breaking news
g.pullareddy
-
‘జి.పుల్లారెడ్డి’కి అరుదైన అవకాశం
– డీఎస్టీ ఫిస్టు–2016 నిధులు మంజూరు కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలకు అరుదైన అవకాశం లభించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(డీఎస్టీ) కళాశాలలో పరిశోధన, అభివృద్ధి కోసం ఫండ్స్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ–2016లో భాగంగా 60 లక్షల రూపాయలు మంజూరైనట్లు ప్రిన్సిపాల్ బీ.శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందులో మొదటి విడతగా రూ. 30 లక్షలు, రెండో విడతలో మరో 30 లక్షల రూపాయలు రానున్నట్లు వివరించారు. ఈ నిధులను సైన్స్ పరికరాల కొనుగోలు కోసం వినియోగించేందుకు వీలుందన్నారు. దేశంలోని అతికొద్ది కళాశాలలకు మాత్రమే ఫీస్టు నిధులు మంజూరవుతాయని, అందులో తమ కళాశాలకు స్థానం లభించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ సంవత్సరమే కళాశాలకు యూజీసీ ఆధ్వర్యంలోని అర్అండ్డీ విభాగం సీపీఈ(కాలేజ్ విత్ పొటెన్సియల్ ఎక్సాలెన్స్) స్థాయిని ఇచ్చిందని. ఏపీఎస్ఎస్డీసీ, పీఎంకేవీవై కింద మూడు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు మంజరైన విషయం విదితమేనని ఆయన వివరించారు. -
రేపటి నుంచి పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనం
ఒంగోలు ఒన్టౌన్, న్యూస్లైన్: జిల్లాలో పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనం ఈ నెల 16 నుంచి స్థానిక డీఆర్ఆర్ఎం హైస్కూలులో నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ ఎ.రాజేశ్వరరావు తెలిపారు.స్థానిక డీఆర్ఆర్ఎం హైస్కూలులో సోమవారం సాయంత్రం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పరీక్ష పత్రాల మూల్యాంకనానికి చేసిన ఏర్పాట్ల గురించి డీఈఓ వివరించారు. 1521 మంది చీఫ్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లను, 450 మంది స్పెషల్ అసిస్టెంట్లను నియమించామన్నారు. వాస్తవంగా అవసరమైన దానికంటే 50 శాతం మందిని అదనంగా నియమించామని చెప్పారు. మూల్యాంకన విధుల మినహాయింపు కోసం 10 శాతం అంటే 151 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. వీరందరికీ మినహాయింపు ఇచ్చినట్లు డీఈఓ చెప్పారు. మూల్యాంకన విధులకు అప్పటికప్పుడు (వరండా అపాయింట్మెంట్) ఎవరినీ నియమించరన్నారు. మూల్యాంకన విధులకు మంగళవారం నుంచి ఎవరికీ మినహాయింపు ఇచ్చేది లేదని, వారికి సార్వత్రిక ఎన్నికల డ్యూటీలు వస్తే తప్పనిసరిగా దానికి సంబంధించిన శిక్షణకు హాజరుకావాల్సిందేనన్నారు. ఎన్నికల శిక్షణ రోజు మూల్యాంకన విధులకు మినహాయింపు ఇస్తామన్నారు. 10వ తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనం జరిగే డీఆర్ఆర్ ఎం హైస్కూలులో చదువుతున్న 6,7,8,9 తరగతుల విద్యార్థులకు ఉదయం 7 నుంచి 9.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించాలని ఆదేశించినట్లు రాజేశ్వరరావు తెలిపారు. సబ్జెక్టు వారీగా... మూల్యాంకనానికి 1521 మంది సబ్జెక్టు టీచర్లను నియమించారు. వీరిలో తెలుగు 1టీకి 77 మంది 2టీకి 161 మంది, 3టీకి 14 మంది, హిందీ 9హెచ్కి 112 మంది, ఇంగ్లిష్ 13ఇకి 91 మంది, 14ఇకి 63 మంది, 29ఇకి 42 మంది, 30ఇకి 70 మంది, గణితం 15టీ/ఇకి 133 మంది, 16టీ/ఇకి 154 మంది, ఫిజికల్ సైన్స్ 19టీ/ఇకి 119 మంది, బయోలాజికల్ సైన్సు 20టీ/ఇకి 191 మంది, సోషల్ స్టడీస్ 21టీ/ఇకి 154 మంది, 22టీ/ఇకి 140 మందిని నియమించారు. సోషల్ స్టడీస్ రెండవ పేపర్ మూల్యాంకనం ఈ నెల 17 నుంచి ప్రారంభమవుతుందన్నారు. ఆ పేపర్కు నియమితులైన వారు 17న విధులకు రిపోర్టు చేయాలన్నారు. మిగిలిన అన్ని పేపర్ల మూల్యాంకనానికి నియమితులైన వారు 16వ తేదీన ఉదయం 9 గంటలకు రిపోర్టు చేయాలని చెప్పారు. మూల్యాంకనానికి నియమితులైన వారందరినీ ప్రధానోపాధ్యాయులు పాఠశాల విధుల నుంచి రిలీవ్ చేసి పంపించాలని డీఈఓ కోరారు. విలేకర్ల సమావేశంలో ఉపవిద్యాధికారి వెంకట్రావు, ఏసీసీ నాగప్ప, డీసీఈబీ కార్యదర్శి జి. పుల్లారెడ్డి పాల్గొన్నారు. -
మారిషస్కూ పుల్లారెడ్డి స్వీట్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్వీట్స్ షాపు.. ఈ పేరు వినగానే.. గల్లీకొకటి ఉంటుందిలే అని తేలిగ్గా కొట్టిపారేస్తాం. కానీ, 66 ఏళ్లుగా మిఠాయిల వ్యాపారంలో నిలదొక్కుకోవడమంటే మామూలు విషయం కాదు. అక్షరాలు కూడా సరిగా రాని ఓ సాధారణ వ్యక్తి ప్రారంభించిన మిఠాయి కొట్టు... నేడు దేశం దాటి మారిషస్లోనూ వ్యాపారం చేసే స్థాయికి చేరిందంటే మాటలు కాదు. ఎవరా వ్యాపారి.. ఏంటా షాపు.. ఎవరా వ్యాపారి అనుకుంటున్నారా? అదే పుల్లారెడ్డి స్వీట్స్! యజమాని జి.పుల్లారెడ్డి!! 1948 నాటి మాట.. కర్నూల్ జిల్లా ఆత్మకూరు మండలంలోని గోకవరం గ్రామవాసి జి.పుల్లారెడ్డి. చదువు అంతగా అబ్బకపోవడంతో కసిరెడ్డి వెంకటరెడ్డి అనే వ్యాపారి బంగారం దుకాణంలో పనిలో చేరాడు. కాస్త డబ్బు సంపాదించాక ఉద్యోగం మానేసి టీ, మజ్జిగ అమ్మే చిన్నపాటి కొట్టును అక్కడే ప్రారంభించాడు పుల్లారెడ్డి. స్వీట్లంటే ఇష్టమున్న వెంకటరెడ్డి తాను కూడా మిఠాయిల వ్యాపారంలోకి రావాలని నిర్ణయించుకున్నాడు. మరి బంగారం దుకాణాన్ని, స్వీట్స్ వ్యాపారాన్ని ఒకే సమయంలో రెండింటినీ నిర్వహణ చేయడం కష్టంగా ఉంటుందనే కారణంతో అప్పట్లో రూ. వెయ్యి అప్పు ఇచ్చి మరీ పుల్లారెడ్డి చేత బలవంతంగా కర్నూల్లోని పాతబస్టాండ్ ప్రాంతంలో మిఠాయి కొట్టును తెరిపించాడు కసిరెడ్డి వెంకటరెడ్డి. అలా మొదలైన పుల్లారెడ్డి స్వీట్స్ ప్రస్థానం.. కర్నూల్లో 4, హైదరాబాద్లో 8, బెంగళూరులో 6 ఔట్లెట్లతో స్వీట్స్ వ్యాపారంలో దూసుకుపోతోంది. 18 ఔట్లెట్లు.. రూ.45 కోట్ల టర్నోవర్ హైదరాబాద్లోని సోమాజిగూడ, అబిడ్స్, కూకట్పల్లి, విక్రంపురి, దిల్సుఖ్నగర్, పీఅండ్టీ కాలనీ, మెహదీపట్నం, కొండాపూర్లో, కర్నూల్లోని పాత బస్స్టాండ్, కొత్త బస్స్టాండ్, కలెక్టర్ ఆఫీస్, రాజ్ విహార్ సెంటర్లలో, బెంగళూరులోని జయ నగర్, మారతాహళ్లి, వైట్వీల్డ్స్, బీటీఎం లేఅవుట్, ఇంద్రానగర్, కడిగుడిలో మొత్తం 18 పుల్లారెడ్డి స్వీట్స్ ఔట్లెట్లున్నాయి. వార్షిక టర్నోవర్ రూ.45 కోట్లు. జీడిపప్పు పాకం, కోవాపురి, అజ్మీరీ కలాకాన్ వంటివి పుల్లారెడ్డి స్వీట్స్ ప్రత్యేకతలు. కేన్సర్ నివారణ స్వీట్లు.. ‘‘స్వీట్లంటే మనలో చాలా మంది ఎక్కువ తినొద్దంటారు. దగ్గొస్తుందని హెచ్చరిస్తారు. కానీ, అది తప్పు. స్వచ్ఛమైన నెయ్యి, పాలతో తయారు చేసే స్వీట్లు ఆరోగ్యానికి మంచివే అని వైద్యులు కూడా చెబుతున్నారు. దేశీ ఆవుల మూత్రం, పేడతో కేన్సర్ వ్యాధిని నయం చేయవచ్చని అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనల్లోనూ తేలింది’’ అంటారు పుల్లారెడ్డి స్వీట్స్ పార్ట్నర్ జి.ఏకాంబరరెడ్డి. అందుకే దేశీ ఆవుల నుంచి వచ్చే పాలు, నెయ్యితో కేన్సర్ నివారణ మిఠాయిలు తయారు చేయడంపై దృష్టి సారించామని, సాధ్యాసాధ్యాలపై చర్చిస్తున్నామని చెప్పారాయన. ‘‘ఇందుకోసం షిమోగా నుంచి 30 దేశీ ఆవులు దిగుమతి చేసుకునే యోచనలో ఉన్నాం. వాటి కోసం ప్రత్యేకమైన గోశాల ఏర్పాటు, పర్యవేక్షణ వంటి కీలకాంశాలపై క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నాం. అయితే కేన్సర్ నివారణ స్వీట్ల తయారీ నిర్ణయం వ్యాపారం కోసం మాత్రమే కాదు.. సమాజ సేవలో భాగంగానే చేస్తాం’’ అని తెలియజేశారు. మారిషస్కూ విస్తరణ యోచన... మారిషస్లో పుల్లారెడ్డి స్వీట్స్ వ్యాపారాన్ని ప్రారంభించే యోచనలో ఉన్నామని, ఇందుకోసం అక్కడి వ్యాపార అవకాశాలు, పర్యాటక ప్రాంతాలు, ప్రజల ఆహారపు అలవాట్లు, రుచుల గురించి వివిధ మార్గాల ద్వారా అధ్యయనం చేస్తున్నామని ఏకాంబరరెడ్డి తెలియజేశారు. రాయితీలు, ప్రోత్సాహకాలపై కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాతే మారిషస్లో వ్యాపారాన్ని ప్రారంభిస్తామని ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. ఈ ఏడాది ఉగాదికి హైదరాబాద్లోని ఏఎస్ రావ్ నగర్లో కొత్త ఔట్లెట్ను ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్త రాజధాని ఖరారయ్యాక అక్కడ కూడా తమ వ్యాపారాన్ని విస్తరిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారాయన. ల్యాబ్లో పరీక్షించిన తర్వాతే.. స్వీట్ల తయారీకి అవసరమైన పాలు, నెయ్యి, పెరుగు వంటి వాటిని సొంత ల్యేబొరేటరీలో పరీక్షించిన తర్వాతే కొనుగోలు చేస్తారు. నంద్యాల, తమిళనాడు నుంచి నెయ్యి దిగుమతి అవుతుంటుంది. రోజుకు 20 డబ్బాలు (ఒక్కోటి 15 కేజీలు) కొనుగోలు చేస్తారు. పాలు రోజుకు 1,500 లీటర్లు కొంటారు. సుగంధ ద్రవ్యాలు, ఇతరరత్రా దినుసులన్నీ బేగంబ జార్ నుంచే కొనుగోలు చేసుకుంటారు.