breaking news
Guindy
-
చెన్నై లగ్జరీ హోటల్.. కోవిడ్ హాట్స్పాట్
చెన్నై: చెన్నై నగరం గిండీలో ఉన్న లగ్జరీ హోటల్ ఐటీసీ గ్రాండ్ చోళ కోవిడ్ హాట్స్పాట్గా మారింది. ఈ హోటల్ సిబ్బందిలో 85 మందికి కోవిడ్ పాజిటివ్గా తేలడం కలకలం రేపుతోంది. గురు, శుక్రవారాల్లో హోటల్లో సేకరించిన 609 శాంపిళ్లకు గాను 85 మందికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. వీరిని ఇళ్లకు పంపించి చికిత్స అందజేస్తున్నామన్నారు. ఈ పరిణామంతో ఉలిక్కి పడ్డ మునిసిపల్ అధికారులు నగరంలోని 25 లగ్జరీ హోటళ్లలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడంతోపాటు వాటి సిబ్బంది, అతిథులందరికీ పరీక్షలు చేపట్టారు. గ్రాండ్ చోళ చెఫ్ ఒకరికి డిసెంబర్ 15వ తేదీన మొదటిసారిగా కోవిడ్గా తేలింది. ఈ హోటల్కు సమీపంలోనే ఉన్న మద్రాస్ ఐఐటీకి చెందిన 200 మంది విద్యార్థులు ఇటీవల కరోనా బారినపడ్డారు. -
చెన్నైలో లారీ బీభత్సం
చెన్నై: గిండి సమీపంలో లారీ బీభత్సం సృష్టించింది. వాటర్ ట్యాంకర్ లారీ అదుపుతప్పి జన సమూహంపైకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన గిండి సమీపంలోని చెల్లమ్మల్ మహిళా కళాశాల సమీపంలో గురువారం చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు విద్యార్థులు కూడా ఉన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.