-
‘ఇంద్రధనుష్’ మంచి ప్రయత్నం
ఇండియా రేటింగ్స్ కితాబు న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఆర్థిక చేయూతనందించే క్రమంలో ప్రభుత్వం తీసుకువచ్చిన ‘ఇంద్రధనుష్’ సంస్కరణ అభినందనీయమని ఇండియా రేటింగ్స్, రీసెర్చ్ సంస్థ పేర్కొంది. కానీ నష్టాల్లో ఉన్న కంపెనీలకు ఇచ్చిన రుణాల విషయంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఆందోళనలు తప్పవని తెలిపింది. ఇంద్రధనుష్ కార్యక్రమం వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధన సాయం అందుతుందని, దీంతో పాలనా సంబంధిత అంశాలు మెరుగుపడతాయని, తద్వారా సేవల నాణ్యత పెరుగుతుందని వివరించింది. బ్యాంకుల బ్యాలెన్స్ షీట్ల గురించి వివరిస్తూ.. పెరిగిపోతున్న మొండిబకాయిల సమస్యల గురించి ప్రభుత్వం సరైన వివరణ ఇవ్వలేదని తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల మూలధన నాణ్యత సమస్యలు అలాగే మిగిలి ఉన్నాయని పేర్కొంది. కార్పొరేట్లకు ఇచ్చిన రుణాల నుంచి ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారానికి బ్యాంకులకు రూ.లక్ష కోట్ల కావాల్సి ఉందని తెలిపింది. -
బ్యాంకులకు మరింత మూలధనం కావాలి
2015-16లో రూ.7,940 కోట్లు సరిపోవన్న ఆర్బీఐ - ఆర్థికశాఖకు లేఖ న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులకు తాజా మూలధనంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) కేంద్రం కేటాయించిన రూ.7,940 కోట్లు సరిపోవని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అభిప్రాయపడింది. ఆర్థిక మంత్రిత్వశాఖ మరిన్ని నిధులను కేటాయించడం అవసరమని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా గురువారం ఇక్కడ విలేకరులతో అన్నారు. మొండి బకాయిలు పెరిగిపోతుండడం, మరోవైపు రుణ వృద్ధి ద్వారా ఆర్థిక వృద్ధికి తోడ్పాటును అందించాల్సిన అవసరం ఉండడం వంటి అంశాల రీత్యా బ్యాంకులకు కేంద్రం మరింత మొత్తంలో తాజా మూలధనాన్ని అందించాల్సి ఉందని ముంద్రా అన్నారు. ఈ మేరకు ఒక లేఖను సైతం ఆర్థికమంత్రిత్వశాఖకు ఆర్బీఐ రాసినట్లు ఆయన వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరం కేంద్రం 9 ప్రభుత్వ రంగ బ్యాంకులకు వాటి పనితీరు ప్రాతిపదికన రూ.6,990 కోట్ల తాజా మూలధనం ఇచ్చింది. అయితే పనితీరు ప్రాతిపదికన బ్యాంకులకు మూలధనం సమకూర్చడం సరికాదని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్పీఏలపై సమగ్ర వ్యూహం మొండిబకాయిల (ఎన్పీఏ) సమస్యలను పరిష్కరించడంలో అత్యుత్తమ వ్యూహాలను అవలంభించాల్సిన అవసరం ఉందని ముంద్రా అన్నారు. ఎన్పీఏలు తలెత్తే పరిస్థితిని దాచిపెట్టడం వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదని అన్నారు. ఏదైనా అకౌంట్ మొండిబకాయిగా మారుతున్నట్లయితే, ఆ అకౌం ట్కు సంబంధించి రుణ గ్రస్తునికి సాయంచేసే దిశలో బ్యాంకింగ్ తగిన చర్యలు తీసుకోవాలన్నారు. • 2014 డిసెంబర్ నాటికి 27 ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల మొండి బకాయిలు రూ. 2,50,531 కోట్లు. మొత్తం రుణాల్లో ఇవి దాదాపు 5.6 శాతం. మొత్తం మొండిబకాయిల్లో 30 టాప్ డిఫాల్టర్ల వాటా రూ.95,122 కోట్లు. బ్యాంకింగ్ వ్యవస్థలో మొండిబకాయిల భారం తీవ్రం కానుందని విశ్లేషణలు వస్తున్నాయి. గడచిన ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 4.4% కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ రేటు 5.3- 5.9% శ్రేణిలో ఉండే అవకాశం ఉందని అంచనా. మందగమనం నేపథ్యంలో పునర్వ్యవస్థీకరణ జరిగిన కొన్ని అకౌంట్లు మొండిబకాయిలుగా మారొచ్చని కొం దరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎఫ్వీలలో తగ్గిన కంపెనీల పెట్టుబడులు ముంబై: ఫారిన్ వెంచర్ల (ఎఫ్వీ)లో భారత్ కంపెనీల ప్రత్యక్ష పెట్టుబడులు మే నెలలో 15 శాతం పడిపోయాయి. ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2014 మే నెలలో ఈ పెట్టుబడుల విలువ 178 కోట్ల డాలర్లు. అయితే ఈ మొత్తం 2015 మేలో 151 కోట్ల డాలర్లకు పడిపోయింది. విదేశాల్లో భారీ పెట్టుబడుల పెట్టిన భారత్ కంపెనీల్లో ఫస్ట్సోర్స్ సొల్యూషన్స్ (18 కోట్ల డాలర్లు), విప్రో (14 కోట్ల డాలర్లు), గోద్రేజ్ కన్జూమర్ ప్రొడక్ట్స్ (13 కోట్ల డాలర్లు), పిరమాల్ ఎంటర్ప్రైజెస్ (5 కోట్ల డాలర్లు), స్టార్లింగ్ అండ్ వెల్సన్ (5 కోట్ల డాలర్లు), కెయిర్ ఇండియా (4 కోట్ల డాలర్లు) ఉన్నాయి. అకౌంట్ తెరిచేందుకు ‘వినియోగ’ బిల్లు చాలు.. ముంబై: బ్యాంకులో కానీ, లేదా మరేదైనా ఆర్థిక సంస్థలోకానీ అకౌంట్ ప్రారంభానికి సంబంధించి అడ్రస్ ధృవీకరణకు పోస్ట్పెయిడ్ మొబైల్ సర్వీస్, పైప్డ్ గ్యాస్, విద్యుత్, టెలిఫోన్, నీటి సరఫరా వంటి యుటిలిటీ బిల్లులు సరిపోతాయని ఆర్బీఐ గురువారం పేర్కొంది. అయితే ఈ బిల్లులు రెండు నెలలకన్నా మించి పాతవి కాకూడదని ఆర్బీఐ ఒక నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. బ్యాంక్ అకౌంట్ తేలిగ్గా తెరవడానికి వీలుగా ఈ సరళీకరణ విధానాన్ని అవలంభిస్తున్నట్లు, ‘అధికారిక చెల్లుబాటు పత్రాల్లో’ (ఓవీడీ) వీటిని చేర్చినట్లు నోటిఫికేషన్ తెలిపింది. వీటితోపాటు వసతికి సంబంధించి ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు, ప్రభుత్వం రంగ సంస్థలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, లిస్టెడ్ కంపెనీలు జారీ చేసే లెటర్ ఆఫ్ అలాట్మెంట్ను కూడా ఓవీడీ పరిధికి తెస్తున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. పాస్పోర్ట్, డ్రైవింగ్ లెసైన్సులు, పాన్ కార్డులు, వోటర్ ఐడెంటిటీ కార్డ్, ఎంఎన్ఆర్ఈజీఏ జాబ్ కార్డ్, ఆధార్ నంబర్లను మాత్రమే ఓవీడీగా పరిగణించాలని గత ఏడాది జూలైలో ఆర్బీఐ పేర్కొంది. కొన్ని వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో తాజా ఆదేశాలను జారీ చేసింది. -
సెంట్రల్, సిండికేట్ బ్యాంకుల బేస్ రేటు కోత
న్యూఢిల్లీ: మరో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు కనీస రుణరేటును తగ్గించాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిండికేట్ బ్యాంక్ బేస్ రేటును తగ్గించాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణ రేటును 0.30 శాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 9.95 శాతానికి తగ్గింది. సిండికేట్ బ్యాంక్ రుణ రేటు పావుశాతం తగ్గి 10 శాతానికి చేరింది. బీఓబీ, ఓబీసీ డిపాజిట్ రేట్ల కోత: కాగా రుణ రేటు కోతకు సంకేతంగా భావించే డిపాజిట్ రేట్ల కోత నిర్ణయాన్ని బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ), ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ) తీసుకున్నాయి. కొన్ని డిపాజిట్లపై తగ్గించిన తాజా వడ్డీ రేటు జూన్ 8 నుంచి అమల్లోకి వస్తుంది. రిజర్వ్ బ్యాంక్ జూన్ 2 రెపో రేటు కోత నేపథ్యంలో మార్కెట్ లీడర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాసహా పలు బ్యాంకులు రుణ, డిపాజిట్ రేట్ల కోత నిర్ణయం తీసుకుంటున్నాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Voting Procedure: ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్
మొలకలతో బోలెడన్ని ప్రయోజనాలు, ఈ సైడ్ ఎఫెక్ట్స్తెలుసుకోండి!
కమిన్స్ మాటలు విని షాకైన హార్దిక్! వీడియో వైరల్
జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
కుటుంబాన్ని బండ బూతులు తిట్టిన చంద్రబాబుతో పవన్ పొత్తు..!
చంద్రబాబుపై రైతుల ఆగ్రహం
ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని అతి ప్రవర్తన.. ఇందులో నిజమెంత..?
తప్పక చదవండి
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement