వారిలో ఒకరిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న హెచ్ సీయూ వైస్ ఛాన్సలర్ పొదిలి అప్పారావుకు రాజకీయ నాయకులతో బలమైన సంబంధాలున్నట్టు తెలుస్తోంది. ఆయనకున్న రాజకీయ పలుకుబడి, సంబంధాలు, లాబీయింగ్ తోనే వీసీ అయ్యారని ప్రచారం జరుగుతోంది. కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు అండతోనే ప్రొఫెసర్ అప్పారావుకు వైస్ ఛాన్సలర్ పదవి దక్కించుకున్నట్టు చెప్పుకుంటున్నారు. తనకున్న రాజకీయ పలుకుబడితోనే 35 మంది పోటీదారులను ఎదుర్కొని ఆయన వీసీ పీఠాన్ని అధిరోహించారని అంటున్నారు. వెంకయ్య అండదండలు పుష్కలంగా ఉండడం వల్లే గతేడాది సెప్టెంబర్ 15న హెచ్ సీయూకు అప్పారావు వీసీ కాగలిగారని వర్సిటీ సిబ్బందిలో కొంతమంది బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలోని తుళ్లూరుకు చెందిన అప్పారావు రెండు దశాబద్దాలుగా హెచ్ సీయూలో పనిచేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 2001-2004లో హెచ్ సీయూ హాస్టల్ కు ఆయన చీఫ్ వార్డెన్ గా వ్యవహరించారు. బలమైన లాబీయింగ్ నేతగా పేరు గాంచిన టీడీపీ మాజీ ఎంపీకి బంధువు కావడంతో రాజకీయ ప్రముఖులతో ఆయనకు సంబంధాలు ఏర్పడ్డాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వీసీ పదవికి అప్పారావు పేరును స్మతి ఇరానీకి వెంకయ్య నాయుడు సూచించారని తెలిపాయి. అప్పారావుకు చంద్రబాబు అండ కూడా ఉందని పేర్కొన్నాయి. అయితే తనకు రాజకీయ నాయకులతో సంబంధాలు లేవని అప్పారావు తెలిపారు. తాను బీజేపీ మనిషి కాదని, ఏ పార్టీకి చెందిన వాడిని కాదని చెప్పారు. రోహిత్ ఆత్మహత్యను రాజకీయం చేయడం తగని అన్నారు. తాను ఏ తప్పు చేయలేదని పేర్కొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. ట్రాక్టర్తో తొక్కించి ఏఎస్ఐ హత్య
హీరోగా జబర్దస్త్ కమెడియన్.. ఆసక్తిగా ట్రైలర్!
‘రాహుల్ గాంధీపై పాక్ ప్రేమ ఆందోళన కలిగించింది’
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
కొత్త పగటివేషగాడు వచ్చాడు
ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
మహిళల టీ20 వరల్డ్కప్ 2024: అక్టోబర్ 6న భారత్-పాక్ మ్యాచ్
అక్కడ శృతి మించిందో.. మీ పాట శాస్వతంగా రద్దే!
తప్పక చదవండి
- కొత్త పగటివేషగాడు వచ్చాడు
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- రేటే 'బంగార'మాయెనే..!
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement