-
మై హోమ్ రామేశ్వర్రావు సంపద రూ.3,300 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్లో ఆకాశహర్మ్యాలతో పాటు ఈ రంగంలో సంపదను సృష్టిస్తున్న శ్రీమంతులూ పెరుగుతున్నారు. దేశవ్యాప్తంగా టాప్–15 మంది రియల్టీ కుబేరుల్లో తెలంగాణ నుంచి ‘మై హోమ్ కన్స్ట్రక్షన్స్’ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు తొలిసారిగా స్థానం దక్కించుకున్నారు. దేశవ్యాప్తంగా రియల్టీ దిగ్గజాల్లో ఈయన 14వ స్థానంలో నిలిచారు. ఈ మేరకు ‘గ్రోహె– హురున్ ఇండియా రియల్ ఎస్టేట్’ 2018వ సంవత్సరానికి సంబంధించిన జాబితా విడుదల చేసింది. హైదరాబాద్ నుంచి తొలి స్థానంలో నిలిచిన రామేశ్వర్ రావు సంపద... రూ.3,300 కోట్లు. హైదరాబాద్ నుంచి రెండో స్థానంలో నిలిచింది... తాజ్ అండ్ జీవీకే హోటల్స్ అధినేత జీవీకే రెడ్డి, ఆయన కుటుంబం. వీళ్ల సంపద విలువ రూ.1,080 కోట్లు! దేశవ్యాప్తంగా వంద మంది రియల్టీ కుబేరుల జాబితాలో జీవీకే 63వ స్థానంలో నిలిచారు. ఇక, రూ.980 కోట్ల సంపదతో అపర్ణా కన్స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్ ప్రతినిధులు సి.వెంకటేశ్వర రెడ్డి, ఎస్ సుబ్రమణ్యం రెడ్డిలు మూడో స్థానంలో నిలిచారు. గ్రోహే జాతీయ జాబితాలో వీళ్లది 66వ స్థానం! లెక్కించింది ఇలా... జర్మనీకి చెందిన ప్రీమియం శానీటరీ ఉత్పత్తుల తయారీ సంస్థ గ్రోహే. మన దేశంలో పుట్టి, ఇక్కడే పెరిగిన రియల్టీ వ్యాపారస్తులను మాత్రమే పరిగణలోకి తీసుకొని ఈ నివేదికను రూపొందించారు. దేశంలోని 100 మంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల మొత్తం సంపద విలువ రూ.2,36,610 కోట్లు. 2017తో పోలిస్తే ఇది 27 శాతం పెరిగింది. 2017లో వీళ్ల సంపద రూ.1,86,700 కోట్లుగా ఉంది. 2018 గ్రోహే హురూన్ రియల్టీ ధనవంతుల్లో లోధా గ్రూప్నకు చెందిన మంగల్ ప్రభాత్ లోధా మొదటి స్థానంలో నిలిచారు. ఈయన సంపద రూ.27,150 కోట్లు. రూ.23,160 కోట్లతో ఎంబసీ అధినేత జితేంద్ర విర్వాణీ రెండో స్థానంలో, రూ.17,690 కోట్ల సంపదతో డీఎల్ఎఫ్కు చెందిన రాజీవ్ సింగ్ మూడో స్థానంలో నిలిచారు. జాబితాలో తొలిసారిగా మహిళలకూ చోటు 2018 గ్రోహే హ్యూరన్ రియల్టీ ధనవంతుల్లో తొలిసారిగా మహిళలూ చోటు దక్కించుకున్నారు. ఈసారి రియల్టీ టైకూన్స్లో 9 మంది మహిళలు ఉండటం విశేషం. మహిళా విభాగంలో డీఎల్ఎఫ్ నుంచి రేణుకా తల్వార్ మొదటి స్థానంలో నిలిచారు. ఈమె సంపద రూ.2,780 కోట్లు. మొత్తం 100 మంది జాబితాలో ఈమెది 19వ స్థానం. 24 ఏళ్లకే బిజినెస్ టైకూన్.. గ్రోహే హురూన్ –2018 జాబితాలో 59 శాతం తొలితరం పారిశ్రామికవేత్తలే ఉన్నారు. ఈ జాబితాలో అత్యంత పిన్న వయస్కుడు ఆర్ఎంజెడ్ అధినేత కునాల్ మెండా (24 సంవత్సరాలు). బెంగళూరుకు చెందిన కునాల్ సంపద రూ.530 కోట్లు. వయసులో బాగా సీనియర్ మాత్రం... ఈస్ట్ ఇండియా హోటల్స్ అధినేత పృథ్వీరాజ్ సింగ్ ఓబెరాయ్ (89 సంవత్సరాలు) కావటం గమనార్హం. న్యూ ఢిల్లీకి చెందిన ఈయన సంపద రూ.3,290 కోట్లు. ముంబై... శ్రీమంతుల నగరం.. టాప్–100 రియల్టీ శ్రీమంతుల్లో 78 మంది ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరులోనే ఉన్నారు. ఒక్క ముంబైలోనే 35 మంది ఉండగా.. ఢిల్లీలో 22 మంది, బెంగళూరులో 21, పుణెలో 5, నోయిడా, చెన్నై, గుర్గావ్, కొచ్చిల్లో 2, కోల్కతా, థానే, అహ్మదాబాద్లో ఒక్కరు చొప్పున ఉన్నారు. -
మరో మూడు దేశాల్లో ‘108’
సాక్షి, హైదరాబాద్: మరో మూడు దేశాలకు ‘108’ అత్యవసర అంబులెన్స్ సేవలను విస్తరించనున్నట్లు జీవీకే-ఈఎంఆర్ఐ చైర్మన్ జీవీకే రెడ్డి వెల్లడించారు. శ్రీలంక, ఇండోనేషియా, థాయిలాండ్లలో ‘108’ వైద్య సేవలను విస్తరిస్తున్నామన్నారు. ‘108’ ప్రారంభమై పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారమిక్కడ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పదేళ్లలో 15 లక్షలమంది ప్రాణాలను కాపాడామన్నారు. ఈ ఏడాది చివరికి శ్రీలంకలో సేవలు ప్రారంభమవుతాయని, ఈ మేరకు ఆ దేశంతో ఒప్పందం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎయిర్ అంబులెన్స్లను ఏర్పాటు చేసే యోచన ఉందన్నారు. తద్వారా రహదారి వసతిలేని మారుమూల గ్రామాల ప్రజలకూ అత్యవసర వైద్య సేవలు అందించడానికి వీలవుతుందన్నారు. -
యువ క్రీడాకారిణులకు జీవీకే చేయూత
జింఖానా, న్యూస్లైన్: ఆంధ్రప్రదేశ్ యువ టెన్నిస్ క్రీడాకారిణులు సామ సాత్విక, షేక్ జాఫ్రీన్లకు జీవీకే అకాడమీ స్పాన్సర్ చేయనుంది. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అకాడమీ డెరైక్టర్ జీవీ కృష్ణారెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. ‘ఈ ఇద్దరు క్రీడాకారిణులు ప్రస్తుతం మంచి ప్రతిభతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే షేక్ జాఫ్రీన్ 2013 బధిరుల ఒలింపిక్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహించింది. సాత్విక జాతీయ స్థాయిలో ఎన్నో విజయాలను నమోదు చేసింది. అయితే ఇటువంటి క్రీడాకారిణులకు ప్రోత్సాహం ఎంతో అవసరం. గతేడాది మేము స్పాన్సర్ చేసిన అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల ప్రస్తుతం జూనియర్ విభాగంలో అగ్రస్థానంలో నిలిచినందుకు ఎంతో గర్విస్తున్నాము. ఆమెతో మా ఒప్పందాన్ని మరో ఏడాది పొడిగించాం. మన రాష్ట్రంలో ప్రతిభాశీలురు చాలా మంది ఉన్నా సరైన మార్గదర్శనం, ప్రోత్సాహం లేక మరుగున పడిపోతున్నారు. అలాంటి క్రీడాకారులకు చేయూతనిచ్చి వారిని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం’ అని జీవీకే రెడ్డి అన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement